సంసారం (1950 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 28: | పంక్తి 28: | ||
==సంక్షిప్త చిత్రకథ== |
==సంక్షిప్త చిత్రకథ== |
||
రఘు (యన్.టి.రామారావు) ప్రభుత్వ ఉద్యోగి. చాలా సామాన్యమైన గుమస్తా బ్రతుకుతుంటాడు. భార్య మంజుల (లక్ష్మీరాజ్యం), తమ్ముడు వేణు (అక్కినేని), పల్లెటూర్లో నివాసం. అక్కడ వుండేది తల్లి, చెల్లెలు మరియు బావ. బావను తల్లి, చెల్లెలు చెప్పుచేతల్లో వుంచుకొంటారు. వీరందరి అవసరాలు తన జీతంతోనే రఘు తీర్చాల్సివస్తుంది. ఆ ప్రయత్నంలో ఎన్నో ఇబ్బందులు పడి సంసారాన్ని విడిచి ఎక్కడికో వెళ్ళిపోతాడు. అప్పుడు మంజుల పిల్లలచేత ముష్టి ఎత్తించి సంసారం నెట్టుకొని వస్తుంది. తను ఒకచోట పనిమనిషిగా చేరి హత్యానేరంలో ఇరుక్కుంటుంది. |
రఘు (యన్.టి.రామారావు) ప్రభుత్వ ఉద్యోగి. చాలా సామాన్యమైన గుమస్తా బ్రతుకుతుంటాడు. భార్య మంజుల (లక్ష్మీరాజ్యం), తమ్ముడు వేణు (అక్కినేని), పల్లెటూర్లో నివాసం. అక్కడ వుండేది తల్లి, చెల్లెలు మరియు బావ. బావను తల్లి, చెల్లెలు చెప్పుచేతల్లో వుంచుకొంటారు. వీరందరి అవసరాలు తన జీతంతోనే రఘు తీర్చాల్సివస్తుంది. ఆ ప్రయత్నంలో ఎన్నో ఇబ్బందులు పడి సంసారాన్ని విడిచి ఎక్కడికో వెళ్ళిపోతాడు. అప్పుడు మంజుల పిల్లలచేత ముష్టి ఎత్తించి సంసారం నెట్టుకొని వస్తుంది. తను ఒకచోట పనిమనిషిగా చేరి హత్యానేరంలో ఇరుక్కుంటుంది. పల్లెటూరిలో వున్న వేణు టౌనుకు వచ్చి జరిగింది తెలుసుకొని పరిస్థితులు చక్కదిద్దడానికి ప్రయత్నిస్తాడు. చివరికి తల్లి, చెల్లెలు కలిసి సంసారానికి చేసిన ద్రోహం బయటా పడుతుంది. రఘు ఇంటికి వస్తాడు. అందరూ ఏకమౌతారు. |
||
==పాటలు== |
==పాటలు== |
15:06, 15 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు
సంసారం (1950 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎల్.వీ.ప్రసాద్ |
---|---|
నిర్మాణం | సి.వి.రంగనాథదాసు, కె.వి.కృష్ణ |
కథ | వెంపటి సదాశివబ్రహ్మం |
తారాగణం | సురభి బాలసరస్వతి, దొరై స్వామి, లక్ష్మీరాజ్యం, అక్కినేని నాగేశ్వరరావు, పుష్పలత, నందమూరి తారక రామారావు, నల్ల రామమూర్తి, సావిత్రి (మొదటి సినిమా మరియు చిన్న పాత్ర), సూర్యకాంతం, రేలంగి వెంకటరామయ్య, దామోదరం, బెజవాడ కాంతమ్మ |
సంగీతం | సుసర్ల దక్షిణామూర్తి |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, జిక్కి కృష్ణవేణి |
గీతరచన | సీనియర్ సముద్రాల, వెంపటి సదాశివబ్రహ్మం, కొండముది గోపరాయశర్మ |
సంభాషణలు | వెంపటి సదాశివబ్రహ్మం |
ఛాయాగ్రహణం | బి.సుబ్బారావు, ఎం.ఎ.రెహమాన్ |
కళ | టి.వి.ఎస్.శర్మ |
నిర్మాణ సంస్థ | సాధనా పిక్చర్స్ |
విడుదల తేదీ | డిసెంబరు 29,1950 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఈ సినిమా 29 డిసెంబరు, 1950 విడుదల అయ్యినా నిర్మాత కె.వి.కృష్ణ మరణించడం చేత ప్రదర్శన ఆపివేసి మళ్ళీ 5 జనవరి, 1951 మొదలు పెట్టినారు. ఈ సినిమా విజయవంతమై 11 థియేటర్లలో శతదినోత్సవాలు జరుపుకున్నది.
సంక్షిప్త చిత్రకథ
రఘు (యన్.టి.రామారావు) ప్రభుత్వ ఉద్యోగి. చాలా సామాన్యమైన గుమస్తా బ్రతుకుతుంటాడు. భార్య మంజుల (లక్ష్మీరాజ్యం), తమ్ముడు వేణు (అక్కినేని), పల్లెటూర్లో నివాసం. అక్కడ వుండేది తల్లి, చెల్లెలు మరియు బావ. బావను తల్లి, చెల్లెలు చెప్పుచేతల్లో వుంచుకొంటారు. వీరందరి అవసరాలు తన జీతంతోనే రఘు తీర్చాల్సివస్తుంది. ఆ ప్రయత్నంలో ఎన్నో ఇబ్బందులు పడి సంసారాన్ని విడిచి ఎక్కడికో వెళ్ళిపోతాడు. అప్పుడు మంజుల పిల్లలచేత ముష్టి ఎత్తించి సంసారం నెట్టుకొని వస్తుంది. తను ఒకచోట పనిమనిషిగా చేరి హత్యానేరంలో ఇరుక్కుంటుంది. పల్లెటూరిలో వున్న వేణు టౌనుకు వచ్చి జరిగింది తెలుసుకొని పరిస్థితులు చక్కదిద్దడానికి ప్రయత్నిస్తాడు. చివరికి తల్లి, చెల్లెలు కలిసి సంసారానికి చేసిన ద్రోహం బయటా పడుతుంది. రఘు ఇంటికి వస్తాడు. అందరూ ఏకమౌతారు.
పాటలు
- రావో వరాల ఏలికా కనవోయి కానుక
- అందాల చందమామ నిన్ను వలచి అలలు లేచి ( ఘంటసాల వెంకటేశ్వరరావు)
- సంసారం సంసారం ప్రేమ సుధాపూరం (ఘంటసాల వెంకటేశ్వరరావు)
- టక్కు టక్కు టమకుల బండి లంఖణాల బండి (ఘంటసాల వెంకటేశ్వరరావు, జిక్కి కృష్ణవేణి)
- కల నిజమాయెగా కోరిక తీరెగా (జిక్కి కృష్ణవేణి)
- నా సొగసైన క్రాపు పోయెనే
- ఇటుపై నా సంగతేమీ
- చిత్రమైనది విధినడక పరిశొధనే ఒక వేడుక (ఘంటసాల వెంకటేశ్వరరావు)