డిండి నది

వికీపీడియా నుండి
(దిండి నది నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
డిండి నది
డిండి జలాశయం

దిండి నది (River Dindi) మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలలో ప్రవహించే నది. ఇది కృష్ణానదికి ఉపనది. దిండి నది మహబూబ్ నగర్ జిల్లా పురుసంపల్లి కొండలలో జన్మిస్తుంది.[1] ఈ నదిపై నల్గొండ జిల్లాలో దిండి రిజర్వాయర్ నిర్మించబడింది. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల సరిహద్దు గుండా నల్లమల అడవులలో ప్రవహింది నాగార్జునసాగర్లో కలుస్తుంది. దిండినదికే దుందుభి నది అని కూడా పిలుస్తారు. దుందుభీ తీరాన మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అతిప్రాచీన క్షేత్రం మామిళ్ళపల్లిని దుందుభీక్షేత్రంగా వ్యవహరిస్తారు. జడ్చర్ల మండలంలో దుందుభీ తీరాన ప్రాచీనమైన పరశవేదీశ్వరాలయం ఉంది. ఈ క్షేత్ర సమీపంలో ప్రవహించే దుందుభిని వర్ణిస్తూ ప్రముఖ రచయిత గంగాపురం హనుమచ్ఛర్మ "దుందుభి" కావ్యాన్ని రచించాడు. దిండి ప్రాజెక్టు1943

మూలాలు[మార్చు]

  1. జలవనరులు, సిద్దాని నాగభూషణం రచన, ఆరవ ముద్రణ (2004), పేజీ 27

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=డిండి_నది&oldid=3563494" నుండి వెలికితీశారు