మహాభారతం

వికీపీడియా నుండి
(మహాభారతము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వ్యాసుడు చెప్పగా వినాయకుడు మహాభారతాన్ని వ్రాశాడని పురాణ కథనం

మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది.[1][2][3][4][5][6] దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటి. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో కవిత్రయముగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రనలు తెలుగు లోకి అనువదించారు.

గ్రంథరచనా చరిత్ర, నిర్మాణం

వ్యాసుడు పఠిస్తుండగా గణేశుడు మహాభారతం లిఖించుట

ఈ ఇతిహాసం సాంప్రదాయకంగా వ్యాసుడు అనే ఋషికి ఆపాదించబడింది. ఆయన ఇతిహాసంలో ప్రధాన పాత్ర కూడా వహించాడు. వ్యాసుడు దీనిని ఇతిహాసం (చరిత్ర) గా అభివర్ణించాడు. ఆయన గురువులందరిని గురించి వేద కాలంలోని వారి విద్యార్థులను గుర్తించే గురు-శిష్య పరంపర గురించి కూడా వివరించాడు. మహాభారతం మొదటి విభాగంలో వ్యాసుడు పఠిస్తుండగా గణపతి (శివ పార్వతుల కుమారుడు) గ్రంథాన్ని లిఖించాడని పేర్కొనబడింది.

ఇతిహాసం కథను కథా నిర్మాణంలో ఉపయోగిస్తుంది. లేకపోతే దీనిని ఫ్రేమెటెల్సు అని పిలుస్తారు. ఇది అనేక భారతీయ పురాతన రచనలలో ప్రముఖ పద్ధతి. ఇది మొదట తక్షశిల వద్ద వ్యాసమహర్షి శిష్యుడు వైశంపాయన అనే ఋషి, [7][8] పాండవ వంశస్థుడు అర్జునుడి మనవడు అయిన జనమేజయ రాజుకు వినిపించాడు. ఈ కథను చాలా సంవత్సరాల తరువాత సౌనకుడు అనే సౌతి అనే పురాణ కథకుడు తిరిగి వినిపించాడు. నైమిశారణ్యం అనే అడవిలో సౌనక కులపతి ఋషులకు తెలియజేసాడు.

సౌతి మహాభారతం శ్లోకాలను పఠించడం

ఈ వచనాన్ని 20వ శతాబ్దం ప్రారంభంలో పాశ్చాత్య ఇండోలాజిస్టులు నిర్మాణాత్మకంగా, అస్తవ్యస్తంగా అభివర్ణించారు. అసలు కవిత ఒకప్పుడు అపారమైన "విషాద శక్తిని" కలిగి ఉండాలని హెర్మను ఓల్డెనుబర్గు భావించాడు. కాని పూర్తి వచనాన్ని "భయంకరమైన గందరగోళం" అని కొట్టిపారేశాడు. "అసమాన మూలం భాగాలను క్రమం లేని మొత్తంగా ముద్ద చేయగలిగారు.[9] మోర్టిజు వింటర్నిట్జి (గస్చిచ్తె డరు ఇండిస్చెను లిటరాటురు 1909) ఇది " కవిత్వరహిత థియాలజిస్టులు - క్లంసీ స్క్రైబ్సు విడివిడిగా క్రమరహితంగా ఉన్న మూల భాగాలను ఒకే కథగా కూర్చాడని పేర్కొన్నాడు.[10]

చేర్పులు

మహాభారతంపై పరిశోధన వచనంలోని పొరలను గుర్తించడానికి, ఎడిటింగు చేయడానికి అపారమైన ప్రయత్నం చేయబడింది. ప్రస్తుత మహాభారతంలోని కొన్ని అంశాలను వేద కాలానికి చెందినవిగా గుర్తించవచ్చు.[11] మహాభారతం నేపథ్యం ఇతిహాసం మూలం " ప్రారంభ వేద కాలం తరువాత", "మొదటి భారతీయ 'సామ్రాజ్యం' క్రీ.పూ. 3 వ శతాబ్దం ఇది క్రీ.పూ. "8 లేదా 9 వ శతాబ్దం నుండి చాలా దూరం తొలగించబడని తేదీ."గా ఉండే [2][12] అవకాశం ఉంది. మహాభారతం రథసారధులు మౌఖికంగా ప్రచారం చేయబడిన కథగా ప్రారంభమైంది.[13] "అక్షర-పరిపూర్ణతను సంరక్షించాల్సిన వేదాల మాదిరిగా కాకుండా ఇతిహాసం ఒక ప్రసిద్ధ రచన. దీని పఠనం అనివార్యంగా భాష, శైలిలో మార్పులకు అనుగుణంగా ఉంటుంది"[12] కాబట్టి దీని ప్రారంభ 'మనుగడ' భాగాలు ప్రభావవంతమైన పురాణానికి మనకు ఉన్న 'బాహ్య' ప్రపంచవ్యవహారాల కంటే పాతది కాదని విశ్వసిస్తున్నారు.[2][12] ప్రారంభ గుప్తులకాలం నాటికి (సా.శ. 4 వ శతాబ్దం) సంస్కృత రూపం "తుది రూపం"కు చేరుకుందని అంచనా.[12] మహాభారతం మొదటి గొప్ప విమర్శనాత్మక ఎడిషను సంపాదకుడు విష్ణు సూక్తంకరు ఇలా వ్యాఖ్యానించారు: "ఒక ద్రవ వచనాన్ని అక్షరాలా అసలు ఆకారంలో ఒక ఆర్కిటైపు, స్టెమా కోడికం ఆధారంగా పునర్నిర్మించడం గురించి ఆలోచించడం పనికిరానిది. అప్పుడు ఏమి సాధ్యమవుతుంది? మనది ఏమిటి? అందుబాటులో ఉన్న వ్రాతప్రతుల అంశం ఆధారంగా చేరుకోగలిగే టెక్స్టు పురాతన రూపాన్ని పునర్నిర్మించడం మాత్రమే లక్ష్యం. "[14] ఆ వ్రాతప్రతుల సాక్ష్యం కొంతవరకు ఆలస్యం అయ్యింది. దాని భౌతిక కూర్పు, భారతదేశ వాతావరణం ఆధారంగా కానీ అది చాలా విస్తృతమైనది.

