పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి

పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (ఆగష్టు 1, 1900 - ఆగస్టు 11, 1962) ప్రముఖ రచయిత, సాహితీకారుడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఈయన విశాఖపట్టణం జిల్లా చోడవరంలో వారి మాతామహులు రాంభట్ల జగన్నాథ శాస్త్రి ఇంట్లో 1900, ఆగష్టు 1 న జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు వేంకట రత్నము, అన్నప్ప పంతులు. పెదమామ గారగు కొత్తూరు అప్పల నరసయ్య పంతులు ( పార్వతీపురములో ప్రముఖ న్యాయవాది ) ఆదర్శ పాలన వీరినెంతో ప్రభావితులను చేసింది. వీరి స్వస్థలము ఒడిషా లోని బరంపురం ( గంజాము జిల్లా ).

విద్యాభ్యాసము[మార్చు]

మిడిల్ స్కూల్ - చోడవరము, విశాఖపట్నము ( సి. బి. యమ్ పైస్కూలు).

రచయితగా[మార్చు]

ఈయనకు మహాభారతము యెడల ప్రీతి మెండు. పురాణములు పిన్నవయసునుంచి చదివేవాడు. పద్యరచన యందు అప్పటినుండి ఆసక్తి జనించెను. మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమమున పాల్గొని 1923 లో కారాగార బద్ధుడయినాడు. జాతీయగీతములు పాడి, ఉద్యమ ప్రచారము చేసెను . వడ్డాది సీతారామాంజనేయకవి ఇతని సహచరుడు, సతీర్థ్యుడు. పురాణం సూర్యనారాయణ తీర్థులు ఇతని ఆరాధ్య గురువు.

రచనలు[మార్చు]

"దండాలు దండాలు భరతమాత " అను సుపరిచిత ప్రబోధ గీతము ఈయన వ్రాసినదే . వడ్డాది కవితో కలిసి స్వరాజ్య గీతామృతము, ఆత్మ శిక్ష అను కంద శతకము ( 1923 ) లను రచియించెను. వాటిని ప్రభుత్వమువారు నిషేధించిరి . స్వతంత్రముగా ' భక్తకల్పద్రుమము ' అను దైవభక్తి ప్రబోధ శతకము ', " కుమారా " అను మకుటముగల కందశతకము పిల్లలకు నీతి బోధకముగ 1945 లో రచించెను .

ఉద్యోగము[మార్చు]

జయపుర సంస్థానము ( ఒడిషా ) శ్రీ విక్రమదేవవర్మ మహారాజు పాలనలో 1925 నుండి 1960 వరకు అమీనుగను, మేనేజరుగను పనిచేశారు.

మరణం[మార్చు]

నిరాడంబర జీవనము, భగవంతునియెడ సర్వ సమర్పణ భావనతో ధర్మాచరణ చేసి 1962, ఆగస్టు 11 వ తేది శుభకృత్ శ్రావణ శుక్ల ఏకాదశి దినమున ( స్థిరవారము ) కటకము లో పెద్దకుమారుని ఏకాంతములో పరమపదించాడు.

మూలాలు[మార్చు]

ఇతరలింకులు[మార్చు]

వనరులు[మార్చు]

  • పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి వారి స్వవిషయము