Coordinates: 16°38′17″N 81°27′37″E / 16.637951°N 81.460215°E / 16.637951; 81.460215

కోలమూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోలమూరు
—  రెవెన్యూ గ్రామం  —
కోలమూరు is located in Andhra Pradesh
కోలమూరు
కోలమూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°38′17″N 81°27′37″E / 16.637951°N 81.460215°E / 16.637951; 81.460215
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం ఉండి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,298
 - పురుషులు 1,639
 - స్త్రీలు 1,659
 - గృహాల సంఖ్య 908
పిన్ కోడ్ 534199
ఎస్.టి.డి కోడ్
గ్రామసచివాలయం-కోలమూరు
ప్రభుత్వ ప్రాధమిక పాటశాల-కోలమూరు
విద్యా సౌకర్యాలు
ప్రభుత్వ ప్రాధమిక పాటశాల భవనము2 - కోలమూరు
ఆధ్యాత్మికం-దేవాలయాలు
శ్రీ పార్వతీ సమేత కైలాసనాథ స్వామి దేవాలయం -కోలమూరు
కోలమూరు గ్రామ పటం
కోలమూరు గ్రామ పటం -గూగుల్ చిత్రం

కొలమూరు పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఉండి నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణం, జిల్లా కేంద్రం, భీమవరం నుండి 15 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 908 ఇళ్లతో, 3298 జనాభాతో 1156 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1639, ఆడవారి సంఖ్య 1659. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 612 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 19. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588611[1].పిన్ కోడ్: 534199.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3369. ఇందులో పురుషుల సంఖ్య 1671, మహిళల సంఖ్య 1698, గ్రామంలో నివాసగృహాలు 945 ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు[మార్చు]

విద్యా సౌకర్యాలు
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, కోలమూరు
విద్యా సౌకర్యాలు
జిల్లా పరిషత్ ఉన్నతపాటశాల-కోలమూరు

గ్రామంలో అంగన్వాడి కేంద్రం ఒకటి, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి, అనియత విద్యా కేంద్రం, ఉండిలో ఉంది.సమీప జూనియర్ కళాశాల గణపవరం, యండగండి లోను డిగ్రీ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాల‌లు, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల భీమవరం లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల భీమవరంలోను సమీప వైద్య కళాశాల ఏలూరు లోనూ ఉన్నాయి.భీమవరంలో గల అన్ని ప్రముఖ విద్యా సంస్థలకు చెందిన స్కూల్ బస్సులు నిత్యం అందుబాటులో ఉంటూ బాలబాలికల విద్యాభ్యాసంనకు తోడ్పాటు లభించు చున్నది

ఈ గ్రామంలో ప్రాధమిక, ఉన్నత పాటశాల లకు దాతలు, ప్రభుత్వ సహకారంతో పూర్తి వసతులతో పక్కా భవనములు నిర్మించబడి, ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో బోధన జరుగుచున్నది

వైద్యసౌకర్యాలు[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

కొలమూరులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 7 కి.మీ. దూరంలో యండగండి లోను, 6 కి.మీ దూరంలోని మండల కేంద్రంలో మరొకటి కలవు ఉంది. గ్రామంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల, పలు ప్రయివేటు హాస్పిటల్స్ గ్రామం నుండి 15 కి.మీ. దూరంలో భీమవరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో 2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో గ్రామ పంచాయితీ కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.దాతలు రుద్రరాజు లచ్చిరాజు, కూనపరాజు గోపాల రాజు గార్ల ఆర్థిక సహకారంతో, బైర్రాజు ఫౌండేషన్ వారి ప్రోత్సాహంతో నిర్మించబడిన "సుజల వాటర్ ప్లాంట్" ద్వారా సురక్షితమైన మంచినీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు.90% నివాసాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు కలవు ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ ఇటీవలనే గ్రామపంచాయితీ ద్వారా ప్రాంభించ బడింది. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోసే అలవాటు క్రమంగా తగ్గుచున్నది

