Coordinates: 16°44′53″N 81°56′07″E / 16.7480°N 81.9352°E / 16.7480; 81.9352

కపిలేశ్వరపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కపిలేశ్వరపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఒక గ్రామం.[1]

కపిలేశ్వరపురం
—  రెవిన్యూ గ్రామం  —
కపిలేశ్వరపురం is located in Andhra Pradesh
కపిలేశ్వరపురం
కపిలేశ్వరపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°44′53″N 81°56′07″E / 16.7480°N 81.9352°E / 16.7480; 81.9352
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కోనసీమ
మండలం కపిలేశ్వరపురం
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 11,793
 - పురుషులు 5,917
 - స్త్రీలు 5,876
 - గృహాల సంఖ్య 2,954
పిన్ కోడ్ 533 309
ఎస్.టి.డి కోడ్

ఇది సమీప పట్టణమైన మండపేట నుండి 16 కి. మీ. దూరంలో ఉంది.గ్రామస్థులు ముఖ్య అవసరములకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండపేటకు వెళ్ళుదురు.ఈ గ్రామం గోదావరి నదీ తీరంలో ఉన్న ఒక పురాతన గ్రామం.[1] దీనిని ఆంగ్లేయుల కాలంలో కపిలేశ్వరపురం జమీ అనేవారు. జామీందారీ వ్యవస్థకు చిహ్నంగా ఇప్పటికీ ఇక్కడ ఒక పెద్ద దివానం ఉంది.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 11,793.[2] ఇందులో పురుషుల సంఖ్య 5,917, మహిళల సంఖ్య 5,876, గ్రామంలో నివాసగృహాలు 2,954 ఉన్నాయి.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3341 ఇళ్లతో, 11698 జనాభాతో 1978 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5896, ఆడవారి సంఖ్య 5802. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2260 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 63. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 587702.[3] పిన్ కోడ్: 533309.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల  ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల అంగరలోను, ఇంజనీరింగ్ కళాశాల రాజమండ్రిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల కాకినాడలోను, పాలీటెక్నిక్‌ బొమ్మూరులోను, మేనేజిమెంటు కళాశాల రాజమండ్రిలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల రావులపాలెంలోను, అనియత విద్యా కేంద్రం మండపేటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కాకినాడ లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

కపిలేశ్వరపురంలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఐదుగురు డాక్టర్లు, 12 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.  ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టరు ఒకరు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది.గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

కపిలేశ్వరపురంలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి.లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి.ఆటో సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి.సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

కపిలేశ్వరపురంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 300 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 760 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 207 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 711 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 356 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 561 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

కపిలేశ్వరపురంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 561 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

కపిలేశ్వరపురంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి

కపిలేశ్వరపురం జమీ[మార్చు]

బలుసు పెద సర్వారాయుడు ఆంగ్లేయుల నుండి 1818లో ఈ జమీ పొందాడు. కపిలేశ్వరపురం జమీలో ఆరు శివారు లంకలున్నాయి. పెదసర్వారాయుడు మహాదాత. బ్రాహ్మణులకు, భట్టులకు భూములు, గోవులు మొదలగు పలు దానాలు చేశాడు. ఒక పెద్ద తటాకం తవ్వించాడు. 1847 లో పెద సర్వారాయుడు చనిపోగా కొడుకు బుచ్చికృష్ణయ్య పాలనకొచ్చాడు. ఇతడు 1852లో ఆరు గ్రామాలు.[1] గల కేసనకుర్రు సంస్థానాన్ని దంతులూరి బుచ్చికృష్ణరాజు నుండి కొని జమీ విస్తరించాడు.