మహాభారతం (1.1.61) 24,000 శ్లోకాల ప్రధాన భాగాన్ని వేరు చేస్తుంది: భారత సరైనది. అదనపు ద్వితీయ విషయాలకు విరుద్ధంగా అవాల్యాన గ్యాయసత్ర (3.4.4) ఇదే విధమైన వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. రచన కనీసం మూడు పునరావృత్తులు సాధారణంగా గుర్తించబడతాయి: 8,800 శ్లోకాలతో జయ (విక్టరీ) వ్యాసవిరచితం, వైశంపాయనుడు పఠించిన భారతంలో 24,000 శ్లోకాలు, చివరికి ఉగ్రశ్రవ సూతుడు పఠించిన మహాభారతం 100,000 పద్యాలు.[15][16] అయినప్పటికీ జాను బ్రోకింగ్టను వంటి కొంతమంది పండితులు, జయ, భారతం ఒకే కథనాన్ని సూచిస్తుందని వాదించారు. ఆదిపర్వం (1.1.81) లోని ఒక పద్యం పొరపాటుగా జయ సిద్ధాంతాన్ని 8,800 శ్లోకాలతో పేర్కొన్నారు.[17] ఈ మహాఇతిహాస గ్రంథం విస్తరించిన రూపంలో 18 పర్వాలు ఉన్నాయి.[18] 12 సంఖ్యలను నొక్కిచెప్పే అధికారిక సూత్రాల తరువాత ఈ పెద్ద రచన పునర్నిర్మాణం జరిగింది. "స్పిట్జరు" వ్రాతప్రతులలో అనుశాసన-పర్వం విరాట పర్వాలు లేకపోవడం వల్ల తాజా భాగాల కలయిక తేదీని సూచిస్తుంది.[19] మనుగడలో ఉన్న పురాతన సంస్కృత రచన కుషాను కాలం (క్రీ.పూ. 200) నాటిది.[20]

మహాభారతంలోని ఒక పాత్ర చెప్పినదాని ప్రకారం. 1.1.50, ఇతిహాసం మూడు వెర్షన్లు ఉన్నాయి. ఇవి వరుసగా మను (1.1.27), అస్తికా (1.3, ఉప పర్వ 5) లేదా వాసు (1.57) తో మొదలయ్యాయి. ఈ సంస్కరణలలో ఒకటి మరొక 'ఫ్రేం' సెట్టింగుల కలయికకు అనుగుణంగా ఉంటాయి. వాసు వెర్షను ఫ్రేం సెట్టింగులను వదిలివేసి, వ్యాసుడు పుట్టినకాలంతో ప్రారంభమవుతుంది. ఆస్తిక వెర్షను బ్రాహ్మణ సాహిత్యం సర్పయాగం అంశాలను జోడించి మహాభారతం అనే పేరును పరిచయం చేస్తుంది. వ్యాసుడిని రచన రచయితగా గుర్తిస్తుంది. ఈ చేర్పుల రచయితలు బహుశా పెకారాట్రిను పండితులు, వారు ఒబెర్లీసు (1998) అభిప్రాయం ఆధారంగా దాని చివరి పునర్నిర్మాణం వరకు రచన మీద నియంత్రణను కలిగి ఉంటారు. భీష్మ-పర్వంలో హునా గురించి ప్రస్తావించినప్పటికీ, ఈ పర్వం 4 వ శతాబ్దంలో సవరించబడిందని సూచిస్తుంది.[ఆధారం చూపాలి].

జనమేజయ సర్పయాగం

ఆది-పర్వంలో జనమేజయ సర్పయాగం (సర్పసత్ర) ప్రస్తావన ఉంది. దాని ప్రేరణను వివరిస్తుంది. ఈ యాగం ఉనికిలో ఉన్న అన్ని సర్పాలను ఎందుకు నాశనం చేయాలని ఉద్దేశించిందో వివరిస్తుంది. ఇది ఉన్నప్పటికీ ఇప్పటికీ పాములు ఎందుకు ఉన్నాయి. ఈ సర్పయాగం అంశం మహాభారతం సంస్కరణకు "నేపథ్య ఆకర్షణ" (మింకోవ్స్కి 1991) గా జోడించబడిన స్వతంత్ర కథగా పరిగణించబడుతుంది. వేద (బ్రాహ్మణ్యం) సాహిత్యానికి ప్రత్యేకించి దగ్గరి సంబంధం ఉందని భావించారు. పాకవిమ్య బ్రాహ్మణ్యం (25.15.3 వద్ద) ఒక సర్పయాగం! అధికారిక పూజారులను వివరిస్తాడు. వీరిలో ధతరాత్ర, జనమేజయ పేర్లు, మహాభారత సర్పయాగంలోని రెండు ప్రధాన పాత్రలు. అలాగే మహాభారతంలో ఒక పాము పేరు తక్షకుడు.[21]

