Coordinates: 15°44′20″N 80°04′48″E / 15.739°N 80.08°E / 15.739; 80.08

రావినూతల (కొరిశపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెవెన్యూ గ్రామం
పటం
Coordinates: 15°44′20″N 80°04′48″E / 15.739°N 80.08°E / 15.739; 80.08
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంకొరిశపాడు మండలం
Area
 • మొత్తం25.62 km2 (9.89 sq mi)
Population
 (2011)[1]
 • మొత్తం8,279
 • Density320/km2 (840/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1052
Area code+91 ( 08593 Edit this on Wikidata )
పిన్‌కోడ్523213 Edit this on Wikidata


రావినూతల బాపట్ల జిల్లా, కొరిశపాడు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కొరిశపాడు నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఒంగోలు నుండి 35 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2375 ఇళ్లతో, 8279 జనాభాతో 2562 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4034, ఆడవారి సంఖ్య 4245. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2660 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 239. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 591010[2].పిన్ కోడ్: 523213.

సమీప గ్రామాలు[మార్చు]

పమిడిపాడు 5 కి.మీ, దైవాల రావూరు 5 కి.మీ. మేదరమెట్ల 9 కి.మీ,కొరిశపాడు 6 కి.మీ,అలవలపాడు 6 కి.మీ.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉన్నాయి.

సమీప ప్రభుత్వ ఆర్ట్స్/సైన్స్ డిగ్రీ కళాశాల మేదరమెట్లలోను, ఇంజనీరింగ్ కళాశాల ఏడుగుండ్లపాడులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ ఒంగోలులోను, మేనేజిమెంటు కళాశాల దొడ్డవరప్పాడులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మేదరమెట్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

రావినూతలలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. డిస్పెన్సరీ, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో6 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఐదుగురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ ఉంది. ప్రతి సోమవారం, గురువారం నాడు స్వచ్ఛ భారత్ పేరుతో రావినూతల మునిసిపాలిటీ వారి బండి వస్తుంది. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

రావినూతలలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

గ్రామ ప్రముఖులు[మార్చు]

నాగభైరవ కోటేశ్వరరావు:ప్రముఖ కవి, సాహితీవేత్త, సినిమా మాటల రచయిత.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

రావినూతలలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 167 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 14 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 12 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 23 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 10 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 331 హెక్టార్లు
  • బంజరు భూమి: 143 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1857 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 2164 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 167 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

రావినూతలలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 167 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

రావినూతలలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

కంది, ప్రత్తి, శనగ

బ్యాంకులు[మార్చు]

  1. ది ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్.
  2. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

విశేషాలు[మార్చు]

  • పూర్వం కమ్మనాడు అనే ప్రాంతం ఉండేది. అది గుండ్లకమ్మ, పేర కమ్మల మధ్య ప్రదేశం, కమ్మ అంటే నది, పేర కమ్మను కృష్ణానది అంటున్నాం. ఈ కమ్మనాటిలో రావినూతల అనే స్థలం ఉంది. దానిలో కాకతీయ పాలకులైన ప్రతాపరుద్రుని సంతోష పెట్టడానికి అప్పటి స్థానపతి బాబులదేవరాయలు, ఒక భీమేశ్వర ఆలయాన్ని నిర్మించాడు అని ఇక్కడి శాసనాలలో రాయబడి ఉంది. అప్పటి భీమేశ్వర ఆలయమే శివాలయం. ఇది 13 వ శతాబ్దంలో నిర్మింపబడింది.
  • భౌగోళికంగా రావినూతల 80 డిగ్రీల 4 సెకనుల నుండి 80 డిగ్రీల 7 సెకనుల తూర్పు రేఖాంశం మధ్య, ఉత్తరాన 15 డిగ్రీల 42 సెకనుల నుండి 15 డిగ్రీల 46 సెకనుల మధ్య, సముద్ర మట్టానికి 125 అడుగుల ఎత్తున విస్తరించి ఉంది.
  • ఊరికి ఉత్తరాన కొప్పెరపాడు, తూర్పున పమిడిపాడు, దక్షిణాన సలివేంద్రం పశ్చిమాన పాలెం అనే ఊళ్ళు ఉన్నాయి.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

రాష్ట్రంలోని పురాతన దేవాలయాల్లో పెక్కింటిని అప్పటి రాష్ట్ర పరిపాలకులైన చోళ రాజులు, పల్లవులు, కాకతీయులు, రాష్ట్ర కూటులు మొదలైన వారు ప్రతిస్టించినవే. ఆయా దేవాలయాలకు, మడులు, మాన్యాలు ఏర్పరిచి అర్చకుల ద్వారా ధూప, దీప నైవేద్యాలకు, నిత్యోస్త్సవ, మాసొస్త్సవ, సంవత్సరోత్సవ కాలక్షెపములుకు విరివిరిగా ధానధర్మాలు చేసి దాన పత్రములు వ్రాయించి ఇచ్చిరి. ఆర్చక స్వాములు దేవాలయాలలో నిత్య నైమిత్తికమైన పూజలు జరిపించుచు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన, మార్గేణ, మహీం, మహీశా గో బ్రాహ్మణేభ్యాచ్చా శుభమస్తు నిత్యం లోకాస్సమస్తా సుఖినోభవంతు అనే శ్లోకాన్ని నిత్యము పఠిస్తూ గ్రామ క్షేమాన్ని, దేశ క్షేమాన్ని, రాజు క్షేమాన్ని కోరుచూ ఆ దేవుని ప్రార్థించడం నిత్యక్రుత్యమై ఉంది.

