కొరిశపాడు
కొరిశపాడు | |
---|---|
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°48′N 80°00′E / 15.8°N 80°ECoordinates: 15°48′N 80°00′E / 15.8°N 80°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | కొరిశపాడు మండలం ![]() |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,002 హె. (2,476 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 4,009 |
• సాంద్రత | 400/కి.మీ2 (1,000/చ. మై.) |
కాలమానం | [[UTC{{{utc_offset}}}]] |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 (08592 ![]() |
పిన్(PIN) | 523212 ![]() |
కొరిశపాడు ప్రకాశం జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన ఒంగోలు నుండి 30 కి. మీ. దూరంలో ఉంది[1].
విద్యా సౌకర్యాలు[మార్చు]
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల మేదరమెట్లలోను, ఇంజనీరింగ్ కళాశాల ఏడుగుండ్లపాడులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్ ఒంగోలులోను, మేనేజిమెంటు కళాశాల దొడ్డవరప్పాడులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మేదరమెట్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలు లోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం[మార్చు]
ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]
కొరిశపాడులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]
గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ముగ్గురు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరు ఉన్నారు.
తాగు నీరు[మార్చు]
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
పారిశుధ్యం[మార్చు]
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]
కొరిశపాడులో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జాతీయ రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]
గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
విద్యుత్తు[మార్చు]
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం[మార్చు]
కొరిశపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 184 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 16 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 46 హెక్టార్లు
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 85 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 31 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 15 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 622 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 546 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 90 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]
కొరిశపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- బావులు/బోరు బావులు: 90 హెక్టార్లు
ఉత్పత్తి[మార్చు]
కొరిశపాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు[మార్చు]
సమీప గ్రామాలు[మార్చు]
వెంకటాపురం 4 కి.మీ,కొంగపాడు 5 కి.మీ, రావినూతల 5 కి.మీ,కుర్రావానిపాలెం 6 కి.మీ. దైవాల రావూరు 6 కి.మీ.
సమీప మండలాలు[మార్చు]
ఉత్తరాన అద్దంకి మండలం,ఉత్తరాన జే.పంగులూరు మండలం,దక్షణాన మద్దిపాడు మండలం,పశ్చిమాన తాళ్ళూరు మండలం.
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
చీరాల బుస్సు ఉదయం ఉన్నది
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
గ్రామానికి త్రాగు/సాగునీటి సౌకర్యం[మార్చు]
ఊరచెరువు :- ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంక్రింద, ఈ చెరువులో పూడికతీత పనులు 2015,మే/జూన్ నెలలలో నిర్వహించారు. ఈ పథకం వలన చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, పూడిక మట్టిని తమ పొలాలకు తరలించడంతో, తమ పొలాలకు రసాయనిక ఎరువుల వినియోగం చాలవరకు తగ్గిపోయినదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. [7]
యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం:- కొరిశపాడు మండల పరిధిలో తూర్పుపాలెం, పెద్ద ఊరు గ్రామ సమీపంలో ఈ ప్రాజెక్టును 177 కోట్ల రూపాయల అంచనావ్యయంతో, 7 సంవత్సరాల నుండి నిర్మించుచున్నారు. [9]
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ గొల్లా శ్రీనివాసరావు సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీమతి పేరం నాగలక్ష్మి ఎన్నికైనారు. [8]
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాయాలములు[మార్చు]
శ్రీ సీతారామస్వామి ఆలయం[మార్చు]