బుచ్చికృష్ణయ్య తరువాత 1853లో వచ్చిన తమ్ముడు పట్టాబిరామయ్య బ్రాహ్మణులను, భక్తులను, పండితులను ఆదరించాడు. ఇతడు 1866లో చనిపోగా బుచ్చి సర్వారాయుడు పాలనకు వచ్చి మూడు సంవత్సరాల తరువాత హఠాత్తుగా చనిపోయాడు. భార్య రామలక్ష్మమ్మ తన పాలనలో మంచి పేరు సంపాదించింది. ఒక పెద్ద సత్రం నిర్మించింది. దత్తపుత్రుడు పట్టాభిరామయ్య 1896లో చనిపోగా ఇద్దరు మనుమలను సంరక్షించుతూ, జమీని పాలించింది. 1906లో ఈమె చనిపోగా రెండవ బుచ్చి సర్వారాయుడు జమీందారయ్యాడు.

ఈతడు 1913లో పెద్ద పాఠశాల నిర్మించి జిల్లా బోర్డుకు అప్పగించాడు. ఆంగ్లేయుల ఇంపీరియల్ వ్యవసాయ పరిశోధనా సంఘానికి సభ్యుడు. చాగంటి శేషయ్య రాధామాధవం, ఆంధ్రకవితరంగిణి, సుగ్రీవ విజయం ముద్రింపచేశాడు. హసనాబాద్ గ్రామంను.[1] సంపాదించాడు. జిల్లా బోర్డు అధ్యక్షునిగా పనిచేశాడు. 1945లో బ్రిటిష్ ప్రభుత్వం రావు బహద్దర్ బిరుదునిచ్చింది. ఇతని కొడుకు ప్రభాకర పట్టాభిరామారావు ఆంధ్ర విశ్వ విద్యాలయం సిండికేట్ సభ్యునిగా, 1952లో మదరాసు రాష్ట్ర మంత్రిగా, తిరిగి 1953లో ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా, 1958లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మంత్రిగా సేవలందించాడు. ఇతని కాలంలో సాహిత్య అకాడెమీ, సంగీత అకాడెమీ, ప్రభుత్వ వాచక పుస్తక ప్రచురణ సంస్థ ఏర్పడ్డాయి. సర్వారాయుడు గారి మరోక పుత్రుడు శ్రీ బలుసు ప్రభాకర బుచ్చి కృష్ణ సత్యనారాయణ రావు (S.B.P.B.K.Satyanarayana Rao) (1921 - 2011) కేంధ్ర మంత్రిగా, ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా, తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్ మాన్ గా పనిచేసారు, పారిశ్రామిక వేత్తగా, కపిలేశ్వర పురం జమిందారుగా సుప్రసిద్దులు.

వృత్తులు[మార్చు]

గోదావరి తీరంలో గ్రామం ఉండడంతో గ్రామంలో చేపలు పడుతూ వాటిపై జీవించే బెస్తవారు ఉన్నారు. దీపావళి పండుగ గడిచిన పదిరోజులకు కపిలేశ్వరపురం, కోటిపల్లి, సుందరపురం గ్రామాల్లోని బెస్తలు ఓ మంచి ముహర్తం పెట్టుకుని వేటకు బయలుదేరుతారు. నదిలో ప్రయాణిస్తూ పగలంతా చేపలు పడుతూంటారు, ఎక్కడ పొద్దుపోయి రాత్రి అయితే అక్కడి రేవులో ప్రయాణం ఆపేసి పడుకుంటారు. ఆత్రేయపురం, పేరవరం (ఆత్రేయపురం), ధవళేశ్వరం, ఆరికరేవుల, తాటిపూడి, పట్టిసీమ, పోలవరం, టేకూరు, శివగిరి, శిరువాక, కొరుటూరు, కొండమొదలు వంటి ఊర్లమీదుగా ప్రయాణిస్తూ పాపికొండలు వరకూ వెళ్తారు. ఇలా పాపికొండలు చేరుకోవడానికి దాదాపుగా ఎనిమిది రోజులు పడుతుంది. ఏ రోజు పట్టుకున్న చేపలు ఆరోజు పైన చెప్పిన ఊళ్ళలో వ్యాపారులకు అమ్మేస్తూ ఉంటారు.[4]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-07.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-07.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-05-22. Retrieved 2021-05-22.