గాంధార

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Gandhāra

సుమారు 1500 BC–535 BC
Gandhāra and other Mahajanapadas in the Post Vedic period.
Gandhāra and other Mahajanapadas in the Post Vedic period.
Approximate boundaries of the Gandhara Mahajanapada, in present-day northwest Pakistan and northeast Afghanistan.
Approximate boundaries of the Gandhara Mahajanapada, in present-day northwest Pakistan and northeast Afghanistan.
రాజధానిPuṣkalavati (modern Charsadda) and Taxila, and later Peshawar (Puruṣapura)
ప్రభుత్వంMonarchy
• సుమారు 750 BC
Nagnajit
• సుమారు 518 BC
Pushkarasakti
చారిత్రిక కాలంAncient Era
• స్థాపన
సుమారు 1500 BC
• పతనం
535 BC
Succeeded by
Achaemenid Empire
Today part ofAfghanistan
Pakistan

గాంధారా పురాతన భారత ఉపఖండం, ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వాయవ్య భాగంలో పెషావర్ బేసిన్లో ఒక పురాతన రాజ్యం, మహాజనపదంగా ఉండేది. ఈ ప్రాంతం మధ్యలో కాబూలు, స్వాతు నదుల సంగమం వద్ద ఉంది. దీనికి పశ్చిమాన సులైమాను పర్వతాలు, తూర్పున సింధు నది సరిహద్దులుగా ఉన్నాయి. సఫేద్ కో పర్వతాలు దీనిని కోహత్ ప్రాంతం నుండి వేరు చేశాయి. ఇది గాంధార ప్రధాన ప్రాంతంగా "గ్రేటర్ గాంధార" సాంస్కృతిక కేంద్రంగా ఉంటూ ఇది సింధు నది మీదుగా తక్షశిలా ప్రాంతం, పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్లోని కాబూలు, బామియను లోయల వరకు, ఉత్తరాన కరాకోరం శ్రేణి వరకు విస్తరించింది.[1][2][3] అంగుత్తారా నికాయ వంటి బౌద్ధ వ్రాత వనరులలో పేర్కొన్న పురాతన భారతదేశంలోని పదహారు మహాజనపదాలలో (పట్టణ, గ్రామీణ ప్రాంతాల పెద్ద సమ్మేళనం) గాంధార ఒకటి.[4][5] అచెమెనిదు కాలం, హెలెనిస్టికు కాలంలో దాని రాజధాని నగరంగా పుష్కలవతి (ఆధునిక చార్సద్దా) ఉంది.

తరువాత క్రీస్తుశకం 127 లో కుషాను చక్రవర్తి కనిష్క ది గ్రేట్ చేత రాజధాని నగరాన్ని పెషావరు [గమనిక 1]కు తరలించారు.

ఋగ్వేదం (క్రీ.పూ. 1500 - సి. 1200)నుండి గాంధార ఉనికిలో ఉంది.[6][7] అలాగే జొరాస్ట్రియను అవెస్టా కాలం నుండి గాంధార ఉనికిలో ఉంది. ఇది అహురా మాజ్డా వ్రాతలలో భూమి మీద సృష్టించబడిన ఆరవ అందమైన ప్రదేశమైన వాకరాటా అని పేర్కొనబడింది. క్రీస్తుపూర్వం 6 వ శతాబ్దంలో గాంధారాను అచెమెనిదు సామ్రాజ్యం స్వాధీనం చేసుకుంది. క్రీ.పూ 327 లో అలెగ్జాండరు ది గ్రేట్ చేత జయించబడింది. తరువాత ఇది మౌర్య సామ్రాజ్యంలో, తరువాత ఇండో-గ్రీకు రాజ్యంలో భాగమైంది. ఈ ప్రాంతం ఇండో-గ్రీకుల క్రింద గ్రీకో-బౌద్ధమతానికి, తరువాత రాజవంశాలలో గాంధారన్ బౌద్ధమతానికి ప్రధాన కేంద్రంగా ఉంది. బౌద్ధమతం మధ్య ఆసియా, తూర్పు ఆసియాకు వ్యాప్తి చెందడానికి ఇది ఒక కేంద్ర ప్రదేశం.[8] ఇది బాక్టీరియను జొరాస్ట్రియనిజం, హిందూ మతం కేంద్రంగా ఉంది.[9] గాంధార (గ్రీకో-బౌద్ధ) కళ స్థానిక సంప్రదాయానికి ప్రసిద్ధి చెందిన గాంధార 1 వ శతాబ్దం నుండి 5 వ శతాబ్దం వరకు కుషాను సామ్రాజ్య పాలనలో శిఖరాగ్రస్థాయిని సాధించింది. గాంధారా "ఆసియా కూడలిగా అభివృద్ధి చెంది" వాణిజ్య మార్గాలను అనుసంధానిస్తూ విభిన్న నాగరికతల సాంస్కృతిక ప్రభావాలను గ్రహిస్తుంది. ముందుగా ఇస్లాం ఆధిపత్యం చేసిన ఈప్రాంతంలో 8-9 వ శతాబ్దాల వరకు బౌద్ధమతం అభివృద్ధి చెందింది.[10] 11 వ శతాబ్దం వరకు పాకిస్తాన్ స్వాతు లోయలో బౌద్ధమతం ప్రాంతాలు కొనసాగాయి.[11]

చరిత్రకారుడు అల్-బిరుని పర్షియను పదం " షాహి "[12] పాలక రాజవంశాన్ని [13] సూచించడానికి ఉపయోగించారు. ఇది కాబూలు షాహి నుండి స్వీకరించబడింది.[14] ఈ రాజవంశం 10 - 11 వ శతాబ్దాల ముస్లిం ఆక్రమణలకు ముందు కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించింది. సా.శ. 1001 లో ఘజ్నికి చెందిన మహమూదు దీనిని స్వాధీనం చేసుకున్న తరువాత గాంధార పేరు అదృశ్యమైంది. ముస్లిం కాలంలో ఈ ప్రాంతం లాహోరు నుండి లేదా కాబూల నుండి పరిపాలించబడింది. మొఘలు కాలంలో ఇది కాబూలు స్వతంత్ర జిల్లాగా ఉంది.

టెర్మినాలజీ[మార్చు]

Cremation urn, Gandhara grave culture, Swat Valley, సుమారు 1200 BC.

గాంధారను సంస్కృతంలో गन्धार గాంధారా అని, అవెస్టానులో వాకారాటా అని, ఓల్డు పర్షియనులో గదారా అని పిలుస్తారు (పాత పర్షియాలో క్యూనిఫాం: 𐎥𐎭𐎠𐎼, గదారా, పాత పర్షియా లిపిలో హల్లులు తొలగించబడటానికి ముందు నాసికా "ఎన్" నుండి గాంధేరా అని కూడా లిప్యంతరీకరించబడింది. గండారా వలె)[15] బాబిలోనియా, ఎలామైటు పారుపరేసన్న (పారా-ఉపారీ-సేనా),[16] చైనా భాషలో టి: 犍陀羅 / ఎస్: 犍陀罗 (క్వింటులులు), గ్రీకులో Γανδάρα (గాంధార).[17]

పేరు వెనుక చరిత్ర[మార్చు]

పేరుకు ఒక ప్రతిపాదిత మూలం "గాంధ" అనే సంస్కృత పదం నుండి వచ్చింది. దీని అర్ధం "సువాసనా ద్రవ్యం", "వారు [నివాసులు] వర్తకం చేసిన సుగంధ ద్రవ్యాలు, సుగంధ మూలికలను సూచిస్తుంది. దానితో వారు తమను తాము కూడా ఉపయోగించారు." [18][19] గాంధార ప్రజలు ఋగ్వేదం, అధర్వవేదం, తరువాత వేద గ్రంథాలలో పేర్కొన్న తెగగ ఉంది.[20] ఇది జొరాస్ట్రియనిజం అవెస్టాను భాషలో వాకారాటా పేరుతో నమోదు చేయబడ్డాయి. పురాణాల సాంప్రదాయ సంస్కృతంలో గాంధారా అనే పేరు పేర్కొనబడింది.

మొదటి డారియసు చక్రవర్తి బెహిస్తును శాసనంలో గండారా అనే పేరు పర్షియను రూపం పేర్క్నబడింది.[21][22] బాబిలోనియా ఎలమైటు భాషలలో పరుపరేసన్న (పారా-ఉపారీ-సేనా, అంటే "హిందూ కుష్ దాటి") అని అనువదించబడింది. అదే శాసనం.[16]

కందహారు కొన్నిసార్లు గాంధారతో శబ్దంతో సంబంధం కలిగి ఉంటుంది. అయినప్పటికీ కందహారు గాంధార ప్రధాన భూభాగంలో భాగంలోనిది కాదు.[23]

భౌగోళికం[మార్చు]

Female spouted figure, terracotta, Charsadda, Gandhara, 3rd to 1st century BC Victoria and Albert Museum

చరిత్ర కాలం అంతటా గాంధార సరిహద్దులు మారుతూ ఉన్నాయి. కొన్నిసార్లు పెషావరు లోయ, తక్షశిలా ప్రాంతాలను సమష్టిగా గాంధార అని పిలుస్తారు; కొన్నిసార్లు స్వాతు లోయ (సంస్కృతం: సువాస్తు) కూడా చేర్చబడింది. పషావరు లోయ అన్నికాలాలలో గాంధార హృదయస్థానంగా ఉంటూ వచ్చింది. ఈ రాజ్యం కపిసా (బాగ్రాం) నుండి పాలించబడింది.[24] పుష్కలవతి (చార్సద్దా), తక్షశిల, పురూసపుర (పెషావరు) చివరి రోజులలో సింధు నదీతీరంలో ఉదభండపుర (హుండి) నుండి పాలించబడింది.

