కోట వేంకటాచలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోట వేంకటాచలం
Kota venkatachalam-1.jpg
ఆంధ్రుల పుట్టుఫూర్వోత్తరములు పుస్తకంలో చిత్రం
జననం
చల్లా వెంకటాచలం

1885
మధునాపురం
మరణం1959 నవంబరు 12
వృత్తిచరిత్ర పరిశోధకులు
తల్లిదండ్రులు
  • చల్లా సుబ్బారాయుడు (తండ్రి)
  • అన్నపూర్ణమ్మ (తల్లి)

కోట వేంకటాచలం (1885-1959) సుప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త, చరిత్ర పరిశోధకులు, విమర్శకులు.[1] ఈయన బ్రహ్మశ్రీ బిరుదు పొందినవాడు.

వీరు నూజివీడు తాలూకాలోని మధునాపురంలో చల్లా సుబ్బారాయుడు, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. చల్లావారి ఇంటిలో పుట్టినా కోటవారికి దత్తత వెళ్ళారు. వీరిని దత్తత తీసుకొన్న దంపతులు: కోట నిత్యానందం, లక్ష్మీదేవమ్మ.

వీరు సంస్కృతాంధ్ర భాషలు అధ్యయనం చేశారు; ఖగోళశాస్త్రంలో విశేషకృషి చేసారు. వాని ఆధారంగా భారతీయ చరిత్రను పునర్నిర్మించారు. సృష్టి ఆరంభం మొదలగు విషయాలలో పాశ్చాత్య విద్వాంసుల కాలగణనం, వారు వారు కూర్చిన భారతదేశ చరిత్ర సరైనవి కావని విమర్శించారు. మన పురాణాలలోనే భారతదేశ వాస్తవచరిత్ర దాగివుందని వీరి సిద్ధాంతం. ఆర్య విజ్ఞానం అనే పేరుతో ఒక బృహద్గ్రంథాన్ని వీరు 8 భాగాలుగా రాసి ప్రకటించాలని సంకల్పించారు. దానిలో మొదటి రెండు భాగాలుగా బ్రహ్మాండ సృష్టి విజ్ఞానము, మానవ సృష్టి విజ్ఞానము అనే గ్రంథాలను వీరు ప్రచురించారు. అవి పలువురి ప్రశంసలు పొందాయి.

ఇతర రచనలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. వెంకటాచలం, కోట, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీ: 780
  2. వేంకటాచలం, కోట. అగ్ని వంశ క్షత్రియులు లేక నియోగి బ్రాహ్మణ ప్రభువులు. Retrieved 2020-07-11.

ఇతర లింకులు[మార్చు]