యోగి వేమన విశ్వవిద్యాలయం
|
యోగి వేమన విశ్వవిద్యాలయం |
|
|---|---|
| ఆదర్శవాక్యం | బోధన, పరిశోధన, సేవ |
| స్థాపన | 2006 |
| తరహా | ప్రభుత్వ విశ్వవిద్యాలయము |
| కులపతి | ఈ.ఎస్.ఎల్.నరసింహన్ |
| ఉప కులపతి | ఆచార్య ఉదయగిరి రాజేంద్ర (తాత్కాలిక ఉప కులపతి) |
| ప్రదేశం | కడప ఆంధ్రప్రదేశ్, భారతదేశం, 516003 |
| క్యాంపస్ | గ్రామీణ |
| అనుబంధాలు | యు.జి.సి |
| వెబ్సైటు | అధికారిక వెబ్సైటు |
యోగి వేమన విశ్వవిద్యాలయం , ఆంధ్రప్రదేశ్ లోని కడప లో ఏర్పాటుచేయబడిన నూతన విశ్వవిద్యాలయము. ఇంతకుముందు ఇది శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా గుర్తించబడేది. 2006 మార్చి 9 వ తేదీన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్నాతకోత్తర కేంద్రం స్థాయు నుంచి స్వతంత్ర విశ్వవిద్యాలయంగా ఏర్పడింది. 2012-13 సంవత్సరంలో ఈ విశ్వవిద్యాలయ మొట్టమొదటి స్నాతకోత్సవం జరిగింది. కులపతి హోదాలో ఈ ఉత్సవానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ హాజరయ్యారు. ఈ ఉత్సవాలలోనే ప్రపంచ ప్రసిద్ది చెందిన పరిశోధకుడు పల్లె రామారావు గారికి డాక్టరేట్ ప్రధానం చేశారు. ఇది కడప నుండి పులివెందుల వెళ్ళే మార్గంలో మిట్టమీదపల్లె పంచాయితీ పరిధిలో సుమారు 450 ఎకరాలలో విస్తరించివుంది.
విభాగాలు [మార్చు]
ఇందులో మొత్తం 17 విభాగాలు ఉన్నాయి. 17 అంశాలలో వివిధ విద్యా తరగతులను నిర్వహిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధనా శాల ఇస్రో భాతస్వామ్యం తో ఈ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరుగుతున్నాయి.
ఇంతవరకు పనిచేసిన ఉపకులపతులు [మార్చు]
- ఆచార్య అర్జల రామచంద్రారెడ్డీ - 2006 - 2013 ఫిబ్రవరి 4 వ తేదీ వరకు
- ఆచార్య ఉదయగిరి రాజేంద్ర - 2013 ఫిబ్రవరి 5 నుండి తాత్కాలిక ఉపకులపతి గా బాధ్యతలు తీసుకున్నారు.
.
