భోపాల్
| ?భోపాల్ మధ్యప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
308.14 కి.మీ² (119 sq mi) • 427 మీ (1,401 అడుగులు) |
| జిల్లా(లు) | భోపాల్ జిల్లా |
| జనాభా • జనసాంద్రత |
14,82,718 (2001) • 160/కి.మీ² (414/చ.మై) |
| మేయర్ | సునీల్ సూద్ |
| కోడులు • పిన్కోడు • టెలిఫోను • వాహనం |
• 462001 • +91 (0)755 • MP-04 |
భోపాల్ (ఆంగ్లం: Bhopal, హిందీ: भोपाल, ఉర్దూ: بھوپال) మధ్యభారతదేశంలోని ఒక నగరం. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని మరియు 'భోపాల్ డివిజన్' కూడానూ. మధ్యప్రదేశ్ లో ఇండోర్ తరువాత రెండవ పెద్ద నగరము. భోపాల్ కు "సరస్సుల నగరం" "మసీదుల నగరం అని పేరు. దీని భౌగోళికం ప్రకృతి సరస్సులు మరియు మానవ నిర్మిత సరస్సులతో నిండియున్నది. [1]
గ్యాస్ దుర్ఘటన [మార్చు]
1984 డిసెంబర్ రెండోతేదీ: యూనియన్ కార్బైడ్ పరిశ్రమనుంచి టన్నుల కొద్దీ లీకైన మిథైల్ ఐసోసైనేట్ (మిక్) మూడువేల నిండు ప్రాణాల్ని కబళించింది. కంటిచూపు పోయినవారు, వూపిరితిత్తులకు తూట్లు పడ్డవాళ్లు, జీవచ్ఛవాలుగా మిగిలినవాళ్లెందరో లెక్కే లేదు. పాతికవేలమంది నేల రాలిపోయారు. అయిదున్నర లక్షల మందికిపైగా అనారోగ్య పీడితులయ్యారు.నేటికీ అక్కడి గాలిలో, నీటిలో, భూగర్భంలో విషపదార్థ నిక్షేపాలు పుట్టబోయేవారినీ శాపగ్రస్తులు చేస్తున్నాయి.ఆ సంస్థ సారథి ఆండర్సన్ 1984 డిసెంబర్లో పట్టుబడినా, భారత్కు తిరిగి వస్తానన్న హామీతో బురిడీ కొట్టించి దేశం దాటి మళ్లీ ఇటువైపు తొంగిచూడనే లేదు. ఆండర్సన్ను అప్పగించాల్సిందిగా ఆరేళ్లక్రితం భారత్ చేసిన అభ్యర్థనను అమెరికా నిష్కర్షగా తోసిపుచ్చింది. విపరీత కాలహరణం జరిగాక ఒక్కో బాధితుడికీ సగటున విదిపింది రూ.12,410. కేంద్ర న్యాయమంత్రి వీరప్ప మొయిలీ భోపాల్ విషవాయు ఉదంతంలో న్యాయమే సమాధి అయిందన్నారు.
మూలాలు [మార్చు]
- ↑ "City of Lakes". Retrieved 2007-04-12.