మహంత్ చంద్‌నాథ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహంత్ చంద్‌నాథ్
2015లో పార్లమెంటులో మహంత్ చంద్‌నాథ్
పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ
In office
2014 మే 16 – 2017 సెప్టెంబరు 17
అంతకు ముందు వారుజితేంద్ర సింగ్ (భారత జాతీయ కాంగ్రెస్)
తరువాత వారుకరణ్ సింగ్ యాదవ్
నియోజకవర్గంఅల్వార్
వ్యక్తిగత వివరాలు
జననం(1956-06-21)1956 జూన్ 21
ఢిల్లీ, భారతదేశం
మరణం2017 సెప్టెంబరు 17(2017-09-17) (వయసు 61)
న్యూ ఢిల్లీ, భారతదేశం
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
నివాసంరోహ్తక్, హర్యానా, భారతదేశం
కళాశాలహిందూ కళాశాల, ఢిల్లీ, ఢిల్లీ విశ్వవిద్యాలయం
వృత్తిరాజకీయ నాయకుడు
వ్యక్తిగతం
మతంహిందూధర్మం
Denominationశైవం
పాఠశాలయోగా
జాతిబాబా మస్త్‌నాథ్
తెగనాథ సంప్రదాయము
Templeబాబా మస్త్‌నాథ్ మఠం
Instituteబాబా మస్త్‌నాథ్ విశ్వవిద్యాలయం
Senior posting
Guruమహంత్ శ్రేయోనాథ్
Period in office1978–2016
Successorబాబా బాలక్ నాథ్
Ordination1978
Postమహంత్ (మఠం అధిపతి)

మహంత్ చంద్‌నాథ్ (1956 జూన్ 21 - 2017 సెప్టెంబరు 17) భారతీయ రాజకీయ నాయకుడు, ఆధ్యాత్మిక గురువు. ఆయన భారతదేశ పార్లమెంటులో అల్వార్ లోక్‌సభ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించాడు. హిందూమతంలోని నాథ్ శాఖకు అధిపతిగా కూడా ఉన్నాడు. ఆయన 1978లో మహంత్ శ్రేయోనాథ్ నుండి సన్యాసం స్వీకరించాడు.[1]

వ్యక్తిగత జీవితం[మార్చు]

హర్యానాలోని బాబా మస్త్ నాథ్ విశ్వవిద్యాలయం చాన్సలర్‌గా ఆయన ఉన్నాడు. ఆయన హిందూమతంలోని నాథ్ శాఖకు కూడా ముఖ్యుడు.[2] 2016 జూలై 29న, యోగి ఆదిత్యనాథ్, బాబా రామ్‌దేవ్‌లు హాజరైన వేడుకలో మహంత్ బాలక్‌నాథ్‌ని తన వారసుడిగా ప్రకటించాడు.[3]

రాజకీయ జీవితం[మార్చు]

2004 భారత పార్లమెంటు ఎన్నికలలో, చాంద్‌నాథ్ భారతీయ జనతా పార్టీ టిక్కెట్‌పై అల్వార్ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.[4][5]

2004 రాజస్థాన్ ఉప ఎన్నిక కోసం, బెహ్రోర్ స్థానంలో పోటీ చేయడానికి చందనాథ్‌కు టిక్కెట్ ఇవ్వబడింది. ఎన్నికల కోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లలిత్ కిషోర్ చతుర్వేది, ముఖ్యమంత్రి వసుంధర రాజే తన నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో పార్టీ రెబల్‌పై పోటీ చేసిన జస్వంత్‌ సింగ్‌ యాదవ్‌పై 13 వేల ఓట్ల తేడాతో విజయం సాధించాడు.[6]

2014 భారత పార్లమెంటు ఎన్నికలలో, చందనాథ్ 2 లక్షల రూపాయల ($3100) ఆస్తుల విలువను ప్రకటించాడు.[7] ఆ ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జితేంద్ర సింగ్.[8] ఎన్నికల్లో గెలిచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[9]

మరణం[మార్చు]

ఆయన 61 సంవత్సరాల వయస్సులో 2017 సెప్టెంబరు 17న క్యాన్సర్‌తో ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణించాడు. ఆయన సామాజిక సేవతో పాటు రాజకీయ నేతగా చిరస్మరణీయుడు అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించాడు.[10]

మూలాలు[మార్చు]

  1. "Alwar MP Chand Nath Yogi passes away, PM Modi birthday celebrations called off in city". 20 August 2018.
  2. "Cong expects tough contest in pampered constituency". Hindustan Times. 12 September 2014. Retrieved 8 July 2017.
  3. "महंत चांदनाथ ने तय किया अपना उत्तराधिकारी, मौजूद रहे बाबा रामदेव". अमर उजाला. Retrieved 9 July 2017.
  4. "ceorajasthan.nic.in".
  5. "BJP, Congress make a dent in rival dens". The Hindu. 2004-10-17. Retrieved 9 July 2017.[dead link]
  6. "BJP, Congress make a dent in rival dens". The Hindu. 2004-10-17. Retrieved 9 July 2017.[dead link]
  7. "16th Lok Sabha to have 442 crorepatis, richest worth Rs 683 crore". Financial Express. 19 May 2014. Retrieved 9 July 2017.
  8. "Two Union ministers among 18 candidates to file papers in Rajasthan". News18. 2 April 2014. Retrieved 9 July 2017.
  9. "Rathore Biggest Winner, Azharuddin Loses Badly". India Journal. Retrieved 9 July 2017.
  10. "Rajasthan: BJP MP from Alwar Mahant Chandnath passes away". Hindustan Times. 17 September 2017. Retrieved 21 September 2017.