1969 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు
స్వరూపం
1969 ఆగస్టు 30
| ||||||||||||||||||||
| ||||||||||||||||||||
| ||||||||||||||||||||
1969 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు 1969 ఆగస్టు 30న జరిగాయి. గోపాల్ స్వరూప్ పాఠక్ భారతదేశానికి నాల్గవ ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు.[1] ప్రస్తుత అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్ మరణానంతరం వచ్చిన రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వరాహగిరి వెంకటగిరి రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి.
షెడ్యూలు
[మార్చు]ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం 1969జూలై31న ప్రకటించింది.[2]
| స.నెం. | పోల్ ఈవెంట్ | తేదీ | |
|---|---|---|---|
| 1. | నామినేషన్ దాఖలుకు చివరి తేదీ | 1969 ఆగస్టు 9 | |
| 2. | నామినేషన్ పరిశీలన తేదీ | 1969 ఆగస్టు 11 | |
| 3. | నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ | 1969 ఆగస్టు 14 | |
| 4. | పోలింగ్ తేదీ | 1969 ఆగస్టు 30 | |
| 5. | కౌంటింగ్ తేదీ | 1969 ఆగస్టు 30 | |
ఫలితాలు
[మార్చు]ఎలక్టోరల్ కాలేజీలో 759 మంది భారత పార్లమెంటు సభ్యులు ఉన్నారు. 6 మంది అభ్యర్థులు ఉపరాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేశారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొదటి రౌండ్ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తరువాత ఫలితాలు వెల్లడయ్యాయి. 400 ఓట్లు రావడంతో గోపాల్ స్వరూప్ పాఠక్ ఉప రాష్ట్రపతిగా ఎన్నికైనట్లు ప్రకటించారు.[2]