గాంధారతో ఈ ప్రావిన్సులో కాబూలు లోయ, స్వాతు చిత్రాల్‌లు ప్రాంతాలు కూడా ఉన్నాయి.[25]

చరిత్ర[మార్చు]

Mother Goddess (fertility divinity), possibly derived from the Indus Valley Civilization, terracotta, Sar Dheri, Gandhara, 1st century BC, Victoria and Albert Museum

పాతరాతి యుగం[మార్చు]

మర్దన్ సమీపంలోని సంఘావో వద్ద ప్రాంతీయ గుహలలోని రాతి యుగం సాక్ష్యాలుగా రాతి పనిముట్లు, కాలిన ఎముకలతో సహా గాంధారాలోని మానవ నివాసాలు కనుగొనబడ్డారు. ఇక్కడ లభించిన కళాఖండాలు సుమారు 15,000 సంవత్సరాల పురాతనమైనవి. ఇటీవలి త్రవ్వకాలు ప్రస్తుతానికి 30,000 సంవత్సరాల ముందు ఉన్నాయి.

వేదకాల గాంధార[మార్చు]

గాంధారా పెషావరు లోయ పురాతన రాజ్యం, ఇది పాకిస్తాన్లోని స్వాతు లోయ, పోటోహారు పీఠభూమి ప్రాంతాలతో పాటు ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్ లోని జలాలాబాదు జిల్లా మధ్య విస్తరించి ఉంది. పురావస్తు శాస్రానుసారంగా గాంధారలోని వేద కాలం గాంధార సమాధి సంస్కృతికి అనుగుణంగా ఉంటుంది.

గాంధారి పేరు ధ్రువీకరించబడింది ఋగ్వేదంలో (RV 1.126.7 [6]). గాంధారిలు, బాల్హికలు (బాక్ట్రియన్లు), ముజవంతులు, అంగాలు, మగధులతో పాటు, అధర్వవేదంలో (AV 5.22.14) సుదూర ప్రజలుగా పేర్కొన్నారు. పురాణ, బౌద్ధ సంప్రదాయాల ఉత్తరాపాత విభాగంలో గాంధారాలను చేర్చారు. గాంధార రాజు నాగ్నాజితు ఐతరేయ బ్రాహ్మణుడు సూచిస్తాడు. వీరు విదేహ రాజు జనకునికి సమకాలీనుడు.[26]

మహాజనపదాలు[మార్చు]

Kingdoms and cities of ancient India, with Gandhara located in the northwest of the Indian subcontinent, during the time of the Buddha (సుమారు 500 BC).

పురాతన భారతదేశంలోని పదహారు మహాజనపదాలలో గాంధార ఒకటి.[4][5] గాంధార ప్రాథమిక నగరాలలో పురసపుర (పెషావర్), తక్షసిలా (టాక్సిలా), పుష్కలవతి (చార్సద్ద) ఉన్నాయి. రాజధాని పెషావరుకు మార్చబడిన తరువాతి 2 వ శతాబ్దం వరకు గాంధార రాజధానిగా ఉంది. ఒక ముఖ్యమైన బౌద్ధ మందిరం కారణంగా 7 వ శతాబ్దం వరకు నగరం తీర్థయాత్రల కేంద్రంగా మార్చబడింది. పెషావరు లోయలోని పుష్కలవతి స్వాతు, కాబూలు నదుల సంగమం వద్ద ఉంది, ఇక్కడ కాబూలు నది మూడు వేర్వేరు శాఖలు కలుస్తాయి. ఆ నిర్దిష్ట స్థలాన్ని ఇప్పటికీ ప్రాంగు (ప్రయాగ) అని పిలుస్తూ పవిత్రంగా భావిస్తారు; ఇప్పటికీ స్థానిక ప్రజలు చనిపోయినవారిని ఖననం కోసం అక్కడకు తీసుకువస్తారు. కాశ్మీరు లోని గంగా, యమునా సంగమం ప్రాంగు ప్రదేశంలో సమీపంలో ఇలాంటి భౌగోళిక లక్షణాలు కనిపిస్తాయి. బెనారసుకు పశ్చిమాన పవిత్ర నగరం ప్రయాగ (పారయాగు) ఉంది. కొన్ని ఇతిహాసాలు ఉన్నాయి. వీటిలో రెండు నదులతో భూగర్భ సరస్వతి నది ఇక్కడ సంగమించి మూడు నదుల సంగమం అయిన త్రివేణిని ఏర్పరుస్తాయి. అయినప్పటికీ ఋగ్వేద గ్రంథాలు, ఆధునిక పరిశోధనలు సరస్వతి నది మార్గం చాలా భిన్నంగా ఉందని సూచిస్తున్నాయి. ఇది ప్రయాగ వద్ద కాక ఆధునిక గుజరాతు లోని కచు వద్ద సముద్రంలో సంగమిస్తుంది. గాంధార నగరం టాక్సిలా క్రీ.పూ 5 వ శతాబ్దం నుండి హిందూ బౌద్ధుల ప్రధాన విద్యా కేంద్రంగా ఉంది.[27] ఇది క్రీ.పూ. 2 వ శతాబ్దం వరకు కొనసాగింది.

గాంధారను హిందూ పురాణాలు మహాభారతం, రామాయణంలో పశ్చిమ రాజ్యంగా పేర్కొన్నారు. త్రేతా యుగంలో రాముడి ముందు, ముచుకుంద, మాంధాతల పాలనలలో, గాంధార రాజ్యాన్ని ద్రుహ్యూ రాజకుమారుడు గాంధార స్థాపించాడు. అతను ద్రుహూ రాజవంశానికి చెందిన అంగారారాజు కుమారుడు. రామాయణ కాలంలో రాముడి సమకాలీనుడైన రాజు నాగ్నజిత్తును రాముడి సోదరుడు భరతుడు ఓడించి చంపాడు. భరత మొదటి కుమారుడు తక్ష సింధు ఒడ్డున గాంధార రాజ్యంలో తక్షశిల (టాక్సిలా) ను స్థాపించాడు. విభీషణుడి బావ అయిన రాజు సైలుషను ఓడించి చంపిన తరువాత సరస్వతి నది ఒడ్డున ఉన్న గంధర్వ తెగలో పుష్కర పుష్కరవతి, పురుషపుర (పుష్కర) ) స్థాపించాడు. ద్వాపర యుగంలో పాండవులకు వ్యతిరేకంగా దుర్యోధనుడు చేసిన అన్ని కుట్రలకు గాంధార యువరాజు శకుని మూలంగా ఉన్నాడు. చివరికి అది కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. కురురాజు ధృతరాష్ట్రుడి భార్య శకుని సోదరిని గాంధారి అని పిలుస్తారు. గాంధార ఆధునిక పాకిస్తానులో ఉంది. ఈ గాంధార రాజ్యంలో పుస్కలవతి, తక్షశిల (టాక్సిలా), పురుషపుర (పెషావరు) నగరాలు ఉన్నాయి. భరత వారసులు ఈ రాజ్యాన్ని పరిపాలించారు. ఇతిహాస కాలంలో దీనిని శకుని తండ్రి సువాలా, శకుని, శకుని కుమారుడు పాలించారు. యుధిష్ఠిర అశ్వమేధ యజ్ఞం కోసం యుద్ధానంతర సైనిక పోరాటం సందర్భంగా అర్జునుడు శకుని కొడుకును ఓడించాడు.

అచమనిదు గాంధార[మార్చు]

Eastern border of the Achaemenid Empire and ancient kingdoms and cities of India (సుమారు 500 BC).
Athens coin (సుమారు 500/490–485 BC) discovered in Pushkalavati. This coin is the earliest known example of its type to be found so far east.[28] Such coins were circulating in the area as currency, at least as far as the Indus, during the reign of the Achaemenids.[29][30][31][32]

క్రీస్తుపూర్వం 550 నాటికి సింధు లోయలో మిగిలి ఉన్న ప్రధాన వేద తెగలలో కాంబోజా, సింధు, తక్సాలు (గాంధార), మద్రాలు, చెనాబు, కథలు, రవి నది, మల్లాలు, తుగ్రాలు (సట్లెజు నది) ఉన్నారు. ఈ అనేక తెగలు, రాజ్యాలు ఒకదానికొకటి పోరాడాయి. సింధు లోయలో బయటి వ్యక్తుల నుండి రక్షించడానికి, పోరాడుతున్న తెగలను ఒక వ్యవస్థీకృత రాజ్యంగా మార్చడానికి ఒక శక్తివంతమైన వేద గిరిజన రాజ్యం లేదు. ఈ ప్రాంతం సంపన్నమైనది, సారవంతమైనది అయినప్పటికీ గొడవలు దుఃఖాన్ని, నిరాశకు దారితీశాయి. గాంధార రాజు పుష్కరసాక్తి తన స్థానిక ప్రత్యర్థులపై అధికార పోరాటాలలో పాల్గొన్నాడు. ఖైబర్ పాస్ సరిగా రక్షణరహితంగా ఉండేది. అచెమెనిదు సామ్రాజ్యానికి చెందిన రాజు మొదటి డారియసు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దండయాత్రకు ప్రణాళిక వేసుకున్నాడు. పర్షియాలో సింధు లోయ దాని బంగారు, సారవంతమైన నేలగా గుర్తించబడింది. ఖైబరు పాసును జయించడం ఆయనకు పూర్వపాలకుడు సైరసు ది గ్రేటు ప్రధాన లక్ష్యంగా ఉండేది.[33] క్రీస్తుపూర్వం 542 లో సైరస్ తన సైన్యాన్ని నడిపించి దక్షిణ బలూచిస్తాన్లోని మక్రాను తీరాన్ని జయించాడు. ఏదేమైనా అతను మక్రాను (కలాటు, ఖుజ్దారు, పంజ్గూరు ప్రాంతాలలో) దాటి ప్రచారం చేసాడు. ఆయన గెడ్రోసియను ఎడారిలో తన సైన్యాన్ని చాలావరకు కోల్పోయాడు (ప్రస్తుత ఖరాను ఎడారి). హించబడింది).