  • ధర్మో రక్షతి రక్షితః అనే అర్యొక్తిని అనుసరించి ధర్మముని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇట్టి ధర్మాన్ని మనం ఎలా ఆచరించాలి, స్వధర్మ ఆచరణ యందు ఎట్టి నిష్ఠ కలిగి ఉండాలి అనే విషయాలను తెలియపరుస్తూ మానవుడి మనుగడను తీర్చి దిద్దడానికి ఏర్పడిన ధర్మాలయాలే ఈ దేవాలయాలు.
  • ఈ గ్రామంలోని దేవాలయాల గురించి చెప్పవలసి వస్తే శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ మల్లేస్వర స్వామి, గంగమ్మ, పోలేరమ్మ గ్రామదేవతలు, ఉత్తర బజారులో ప్రతిష్ఠించబడిన బ్రహ్మం గారి మఠం, శ్రీ సాయి దేవాలయం, బొడ్డు రాయి వీధిలోని కన్యకా పరమేశ్వరి దేవాలయం మన ఊరి ఆచార సంపత్తికి, ధార్మిక ప్రవుత్తికి మూలకందాలు.
  • శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం: ఈ దేవాలయం, 14వ శతాబ్దంలో చోళ రాజులచే నిర్మించబడింది. ఈ దేవాలయ నిత్య నైవేద్య ధూపారాధనలకు గాను 42 ఎకరముల, మెట్టభూమి ఇచ్చియున్నారు.
  • శ్రీ మల్లీశ్వర స్వామి దేవాలయం: 1215 వ సంవత్సరంలో కాకతీయ ప్రతాపరుద్రుని మంత్రి ఇక్కడ మల్లీశ్వర స్వామి దేవాలయాన్ని ప్రతిష్ఠించినట్లు ఇచ్చట శాసనముల ద్వారా తెలియుచున్నది.45 ఏకరముల 35 సెంట్ల భూమి, దేవాలయ పోషణకు ఏర్పరచబడియున్నది. శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ దుర్గనాగ మల్లేశ్వర స్వామిల ఉత్సవ మూర్తుల విగ్రహలను ముక్కోటి ఏకాదశికి, విజయ దశమికి గ్రామోత్సవంలో ఊరేగించుట ఇప్పటికిని ఆచారమగ ఉంది.
  • శ్రీ బ్రహ్మం గారి మఠం: ఉత్తర బజారులోని బ్రహ్మం గారి మఠం 1954లో ఉరందరి మూకుమ్మడి సహకారముతో ప్రతిష్ఠించబదినది. ఇచ్చట కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు, నగర సంకీర్తన, భజనలు, గ్రామ సమష్టి సహకారంతో జరుపుకొనుచుందురు. వైశాఖ శుద్ధ ఏకాదశికి ఆరాధనోత్సవం, ఆచారంగా జరపబడుచున్నది.
  • శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి: శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో వైశ్య సంఘం వారు నవరాత్రులు జరుపుతారు. ఆరుద్రోత్సవం, అమ్మవారి పుట్టిన రోజు జరపడం ఇక్కడ ఆచారమై ఉంది.
  • శ్రీ రామాలయం-:- రావినూతల గ్రామంలో నిర్మించ తలపెట్టిన ఈ ఆలయ నిర్మాణానికి 2020,నవంబరు-25వతేదీ, బుధవారం నాడు భూమిపూజ నిర్వహించారు. [1]

గ్రామ దేవతలు గంగమ్మ, పోలేరమ్మలకు పూర్వం 5 సంవత్సరములకు ఒకసారి వైభవోపేతంగా జరిపించెడివారు. గంగమ్మ దేవతకు తొమ్మిది రోజులు, పోలేరమ్మకు 5 రోజులు, జాతరోత్సవములు జరుగుచుండెడివి. కొలువులు ప్రారంభమైన రోజున గంగమ్మకు, పోలేరమ్మకు, గ్రామస్థులు పొంగళ్ళ అమ్మవార్ల పేర్లతో పెట్టుకొని ప్రభలతో ఉత్సవ వేడుకలు జరుపుకునేవారు. శిడిమాను ఉత్సవంతో ఉత్సవాన్ని ముగించేవారు. చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఉత్సవాన్ని తిలకించెడివారు. ఈ మధ్య కాలంలో ఈ ఉత్సవాలు అప్పుడప్పుడు మాత్రమే చేస్తున్నారు. గంగమ్మ దేవతకు ఇప్పటికిని నిత్య పూజలు, దైవారాధన ఈనాటికి జరుపుతున్నారు. గ్రామంలో ఏ ఇంట పెళ్ళి జరిగినా వివాహం రోజు ముందు సాయంకాలము వధూ వరులు వారిళ్ళలో వడపప్పు, పానకము తయారు చెయించుకొని మేళ తాళాలతో గంగమ్మ, పోలేరమ్మ దేవతలకు నైవేద్యం సమర్పించి అచ్చట ముత్తైదువులకు పసుపు, కుంకుమ, పానకము పంచడం పరిపాటిగా ఉంది. ఈ ఉత్సవంలో గ్రామ ప్రజలు కూడా విరివిగా పాల్గొందురు. ఈ శుభ సమయంలో నూతన వధూ వరులు అమ్మవారిని దర్శించి వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కొరడం ఆచారంగానున్నది.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,280. ఇందులో పురుషుల సంఖ్య 3,630, మహిళల సంఖ్య 3,650, గ్రామంలో నివాస గృహాలు 1,969 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,562 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".