సుపర్ణోఖ్యానం కవిత్వం తొలి ఆనవాళ్ళలో" ఒకటిగా పరిగణించబడే పద్యం, విస్తరించిన గరుడపురాణానికి ఇది పూర్వగామి, ఇది మహాభారతం ఆదిపర్వంలో, ఆస్థికపర్వంలో చేర్చబడింది.[22][23]

చారిత్రక ఆధారాలు

మహాభారతం దాని ప్రధాన భారత గురించి మొట్టమొదటి ప్రస్తావనలు పాణిని అష్టాధ్యాయి సూత్రం (సూత్రం 6.2.38) (క్రీ.పూ. 4 వ శతాబ్దం) అశ్వలాయన గృహ్యసూత్రాలు (3.4.4) ఉన్నాయి. దీని అర్థం భారతం అని పిలువబడే ప్రధాన 24,000 శ్లోకాలు, అలాగే విస్తరించిన మహాభారతం ప్రారంభ వెర్షను, క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దం నాటికి కూర్చబడ్డాయి. గ్రీకు రచయిత డియో క్రిసోస్టోం (మ .40 - సి. 120 CE) ఇచ్చిన నివేదిక హోమరు కవిత్వం భారతదేశంలో కూడా పాడటం గురించి వివరించింది.[24] ఇలియడు సంస్కృతంలోకి అనువదించబడిందని సూచిస్తుంది. అయినప్పటికీ భారతీయ అధ్యయనకారులు సాధారణంగా ఈ తేదీలో ఒక మహాభారతం ఉనికికి సాక్ష్యంగా తీసుకున్నారు. దీని ఎపిసోడ్లు డియో లేదా అతని మూలాలు ఇలియడు కథగా గుర్తించాయి.[25]

మహాభారతంలోని అనేక కథలు శాస్త్రీయ సంస్కృత సాహిత్యంలో వారి స్వంత ప్రత్యేక గుర్తింపులను పొందాయి. ఉదాహరణకు గుప్తరాజవంశం యుగంలో నివసించినట్లు భావిస్తున్న ప్రఖ్యాత సంస్కృత కవి కాళిదాసు (క్రీ.పూ. 400) అభిజ్ఞానశాకుంతలం, మహాభారతానికి పూర్వగామి అయిన కథ ఆధారంగా రూపొందించబడింది. కాళిదాసుకు ముందు నివసించినట్లు భావిస్తున్న భాసమహాకవి రాసిన సంస్కృత నాటకం ఊరుభాగా, భీముడి తొడలను చీల్చడం ద్వారా దుర్యోధనుడిని హతమార్చడం మీద ఆధారపడింది.[ఆధారం చూపాలి]

ఖోహు (సత్నా జిల్లా, మధ్యప్రదేశు) నుండి వచ్చిన మహారాజా శర్వనాథ (సా.శ. 533–534) రాగి పలక శాసనం మహాభారతాన్ని "100,000 పద్యాల సమాహారం" (శత- సహశ్రీ సహ్హిత) గా అభివర్ణిస్తుంది.[ఆధారం చూపాలి]

18 పర్వాలూ పుస్తకాలు

18 పర్వాల విభాగాలు దిగువన ఇవ్వబడ్డాయి:

