Jump to content

టి.వెంకటేశ్వరరావు

వికీపీడియా నుండి
టి. వెంకటేశ్వరరావు
జననంతాడిపనేని వెంకటేశ్వరరావు
1916 నవంబరు 12
చెమళ్లమూడి, గుంటూరు జిల్లా
మరణం2013 అక్టోబరు 14
ఇతర పేర్లుటీవీ
వృత్తివిజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ప్రథమ మేయర్
భార్య / భర్తవసుంధర
పిల్లలుకుమారులు. రమేష్‌, సురేష్‌

తాడిపనేని వెంకటేశ్వరరావు, బెజవాడ కార్పొరేషన్ మొదటి మేయర్.[1] 1981-83, 1995-2000 సంవత్సరాల మధ్యకాలంలో రెండు సార్లు విజయవాడ మేయర్ గా పనిచేశాడు.

జననం

[మార్చు]

ఇతను 1916, నవంబరు 12 గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చెమళ్లమూడి గ్రామంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు.[2] గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో 1939 లో డిగ్రీ పూర్తిచేసి, 1940 జనవరి నుండి విజయవాడలో స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

1948 నుండి 1951 వరకు జైలు జీవితం గడిపాడు. విజయవాడ పురపాలక సంఘం వైస్ చైర్మేన్ గా 1958 నుండి 1959 వరకు పనిచేశాడు. నగరంలో పేదలకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రముఖ ప్రాత వహించాడు. అఖిల భారత మేయర్ల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. భార్య వసుంధర స్వగ్రామం గుంటూరు జిల్లా జూపూడి. 1938లో వివాహం జరిగింది. వసుంధర కమ్యూనిస్టు పార్టీలోను, మహిళా సమాఖ్యలోను క్రియాశీలక పాత్ర పోషించింది. ఆమె 2011 జనవరి 3 న చనిపోయింది. విజయవాడలో విశాలాంధ్ర భవనం, చండ్రరాజేశ్వరరావు లైబ్రరీ, లెనిన్ సెంటర్లో లెనిన్ విగ్రహం ఏర్పాటులో అతను కృషిఉంది. బలమైన స్థానిక సంస్థలు ఉన్నప్పుడే రాష్ట్రాభి వృద్ధి సాధ్యమవుతుందంటూ రాజ్యాంగం 74వ సవరణ, స్థానిక సంస్థలకు హక్కుల బదలాయింపు కోసం కృషి చేశాడు. రాష్ట్ర ప్రభుత్వ పెత్తందారీతనం లేని, కమిషనర్ల ఆధిపత్యంలేని మున్సిపాలిటీల్లో స్వయంపాలన సాధించాలని ఉద్యమించాడు. స్థానిక సంస్థల హక్కులు, నిధుల కోసం నిరశన దీక్ష చేశారు.[1]

1965 ఆంధ్రప్రదేశ్ పురపాలకసంఘ చట్టం, 1955 హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ చట్టాలలో మౌలిక మార్పులు అవసరమని, మేయర్లు, చైర్‌పర్సన్లు, ప్రజాప్రతినిధులకు అధికారాలు కల్పించాలని, బెంగాల్ నమూనా మేయర్ ఇన్ కౌన్సిలు విధానాన్ని ప్రవేశపెట్టాలని తాడిపినేని పోరాడాడు. 1995 జూన్ 18న రాష్ట్రంలోని మేయర్లు, ఛైర్మన్ల సదస్సును విజయవాడలో నిర్వహించాడు. టీవీని కదిలే మునిసిపల్ చట్టం అని సంబోధించేవారు. టీవీ తొలితరం కమ్యూనిస్టులైన పుచ్చల పల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య, మోటూరు హనుమంతరావు, వేములపల్లి శ్రీకృష్ణ ల సహచరుడు. రహస్యజీతం గడుపుతూ 1947-48 లో అరెస్టు అయిరాజమండ్రి, కడలూరు జైళ్లలో గడిపాడు. జైలు కమిటీ మేయర్‌గా మూడేళ్లు పనిచేశాడు. పార్టీ విభజన అనంతరం సీపీఐ విజయవాడ శాఖ కార్యదర్శిగా పనిచేశాడు.సత్యనారాయణపురం రైల్వే ట్రాక్ తొలగించేందుకు కృషి చేశాడు. ఫలితంగానే నేడు బీఆర్టీఎస్ రోడ్డును నగర ప్రజలు చూడగలుగుచున్నారు. పడమట ఎన్టీ ఆర్ సర్కిల్ నుంచి పంటకాలువ రోడ్డు ఏర్పాటుచేయించాడు. కాలువపై బ్రిడ్జిలు నిర్మించడంలో అతని పాత్ర మరవలేంది. విజయవాడ కొండలపై కాపురాలకోసం కిలోమీటర్ల ఎత్తున బూస్టర్ల ద్వారా నీటి సరఫరా, వీధి దీపాలు ఏర్పాటు చేశారు. పార్కులు, రిక్రియేషన్ క్లబ్‌లకు నగరపాలక సంస్థ బడ్జెట్‌లో నిధులు కేటాయించాడు. రాష్ట్రంలోనే తొలిసారి కార్పొరేషన్ భాగస్వామ్యంతో వీధి బాలకార్మికుల కోసం ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ సంస్థ ఏర్పాటు చేశాడు. ఆ సంస్థ 40 వేల బాలకార్మికులకు ఆశ్రయం కల్పించింది.[1] ముందు చూపున్న నేత. ఇద్దరు కుమారులు. రమేష్‌ సిద్ధార్థ అకాడమీలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తుండగా, రెండవ కుమారుడు సురేష్‌ న్యూఢిల్లీలోని మినిస్టీరియల్‌ ఆఫ్‌ ఎక్స్‌టర్నల్‌ ఎఫైర్స్‌లో పనిచేస్తున్నారు. వెంకటేశ్వరరావు 2013 అక్టోబరు 14 న కన్నుమూశాడు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "'స్థానిక' హక్కుల ఉద్యమనేత టి. వెంకటేశ్వరరావు". Sakshi. 2013-10-16. Retrieved 2021-07-17.
  2. టి. వెంకటేశ్వరరావు (2008). విజయవాడ సమగ్ర దర్శిని. విజయవాడ: టి. వెంకటేశ్వరరావు. p. 4.

వెలుపలి లంకెలు

[మార్చు]