Xerxes I tomb, Gandharian soldier, సుమారు 470 BC.
Xerxes I tomb, Gandharian soldier, సుమారు 470 BC (detail).

క్రీస్తుపూర్వం 518 లో డారియను తన సైన్యాన్ని ఖైబర్ పాస్ ద్వారా దక్షిణ దిశగా నడిపించాడు. చివరికి క్రీస్తుపూర్వం 516 నాటికి సింధు లోని అరేబియా సముద్ర తీరానికి చేరుకున్నాడు. పర్షియా పాలనలో సింధు లోయలో మొదటిసారిగా అధికారిక వ్యవస్థతో కేంద్రీకృత పరిపాలన వ్యవస్థను ప్రవేశపెట్టారు. ప్రాంతీయ రాజధానులతో ప్రావిన్సులు ("సాథెరపీ") స్థాపించబడ్డాయి:

క్రీస్తుపూర్వం 518 లో గాంధార పుష్కలవతి (చార్సద్దా) వద్ద తన రాజధాని స్థాపించబడింది.[34] పాత గాంధార సమాధి సంస్కృతి ప్రాంతంలో గాంధారా సాత్రపీ (ప్రస్తుత ఖైబరు పాసు) స్థాపించబడింది. అచెమెనిదు పాలనలో అరామికు (అచెమెనిదుల అధికారిక భాష) భాష కొరకు ఉపయోగించిన ఖరోస్తి వర్ణమాల ఇక్కడ అభివృద్ధి చెందింది. సా.శ. 200 వరకు ఇది గాంధార జాతీయ లిపిగా ఉంది.

క్రీ.పూ 518 లో పంజాబు లోని గాంధార రాజ్యం (తక్షీలా) అచెమెనిదు సామ్రాజ్యం స్వాధీనం చేసుకుంది.[35] ఈ సమయంలో హర్యంక రాజవంశానికి చెందిన మగధ సామ్రాజ్య చక్రవర్తి బింబిసారా (క్రీ.పూ. 558-491) సమకాలీనుడైన పుష్కరసక్తి రాజు గాంధార రాజు. రాజు పుష్కరసాక్తి తన స్థానిక ప్రత్యర్థులపై అధికార పోరాటాలలో పాల్గొన్నాడు. డారియసు ఆధ్వర్యంలోని అచెమెనిదులు క్రీస్తుపూర్వం 516 లో ఈ ప్రాంతంలోకి చొచ్చుకుపోయి ఆధునిక పంజాబు, పాకిస్తాను పశ్చిమ ప్రాంతాలను సింధు నది, సింధు వరకు స్వాధీనం చేసుకుంది.

పెర్సెపోలిసు సమీపంలోని నక్ష్-ఇ-రుస్తాం వద్ద ఉన్న డారియసు (క్రీ.పూ. 521–486) సమాధి మీద ఉన్న శాసనం గదారా (గాంధేరా)తో పాటు హిందుషు (హండు, సింధు) తో పాటు సాత్రపీల జాబితాలో ఉంది. క్రీస్తుపూర్వం 380 నాటికి ఈ ప్రాంతం మీద పర్షియా పట్టు బలహీనపడింది. గాంధారాలో చాలా చిన్న రాజ్యాలు పుట్టుకొచ్చాయి. క్రీ.పూ 327 లో అలెగ్జాండరు ది గ్రేట్ గాంధారతో పాటు పర్షియా సామ్రాజ్యం భారతీయ సాత్రపీలను జయించాడు. అలెగ్జాండరు యాత్రలు అతని సభలోని చరిత్రకారులు, అరియను (సా.శ. 175 లో) తన అనాబాసిసు అలెగ్జాండ్రిలో ఈ సంఘటన నమోదు చేసాడు. తరువాత చాలా శతాబ్దాల తరువాత ఇతర చరిత్రకారులు నమోదు చేసారు.

1962 లో సర్ మోర్టిమెరు వీలరు అక్కడ కొన్ని తవ్వకాలు జరిపారు. వివిధ అచెమెనిదు అవశేషాలను గుర్తించారు.

మసెండోనియను గాంధార[మార్చు]

"Victory coin" of Alexander the Great, minted in Babylon సుమారు 322 BC, following his campaigns in the Indian subcontinent. Obverse: Alexander being crowned by Nike. Reverse: Alexander attacking king Porus on his elephant. Silver. British Museum.

క్రీస్తుపూర్వం 327 శీతాకాలంలో అలెగ్జాండరు తన అధికారానికి లోబడడానికి మిగిలిన ఐదు అచెమెనిదు సాత్రపీ లలోని అన్ని అధిపతులను ఆహ్వానించాడు. మాజీ హిందూషు సాత్రపీలోని అప్పటి టాక్సిలా పాలకుడు అంబి దీనిని అంగీకరించినప్పటికీ గాంధారా, అరాచోసియా, సత్తాగిడియా, గెడ్రోసియా మాజీ సాత్రపీలో మిగిలిన గిరిజన వంశాలు అలెగ్జాండరు ప్రతిపాదనను తిరస్కరించారు.

వారు ఎదుర్కొన్న మొట్టమొదటి తెగ కునారు లోయలోని అస్పాసియోయి తెగ అలెగ్జాండరుకు వ్యతిరేకంగా భీకర యుద్ధాన్ని ప్రారంభించారు దీనిలో ఆయన భుజంలో ఒక ఆయుధంచేత గాయపడ్డాడు. అయినప్పటికీ అస్పాసియోయి చివరికి ఓడిపోయి వారి సైనికులలో 40,000 మంది బానిసలుగా చేసుకోబడ్డారు. అలెగ్జాండరు తరువాత నైరుతి దిశలో ముందుకు సాగాడు. అక్కడ ఆయన క్రీ.పూ 326 లో స్వాతు & బునరు లోయలో అస్కెనోయి తెగను ఎదుర్కొన్నాడు. అస్సాకెనోయి ధైర్యంగా పోరాడి, ఒరా, బజీరా (బారికోటు), మసాగా నగరాలలో అలెగ్జాండరు, అతని సైన్యంనికి వ్యతిరేకంగా మొండి పట్టుదల చూపించి ఎదుర్కొన్నారు. అస్సకెనోయి ప్రతిఘటన గురించి అలెగ్జాండరు అత్యధికంగా ఆగ్రహించాడు. అతను మసాగా మొత్తం జనాభాను చంపి దాని భవనాలను శిథిలావస్థకు తీసుకువెళ్ళాడు. తరువాత ఒరా వద్ద ఇదే విధమైన వధ జరిగింది.[36] మరొక బలమైన కోట అస్సాకెనోయి. ఈ కబేళాల కథలు అనేకమంది అస్సాకేనియన్లకు చేరాయి వారు షాంగ్లా, కొహిస్తాను మధ్య ఉన్న కొండ కోట అయిన ఆర్నోస్కు పారిపోవటం ప్రారంభించారు. అలెగ్జాండరు వారి వెనుకబడి కొండ కోటను ముట్టడించి చివరికి కోటను స్వాధీనం చేసుకుని నాశనం చేసి లోపల ఉన్న ప్రతి ఒక్కరినీ చంపాడు. మిగిలిన చిన్న తెగలు లొంగిపోయాయి లేదా పుష్కలవతి (చార్సద్దా) అస్తానెనోయి తెగ లాగా తటస్థంగా నిలిచాయి. ఇక్కడ 38,000 మంది సైనికులు, 2,30,000 ఎద్దులను అలెగ్జాండరు స్వాధీనం చేసుకున్నారు.[37] చివరికి అలెగ్జాండరు చిన్న శక్తి అటాక్ వద్ద ఖైబరు పాస్ ద్వారా వచ్చిన పెద్ద శక్తితో కలుసింది. గాంధారపై విజయం సాధించడంతో, అలెగ్జాండరు తన సైనిక సరఫరా మార్గాన్ని బలోపేతంగా మార్చబడింది. ఇది ఇప్పుడు హిందూ కుషు మీద దాడి చేసాడు.

గాంధారను జయించిన తరువాత తనసైన్యాలను బలపరచుకోవడానికి బాక్ట్రియా నుండి సహాయం తీసుకుని అలెగ్జాండరు తనసైన్యాలతో తక్షశిల రాజు అంబి సైన్యాలను కలుపుకొని క్రీ.పూ 326 జూలైలో ఇండసు నదిని దాటి అర్చోసియా (పంజాబు)పోరాటం సాగించాడు. తరువాత అలెగ్జాండరు గాంధారలోని పంజాబు, సింధులలో పలు స్థావరాలను స్థాపించాడు.[38] తరువాత సత్రాపీలకు కొత్త అధికారులను నియమించాడు:

క్రీ.పూ 326 లో అలెగ్జాండరు గాంధారలో ఒక్సియార్టెసు సత్రాపు అధికారిగా ప్రతిపాదించాడు.