పర్వం శీర్షిక ఉప- పర్వాలు అంశాలు
1 ఆది పర్వము 1–19 తక్షశిలలో (ఆధునిక తక్షశిల (పాకిస్థాను) ) జనమేజయుడు నిర్వహించిన సర్పయాగం తరువాత వైశంపాయనుడు భారతం వినిపించిన తరువాత నైమిశారణ్యంలో ఋషులందరూ వినుచుండగా సూతుడు భారతకథను ప్రసంగించాడు. కురు వంశానికి మూలమైన భరత, భృగువంశాల వంశవృక్షాలు వివరించబడ్డాయి (ఆది అంటే మొదటి).
2 సభా పర్వము 20–28 దానవుడైన మయుడు ఇంద్రప్రస్థ వద్ద రాజభవనం, సభామండపం నిర్మించాడు. యుధిష్టరుడి సభలో జీవితం, రాజసూయ యాగం. మాయాజూదం ద్రౌపది వస్త్రాపహరణం, పాండవుల వనవాసం ఇందులో వర్ణించబడింది.
3 వన పర్వం లేదా అరణ్యపర్వం 29–44 12 సంవత్సరాల పాండవుల అరణ్యవాసం. (అరణ్య)
4 విరాట పర్వము 45–48 విరాటరాజు సభలో పాండవులు ఒక సంవత్సరకాలం గడుపిని వివరం వర్ణించబడింది.
5 ఉద్యోగ పర్వము 49–59 పాండవులు, కౌరవుల మద్య నిర్వహించబడిన విఫలమైన సంధిప్రయత్నాలు, యుద్ధానికి సన్నద్ధం జరగడం. (ఉద్యోగఅంటే పనిచేయడం).
6 భీష్మ పర్వము 60–64 భీష్ముడు కౌరవుల పక్షం సైన్యాధ్యక్షుడుగా యుద్ధం మొదటి భాగం. భీష్ముడు అంపశయ్య మీద పడిపోవడం, (ఇందులో గీతోపదేశం 25-42 అధ్యాయాలలో) వర్ణించబడింది.[26][27]
7 ద్రోణ పర్వము 65–72 ద్రోణుడి సారథ్యంలో కొనసాగిన యుద్ధం. " బుక్ ఆఫ్ వార్ " పుస్తకంలో ఇది ప్రధానమైనది. ఈ పుస్తకం చివరిలో ఇరుపక్షాలలో మహావీరులలో అనేకులు యుద్ధం కారణంగా మరణించారు.
8 కర్ణ పర్వము 73 కౌరవపక్షంలో కర్ణుడి సారథ్యంలో కొనసాగిన యుద్ధం.
9 శల్య పర్వము 74–77 కౌరవపక్షంలో శల్యుని సారథ్యంలో కొనసాగి ముగిసిన యుద్ధం చివరి రోజు. ఇందులో సరస్వతీ నదీతీరంలో బలరాముడి యాత్ర, భీముడు, దుర్యోధనుల మద్య యుద్ధం, భీముడు దుర్యోధనుడి తొడలు విరచుట.
10 సౌప్తిక పర్వము 78–80 అశ్వమేధ పర్వము కృపాచార్యుడు, కృతవర్మ మిగిలిన పాండవుల సైన్యాలను నిద్రపోతున్న సమయంలో వధించడం. కౌరవుల వైపు 3, పాండవుల వైపు 7 మంది మిగిలి ఉన్నారు.
11 స్త్రీ పర్వము 81–85 గాంధారి, కౌరవ స్త్రీలు, పాండవులు యుద్ధంలో మరణించిన వారిని గురించి ధుఃఖించుట. గాంధారి శ్రీకృష్ణుడిని శపించుట.
12 శాంతి పర్వము 86–88 చక్రవర్తిగా యుధిష్ఠరుడి పట్టాభిషేకం. భీష్ముడి నుండి ధర్మరాజాదులు ఉపదేశాలు గ్రహించుట. ఆర్థిక, రాజకీయాల గురించి అనేక విషయాలు చర్చించబడిన ఈ పుస్తకం మహాభారతంలో సుదీర్ఘమైనది. ఈ పుస్తకంలో తరువాత చొరబాట్లు అధికంగా జరిగాయని " కిసారి మోహను గంగూలి " అభిప్రాయపడ్డాడు.
13 అనుశాసనిక పర్వము 89–90 భీష్ముడు చెప్పిన ది ఫైనల్ ఇంస్ట్రక్షంసు (అనుశాసన).
14 అశ్వమేథ పర్వము [28] 91–92 యుధిష్టరుడు నిర్వహించిన అశ్వమేథయాగం. అర్జునుడి విజయయాత్ర. అర్జునుడికి శ్రీకృష్ణుడు అనుగీత బోధించుట.
15 ఆశ్రమవాస పర్వము 93–95 ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి అంతిమయాత్ర. (సజీవంగా కార్చిచ్చులో పడి కాలిపోయి మరణించారు). విదురుడు యోగిగా శరీరయాత్ర ముగించి ధర్మరాజులో ప్రాణాలను విలీనం చేయుట. తమతో ఉన్న సంజయుడిని హిమాలయాలకు పోయి ప్రాణాలను రక్షించుకొమ్మని ఆఙాపించుట.
16 మౌసల పర్వము 96 గాంధారి శాపఫలితంగా యాదవులు అంతర్యుద్ధం చేసుకుని మౌసలం (ముసలం) కారణంగా మరణించుట.
17 మహాప్రస్థానిక పర్వము 97 యుధిష్టరుడు తన సోదరులు, భార్య ద్రౌపదితో సుదీర్ఘమైన అంతిమయాత్రతో జీవనయాత్ర ముగించుట. ఇందులో యుధిష్టరుడు మినహా అందరూ శరీరాలు చాలించగా, యుధిష్టరుడు సశరీరుడుగా స్వర్గలోకం చేరుకుంటాడు.
18 స్వర్గారోహణ పర్వము 98 యుధిష్టరుడు చివరి పరీక్ష తరువాత స్వర్గంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రవేశించుట.
khila హరివంశ పర్వము 99–100 18 పర్వాలలో చెప్పబడని శ్రీకృష్ణుడి గురించి వివరించుట.

కావ్య ప్రశస్తి

"యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్" - "ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు" అని ప్రశస్తి పొందింది. హిందువులకు ఎంతో పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రము కూడా మహాభారతంలోని భాగాలే. దీనిని బట్టి ఈ కావ్య విశిష్టతను అంచనా వేయవచ్చును.

ఈ కావ్యవైభవాన్ని నన్నయ:

దీనిని ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రమనీ, ఆధ్యాత్మవిదులు వేదాంతమనీ, నీతి విచక్షణులు నీతి శాస్త్రమనీ, కవులు మహాకావ్యమనీ అంటారు. లాక్షణికులు సర్వ లక్షణ సంగ్రహమనీ, ఐతిహాసికులు ఇతిహాసమనీ, పౌరాణికులు బహుపురాణ సముచ్ఛయమనీ కొనియాడుతారు. వివిధ తత్త్వవేది, విష్ణు సన్నిభుడు అయిన వేదవ్యాసుడు దీనిని విశ్వజనీనమయ్యేలా సృజించాడు.

మహాభారత గాథను వ్యాసుడు ప్రప్రథమంగా తన శిష్యుడైన వైశంపాయనుడి చేత సర్పయాగం చేయించేటపుడు జనమేజయ మహారాజుకి చెప్పించగా, అదే కావ్యాన్ని తరువాత నైమిశారణ్యంలో శౌనక మహర్షి సత్రయాగము చేయుచున్నప్పుడు సూతమహర్షి అక్కడకు వచ్చిన ఋషులకు చెప్పాడు.

