అక్షాంశ రేఖాంశాలు: 16°51′7″N 82°3′24″E / 16.85194°N 82.05667°E / 16.85194; 82.05667

చోడవరం (రామచంద్రపురం మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చోడవరం (రామచంద్రపురం మండలం)
పటం
చోడవరం (రామచంద్రపురం మండలం) is located in ఆంధ్రప్రదేశ్
చోడవరం (రామచంద్రపురం మండలం)
చోడవరం (రామచంద్రపురం మండలం)
అక్షాంశ రేఖాంశాలు: 16°51′7″N 82°3′24″E / 16.85194°N 82.05667°E / 16.85194; 82.05667
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకోనసీమ
మండలంరామచంద్రాపురం
విస్తీర్ణం10.25 కి.మీ2 (3.96 చ. మై)
జనాభా
 (2011)
3,787
 • జనసాంద్రత370/కి.మీ2 (960/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు1,890
 • స్త్రీలు1,897
 • లింగ నిష్పత్తి1,004
 • నివాసాలు1,016
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్533256
2011 జనగణన కోడ్587633

చోడవరం, రామచంద్రపురం, కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలానికి చెందిన గ్రామం.[2]

ఇది మండల కేంద్రమైన రామచంద్రపురం నుండి 3 కి. మీ. దూరంలో ఉంది.

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,698.[3] ఇందులో పురుషుల సంఖ్య 1,851, మహిళల సంఖ్య 1,847, గ్రామంలో నివాస గృహాలు 891 ఉన్నాయి.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1016 ఇళ్లతో, 3787 జనాభాతో 1025 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1890, ఆడవారి సంఖ్య 1897. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2081 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 13. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 587633[4].

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి.బాలబడి రామచంద్రపురంలోను, మాధ్యమిక పాఠశాల నరసాపురపుపేటలోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల రామచంద్రపురంలోను, ఇంజనీరింగ్ కళాశాల ఎ.అగ్రహారంలోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల రామచంద్రపురంలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు కాకినాడలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల రామచంద్రపురంలోను, అనియత విద్యా కేంద్రం ద్రాక్షారామంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కాకినాడ లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

చోడవరంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. అలోపతి ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

చోడవరంలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 16 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

చోడవరంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 145 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 879 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 879 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

చోడవరంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 879 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

చోడవరంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి

వ్యవసాయం

[మార్చు]

చోడవరం గ్రామ ఆయకట్టు మొత్తం 2,500 ఎకరాలు మొత్తం మాగాణి. ప్రధాన పంట వరి. వేసవిలో మూడవ పంటగా పెసర, మినుము వంటి పప్పు ధాన్యాలు పండిస్తారు.

గ్రామంలో దర్సించవలసిన ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

కేశవస్వామి దేవాలయం

[మార్చు]
  • చోడవరంలో చోడరాజులు నిర్మించిన కేశవస్వామి దేవాలయం అతి పురాతన దేవాలయం. ఈ దేవాలయం ఇంచుమించు పదవ శతాబ్దంలో నిర్మించారు. ఈ దేవాలయంలో కేసవస్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై ఉన్నారు. ఈ దేవాలయం పూర్తిగా ఇసుక రాతితో నిర్మింపబడింది. దేవాలయం మాత్రమే కాక ఈ ప్రాంగణం లోనే షోడష స్తంభ (పదహారు స్తంభాల 4x4) నాట్యమండపం నిర్మించారు. ఈ దేవాలయానికి 1980 లో మరమ్మత్తులు చేసారు. ఇదే ఆవరణలో 1940 వ దశకంలో నిర్మించిన కోదండరాముని ఆలయం కూడా వుండేది. దీనిని ది 2018 మార్చి 8 తేదీన పునఃనిర్నించారు.

ఆలయ విశేషాలు

[మార్చు]

సోమసూత్రమును (స్వామివారి ఆభిషేక జల బహిర్ద్వారమున) ఒకే రాతితో మలుపబడిన మకరముఖము ఉంది.అయితే ఆమకరమునకు వెనుకవైపున (పై భాగమున) సింహముఖములో మరియొక సింహముఖమును, లోపలి భాగము నాగసర్పమునందు వేరొక నాగసర్పమును శిల్పి కల్పించాడు.దీని అర్ధము ఎంత విచారించినను ఆగమశిల్ప, లౌక్యములచే సరియైన సమాధానము కుదురుపడలేదు.సోమసూత్రముల మకరముపై గోముఖము, సింహముఖము, గజముఖము, వరాహముఖము సహజముగా ఉండును.అయితే కోరుకొండ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ సోమసూత్రమున నాగసర్పము ఉంది.అయితే ఈ సోమసూత్రమునగల మకరముఖము పై భాగము సింహముఖమునందు వేరొక సింహముఖమును, ఆ మకర ముఖము లోపలి వైపున నాగసర్పమున వేరొక నాగ సర్పమును శిల్పి నిర్మించుట ఆశ్చర్యకరము.సోమసూత్రము మకరముఖమున యశోసంపదలకును, సింహముఖము శత్రువిజయమునకు, నాగసర్పము ఆరోగ్యమునకు నిర్మింపవలసినట్లు ఆగమశాస్త్రములందు కానవచ్చుచున్నది. అయితే ఒక్కొక్కదానికొక్కటే చెప్పబడియుండ ఇట్లీ యొక్క సోమసూత్రమునందే మకరముఖము, దానికనుబంధముగ రెండు సింహముఖములు రెండు నాగ సర్పములు కల్పించుట వింతయై సామాన్యుల బుద్ధికనువుగానిదై యున్నది.కావున ఈ సమస్యను ఆగమశాస్త్రజ్ఞలును, ఆలయ నిర్మాణ స్థపతులు మాత్రమే వెలువడింపదగినదై యున్నది.

