యోగి వేమన విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి

యోగి వేమన విశ్వవిద్యాలయం

Yogi-Vemana.jpg

ఆదర్శవాక్యం బోధన, పరిశోధన, సేవ
స్థాపన 2006
తరహా ప్రభుత్వ విశ్వవిద్యాలయము
కులపతి ఈ.ఎస్.ఎల్.నరసింహన్
ఉప కులపతి ఆచార్య ఉదయగిరి రాజేంద్ర (తాత్కాలిక ఉప కులపతి)
ప్రదేశం కడప
ఆంధ్రప్రదేశ్, భారతదేశం,
516003
క్యాంపస్ గ్రామీణ
అనుబంధాలు యు.జి.సి
వెబ్‌సైటు అధికారిక వెబ్సైటు

యోగి వేమన విశ్వవిద్యాలయం , ఆంధ్రప్రదేశ్ లోని కడప లో ఏర్పాటుచేయబడిన నూతన విశ్వవిద్యాలయము. ఇంతకుముందు ఇది శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా గుర్తించబడేది. 2006 మార్చి 9 వ తేదీన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్నాతకోత్తర కేంద్రం స్థాయు నుంచి స్వతంత్ర విశ్వవిద్యాలయంగా ఏర్పడింది. 2012-13 సంవత్సరంలో ఈ విశ్వవిద్యాలయ మొట్టమొదటి స్నాతకోత్సవం జరిగింది. కులపతి హోదాలో ఈ ఉత్సవానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ హాజరయ్యారు. ఈ ఉత్సవాలలోనే ప్రపంచ ప్రసిద్ది చెందిన పరిశోధకుడు పల్లె రామారావు గారికి డాక్టరేట్ ప్రధానం చేశారు. ఇది కడప నుండి పులివెందుల వెళ్ళే మార్గంలో మిట్టమీదపల్లె పంచాయితీ పరిధిలో సుమారు 450 ఎకరాలలో విస్తరించివుంది.

విభాగాలు [మార్చు]

ఇందులో మొత్తం 17 విభాగాలు ఉన్నాయి. 17 అంశాలలో వివిధ విద్యా తరగతులను నిర్వహిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధనా శాల ఇస్రో భాతస్వామ్యం తో ఈ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరుగుతున్నాయి.

ఇంతవరకు పనిచేసిన ఉపకులపతులు [మార్చు]

  1. ఆచార్య అర్జల రామచంద్రారెడ్డీ - 2006 - 2013 ఫిబ్రవరి 4 వ తేదీ వరకు
  2. ఆచార్య ఉదయగిరి రాజేంద్ర - 2013 ఫిబ్రవరి 5 నుండి తాత్కాలిక ఉపకులపతి గా బాధ్యతలు తీసుకున్నారు.

.