మహాభారతాన్నిచెరకుగడతో పోల్చారు. పర్వము అంటే చెరకు కణుపు. 18 కణుపులు (పర్వములు) కలిగిన పెద్ద చెరకుగడ, మహాభారతం. చెరకును నములుతున్న కొద్దీ రసం నోటిలోకి వచ్చి, నోరు తీపి ఎక్కుతుంది. అలాగే భారతాన్ని చదివిన కొద్దీ జ్ఞానం పెరుగుతుంది.

మహాభారతంలోని విభాగాలు

మహాభారతంలో 18 పర్వములు, వాటిలో జరిగే కథాక్రమం ఇది:

  1. ఆది పర్వము: 1-19 ఉపపర్వాలు - పీఠిక, కురువంశం కథ, రాకుమారుల జననం, విద్యాభ్యాసం.
  2. సభా పర్వము: 20-28 ఉపపర్వాలు - కురుసభా రంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్యభ్రష్టత.
  3. వన పర్వము (లేక) అరణ్య పర్వము: 29-44 ఉపపర్వాలు - అరణ్యంలో పాండవుల 12 సంవత్సరాల జీవనం.
  4. విరాట పర్వము: 45-48 ఉపపర్వాలు - విరాటరాజు కొలువులో ఒక సంవత్సరం పాండవుల అజ్ఞాతవాసం.
  5. ఉద్యోగ పర్వము: 49-59 ఉపపర్వాలు - కౌరవ పాండవ సంగ్రామానికి సన్నాహాలు.
  6. భీష్మ పర్వము: 60-64 ఉపపర్వాలు - భీష్ముని నాయకత్వంలో సాగిన యుద్ధం.
  7. ద్రోణ పర్వము 65-72 ఉపపర్వాలు - ద్రోణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
  8. కర్ణ పర్వము: 73 వ ఉపపర్వము - కర్ణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
  9. శల్య పర్వము: 74-77 ఉపపర్వాలు - శల్యుడు సారథిగా సాగిన యుద్ధం.
  10. సౌప్తిక పర్వము: 78-80 ఉపపర్వాలు - నిదురిస్తున్న ఉపపాండవులను అశ్వత్థామ వధించడం.
  11. స్త్రీ పర్వము: 81-85 ఉపపర్వాలు - గాంధారి మొదలగు స్త్రీలు, మరణించినవారికై రోదించడం.
  12. శాంతి పర్వము: 86-88 ఉపపర్వాలు - యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం. భీష్ముని ఉపదేశాలు.
  13. అనుశాసనిక పర్వము: 89-90 ఉపపర్వాలు - భీష్ముని చివరి ఉపదేశాలు (అనుశాసనాలు)
  14. అశ్వమేధ పర్వము: 91-92 ఉపపర్వాలు - యుధిష్ఠిరుని అశ్వమేధ యాగం.
  15. ఆశ్రమవాస పర్వము: 93-95 ఉపపర్వాలు - ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ప్రభృతులు చివరి రోజులు ఆశ్రమవాసులుగా గడపడం.
  16. మౌసల పర్వము: 96వ ఉపపర్వం - యదువంశంలో ముసలం, అంతఃకలహాలు.
  17. మహాప్రస్ధానిక పర్వము: 97వ ఉపపర్వం - పాండవుల స్వర్గ ప్రయాణం ఆరంభం.
  18. స్వర్గారోహణ పర్వము:98వ ఉపపర్వం - పాండవులు స్వర్గాన్ని చేరడం.

హరివంశ పర్వము: శ్రీకృష్ణుని జీవితగాథ వీటిలో మొదటి అయిదు పర్వాలను ఆదిపంచకము అనీ, తరువాతి ఆరు పర్వాలను యుద్ధషట్కము అనీ, ఆ తరువాతి ఏడు పర్వాలను శాంతిసప్తకము అనీ అంటారు.

మహాభారతం ప్రత్యేకతలు

అక్షౌహిణి

భారతీయ కొలమానంలో అక్షౌహిణి ఒక కొలత. సైన్యాన్ని అక్షౌహిణిలో కొలుస్తారు. కంబ రామాయణంలో ఆ లెక్కలు ఇలా ఉన్నాయి. ఆదిపర్వం బట్టి సైన్యగణాంకాలలో పునాది నిష్పత్తి 1 రథము: 1 ఏనుగు: 3 గుర్రాలు: 5 కాలిబంట్లు.

అక్షౌహిణి రథములు ఏనుగులు గుఱ్ఱములు కాలిబంట్లు
1 21,870 21,870 65,610 1,09,350

వివిధ ప్రమాణాలు

పత్తి

ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, ఐదు కాలిబంట్లు కలిస్తే ఒక "పత్తి" అంటారు.

1 రథములు + 1 ఏనుగు + 3 గుర్రాలు + 5 కాలిబంట్లు
సేనాముఖము

మూడు పత్తులు ఒక సేనాముఖము అనగా సేనాముఖము = 3 X పత్తి

3 రథములు + 3 ఏనుగులు + 9 గుర్రాలు + 15 కాలిబంట్లు
గుల్మము

మూడు సేనాముఖములు ఒక గుల్మము. అనగా గుల్మము = 3 X సేనాముఖము

9 రథములు + 9 ఏనుగులు + 27 గుర్రాలు + 45 కాలిబంట్లు
గణము

గణము అనగా మూడు గుల్మములు అనగా గణము = 3 X గుల్మము

27 రథములు + 27 ఏనుగులు + 81 గుర్రాలు + 135 కాలిబంట్లు
వాహిని

వాహిని అనగా మూడు గణములు. అనగా గణము =3 X గణము

81 రథములు + 81 ఏనుగులు + 243 గుర్రాలు + 405 కాలిబంట్లు
పృతన

పృతన అనగా మూడు వాహినులు అనగా పృతన=3 X వాహినులు

243 రథములు + 243 ఏనుగులు + 729 గుర్రాలు + 1215 కాలిబంట్లు
చమువు

చమువు అనగా మూడు పృతనల సైన్యము. అనగా 3 Xపృతన

729 రథములు + 729 ఏనుగులు + 2187 గుర్రాలు + 3645 కాలిబంట్లు
అనీకిని

అనీకిని అనగా మూడు చమువుల సైన్యము. అనగా 3 Xచమువు.

