బోడె ప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బోడె ప్రసాద్
బోడె ప్రసాద్


ఎమ్మెల్యే
పదవీ కాలం
2014- 2019
ముందు కొలుసు పార్థసారథి
తరువాత కొలుసు పార్థసారథి
నియోజకవర్గం పెనమలూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1968
పెనమలూరు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు వెంకటేశ్వర్ రావు, కృష్ణ కుమారి
జీవిత భాగస్వామి హేమ చౌదరి
సంతానం వైష్ణవి, వెంకటరామన్
వృత్తి రాజకీయ నాయకుడు

బోడె ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో పెనమలూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

బోడె ప్రసాద్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2006లో పోరంకి గ్రామా ఉప సర్పంచిగా పని చేసి, 2010 నుండి పెనమలూరు మండలం టీడీపీ అధ్యక్షుడిగా పని చేసి 2014లో పెనమలూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కుక్కల విద్యాసాగర్ పై 31448 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2019లో పెనమలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి చేతిలో 11317 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. బోడె ప్రసాద్‌ టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా 2021 జులై 9న నియమితులయ్యాడు.[2]

మూలాలు[మార్చు]

  1. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  2. Andhra Jyothy (9 July 2021). "టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శిగా బోడె ప్రసాద్‌". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.