ఎన్.వి. రమణయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎన్.వి. రమణయ్య
జననంజూలై 10, 1935
మరణంజనవరి 16, 2018
జాతీయతభారతీయుడు
వృత్తిఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త, సంపాదకుడు

ఎన్.వి. రమణయ్య (1935 జూలై 10 - 2018 జనవరి 16) ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త, సంపాదకుడు.[1]

జననం[మార్చు]

రమణయ్య 1935, జూలై 10న ప్రకాశం జిల్లా, సింగరాయకొండలో జన్మించాడు. బింగినిపల్లి, ఒంగోలు, నెల్లూరు, విజయనగరంలలో విద్యాభ్యాసం పూర్తిచేశాడు.

సామాజిక కార్యకర్తగా[మార్చు]

డిగ్రీ విద్యార్థిగా ఉన్నప్పుడు నెల్లూరు విఆర్ కళాశాల కార్యదర్శిగా, డి.ఎస్.యు. కార్యదర్శిగా పనిచేసాడు. చేతన, నవవికాస్ సంస్థల ద్వారా సేవ కార్యక్రమాలు నిర్వహించాడు.

సాహిత్య సేవ[మార్చు]

ఉన్నవ రచనలు, హేతువాద రచనలు, అక్షర, శంకరన్, మధుమురళి బాలమురళి, పరిశోధన, బతుకుచిత్రం, ఏకాంతసేవ మొదలైన గ్రంథాలకు సంపాదకత్వం వహించాడు.

మరణం[మార్చు]

ఈయన 2018, జనవరి 16న హైదరాబాదులో మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. ప్రజాసాహితి మాసపత్రిక, ఫిబ్రవరి 2018, జనసాహితి ప్రచురణ, పుట.4.