గాంధార ప్రాంతానికి మౌర్యుల ప్రవేశం[మార్చు]

Coin of Early Gandhara Janapada: AR Shatamana and one-eighth Shatamana (round), Taxila-Gandhara region, సుమారు 600–300 BC
A monetary silver coin of the satrapy of Gandhara about 500–400 BC. Obv: Gandhara symbol representing 6 weapons with one point between two weapons; At the bottom of the point, a hollow moon. Rev: Empty. Dimensions: 14 mm Weight: 1.4 g.

మౌర్య రాజవంశం స్థాపకుడు చంద్రగుప్త మౌర్య అలెగ్జాండరు నగరాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు టాక్సిలాలో నివసించినట్లు భావిస్తున్నారు. సాంప్రదాయం ఆధారంగా అతను కౌటిల్య దగ్గర శిక్షణ పొందాడు. ఆయన తన పాలనలో కౌటిల్యుడు ప్రధాన సలహాదారుగా కొనసాగాడు. బహుశా మౌర్యచంద్రగుప్తుడు గాంధార, వాహికలను తన స్థావరంగా ఉపయోగించుకుని మగధ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించి క్రీ.పూ 321 లో పాటలీపుత్ర వద్ద సింహాసనాన్ని అధిష్టించాడు. ఏదేమైనా చంద్రగుప్త మౌర్య గురించి సమకాలీన భారతీయ వ్రాతపూర్వక ఆధారాలు లేవు. దాదాపుగా తెలిసినవన్నీ పాటలీపుత్రలోని సెల్యూకసు రాయబారి మెగాస్టీనీసు డైరీల ఆధారంగా అర్రియను తన ఇండికాలో నమోదు చేసినట్లు భావిస్తున్నారు. అలెగ్జాండరు పట్ల తన భయాన్ని తగ్గించడానికి అంబి త్వరితగతిలో విలువైన బహుమతులతో ఆయనను కలుసుకుని అంబి తన శక్తులన్నింటితో సహా స్వయంగా అలెగ్జాండరుకు సమర్పించాడు. అలెగ్జాండరు అంబికి తన బిరుదును, బహుమతులను తిరిగి ఇవ్వడమే కాక, "పర్షియా వస్త్రాలు, బంగారు, వెండి ఆభరణాలు, 30 గుర్రాలు, 1000 బంగారం పతకాలు" కూడా ఆయనకు అందించాడు. అలెగ్జాండరు తన బలగాలను ధైర్యంగా విభజించాడు. సింధు మీద హండ్ (ఫాక్స్ 1973) వద్ద వంతెనను నిర్మించడంలో అంబీ హెఫెషను, పెర్డికాసుకు సహాయం చేశాడు. వారి దళాలను సరఫరా చేశాడు. అలెగ్జాండరును అతని మొత్తం సైన్యానికి తన రాజధాని తక్షశిలలో నిలిపి స్నేహం ప్రదర్శనతో అత్యంత ఉదార ​​ఆతిథ్యం అందించాడు.

మాసిడోనియా రాజు తరువాత టాక్సీల్సు 5000 మంది సైనికులతో అంబి హైడాస్పెసు నది యుద్ధంలో పాల్గొన్నారు. ఆ విజయం తరువాత అలెగ్జాండరు అంబిని పోరసు వద్దకు పంపబడ్డాడు. అంబి మాసిడోనియా రాజుకు లొంగిపొమ్మని పోరసును ఆదేశించి తన పాత శత్రువు చేతిలో ప్రాణాలు కోల్పోకుండా తృటిలో తప్పించుకున్నాడు. అయినప్పటికీ తరువాత ఇద్దరు ప్రత్యర్థులు అలెగ్జాండరు వ్యక్తిగత మధ్యవర్తిత్వం ద్వారా రాజీ పడ్డారు; టాక్సిల్సు హైడాస్పెసు లోని నౌకాదళ పరికరాలతో ఉత్సాహంగా సహకరించిన తరువాత ఆ నది, సింధు మధ్య మొత్తం భూభాగం స్వాధీనం చేసుకొనబడింది. ఫిలిపు (మచాటాసు కుమారుడు) మరణం తరువాత అంబికి మరింత అధికారం లభించింది; అలెగ్జాండరు మరణించే (క్రీ.పూ. 323)వరకు ఆయన అధికారం కొనసాగింది. క్రీ.పూ 321 లోని త్రిపారిడిససు ప్రావిన్సుల విభజనకు అంబికి అలెగ్జాండరు నుండి అనుమతి లభించింది. తరువాత అంబిని మౌర్య సామ్రాజ్యం చక్రవర్తి చంద్రగుప్తా మౌర్య పదవీచ్యుతుని చేసి చంపి గాంధారను గ్రీకుల నుండి చంద్రగుప్త మౌర్య స్వాధీనం చేసుకున్నారు.

క్రీస్తుపూర్వం 305 లో సెల్యూకసు నికేటరు (ఆసియాలో అలెగ్జాండరు వారసుడు) తో యుద్ధం తరువాత మౌర్య చక్రవర్తి తన సంరాజ్యాన్ని ప్రస్తుత దక్షిణ ఆఫ్ఘనిస్తాను వరకు విస్తరించాడు. సామ్రాజ్యం గ్రాండు ట్రంకు రహదారి పూర్తవడంతో ఈ ప్రాంతం వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఒకటిన్నర శతాబ్దం పాటు గాంధారా మౌర్య సామ్రాజ్యంలో ఉండిపోయింది.

చంద్రగుప్తమౌర్యుడి మనవడు అశోకుడు గొప్ప భారతీయ పాలకులలో ఒకడు. తన తాత వలె అశోకుడు కూడా గాంధారాలో ప్రతినిధిగా తన వృత్తిని ప్రారంభించాడు. తరువాత అతను బౌద్ధుడయ్యాడై బౌద్ధ ధర్మాన్ని ప్రోత్సహించాడు. తన సామ్రాజ్యంలో ఇతర విషయాలతో శాకాహార ఆహారం, తన సామ్రాజ్యంలో గృహాలలోనూ అడవిలోనూ జంతువులను చంపడం నిషేధించాడు. అశోకుడు గాంధారలో అనేక స్థూపాలను నిర్మించాడు. యోనాసు, కాంబోజాలు, గాంధారాలతో సహా వాయవ్య సరిహద్దు మీద మౌర్య నియంత్రణకు చిహ్నంగా అశోకుడు వదిలిపెట్టిన శిలాశాసనాలు ఈ ప్రాంతం మీద మౌర్యుల ఆధిక్యాన్ని ధ్రువీకరిస్తున్నాయి. అధ్యయనకారులు గాంధారలు, కంబోజులు, [39][40][41] కురులు, కంబోజాలు, గాంధారాలు, బహ్లికాలు ఒకదానితో ఒకటి భాషా, సంప్రయ, సంస్కృతుల పరంగా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని అభిప్రాయపడుతున్నారు. వీరు అందరికీ ఇరానియన్ సంబంధాలు ఉన్నాయని కూడా వాదించారు.[42] లేదా గాంధార, కంబోజా ఒక సామ్రాజ్యంలోని రెండు ప్రావిన్సులు తప్ప మరొకటి కాదు కనుక ఒకరి భాషను ప్రభావితం చేస్తున్నారు. [43] ఏది ఏమయినప్పటికీ గాంధార స్థానిక భాష పాణిని సాంప్రదాయిక భాష ("భాష")గా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది కంబోజా ఇరానియను (అవెస్టాను) భాషకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది.[note 1]

గ్రేసు- బాక్ట్రియన్లు, శాకాలు, ఇండో- పార్ధియన్లు[మార్చు]

Greco-Buddhist statue of standing Buddha, Gandhara (1st–2nd century), Tokyo National Museum

సామ్రాజ్యం క్షీణత భారత ఉపఖండంలో గ్రీకో-బాక్ట్రియా దండయాత్రలకు ద్వారం తెరిచింది. క్రీ.పూ 180 లో ప్రస్తుత దక్షిణ ఆఫ్ఘనిస్తానును బాక్ట్రియాకు చెందిన మొదటి డెమెట్రియసు స్వాధీనం చేసుకున్నాడు. క్రీస్తుపూర్వం 185 లో డెమెట్రియసు గాంధార, పంజాబులను ఆక్రమించి జయించాడు. తరువాత బాక్ట్రియా గ్రీకుల వివిధ సమూహాల మధ్య యుద్ధాలు బాక్ట్రియా నుండి గాంధారకు స్వాతంత్ర్యం పొందేలా చేసి ఇండో-గ్రీకు రాజ్యం ఏర్పడటానికి కారణమయ్యాయి. ఇండో- గ్రీకు రాజులలో మొదటి మెనాండరు అత్యంత గొప్ప రాజుగా ప్రసిద్ధి చెందాడు. ఆయన ముందుగా టాక్సిలా నుండి తరువాత సాగాలా (సియాల్‌కోట్) నుండి పాలించాడు. అతను టాక్సిలా (సిర్కాపు), పుష్కలవతిని పునర్నిర్మించాడు. తరువాత ఆయన బౌద్ధుడయ్యాడు. గొప్ప బౌద్ధ తత్వవేత్త నాగసేనతో మిలిండా పన్హా పుస్తకంలో ఆయన తత్వవేత్తలతో జరిపిన చర్చలు బౌద్ధ గ్రంథాలలో నమోదు చేయబడింది.