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

కొలమూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. ప్రధాన పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 6 కి.మీ. దూరంలో ఉన్నాయి. స్థానిక టెలిఫోన్ ఎక్స్చేంజి కేంద్రం ద్వారా ల్యాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె /రాష్ట్ర ప్రభుత్వంఅధ్వర్యంలో రుద్రరాజు నరసరాజు గారి ద్వారా నిర్వహించబడు చున్న మీ సేవా కేంద్రం,, కేంద్ర ప్రభుత్వం వారి కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా పౌర సేవలు అందుబాటులో ఉన్నవి ప్రైవేటు కొరియర్ సేవలు గ్రామానికి 6 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి.రైల్వే స్టేషన్ గ్రామానికి 6 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి నెంబర్ 165 ను 6 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో సిమెంట్ రోడ్లు, వ్యవసాయ అవసరాలకు పొలాల్లో కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలోప్రభుత్వ రంగంలో బ్యాంకు ఆఫ్ బరోడా బ్యాంకు, సహకార రంగంలో ఉండి కోఆపరేటి రూరల్ బ్యాంకులు ఆర్థిక సేవలు అందించబడుచున్నవి. గ్రామంలో స్వయం సహాయక బృందాలు,2 పౌర సరఫరాల కేంద్రాలు ఉన్నాయి. ఏటీఎమ్ సదుపాయం కలదు రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 7 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాళ్ళు సమీప భీమవరం పట్టణంలోను, గ్రంథాలయం గ్రామం నుండి 6కి.మీ. దూరంలో ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం గల పాటశాల ఆవరణలో కలదు

గ్రామ పంచాయతీ[మార్చు]

ఫోటో
గ్రామ ఆవిర్భావ సమయంలో గ్రామ కచేరిగా నిర్మిచిడిన ఈ భవనం అనంతరకాలంలో గ్రామపంచాయితీ కార్యాలయంగా సుదీర్ఘ కాలం 2022 ప్రధమార్థం వరకు సేవలందిచి, ప్రస్తుతం గ్రామ ఆరోగ్య ఉపకేంద్రంగా కొనసాగుతోంది

2020 సంవత్సరంలోఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి నడింపల్లి సత్యవతిసర్పంచిగాను ఆమె భర్త రామకృష్ణం రాజు ఉప సర్పంచ్ గాను గెలుపొందారు అనంతరము గ్రామ ఆవిర్భావం నుండి పరిపాలన కొనసాగిస్తున్న గ్రామా నడి బొడ్డున గల గ్రామ పంచాయతీ కార్యలయము స్థానే ప్రస్తుత వ్యవస్థ లోని గ్రామ సచివాలయ నూతన భవన నిర్మాణం కొరకు ఉప్పులూరు రోడ్ సమీపంలో ఉండి-చేబ్రోలు ప్రధాన రహదారికి అనుకోని 10 సెంట్లు స్థలాన్ని ప్రస్తుత సర్పంచ్ దంపతులు సమకూర్చగా 2020 నవంబరు 21 వ తేదిన శంకుస్థాపన చేయబడి, 2022 ఏప్రిల్ 14 వ తేదిన ప్రారంభోత్సవం జరిగిన నూతన భవనంలో గ్రామసచివాలయంగా పరిపాలన నిర్వహించ బడుచున్నది.[2]

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం, వ్యవసాయ అవసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 24 గంటల పాటు వ్యవసాయానికి, వాణిజ్య అవసరాల కోసం కూడా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నారు. గ్రామంలో విద్యుత్ ఉప నిర్మిత కేంద్రము కలదు

భూమి వినియోగం[మార్చు]

కొలమూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 156 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 999 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 999 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

కొలమూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 999 హెక్టార్ల (ఉప్పులూరు కాలవ ద్వారా 879 హెక్టార్లు భూమికి, వెంకయ్య ఒయ్యేరు కాలవ ద్వారా 120 హెక్టార్లు భూమికి సాగునీటి సరపరా జరుగుతుంది.

ఉత్పత్తి[మార్చు]

కొలమూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

వరి, చేపలు, రొయ్యలు, కొబ్బరి

ప్రధాన పంటలు[మార్చు]

వరిపంట మొత్తం సాగుభూమిలో ఒక వంతుగాను, మిగిలిన మూడు వంతుల భూమిలో 2015-2016 సంవత్సరం నుండి నీలి విప్లవం ద్వారా ఆక్వా ఉత్పత్తులు అనగా చేపలు రొయ్యలు ఆధునిక పద్ధతులలో సాగు చేయ బడుచున్నవి

గ్రామానికి చిత్రాల గ్యాలరీ[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2018-12-22. Retrieved 2019-02-09.
"https://te.wikipedia.org/w/index.php?title=కోలమూరు&oldid=4076554" నుండి వెలికితీశారు