అల్లు భానుమతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లు భానుమతి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1985 - 1989
ముందు గ్రంధి మాధవి
తరువాత ఈటి విజయలక్ష్మి
నియోజకవర్గం విశాఖపట్నం - I

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ
వృత్తి రాజకీయ నాయకురాలు

అల్లు భానుమ‌తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం - I శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.

రాజకీయ జీవితం[మార్చు]

అల్లు భానుమ‌తి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1985లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం - I నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పాలూరి శేషమాంబ పై 9038 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె ఆ తరువాత విశాఖపట్నం జిల్లా డీసీసీబి చైర్‌పర్సన్‌గా పని చేసింది. భానుమతి ఫిబ్రవరి 2019లో జనసేన పార్టీలో చేరింది, ఆమె మాడుగుల నియోజకవర్గం టికెట్‌ ఆశించి దక్కకపోవడంతో[1] 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది. అల్లు భానుమ‌తి 2020లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.

మూలాలు[మార్చు]

  1. Sakshi (21 March 2019). "పవన్‌ మమ్మల్ని మోసం చేశాడు: మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.