శ్రీ అగస్థేశ్వర స్వామి దేవాలయం (శివాలయం)

[మార్చు]
  • రాజేంద్రచోడుడు నిర్మించిన శ్రీ అగస్థేశ్వర స్వామి (శివుడు) ఆలయం వుండేది. అది జీర్ణావస్థలో వుండడంతో 1960 వ దశకంలో దానిని పునర్మించారు. 1980 లో తి.తి.దే. (తిరుమల తిరుపతి దేవస్థానములు) వారి ఆర్థిక సహాయంతో ఈ దేవాలయానికి ప్రహారీ గోడ, ఒక కళ్యాణ మండపం నిర్మించారు.

ఆలయ శిలాశాసనం విశేషాలు

[మార్చు]

ఇక్కడ లభించిన శిలాశాసనము 12 వ శతాబ్దమునకు చెందినది.దీని ఎత్తు 1.5మీ 12 పంక్తులలో లిఖించిబడియున్నది.శాసనమంతయు సంస్కృత భాషలో లిఖించింది.ఒకే ఒక శార్దూల విక్రీడిత వృతము.ఒకే ఒక చోట మాత్రము గురువు, లఘువులు వ్యత్యాస్థమై ఛందోభంగము సంభవించింది.శాసనకాలము సా.శ. 1155సం.వేంగీ దేశస్థుల పాలన.రాజేంద్రచోడ భూప నరేంద్రపతి సామంతుడు పేరు ఉంది.శాసన విషయము: శాలివాహన శకము.సా.శ.1155 యవనామ సంవత్సర కార్తిక శుద్ధ చతుర్ధి (నాగచతుర్ధి) జయ (మంగళ) వారమున పూర్వాషాడా నక్షత్రముందు రాజేంద్రచోడ భూప నరేంద్రపతివలన దక్షారామ పురీశ్వరుడైన విభవభీమేశ్వరున కర్పించబడింది.

శ్రీ పాగేలమ్మ అమ్మవారి దేవాలయం

[మార్చు]
  • పాగేలమ్మ వారి దేవాలయం మరొక ముఖ్యమైన దేవాలయం. ఈవిడ గ్రామదేవత. ఈవిడ బిక్కని వారి దేవత అనీ, ముత్యాలమ్మ (బిక్కని వారి ఇంటి ఆడపడుచు), గంగమ్మ (మల్లిపూడి (గొల్లలు) వారి ఆడపడుచు), సత్తమ్మ (వేగుళ్ళ వారి ఇంటి ఆడపడుచు), బంగారమ్మ (బంగారు బాపనమ్మ)బ్రాహ్మల ఆడపడుచు, గొంతెమ్మ (రాజుల ఆడపడుచు, మాలల కోడలు), పోతురాజు (బిక్కని వారి అబ్బాయి) లకు అక్క అనీ ఒక నమ్మకం. ఈ దేవతలందరి విగ్రహాలూ గుడిలో వుండటమే కాక ఎవరికి వారి గుడులు వేరువేరుగా వారివారి స్థానాలలో వుంటాయి. పాగేలమ్మ వారి జాతర వైశాఖ శుద్ధ పూర్ణిమ రోజున గరగ ఎత్తటంతో మొదలై వైశాఖ బహుళ చతుర్దశి రోజున జాగరణ/సంబరం, వైశాఖ బహుళ అమావాస్య రోజున తీర్దం, జేష్ట శుద్ధ పాడ్యమి రోజున బలిహరణ (కుంభం పోయడం)తో ముగుస్తుంది. నేటికీ మనం ఇక్కడ శివసత్తులను (శివ శక్తులు) చూడవచ్చు. ఈవిడ దేవాలయాన్ని ది|| 2016 నవంబరు 20 తేదీన పునఃనిర్నించారు.

మూలాలు

[మార్చు]
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-06.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-06.
  4. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".