2187 రథములు + 2187 ఏనుగులు + 6561 గుర్రాలు + 10935 కాలిబంట్లు

అక్షౌహిణి

అక్షౌహిణి అనగా పది అనీకినుల సైన్యము అనగా 10 X అనీకిని

21870 రథములు + 21870 ఏనుగులు + 65610 గుర్రాలు + 109350 కాలిబంట్లు

ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్ధములో పాల్గొన్నాయి. అంటే - 3,93,660 రథములు + 3,93,660 ఏనుగులు + 11,80,980 గుర్రాలు + 19,68,300 కాలిబంట్లు

ఒక్కొక్క రథం మీద యుద్ధవీరునితో పాటు సారథి కూడా ఉంటాడు. సారథులను కూడా లెక్కలోనికి తీసుకుంటే, రథబలం 7,87,320 కి చేరుకుంటుంది. అలాగే గజబలంతో యుద్ధవీరునితో పాటు మావటిని లెక్కలోనికి తీసుకుంటే, గజ బలం 7,87,320 కి చేరుకుంటుంది.

రకం ఎన్నింతలు రథములు ఏనుగులు గుర్రాలు కాలిబంట్లు సారథి
పత్తి 1 1 1 3 5 పత్తిపాలుడు
సేనాముఖము 3 3 3 9 15 సేనాముఖి
గుల్మము 3*3 9 9 27 45 నాయకుడు
గణము 33 27 27 81 135 గణనాయకుడు
వాహిని 34 81 81 243 405 వాహినిపతి
పృతన 35 243 243 729 1,215 పృతనాధిపతి
చమువు (సేనా) 36 729 729 2,187 3,645 సేనాపతి
అనీకిని 37 2,187 2,187 6,561 10,935 అనీకాధిపతి
అక్షౌహిణి 10*37 21,870 21,870 65,610 1,09,350 మహా సేనాపతి

మరిన్ని ప్రమాణాలు

అక్షౌహిణి X '18' = ఏకము

ఏకము X '8' = కోటి (ఈ కోటి మన కోటి కాదు)

కోటి X '8' = శంఖము

శంఖము X '8' = కుముదము

కుముదము X '8' = పద్మము

పద్మము X '8' = నాడి

నాడి X '8' = సముద్రము

సముద్రము X '8' = వెల్లువ

అంటే 36,691,71,39,200 సైన్యాన్ని వెల్లువ అంటారు.

ఇటు వంటివి 70 వెల్లువలు సుగ్రీవుని దగ్గర ఉన్నట్లుగా కంబ రామాయణం చెపుతుంది. అంటే 366917139200 X 70 = 25684199744000 మంది వానర వీరులు సుగ్రీవుని దగ్గర వుండేవారు. వీరికి నీలుడు అధిపతి.

25684199744000 మంది బలవంతులు కలిసి త్రేతాయుగములో (1,700,000 సంవత్సరాల పూర్వం) లంకకు వారధి కట్టారన్నమాట.

మూలాలు

  • అక్షౌహిణులు. పాండవ పక్షం వహించి పోరాడిన వారి సంఖ్య 7అక్షౌహిణులు.
  • ఈ యుద్ధం జరిగిన ప్రదేశం శమంతక పంచకం. తన తండ్రిని అధర్మంగా చంపిన క్షత్రియ వంశాల మీద పరశురాముడు 21 పర్యాయములు భూమండలం అంతా తిరిగి దండయాత్ర చేసి క్షత్రియ వధ చేసిన సమయంలో క్షత్రియ రక్తంతో ఏర్పడ్డ ఐదు తటాకాలే ఈ శమంతక పంచకం. పరశురాముడు తన తండ్రికి ఇక్కడ తర్పణం వదిలి క్షత్రియుల మీద తనకు ఉన్న పగ తీర్చుకున్నాడు.
  • పంచమ వేదంగా వర్ణించబడే ఈ మహాభారతాన్ని కవులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్షణాలు కలిగిన గ్రంథరాజమని, పౌరాణికులు అష్టాదశపురాణ సారమని, నీతిశాస్త్రపారంగతులు నీతి శాస్త్రమని, తత్వజ్ఞులు ధర్మశాస్త్రమని, ఇతిహాసకులు ఇతిహాసమని ప్రశంసించారు.
  • వినాయకుని ఆదేశానుసారం వేదవ్యాసుడు ఆగకుండా చెప్తుంటే వినాయకుడు తన దంతమును విరిచి ఘంటముగా చేసికొని మహాభారతకథను లిఖించాడు.
  • మహాభారతంలోని ఉపపర్వాలు 100. పైష్యమ, ఆస్తీకము, ఆదివంశావతారం, సంభవపర్వము, జతుగృహదాహము, హైడంబము, బకవధ, చైత్రరధము, ద్రౌపదీస్వయంవరం, వైవాహికం, విదురాగమనము, రాజ్యార్ధలాభము, అర్జునతీర్ధయాత్ర, సుభద్రాకల్యాణం, హరణహారిక, ఖాండవదహనం, మయదర్శనం,