సముద్ర దేవతలు, గాంధార

క్రీస్తుపూర్వం 140 లో మెనాండరు మరణించిన సమయంలో మధ్య ఆసియా కుషన్లు బాక్ట్రియాను అధిగమించి అక్కడితో గ్రీకు పాలనను ముగించారు. క్రీస్తుపూర్వం 80 లో ఇరాను పార్థియన్ల ప్రభావంతో శాకాలు గాంధార, పాకిస్తాను, పశ్చిమ భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో విస్తరించారు. శాకా రాజులలో అత్యంత ప్రసిద్ధ చెందిన రాజా మౌసెసు గాంధారాలో స్థిరపడ్డారు.

క్రీస్తుపూర్వం 90 నాటికి పార్థియన్లు తూర్పు ఇరాను మీద నియంత్రణ సాధించారు. క్రీస్తుపూర్వం 50 లో వారు నేటి ఆఫ్ఘనిస్తానులో గ్రీకు పాలన చివరి అవశేషాలను అంతం చేశారు. చివరికి ఇండో-పార్థియను రాజవంశం గాంధార మీద నియంత్రణ సాధించడంలో విజయవంతమైంది. పార్థియన్లు గ్రీకు కళా సంప్రదాయాలకు మద్దతునిస్తూనే ఉన్నారు. క్రీ.పూ 75-50 నాటికి గాంధార గ్రీకో-బౌద్ధ కళ ప్రారంభం అయింది. రోం, ఇండో-పార్థియను రాజ్యాల మధ్య సంబంధాలు ఉన్నాయి.[44] భవన నిర్మాణ పద్ధతులు పరస్పరం పంచుకున్నారని పురావస్తు ఆధారాలు ఉన్నాయి. క్రీస్తుశకం 40 లో థామసు అపొస్తలుడు భారత ఉపఖండాన్ని సందర్శించి ఇండో-పార్థియను రాజు గొండోఫారెసును ఎదుర్కొన్నట్లు క్రైస్తవ రికార్డులు పేర్కొన్నాయి.[45]

కుషాను గాంధార[మార్చు]

Casket of Kanishka the Great, with Buddhist motifs

75 నాటికి మధ్య ఆసియా నుండి మరొక సమూహం పార్థియను రాజవంశాన్ని నిర్మూలించింది. చైనాలో యుయెజి అని పిలువబడే కుషాన్లు (కొంతమంది జాతిపరంగా ఆసి అని వాదించారు) మధ్య ఆసియా నుండి బాక్టీరియాకు వెళ్ళి అక్కడ వారు ఒక శతాబ్దం పాటు ఉన్నారు. సుమారు 75 నాటిక్ వారి తెగలలో ఒకటైన కుషాను (కునా)లు కుజుల కాడ్ఫిసెసు నాయకత్వంలో గాంధార, (ప్రస్తుత పాకిస్తాను) లోని ఇతర ప్రాంతాలమీద నియంత్రణ సాధించింది.

కుషనుల కాలం గాంధార స్వర్ణ కాలంగా పరిగణించబడుతుంది. పెషావరు లోయ, టాక్సీలాలు ఈ కాలపు స్థూపాలు, మఠాల శిథిలాలతో నిండి ఉన్నాయి. గాంధార కళ వృద్ధి చెందింది, భారత ఉపఖండంలో ఉత్తమమైన శిల్పాలను తయారు చేసింది. జాటకాల జ్ఞాపకార్థం అనేక స్మారక చిహ్నాలు సృష్టించబడ్డాయి.

సా.శ.4 వ శతాబ్దం, బోధిసత్వుని తల
జమాల్ గార్హి సమీపంలో కనుగొనబడిన సా.శ. 300 - 500 కాలానికి చెందిన కూర్చున్న బుద్ధుడు. ప్రస్తుతం ఇది శాన్ఫ్రాన్సిస్కోలోని ఆసియన్ ఆర్టు మ్యూజియంలో ప్రదర్శనలో ఉంది

గొప్ప కుషను రాజు కనిష్క ది గ్రేట్ (128–151) పాలనలో గాంధార సంస్కృతి అభివృద్ధి చెందింది. సిర్సుఖు, పెషావరు వద్ద టాక్సిలా (తకాసిలా) నగరాలు నిర్మించబడ్డాయి. పెషావరు గాంధార నుండి మధ్య ఆసియా వరకు విస్తరించి ఉన్న గొప్ప సామ్రాజ్యానికి రాజధానిగా మారింది. కనిష్క బౌద్ధ విశ్వాసానికి గొప్ప పోషకుడు; బౌద్ధమతం మధ్య ఆసియా, ఫార్ ఈస్టు లకు బాక్ట్రియా, సోగ్డియా అంతటా వ్యాపించింది. అక్కడ అతని సామ్రాజ్యం చైనా హాన్ సామ్రాజ్యాన్ని కలుసుకుంది. బౌద్ధ కళ గాంధార నుండి ఆసియాలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. కనిష్క ఆధ్వర్యంలో గాంధార బౌద్ధమతం పవిత్ర భూమిగా మారింది. అనేక జాటకాలతో సంబంధం ఉన్న స్మారక చిహ్నాలకు ఆకర్షించబడిన చైనా యాత్రికులు వీటిని చూడడానికి ఇక్కడకు పర్యాటకులుగా వస్తుంటారు.

గాంధారాలో బుద్ధుడు మానవ రూపంలో ప్రాతినిధ్యం వహించే మహాయాన బౌద్ధమతం అభివృద్ధి చెందింది. కుషాన్ల ఆధ్వర్యంలో కొత్త బౌద్ధ స్థూపాలు నిర్మించబడ్డాయి, పాతవి విస్తరించబడ్డాయి. బుద్ధుని భారీ విగ్రహాలను మఠాలలో నిర్మించి కొండప్రాంతాలలో చెక్కారు. కనిష్కుడు పెషావరు వద్ద 400 అడుగుల గొప్ప గోపురం కూడా నిర్మించాడు. ఈ గోపురాన్ని దేశాన్ని సందర్శించిన చైనా సన్యాసులు ఫాక్సియను, సాంగు యున్, జువానుజాంగు ఈ గోపుర వివరణలు అందించారు. 11 వ శతాబ్దంలో ఘజ్ని మహముదు చేత పూర్తిగా నాశనం చేయబడే వరకు ఈ నిర్మాణం చాలాసార్లు నాశనం చేయబడి తిరిగి పునర్నిర్మించబడింది.

హెప్తాలైటు దాడి[మార్చు]

Gandhara fortified city depicted in a Buddhist relief

451 లో హెప్తాలిటే హంసు గాంధారను స్వాధీనం చేసుకున్నాడు. ఆయన బౌద్ధమతాన్ని అవలంబించలేదు. కానీ వాస్తవానికి "భయంకరమైన ఊచకోతలకు పాల్పడింది." మిహిరాకులా మతానికి "భయంకరమైన హింసకుడు" అయ్యాడు.[46] వారి పాలనలో హిందూ మతం తిరిగి పుంజుకుంది. బౌద్ధ గాంధార నాగరికత క్షీణించింది.

ఈ శతాబ్దాలలో గాంధార పరివర్తన చెందుతున్నట్లు అనేక మంది చైనా బౌద్ధ యాత్రికుల ప్రయాణ రికార్డులు నమోదు చేశాయి. బౌద్ధమతం క్షీణించి, హిందూ మతం అభివృద్ధి చెందింది. 400 లో ప్రాకృతభాష ప్రజల భాషగా ఉన్నప్పుడు బౌద్ధమతం అభివృద్ధి చెందుతున్న సమయంలో ఫాక్సియను గాంధారలో ప్రయాణించాడు. 100 సంవత్సరాల తరువాత 520 లో సాంగ్ యున్ సందర్శించిన సమయంలో వేరే పరిస్థితి వివరించబడింది: ఈ ప్రాంతం వైట్ హన్స్ చేత నాశనం చేయబడింది. బుద్ధుని చట్టాలను పాటించని లా-లిహ్ చేత పాలించబడింది. జువాన్జాంగు 644 లో భారతదేశాన్ని సందర్శించాడు. గాంధారాలో హిందూ మతం, బౌద్ధమతం క్షీణించిందని కనుగొన్నారు. బుద్ధుని చట్టాన్ని గౌరవించే గాంధారను కాబూలుకు చెందిన ఒక రాజు పాలించాడు. కాని టాక్సీలా శిథిలావస్థకు చేరుకుంది, బౌద్ధ మఠాలు నిర్జనమైపోయాయి.

కాబూలు షాహి[మార్చు]

Sharing of the Buddha's relics, above a Gandhara fortified city.

644 లో సస్సానిదు సామ్రాజ్యాన్ని అరబ్బులు పతనం చేసిన తరువాత ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం, గాంధార మీద ముస్లింల వత్తిడి ఉన్నప్పటికీ వారు తమ సామ్రాజ్యాన్ని గాంధార వరకు విస్తరించడంలో విఫలమయ్యారు. గాంధారాను మొదట స్థానిక రాజులు పాలించారు. తరువాత వారు తమ రాజ్యాన్ని ఒక సామ్రాజ్యంగా విస్తరించారు.

