శార్వరి నుండి శార్వరి దాక
Jump to navigation
Jump to search
శార్వరి నుండి శార్వరి దాక | |
కృతికర్త: | విశ్వనాథ సత్యనారాయణ |
---|---|
ప్రక్రియ: | నవల |
ప్రచురణ: | విశ్వనాథ పావనిశాస్త్రి |
విడుదల: | 1961 |
ఆంగ్ల ప్రచురణ: | 2006, 2013 |
శార్వరి నుండి శార్వరి దాక జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రాసిన నవల.
రచనా నేపథ్యం[మార్చు]
శార్వరి నుండి శార్వరి దాక నవల రచనాకాలం 1961గా గ్రంథకర్త కుమారుడు, విశ్వనాథ సాహిత్యానికి సంపాదకుడు, ప్రచురణకర్త విశ్వనాథ పావనిశాస్త్రి నిర్థారించారు. ఈ నవలను విశ్వనాథ సత్యనారాయణ తాను ఆశువుగా చెపుతూ ఉండగా, జువ్వాడి గౌతమరావు లిపిబద్ధం చేశారు. దీని ప్రథమముద్రణ 1962లో కరీంనగర్ లోని చింతల నరసింహులు అండ్ సన్స్ వారు వేశారు. రెండవ ముద్రణ 2006లో, మూడవ ముద్రణ 2013లో జరిగింది.
శార్వరి నుండి శార్వరి దాకలోని శార్వరి తెలుగు సంవత్సరం పేరు. తెలుగు సంవత్సరాలు అరవై. చైత్రం, వైశాఖం మొదలైన పన్నెండు నెలలూ ప్రతీ యేడాదీ తిరిగి వచ్చినట్లే, ఇవి కూడా ప్రతి అరవై యేళ్ళకీ తిరిగి వస్తూ ఉంటాయి. ఈ నవల కథాకాలం సా.శ.1885 మన్మథ నామ సంవత్సరంలో ప్రారంభమవుతుంది.