సభాపర్వము, మంత్రపర్వము, జరాసంధవధ, దిగ్విజయము, రాజసూయము, బర్ఘ్యాభిహరణం, శిశుపాలవధ, ద్యూతము, అనుద్యూతము, అరణ్యము, కిమ్మీరవధ, కైరాతము, ఇంద్రలోకాభిగమనం, ధర్మజతీర్ధయాత్ర, జటాసురవధ, యక్షయుద్ధం, అజగరం, మార్కడేయోపాఖ్యానం, సత్యాద్రౌపదీ సంవాదం, ఘోషయాత్ర, ప్రాయోపవేశం, వ్రీహి ద్రోణాఖ్యానం, ద్రౌపదీహరణం, కుండలాహరణం, ఆరణేయం, వైరాటం, కీచకవధ, గోగ్రహణం, అభిమన్యువివాహం, ఉద్యోగం, సంజయయానం, ధృతరాష్ట్రప్రజాగరణం, సానత్సుతజాతం, యానసంధి, భగవద్యానం, సైనానిర్యాత, ఉలూకదూతాభిగమనం, సమరధ, అతిరధ సంఖ్యానము, కర్ణభీష్మవివాదం, అబోపాఖ్యానం, జంబూఖండవినిర్మాణం, భూమిపర్వము, భీష్మాభిషేకం, భగవద్గీత, భీష్మవధ, ద్రౌణాభిషేకం, సంశప్తకవధ, అభిమన్యువధ, ప్రతిజ్ఞాపర్వం, జయద్రధ వధ, ఘటోత్కచ వధ, ద్రోణవధ, నారాయణాస్రప్రయోగం, కర్ణపర్వం, శల్యపర్వం, హ్రదప్రవేశం, గదాయుద్ధం, సారసత్వం, సౌప్తిక పర్వం, వైషీకం, జలప్రదానం, స్త్రీపర్వం, శ్రాద్ధపర్వం, రాజ్యాభిషేకం, చార్వాక నిగ్రహం, గృహప్రనిభాగం, శాంతిపర్వం, రాజధర్మానుకీర్తనం, ఆపద్ధర్మం, మోక్షధర్మం, ఆనుశాసనికం, భీష్మస్వర్గారోహణం, అశ్వమేధం, అనుగీత, ఆశ్రమవాసం, పుత్రసందర్శనం, నారదాగమనం, మౌసలం, మహాప్రస్థానం, హరివంశం, భనిష్యత్పర్వం.

చారిత్రక పరిశీలనలు

కథల్లోను, కావ్యాల్లోను నిజమైన ప్రదేశాల పేర్లను పేర్కొనడం ఎక్కువమంది రచయితల్లో కనిపించే లక్షణం. రచయిత చనిపోయిన లక్షల సంవత్సరాల తర్వాత త్రవ్వకాల్లో బయల్పడిన ఆ రచయిత వ్రాతల ప్రకారం పరిశోధిస్తే ఆ ప్రదేశాలు అలాగే ఉంటాయి కనుక ఎవరైనా ఆ వ్రాతలు చదివినప్పుడు అందులోని కథ నిజంగా జరిగినట్లు అనిపిస్తుందని ఒక అభిప్రాయం ఉంది.[ఆధారం చూపాలి] క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల వరకూ ఆర్యుల భాష అయిన సంస్కృత భాష భారతదేశంలో లేదని, మహాభారత కావ్యం వేద కాలం తర్వాత, అనగా సుమారు క్రీస్తు పూర్వం 800 - క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల మధ్య ఆర్యుల తెగకు చెందిన వేదవ్యాసుడు అను కవి రచించిన కావ్యము అని, మహా భారతములోని సన్నివేశాలు కల్పితాలు అని, హిందువులకు తమ మతముపై యున్న గట్టి విశ్వాసాలే కల్పిత కావ్యాన్ని చరిత్రగా చేశాయని పరిశోధకుల భావన.[ఆధారం చూపాలి] గుజరాత్ రాష్ట్రంలో ఇటీవల ద్వారకా నగరం వద్ద అరేబియన్ సముద్ర తీర గర్భంలో బయల్పడిన ఓడ రేవు క్రీస్తుపూర్వం 3000 సంవత్సారాలనాటిదని, అది సింధూ (హరప్పా) నాగరికతకు చెందినది అని, ఆ కాలంలో భాషకు లిపి లేదని పరిశోధనలు తెలుపుతున్నాయి [29][30]

తెలుగు సినిమాలలో భారతగాథ

మహాభారత కథ ఇతివృత్తంగా ఎన్నో తెలుగు సినిమాలు వెలువడ్డాయి. పౌరాణిక ఇతివృత్తాలను తెరకెక్కించడంలో తెలుగువారికున్న నైపుణ్యం కారణంగా వాటిలో చాలా సినిమాలు చిరస్థాయిగా జనాదరణ పొందాయి. వాటిలో కొన్ని:

మహాభారతంలో మంచి కథలు (వ్యాసాలు)

