సలాబత్ జంగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Salabat Jung

అసఫ్‌ ఉద్దౌలా మీర్ అలీ సలాబత్ జంగ్ (జ: 1718 - మ: సెప్టెంబరు 16, 1763) హైదరాబాదు నిజాం పాలకుడు. 1751 సంవత్సరంలో ముజఫర్ జంగ్ హత్య తరువాత ఫ్రెంచి సేనాని బుస్సీ నాసర్ జంగ్ తమ్ముడైన సలాబత్ జంగ్ ను దక్కను సుబేదారుగా ప్రకటించాడు. సలాబత్ జంగ్ దివానైన సయ్యద్ లస్కర్ ఖాన్ దక్కను నుండి ఫ్రెంచి సేనలను తరిమివేయడానికి కుట్రపన్నాడని పసిగట్టిన బుస్సీ 1754లో ఉత్తర సర్కారులు లోని శ్రీకాకుళం, ఏలూరు, రాజమహేంద్రవరం, కొండపల్లి లను సొంత జాగీరుగా సలాబత్ జంగ్ చేత వ్రాయించుకున్నాడు.

సారవంతమైన ఉత్తర సర్కారులు ఫ్రెంచి వారి ఆధీనంలోకి పోవటం వలన హైదరాబాదు రాజ్య ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నమైనది. మూడవ కర్ణాటక యుద్ధంలో ఆంగ్లేయులు ఫ్రెంచి వారిని ఓడించి మచిలీపట్నం స్వాధీనం చేసుకున్నారు. 1759 మే 14 తేదీన సలాబత్ జంగ్ ఆంగ్లేయులతో సంథి చేసుకొని గుంటూరు తప్ప ఉత్తర సర్కారులు అన్నింటిని ఆంగ్లేయుల పరం చేశాడు.

సా.శ. 1761లో మొదటి అసఫ్ జా నాలుగవ కుమారుడైన నిజాం ఆలీ ఖాన్ రెండవ అసఫ్ జా బిరుదుతో నిజాం అయ్యాడు. ఇతని కాలం నుండే అసఫ్ జాహీ ప్రభువులు నిజాం ప్రభువులుగా ప్రసిద్ధిచెందారు.