తరువాతి 200 సంవత్సరాలు గాంధారను కాబూల నుండి షాహి వంశం చేత పాలించబడింది. 9 వ శతాబ్దంలో కొంతకాలం కాబూలు షాహి స్థానాన్ని కాబూలుషాహి భర్తీ చేసాడు. వివిధ ముస్లిం రికార్డుల ఆధారంగా ఇది 870 లో జరిగిందని అంచనా. అల్-బిరుని (973-1048) రచనల ఆధారంగా కాబూల్షాహి బ్రాహ్మణ మంత్రి కల్లారు 843 లో షాహి రాజవంశాన్ని స్థాపించారని భావిస్తున్నారు. రాజవంశం కాబూల నుండి కొంతకాలం తరువాత వారి రాజధానిని ఉదభండపురానికి తరలించింది. వారు తమ రాజ్యాలన్నిటిలో గొప్ప దేవాలయాలను నిర్మించారు. పంజాబు సాల్టు రేంజిలో ఈ భవనాలు కొన్ని ఇప్పటికీ మంచి స్థితిలో ఉన్నాయి.

పతనం[మార్చు]

ఈ రాజవంశం చివరి గొప్ప రాజు జయపాల. అతని సామ్రాజ్యం కాబూలుకు పడమటి దిశలో సట్లెజు నది వరకు విస్తరించింది. ఏదేమైనా గాంధారరాజ్య ఈ విస్తరణ సాబుక్తిజిను ఆధ్వర్యంలో శక్తివంతమైన ఘజ్నావిదు సామ్రాజ్యంగా అభివృద్ధి చెందింది. సబుక్తిజిను చేతిలో రెండుమార్లు ఓడిపోయి, కాబూలు లోయలో గజ్నికి చెందిన మహమూదు చేతిలో ఓడిపోయిన తరువాత జయపాల చితిపేర్చుకుని తన ప్రాణాలను అర్పించాడు. జయపాల కుమారులలో ఒకడైన ఆనందపాల తన రాజధానిని " సాల్టు రేంజి " లోని నందనా సమీపానికి తరలించాడు. 1021 లో ఈ రాజవంశం చివరి రాజు త్రిలోచనపాలాను తన సొంత దళాలు హత్య చేశాయి. ఇది గాంధార ముగింపుగా మారింది. తదనంతరం కొందరు షాహి యువరాజులు కాశ్మీరుకు వెళ్లి స్థానిక రాజకీయాలలో చురుకుగా ఉన్నారు.

ఆఫ్ఘనిస్తాన్లోని గాంధార నగరానికి తరువాత కందహారు నగరం అని పేరు పెట్టారు. హెచ్.డబల్యూ రచనల ఆధారంగా 5 వ శతాబ్దంలో గాంధార నుండి వలస వచ్చిన బెలో ఈ పేరును ఆధునిక కందహారుకు తీసుకువచ్చారు. ఫాక్సియను సందర్శించిన సమయంలో పెషావరు లోయలో బుద్ధుడి భిక్ష-గిన్నె 400 (చాప్టరు XII) ను ఉనికిలో ఉందని తన నివేదికలో సూచించాడు. కందహారు వెలుపల సుల్తాను వైసు మందిరంలో భద్రపరచబడిన ఈ భారీ భిక్షపాత్రను (ఏడు అడుగుల వ్యాసం) 1872 లో బెలో సందర్శించినట్లు నివేదించబడింది. ఓలాఫు కారో 1958 లో తన పుస్తకాన్ని రాసినప్పుడు (కారో, పేజీలు 170–171) ఈ అవశిష్టాన్ని కాబూలు మ్యూజియంలో ఉన్నట్లు నివేదించాడు. ఈ భిక్షాపాత్ర ప్రస్తుత స్థితి తెలియదు.

సి. 1001 లో పెషావరు యుద్ధంలో జయపాల ఓటమి తరువాత గాంధార, వాయవ్య భారతదేశంలో ఎక్కువ భాగం ఘజ్ని మహముదు చేత సంభవించిన వినాశనం గురించి 1030 లో అల్ బిరుని నివేదించింది:

తరువాతి కాలంలో తుర్కుల కాలం వరకు ముస్లిం విజేతలు కాబూలు, సింధు నది సరిహద్దులను దాటి వెళ్ళలేదు. వారు సామని రాజవంశం అధ్వర్యంలో ఘజ్నాలో అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుప్రీం శక్తిని నాయిరు-అదౌలా సాబుక్తాజిను పతనం చేసాడు. ఈ యువరాజు పవిత్ర యుద్ధాన్ని తన వ్యూహంగా ఎంచుకున్నాడు. ఫలితంగా తనను తాను అల్-ఘాజా ("యోధుడు / ఆక్రమణదారుడు") అని పేర్కొన్నాడు. ఆయన తన వారసుల ఆసక్తి అనుసరించి భారత సరిహద్దును బలహీనపరిచేందుకు ఆయన కుమారుడు యామిను-అడ్డౌలా మామాదు (30 సంవత్సరాలు, అంతకంటే అధిక కాలం) తరువాత భారతదేశంలోకి ప్రవేశించాడు. దేవుడు తండ్రి, కొడుకు ఇద్దరికీ దయ చూపాడు! మామాదు దేశం శ్రేయస్సును పూర్తిగా నాశనం చేసి, అక్కడ తీవ్రమైన దోపిడీలు చేశాడు. దీని ద్వారా హిందువులు అన్ని దిశలలో ధూళి అణువులలాగా చెల్లాచెదురయ్యారై ప్రజల నోటిలో పాత కథలాగా మారారు. వారి చెల్లాచెదురుగా వారి అవశేషగుర్తులు మిగిలిపోయ్యాయి. అయితే ముస్లింలందరిపట్ల అత్యంత విరక్తిభావం అధికరించింది. హిందూ శాస్త్రాలు మనచేత జయించిన దేశంలోని చాలా ప్రాంతాలకు దూరంగా తరలి మన చేతిని ఇంకా చేరుకోలేని ప్రదేశాలకు వెళ్ళాయి. హిందువులు కాశ్మీరు, బెనారెసు, ఇతర ప్రదేశాలకు పారిపోవడానికి ఇది కూడా కారణం. అక్కడ వారికి, విదేశీయులందరికీ మధ్య ఉన్న విరోధం రాజకీయ, మతపరమైన వనరుల ఆధారంగా మరింత అధికరించింది.[47]

మా శకం పదవ, తరువాతి శతాబ్దం ప్రారంభ సంవత్సరాలలో ఘజ్ని వద్ద పాలించిన రాజుల తుర్కు రాజవంశానికి చెందిన మొదటి సుల్తాను ముసల్మాను మహమూదు తరువాత పన్నెండు - పద్నాలుగు మంది ఉన్నారు. వీరు గాంధరులోకి ప్రవేశించి - ప్రస్తుత పెషావరు లోయ - హిందూస్తాను మతమార్పిడి దండయాత్రల సమయంలో.[48]

అతని మార్గం అంతటా అగ్ని, కత్తి, వినాశనం, విధ్వంసం గుర్తుగా నిలిచాయి. ఆయన మరణం కాలానికి ఉత్తర ఉద్యానవనం అని పిలువబడే గాంధరు ఒక విచిత్రమైన, నిర్జనమైన వ్యర్థంగా మిగిలిపోయింది. దాని గొప్ప పొలాలు, ఫలవంతమైన తోటలు, వాటికి నీరు అందించిన కాలువతో పాటు (మైదానం పశ్చిమ భాగంలో ఇప్పటికీ పాక్షికంగా కనుగొనవచ్చు), అన్నీ కనుమరుగయ్యాయి. అందులో నిర్మించిన అనేక రాతి నగరాలు, మఠాలు, పైభాగాలను వాటి విలువైన, గౌరవనీయమైన స్మారక చిహ్నాలు, శిల్పాలు తొలగించారు, కాల్చారు, నేలమీద పడేశారు, పూర్తిగా నివాసాలు నాశనం చేశారు.[48]

Rediscovery[మార్చు]

Many stupas, such as the Shingerdar stupa in Ghalegay, are scattered throughout the region near Peshawar.

గాంధార ఘజ్ని మహముదు సామ్రాజ్యంలో కలిసిపోయే సమయానికే బౌద్ధ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గాంధార కళ మరుగున పడింది. అల్-బిరుని తరువాత కాశ్మీరీ రచయిత కల్హానా 1151 లో తన రాజతరంగిని అనే పుస్తకాన్ని వ్రాసాడు. ఆయన తన రచనలలో గాంధారాలో జరిగిన కొన్ని సంఘటనలను రికార్డు చేశాడు. దాని చివరి రాజ వంశ రాజధాని ఉదభండపుర గురించి వివరాలను అందించాడు.

19 వ శతాబ్దంలో బ్రిటిష్ సైనికులు, నిర్వాహకులు భారత ఉపఖండంలోని ప్రాచీన చరిత్రపై ఆసక్తి చూపడం ప్రారంభించారు. 1830 లలో అశోక అనంతర కాలానికి చెందిన నాణేలు కనుగొనబడ్డాయి. అదే కాలంలో చైనీయుల యాత్రాంశాలు అనువదించబడ్డాయి. చార్లెసు మాసను, జేమ్సు ప్రిన్సెపె, అలెగ్జాండరు కన్నిన్నింహం 1838 లో ఖరోస్టి లిపిని రూపొందించాడు. చైనీయుల రికార్డులు బౌద్ధ మందిరాల కోసం ప్రదేశాలు, నిర్మాణవ్యూహా ప్రణాళికలను అందించాయి. నాణేల ఆవిష్కరణతో పాటు ఈ రికార్డులు గాంధార చరిత్రను అనుసంధానించేందుకు అవసరమైన ఆధారాలను అందించాయి. 1848 లో కన్నింగుహాం పెషావరుకు ఉత్తరాన గాంధార శిల్పాలను కనుగొన్నారు. ఆయన 1860 లలో టాక్సిలా ప్రాంతాన్ని కూడా గుర్తించాడు. అప్పటి నుండి పెషావరు లోయలో పెద్ద సంఖ్యలో బౌద్ధ విగ్రహాలు కనుగొనబడ్డాయి.