"మహాభారతం" లోమంచి కథలు ( వ్యాసాలు) Videos

ఇవి కూడ చూడండి

త్రివిక్రమ దేవాలయం

మాండవ్య

మూలాలు

  1. Molloy, Michael (2008). Experiencing the World's Religions. p. 87. ISBN 9780073535647
  2. 2.0 2.1 2.2 Brockington, J. (1998). The Sanskrit Epics, Leiden. p. 26
  3. The Mahabharata and the Sindhu-Sarasvati Tradition - by Subhash Kak
  4. Van Buitenen; The Mahabharata Vol. 1; The Book of the Beginning. Introduction (Authorship and Date)
  5. Story of Hindusthani Classical Music, by ITC Sangeet Research Academy, 500 B.C - 200 B.C
  6. An Introduction to Epic Philosophy, edited by Subodh Kapoor, Cosmo Publications, New Delhi, India
  7. Davis, Richard H. (2014). The "Bhagavad Gita": A Biography. Princeton University Press. p. 38. ISBN 9781400851973.
  8. Krishnan, Bal (1978). Kurukshetra: Political and Cultural History. B.R. Publishing Corporation. p. 50.
  9. Hermann Oldenberg, Das Mahabharata: seine Entstehung, sein Inhalt, seine Form, Göttingen, 1922,[page needed]
  10. "The Mahabharata" at The Sampradaya Sun
  11. A History of Indian Literature, Volume 1 by Maurice Winternitz
  12. 12.0 12.1 12.2 12.3 Buitenen (1973) pp. xxiv–xxv
  13. "The Mahabharata: How an oral narrative of the bards became a text of the Brahmins".
  14. Sukthankar (1933) "Prolegomena" p. lxxxvi. Emphasis is original.
  15. Gupta & Ramachandran (1976), citing Mahabharata, Critical Edition, I, 56, 33
  16. SP Gupta and KS Ramachandran (1976), p.3-4, citing Vaidya (1967), p.11
  17. Brockington, J. L. (1998). The Sanskrit epics, Part 2. Vol. 12. BRILL. p. 21. ISBN 978-90-04-10260-6.
  18. 18 books, 18 chapters of the Bhagavadgita and the Narayaniya each, corresponding to the 18 days of the battle and the 18 armies (Mbh. 5.152.23)
  19. The Spitzer Manuscript (Beitrage zur Kultur- und Geistesgeschichte Asiens), Austrian Academy of Sciences, 2004. It is one of the oldest Sanskrit manuscripts found on the Silk Road and part of the estate of Dr. Moritz Spitzer.
  20. Schlingloff, Dieter (1969). "The Oldest Extant Parvan-List of the Mahābhārata". Journal of the American Oriental Society. 89 (2): 334–338. doi:10.2307/596517. JSTOR 596517.
  21. J.A.B. van Buitenen, Mahābhārata, Volume 1, p.445, citing W. Caland, The Pañcaviṃśa Brāhmaṇa, p.640-2
  22. Moriz Winternitz (1996). A History of Indian Literature, Volume 1. Motilal Banarsidass. pp. 291–292. ISBN 978-81-208-0264-3.
  23. Jean Philippe Vogel (1995). Indian Serpent-lore: Or, The Nāgas in Hindu Legend and Art. Asian Educational Services. pp. 53–54. ISBN 978-81-206-1071-2.
  24. Dio Chrysostom, 53.6[permanent dead link]-7, trans. H. Lamar Crosby, Loeb Classical Library, 1946, vol. 4, p. 363.
  25. Christian Lassen, in his Indische Alterthumskunde, supposed that the reference is ultimately to Dhritarashtra's sorrows, the laments of Gandhari and Draupadi, and the valor of Arjuna and Suyodhana or Karna (cited approvingly in Max Duncker, The History of Antiquity (trans. Evelyn Abbott, London 1880), vol. 4, p. 81). This interpretation is endorsed in such standard references as Albrecht Weber's History of Indian Literature but has sometimes been repeated as fact instead of as interpretation.
  26. "The Mahabharata, Book 6: Bhishma Parva: Bhagavat-Gita Parva: Section XXV (Bhagavad Gita Chapter I)". Sacred-texts.com. Retrieved 3 August 2012.
  27. "The Mahabharata, Book 6: Bhishma Parva: Bhagavat-Gita Parva: Section XLII (Bhagavad Gita, Chapter XVIII)". Sacred-texts.com. Retrieved 3 August 2012.
  28. The Ashvamedhika-parva is also preserved in a separate version, the Jaimini-Bharata (Jaiminiya-ashvamedha) where the frame dialogue is replaced, the narration being attributed to Jaimini, another disciple of Vyasa. This version contains far more devotional material (related to Krishna) than the standard epic and probably dates to the 12th century. It has some regional versions, the most popular being the Kannada one by Devapurada Annama Lakshmisha (16th century).The Mahabharata[ఆధారం చూపాలి]
  29. Ancient shorelines of Gujarat, India, during the Indus civilization (Late Mid-Holocene): A study based on archaeological evidences, A. S. Gaur* and K. H. Vora, Marine Archaeology Centre, National Institute of Oceanography, Dona Paula, Goa 403 004, India
  30. Archeology of Dwaraka Land, by Sundaresh and A.S Gaur, Marine Archeology Center, National Institute of Oceanography, Goa 403004.

బయటి లింకులు

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:


http://www.iisc.ernet.in/currsci/jul10/articles29.htm Archived 2015-09-24 at the Wayback Machine
మరింత సమాచారం

బయటి లింకులు

ఆన్‌లైన్ మహాభారత గ్రంథం
కిసారి మోహన్ గంగూలి అనువాదం
మహాభారతం గురించిన వ్యాసాలు
వినండి (ఆడియో)
ఇంకా కొన్ని వనరులు


"https://te.wikipedia.org/w/index.php?title=మహాభారతం&oldid=4010910" నుండి వెలికితీశారు