ఈ ఆలయంలోని గర్భగుడిలో, 200 ఏళ్ళుగా అఖండదీపం వెలుగుతూనే ఉండటం విశేషం. 100 దేవాలయాలలో ఇలాంటి దేవాలయం ఒకటుంటుందని పెద్దలు చెపుతుంటారు. స్వామి స్వరూపం, గజలక్ష్మి, రాజ్యలక్ష్మి, రెండువైపులా నారదుడు, తుంబురుడు, ద్వారపాలకులతో మహాసింహద్వారం ప్రత్యేకత. పోరూరి, జొన్నలగడ్డ, కనుబద్ధు, నీలంరాజులు ఆలయధర్మకర్తలుగా వ్యవహరించారు. 'గంగాప్రసాద్" అనే దాత ఏకంగా 18 ఎకరాల పొలం స్వామివారికి ధూప, దీప, నైవేద్యాలకు దానమిచ్చారు. ఒకప్పుడు దసరా, ముక్కోటికి భజనలు, కోలాటం విశేషంగా జరిగేవి. ఇప్పుడు స్వామివారికి 60 ఎకరాల మాన్యం ఉంది. దీంతోపాటు, సుమారు 6 లక్షల రూపాయల ఆలయ నగదు ఉంది. ఈ ఆలయం ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. సి.జి.ఎఫ్ నిధులతో పునఃప్రతిష్ఠ చేయాలని దేవాదాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. త్వరలో దాతలు, భక్తుల సాయంతో కార్యాచరణ పెడతారు. [3]
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించెదరు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు. [5]
శ్రీ గంగా సమేత నీలకంఠేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]
కొరిశపాడు గ్రామ పెద్ద ఊరు సమీపంలో పునప్రతిష్ఠించిన ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం, 2014,మే-20 బుధవారం వైభవంగా నిర్వహించెదరు. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించెదరు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. [4]
శ్రీ పంచముఖ గాయత్రీదేవి శక్తి పీఠం[మార్చు]
శ్రీ గాయత్రీదేవి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా, 2015,మే-28వ తేదీ గురువారంనాడు, ఈ ఆలయంలో, అమ్మవారికి లక్ష మల్లెలతో అర్చన నిర్వహించెదరు. ప్రతి సంవత్సరం, ప్రత్యేకపూజలు మాత్రమే నిర్వహించెడివారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా అర్చన నిర్వహించుచున్నారు. [6]
ఈ పీఠంలో 2015,డిసెంబరు-27వ తేదీ అదివారంనాడు, ఋత్విక్కుల మంత్రోచ్ఛారణల నడుమ, 54 కుండలీయ, 21వ శ్రీ గాయత్రీదేవి మహాయఙం వైభవంగా నిర్వహించారు. ఉదయం 21 కలశాలతో గ్రామోత్సవం నిర్వహించారు. గాయత్రీ హోమాలు నిర్వహించారు. దంపతులే యఙకర్తలుగా పూర్ణాహుతి నిర్వహించారు. శక్తి పీఠం వద్ద ప్రత్యేకపూజలు నిర్వహించారు. మహా నివేదన, గాయత్రీ స్వాముల దీక్షా విరమణ అనంతరం, అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమాలకు గ్రామస్థులతోపాటు, చుట్టుప్రక్కల గ్రామాలనుండి గూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసారు. [10]
గ్రామములోని ప్రధాన పంటలు[మార్చు]
గ్రామములోని ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామములో జన్మించిన ప్రముఖులు[మార్చు]
శ్రీ దండు రామకృష్ణారెడ్డి[మార్చు]
వీరు "అఖిల భారత కృషి పండిట్" పురస్కార గ్రహీత. 20 సం. అఖిల భారత కాంగ్రెసు కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఇంకా అఖిల భారత పొగాకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు, మొదలగు అనేక పదవులు వీరిని వరించినవి. వీరు 1950 నుండి 1974 వరకూ కొరిశపాడు పంచాయతీ సమితి అధ్యక్షులుగా ఉన్నారు. మండల కార్యాలయాలు రహదారికి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో, రహదారి సమీపంలోని పొలాల రైతులకు తన పొలాలనిచ్చి, కార్యాలయాలనన్నిటినీ ఒకే చోట తన స్వంతఖర్చుతో నిర్మించారు. 1964,ఏప్రిల్-17న ఈ కార్యాలయ సముదాయాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. గ్రామానికి పశువైద్యశాల, ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, గ్రంథాలయం, పార్కు, ఆడిటోరియం, మురుగు కాలువలు నిర్మించి, కొరిశపాడుని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దినారు. మొదట వంద ఎకరాల భూమి ఉన్న ఈ ఆసామీ, చనిపోయేనాటికి తన భార్యకు మిగిల్చింది ఒక ఎకరం భూమి మంత్రమే. మండల కార్యాలయంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. [2]
గ్రామ విశేషాలు[మార్చు]
- ఈ గ్రామ సమీపంలో ఒక సీసం గ్లాస్ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ సిలికా ఇసుక ద్వారా గ్లాస్ తయారు చేసెదరు.
- ఈ గ్రామ సమీపంలో ఒక రొయ్యల ఫ్యాక్టరీ ఉంది.
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,823.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,906, మహిళల సంఖ్య 1,917, గ్రామంలో నివాస గృహాలు 951 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1,002 హెక్టారులు.
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
మూలాలు[మార్చు]
వెలుపలి లంకెలు[మార్చు]
[2] ఈనాడు ప్రకాశం; 2013,జులై-10; 8వపేజీ [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి, 2013,అక్టోబరు-2; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,మే-21; 1వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,మార్చి-28; 2వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,మే-28; 5వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,జూన్-24; 2వపేజీ. [8] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,సెప్టెంబరు-22; 2వపేజీ. [9] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,డిసెంబరు-8; 1వపేజీ. [10] ఈనాడు ప్రకాశం; 2015,డిసెంబరు-28; 6వపేజీ.