పురావస్తు శాస్త్రవేత్త జాను మార్షలు 1912 - 1934 మధ్య టాక్సిలా వద్ద త్రవ్వకాలు జరిపారు. అతను ప్రత్యేక గ్రీకు, పార్థియను, కుషాను నగరాలను పెద్ద సంఖ్యలో స్థూపాలు, మఠాలను కనుగొన్నాడు. ఈ ఆవిష్కరణలు గాంధార చరిత్ర, దాని కళ కాలక్రమాన్ని చాలా ఎక్కువ అనుసంధానించడానికి సహాయపడ్డాయి.

1947 తరువాత అహ్మదు హసను డాని, పెషావరు విశ్వవిద్యాలయంలోని పురావస్తు విభాగం పెషావరు, స్వాతు లోయలో అనేక ఆవిష్కరణలు చేసారు. ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాల పరిశోధకులు పెషావరు వంటి గాంధార నాగరికత సంబంధిత అనేక ప్రదేశాలలో తవ్వకాలు చేస్తున్నారు.

Taliban destruction of Buddhist relics[మార్చు]

పాకిస్తాన్లోని స్వాతు లోయలో అనేక బౌద్ధ శిల్పాలు, స్థూపాలు ఉన్నాయి. జెహానాబాదులో కూర్చున్న బుద్ధ విగ్రహం ఉంది.[49]

కుషాను శకం తాలిబాను చేసిన రెండు ప్రయత్నాల తరువాత స్వాతు లోయలోని బౌద్ధ స్థూపాలు, విగ్రహాలు కూల్చివేయబడ్డాయి, జెహానాబాదు బుద్ధుని ముఖం డైనమైటుతో విధ్వశం చేయబడింది.[50][51][52] తాలిబాను దాడి చేసిన మంగ్లోరుకు సమీపంలో ఉన్న స్వాతులోని బృహత్తర బుద్ధ విగ్రహాల కంటే బామియను బౌద్ధవిగ్రహం మాత్రమే పెద్దది.[53] బుద్ధుడిని నాశనం చేయడానికి ప్రారంభ ప్రయత్నాల తరువాత విగ్రహాన్ని రక్షించడానికి ప్రభుత్వం ఏమీ చేయలేదు. విగ్రహం మీద రెండవ దాడి జరిపి పాదాలు, భుజాలు, ముఖం పడగొట్టబడ్డాయి.[54] తాలిబాను, దోపిడీదారులు వంటి ఇస్లాంవాదులు బౌద్ధ గాంధార నాగరికతకు చెందిన పాకిస్తానులోని అనేక బౌద్ధ కళాఖండాలను (ముఖ్యంగా స్వాతు లోయలోనివి) నాశనం చేశారు.[55] తాలిబాను ఉద్దేశపూర్వకంగా గాంధార బౌద్ధ అవశేషాలను లక్ష్యం చేసుకుని విధ్వంసం కార్యక్రమాలు చేపట్టింది.[56] లాహోరు క్రిస్టియను ఆర్చి బిషపు, లారెన్సు జాన్ సల్దాన్హా, పాకిస్తాను ప్రభుత్వానికి స్వాతు లోయలో తాలిబాను కార్యకలాపాలను ఖండిస్తూ ఒక లేఖ రాశాడు. బుద్ధ విగ్రహాలను నాశనం చేయడం, క్రైస్తవులు, సిక్కులు, హిందువుల మీద వారు చేసిన దాడులతో సహా లేఖలో పేర్కొనబడ్డాయి.[57] గాంధార బౌద్ధ కళాఖండాలను స్మగ్లర్లు చట్టవిరుద్ధంగా దోచుకున్నారు.[58] బుద్ధుడిని మరమ్మతు చేయడంలో ఇటాలియన్ల బృందం సహాయపడింది.[59]

భాష[మార్చు]

ఇప్పటివరకు కనుగొన్న గాంధార బౌద్ధ గ్రంథాల బౌద్ధ, ఆసియా వ్రాతప్రతులు చాలావరకు బిర్చి బెరడు మీద వ్రాయబడ్డాయి. ఇవి జాబితా చేయబడిన బంకమట్టి కుండలలో కనుగొనబడ్డాయి. పాణిని తన అష్టాధ్యాయిలో సంస్కృతంలోని వేద రూపం అలాగే సంస్కృతం తరువాత రూపమైన గాంధారి భాషను పేర్కొన్నారు.

గాంధార భాష ప్రాకృత లేదా "మధ్య ఇండో-ఆర్యను" మాండలికం. దీనిని సాధారణంగా గోంధేరే అని పిలుస్తారు. ఈ భాష ఖరోస్టి లిపిని ఉపయోగించింది. ఇది 4 వ శతాబ్దంలో అదృశ్యం అయింది. ఏదేమైనా ఇండో-ఆర్యను ప్రాకృతాల నుండి పంజాబీ, హింద్కో, కోహిస్తానీ, ఉద్భవించాయి. ఇవి గాంధార, పరిసర ప్రాంతాలలో వాడుకలో ఉన్నాయి. అయినప్పటికీ మధ్య ఆసియా ఇరానియను ఆక్రమణదారులకు మార్గం చూపడంతో పురాతన గాంధార సంస్కృతిలో భాషా మార్పు సంభవించింది.[60]

Buddhism[మార్చు]

Maitreya Bodhisattva, Gautama Buddha, and Avalokiteśvara Bodhisattva. 2nd–3rd century AD, Gandhāra
Bronze statue of Avalokiteśvara Bodhisattva. Fearlessness mudrā. 3rd century AD, Gandhāra

మహాయాన బుద్ధిజం[మార్చు]

కుహాన్ సన్యాసి లోకాకీమా మొట్టమొదటి బౌద్ధ సూత్రాలను చైనాభాషలోకి అనువదించడం ప్రారంభించిన సమయంలో సా.శ. 147 లోనే గాంధార ప్రాంతం నుండి మహాయాన " స్వచ్ఛమైన భూ సూత్రాలు " చైనాకు తీసుకువచ్చారు.[61] మొట్టమొదటి అనువాదం గాంధారి భాష నుండి అనువదించబడినట్లు సాక్ష్యాధారాలు చూపిస్తున్నాయి.[62]" ఆస్తాసహస్రిక ప్రజాపరమిత సూత్రం " వంటి ముఖ్యమైన మహాయాన సూత్రాలను, అలాగే సమాధి అరుదైన ప్రారంభ మహాయాన సూత్రాలు బుద్ధ అకోభ్యా మీద ధ్యానం వంటి అంశాలను లోకాకీమా అనువదించాడు. లోకక్సేమా అనువాదాలు మహాయాన బౌద్ధమతం ప్రారంభ కాలం గురించి అంతరదృష్టిని అందిస్తూనే ఉన్నాయి. ఈ గ్రంథాలు తరచుగా సన్యాసుల పద్ధతులు, అటవీ నివాసం, ధ్యాన ఏకాగ్రత స్థితి విధానాలు కలిగి ఉంటుందని నొక్కి చెబుతుంది:[63]

పాల్ హారిసను మహాయాన సూత్రాల మొట్టమొదటి సంస్కరణలు, సా.శ. 2 వ శతాబ్దం చివరి భాగంలో ఇండో-సిథియను అనువాదకుడు లోకాకీమా చైనీస్లోకి గ్రంథాల అనువాద కార్యక్రమాలు చేపట్టాడు. అదనపు సన్యాస విధానాల కొరకు అడవిలో నివసించడానికి, అన్నింటికంటే మించి లోకకీమా సూత్ర కార్పసులో ధ్యాన శోషణ (సమాధి) స్థితి ఉత్సాహం కలిగిస్తుందని హారిసను సూచించాడు. ధ్యానం, ధ్యాన స్థితి ప్రారంభ మహాయానాలో ఒక ప్రధాన స్థానాన్ని ఆక్రమించినట్లు అనిపిస్తుంది. ఖచ్చితంగా వారి ఆధ్యాత్మిక సామర్థ్యం కారణంగా కానీ వారు తాజా ఙానం, ప్రేరణ కలగడానికి అవకాశం ఇచ్చినందున

క్రీస్తుశకం 1 వ - 2 వ శతాబ్దాలలో కుషాను సామ్రాజ్యకాలంలో గాంధారా ప్రాంతంలో వర్ధిల్లిన మహాసాసక, భికాసు ఆదేశానుసారం మహాయాన దీర్ఘ సుఖవతవ్య సూత్రం సంకలనం చేయబడిందని కొందరు విధ్వాంశులు విశ్వసిస్తున్నారు.[64][65] ఏది ఏమయినప్పటికీ సుదీర్ఘమైన సుఖవతవిహ మహాసగికా-లోకోత్తరవాద శాఖకు, దాని సంకలనం, ఈ సూత్రంలో లోకోత్తరవాద మహావస్తుతో సమానంగా అనేక అంశాలు ఉన్నాయి.[64] కుషాను కాలంలో గాంధారాలో నిర్మించిన బోధిసత్వులు అవలోకితేశ్వర, మహాస్తంప్రప్తాతో అమితాభా బుద్ధుని చిత్రాలు కూడా ఉన్నాయి.[66]

