Coordinates: 16°28′20″N 81°31′46″E / 16.4722016°N 81.5294716°E / 16.4722016; 81.5294716

దిరుసుమర్రు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిరుసుమర్రు
—  రెవెన్యూ గ్రామం  —
దిరుసుమర్రు is located in Andhra Pradesh
దిరుసుమర్రు
దిరుసుమర్రు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°28′20″N 81°31′46″E / 16.4722016°N 81.5294716°E / 16.4722016; 81.5294716
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం భీమవరం
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 8,645
 - పురుషులు 4,358
 - స్త్రీలు 4,287
 - గృహాల సంఖ్య 2,509
పిన్ కోడ్ 534239
ఎస్.టి.డి కోడ్

దిరుసుమర్రు, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రమైన భీమవరం నుండి 8 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2509 ఇళ్లతో, 8645 జనాభాతో 1414 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4358, ఆడవారి సంఖ్య 4287. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 339 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 55. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588736.[1] ఈ గ్రామం భీమవరం – మొగల్తూరు రహదారిలో భీమవరం పట్టణం నుండి సుమారు 7 కి.మీ. దూరంలో ఉంది. ప్రధాన రహదారి నుండి గ్రామం సుమారు 5 కి.మీ లోపలకు ఉంది.

ప్రధాన విశేషాలు[మార్చు]

గ్రామప్రారంభమున ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఈ స్వామి గ్రామాన్ని అన్ని ఆపదల నుండి కాపాడునని గ్రామస్ధుల విశ్వాసం. ప్రతి ఏడాది ముక్కోటి ఏకాదశి నుండి 9 రోజులు పాటు ఆంజనేయ స్వామి ఉత్సవం గ్రామస్ధులు ఘనంగా నిర్వహిస్తారు. గ్రామప్రారంభంలో ఉన్న సుమారు 1.5 కి.మీ.ల ప్రాంతాన్ని సింగరాజుపాలెం అని అంటారు. ఈ సింగరాజుపాలెంనందు శ్రీరామాలయం ఉంది. ప్రతి ఏడాది శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణాన్ని గ్రామస్ధులు ఘనంగా నిర్వహిస్తారు. గ్రామప్రారంభం నుండి సుమారు 3.5 కి.మీ లోపల ఒక పురాతన శివాలయం ఉంది. ఈ శివాలయంనందు ప్రత్యేకత గంగాదేవి ఆలయం శివుని ఆలయం పైభాగాన మొదటి అంతస్తు యందు ఉండుట. భక్తులు మొదట శివపార్వతులను దర్శించి ఆ పైన మొదటి అంతస్తు యందున్న గంగాదేవిని దర్శిస్తారు ఇచట ప్రతి ఏడాది జరుగు శివరాత్రి ఉత్సవాలకు చుట్టుప్రక్కల గ్రామాలనుండి కూడా ప్రజలు వస్తారు.

రవాణా సౌకర్యం[మార్చు]

భీమవరం పట్టణం యందున్న పాతబస్టాండు, ఆదివారం బజారు నుండి దిరుసుమర్రు గ్రామానికు ప్రైవేటు బస్సు సౌకర్యం, ఆటో సౌకర్యం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్.టి.సి) బస్సులు కొన్నిసార్లు ఉండును. ఆటో సౌకర్యం ఆర్.టి.సి బస్టాండు నుండి, భీమవరం పట్టణ రైల్వే స్టేషను నుండి ఉంది.

ఇతర సౌకర్యాలు[మార్చు]

గ్రామ ప్రారంభములోనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. ఈ చుట్టుప్రక్కల గ్రామాలకు ఇదియే ఉన్నత పాఠశాల.

గ్రామానికి చెందిన ప్రముఖులు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8917. ఇందులో పురుషుల సంఖ్య 4483, మహిళల సంఖ్య 4434, గ్రామంలో నివాస గృహాలు 2146 ఉన్నాయి.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2509 ఇళ్లతో, 8645 జనాభాతో 1414 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4358, ఆడవారి సంఖ్య 4287. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 339 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 55. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588736.[1]

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి భీమవరంలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం భీమవరం లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప వైద్య కళాశాల, ఏలూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

దిరుసుమర్రులో ఉన్న రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

దిరుసుమర్రులో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

దిరుసుమర్రులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 129 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1284 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1284 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

దిరుసుమర్రులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 1284 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

దిరుసుమర్రులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

వ్యవసాయం[మార్చు]

ప్రధాన పంట వరి. నీటి పారుదల వ్యవస్థ చక్కగా ఉండుటచే రబీ, ఖరీఫ్ లందు రైతులు వరినే పండించెదరు.

ఆక్వా కల్చర్[మార్చు]

వరి తర్వాత ఆక్వా కల్చర్ రెండవ ప్రధాన వృత్తి. ఆక్వా కల్చర్ ప్రధానముగా చేపల, రొయ్యల చెరువులలో సాగు చేయబడును.

ప్రధాన పంటలు[మార్చు]

వరి

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

బియ్యం

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".