ఎమ్వీయల్. నరసింహారావు
వికీపీడియా నుండి
ఎమ్వీయల్. నరసింహారావు (1944 - 1986) సుప్రసిద్ధ సాహితీవేత్త మరియు సినిమా నిర్మాత. వీరి పూర్తిపేరు మద్దాలి వెంకట లక్ష్మీ నరసింహారావు. వీరు సెప్టెంబరు 21, 1944 సంవత్సరంలో గూడూరులో జన్మించారు. బందరులో డిగ్రీ చదివి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. పూర్తిచేశారు. నూజివీడులోని ధర్మ అప్పారాయ కళాశాల తెలుగు శాఖలో అధ్యాపకులుగా చేరి చివరివరకు పనిచేశారు.ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రశ్న జవాబుల శీర్షిక చాలా కాలం వికజయవంతంగా నిర్వహించారు.'తాగుడుమూతలు' శీర్షిక కూడా వీరిదే 1974లో బాపూ రమణల పరిచయంతో సినిమా రంగంలో ప్రవేశించి ముత్యాల ముగ్గు సినిమా నిర్మించారు. ఇది బాగా విజయవంతం కావడంతో, గోరంత దీపం, స్నేహం, మనవూరి పాండవులు, తూర్పు వెళ్ళే రైలు, ఓ ఇంటి భాగోతం సినిమాలకు సంభాషణలు రాశారు.