Coordinates: 15°58′52″N 80°50′22″E / 15.980992°N 80.839335°E / 15.980992; 80.839335

నల్లూరిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నల్లూరిపాలెం
—  గ్రామం  —
నల్లూరిపాలెం is located in Andhra Pradesh
నల్లూరిపాలెం
నల్లూరిపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°58′52″N 80°50′22″E / 15.980992°N 80.839335°E / 15.980992; 80.839335
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం రేపల్లె
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి రాగిపాటి గోవిందమ్మ
పిన్ కోడ్ 522265
ఎస్.టి.డి కోడ్ 08648

నల్లూరిపాలెం బాపట్ల జిల్లా రేపల్లె మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. పిన్ కోడ్: 522 265. ఎస్.టి.డి.కోడ్ నం. 08648.

గ్రామ చరిత్ర[మార్చు]

భారతదేశ స్వాతంత్ర్యోద్యమం, నల్లూరు, నల్లూరుపాలెం గ్రామాలు ప్రజలలో గూడా స్ఫూర్తిని రగిలించింది. నల్లూరు గ్రామ ప్రజలు ప్రాణాలకు తెగించి ఉద్యమానికి ప్రోత్సాహం ఇచ్చారు. నల్లూరుపాలెం గ్రామంలో మాహాత్ముడు అడుగుపెట్టినప్పుడు, గ్రామప్రజలు, ఉద్యమనిర్వహణకోసం తమ ఒంటిపైనున్న ఆభరణాలు సైతం, ఆ మహాత్మునికి విరాళంగా అందించి, దేశసేవలో తరించారు. తెనాలికి చెందిన వెంకటసుబ్బయ్య, నల్లూరు గ్రామం కేంద్రంగా, హిందీభాషతో పాటు, ఉద్యమపాఠాలు సైతం చెప్పించారు. ఆయన పోలీసుల లాఠీల దెబ్బలు, కారాగారశిక్షను గూడా అనుభవించారు. పోలీసులు గ్రామంలోని ప్రతి ఇల్లూ ఉద్యమకారులకై వెతకటంతో, వీరు ఊరిబయట పూరిపాక వేసుకొని ఉద్యమం చేసారు. ఆ ప్రాంతములో 1934, జనవరి-18వతేదీనాడు, గాంధీస్థూపం నిర్మించారు. అది ఆనాటి ఉద్యమకారుల త్యాగాలకు స్మారక చిహ్నంగా మారినది. ప్రస్తుతం శిథిలావస్థకుచేరిన ఆ స్థూపాన్ని అభివృద్ధిచేయాడానికి సర్పంచి శ్రీ సుభాష్ ముందుకు వచ్చారు.

ఈ గ్రామం మండల కేంద్రానికి 5 కి.మీ. దూరంలో ఉంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

ఈ పాఠశాల భవనాలను 1966లో నిర్మించారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం 235 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు. 13 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ పాఠశాల సక్సెస్ పాఠశాల కావటంతో తెలుగు మాధ్యమంలో 5వ తరగతి వరకు, ఆంగ్ల మాధ్యమంలోనూ 5వ తరగతి వరకు విద్యాబోధన చేస్తున్నారు. ప్రస్తుతం పాఠశాల శిథిలావస్థకు చేరినది. ఈ పాఠశాల నిర్మించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా, పాఠశాల స్వర్ణోత్సవాలను, 2017, జనవరి-12,13 తేదీలలో వైభవంగా నిర్వహించెదరు.ఈ పాఠశాల వ్యవస్థాపకుడు కీ.శే.సుఖవాసి జగన్నాధం కాంస్య విగ్రహాన్ని, ఈ పాఠశాల ఆవరణలో 2017, ఆగస్టు-8న ఆవిష్కరించెదరు. ఈ సందర్భంగా ఆయన మనుమడు, హైదరాబాదులోని ప్రగతి రిసార్ట్స్ అధినేత శ్రీ గడ్డిపాటి బాలకోటేశ్వరరావు, పాఠశాలకు ఒక వేయి మొక్కలనూ, ఒక 100 ట్రీ గార్డ్స్‌నూ బహుకరించెదరు.

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల[మార్చు]

వేద పాఠశాల[మార్చు]

ఇండియన్ రూరల్ అడ్మినిస్ట్రేషన్ (I.R.A) ప్రతినిధి శ్రీ సుఖవాసి హరిన్ చాంద్, ఈ పాఠశాల కొరకు ఒక నీటి శుద్ధియంత్రాన్ని వితరణగా అందించారు.

గ్రంథాలయం[మార్చు]

ఈ గ్రామంలో గ్రంథాలయానికి ఒక శాశ్వత భవన నిర్మాణానికి, అరు లక్షల రూపాయల అంచనా వ్యయంతో, 2009లో శంకుస్థాపన నిర్వహించారు. ఇంకనూ పూర్తి కాలేదు.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

ఆర్థిక వ్యవస్థ: ముఖ్యంగా వ్యవసాయాధారితం. ప్రధానంగా ప్రకాశం బారేజి నుండి నీటి సరఫరా జరుగుతుంది.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో రాగిపాటి గోవిందమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ అంకమ్మ తల్లి ఆలయం[మార్చు]

గ్రామంలో నూతనంగా అంకమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి, 2017, ఫిబ్రవర్-6వతేదీ సోమవారంనాడు శంకుస్థాపన నిర్వహించారు.

శ్రీ వేద భారతి గీతాశ్రమం[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి ప్రధానమైన పంట. రెండవ పంటగా మినుమును ప్రధానంగా పండిస్తారు.