వాయవ్యంలో మహాయాన ప్రఙాపరామిత బోధనల స్థాపనకు కుషాను సామ్రాజ్యానికి చెందిన కనిష్కుడు అధ్యక్షత వహించినట్లు మాజురామలకల్పాలో పేర్కొనబడింది.[67] కనిష్కా సమయంలో ఈ ప్రాంతంలో జలంధ్రా ఆశ్రమంలో నిర్వహించబడిన సమావేశానికి 500 మంది బోధిసత్వులు హాజరయ్యారని ఈ కాలంలో వాయవ్య దిశలో మహాయానకు కొంత సంస్థాగత బలాన్ని సూచిస్తున్నారని టెరనాథ రాశారు.[67] కుషాను కాలంలో ప్రజాపరామిత వాయవ్య దిశలో గొప్ప విజయాన్ని సాధించిందని, ప్రారంభ మహాయాన "కోట, కేంద్రం" అయి ఉండవచ్చు. కానీ దాని మూలం కాదు. ఆయన బౌద్ధమతం మహాసికా శాఖతో సంబంధం కలిగి ఉన్నాడు.[68]

Buddhist translators[మార్చు]

హాన్ రాజవంశం (క్రీ.పూ. 202 - సా.శ. 220) గాంధార బౌద్ధ మిషనరీల మధ్య ఆసియాకు చెందిన ఇతర సన్యాసులతో సా.శ. 2 వ శతాబ్దం నుండి చైనా రాజధాని లుయోయాంగు వద్ద చైతన్యవంతంగా పనిచేసారు.ప్రత్యేకంగా వారు వారి అనువాద రచనల ద్వారా తమ ప్రత్యేకతను చాటుకున్నారు. వారు ప్రారంభ బౌద్ధ విద్యాలయాల నుండి మహాయాన నుండి వచ్చిన గ్రంథాలను ప్రోత్సహించారు. ఈ అనువాదకులు:

  • మహాయాన గ్రంథాలను చైనీస్లోకి అనువదించిన మొదటివాడు లోకకీమా (ఒక కుషాను) (167–186)
  • జియో యావో (ఒకవేళ కుషాను సన్యాసి, లోకాకీమా తరువాత రెండవ తరం అనువాదకుడు.
  • జియో కియాన్ (220-252) (కుషాను సన్యాసి) ఆయన తాత 168-190 సమయంలో చైనాలో స్థిరపడ్డారు.
  • జియో యు (ససెలు: 230) లో నాంజింగు వద్ద పనిచేసిన కుషాను సన్యాసి.
  • ధర్మరాక్య (265-313), కుషాను కుటుంబం డన్హువాంగు వద్ద తరతరాలుగా నివసించింది.
  • జనగుప్తా (561–592), గాంధారా సన్యాసి, అనువాదకుడు.
  • షికానంద (652–710), ఓషియానా, గాంధార నుండి సన్యాసి, అనువాదకుడు.
  • ప్రఙా జపాను కోకైని సంస్కృత లిపితో విద్యాభ్యాసం చేసిన కాబూలు సన్యాసి, అనువాదకుడు.

Textual finds[మార్చు]

చైనా బౌద్ధ సన్యాసి జువాన్జాంగు 7 వ శతాబ్దంలో ఆఫ్ఘనిస్తానులోని బామియను వద్ద ఉన్న లోకోత్తరవాద ఆశ్రమాన్ని సందర్శించాడు. ఈ మఠం స్థలాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు తిరిగి కనుగొన్నారు.[69] ఈ ఆశ్రమ సేకరణలోని మహాయనా సూత్రాలతో సహా బిర్చిబార్కు తాళపత్ర వ్రాతప్రతులు ఈ ప్రదేశంలో కనుగొనబడ్డాయి. ఇవి ఇప్పుడు షాయెను సేకరణలలో ఉన్నాయి. కొన్ని వ్రాతప్రతులు గాంధారి భాషలో, ఖరోహు లిపిలో ఉన్నాయి. మరికొన్ని సంస్కృతంలో, గుప్తా లిపి రూపాల్లో వ్రాయబడ్డాయి. ఈ ఆశ్రమ సేకరణ నుండి బయటపడిన వ్రాతప్రతులు, శకలాలు ఈ క్రింది మూల గ్రంథాలను కలిగి ఉన్నాయి:[69]

  • మహాసాగికా-లోకోత్తరవాద ప్రతిమోక విభగ (ఎం.ఎస్. 2382/269)
  • మహాపరినిర్వాన సూత్ర, అగామాసు నుండి ఒక సూత్రం (ఎం.ఎస్. 2179/44)
  • కాగా సూత్రా, అగామాసు (MS 2376) నుండి వచ్చిన ఒక సూత్రం
  • వజ్రాచెడికా ప్రఙాపరమిత సూత్ర, ఒక మహాయాన సూత్రం (ఎం.ఎస్. 2385)
  • భైజజ్యగురు సూత్ర, ఒక మహాయాన సూత్రం (ఎం.ఎస్. 2385)
  • శ్రీమలదేవి సింహానంద సూత్ర, మహావీరసూత్ర (ఎం.ఎస్. 2378)
  • ప్రవీణసూత్ర, మహాయాన సూత్రం (ఎం.ఎస్. 2378)
  • సర్వధర్మప్రవృత్తినిర్దేశ సూత్ర, ఒక మహాయాన సూత్రం (MS 2378)
  • అజతశత్రుకాకత్యవినోదన సూత్ర, ఒక మహాయాన సూత్రం (ఎం.ఎస్. 2378)
  • సారిపుత్ర అభిధర్మ ఆస్ట్రా (ఎంఎస్ 2375/08)

పాకిస్తాన్లోని గిల్గిటు వద్ద ఉన్న గంధారాలో " ఔషధ బుద్ధుని " ప్రజాదరణను ధ్రువీకరిస్తూ, భాజజయగురువైరుర్వ్యప్రజారజ సూత్రం సంస్కృత వ్రాతప్రతి ఉంది.[70] ఈ అన్వేషణలోని వ్రాతప్రతులు 7 వ శతాబ్దానికి పూర్వం నాటివి. ఇవి గుప్తా లిపిలో వ్రాయబడ్డాయి.[70]

కళలు[మార్చు]

Greco-Buddhist Portraits from the site of Hadda, Gandhara, 3rd century, Guimet Museum

గాంధార విలక్షణమైన గాంధారా బౌద్ధ కళాశైలికి ప్రసిద్ధి చెందింది. ఇది పార్థియను, సిథియను, రోమన్, గ్రేకో-బాక్ట్రియను, గంగాలోయ నుండి స్థానిక భారతీయ కళాప్రభావాలను ప్రతిబింభిస్తుంది.[71] పార్థియను కాలంలో (క్రీ.పూ. 50 - సా.శ. 75) ఈ అభివృద్ధి ప్రారంభమైంది. 1 వ - 5 వ శతాబ్దం వరకు కుషాను కాలంలో గాంధార శైలి అభివృద్ధి చెందింది. 5 వ శతాబ్దంలో వైటు హన్సు దాడి తరువాత నాశనం చేయబడింది. సిద్ధార్థను బెజ్వెల్డు యువరాజుగా (సిద్ధార్థ ప్యాలెస్ జీవితాన్ని త్యజించే ముందు) ఒక సాధారణ మూలాంశంలో చూపించారు.[72] గాంధార శిల్పులు సన్యాసుల, మత భవనాల అలంకరణ కోసం స్టుక్కో, అలాగే రాయిని విస్తృతంగా ఉపయోగించారు.[72] స్టక్కో కళాకారుడికి గొప్ప ప్లాస్టిసిటీ మాధ్యమాన్ని అందించింది. శిల్పకళకు అధిక స్థాయి వ్యక్తీకరణను అందించడానికి వీలు కల్పించింది. గాంధారా - ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, భారతదేశం, మధ్య ఆసియా, చైనా నుండి బౌద్ధమతం వ్యాపించిన చోట గార శిల్పం ప్రాచుర్యం పొందింది.

బౌద్ధ చిత్రాలు హెలెనిస్టికు ప్రపంచంలోని సంస్కృతుల కొన్ని కళాత్మక అంశాలతో కలిపి ఉన్నాయి. అపోలో శాసనాల మాదిరిగానే ఉంగరాల జుట్టు యవ్వన బుద్ధుడు ఒక ఉదాహరణ.[72]

మూలాలు[మార్చు]

  1. Neelis, Early Buddhist Transmission and Trade Networks 2010, p. 232.
  2. Eggermont, Alexander's Campaigns in Sind and Baluchistan 1975, pp. 175–177.
  3. Badian, Ernst (1987), "Alexander at Peucelaotis", The Classical Quarterly, 37 (1): 117–128, doi:10.1017/S0009838800031712, JSTOR 639350
  4. 4.0 4.1 Higham, Charles (2014), Encyclopedia of Ancient Asian Civilizations, Infobase Publishing, pp. 209–, ISBN 978-1-4381-0996-1
  5. 5.0 5.1 Khoinaijam Rita Devi (1 జనవరి 2007). History of ancient India: on the basis of Buddhist literature. Akansha Publishing House. ISBN 978-81-8370-086-3.
  6. 6.0 6.1 "Rigveda 1.126:7, English translation by Ralph TH Griffith".
  7. Arthur Anthony Macdonell (1997). A History of Sanskrit Literature. Motilal Banarsidass. pp. 130–. ISBN 978-81-208-0095-3.
  8. "UW Press: Ancient Buddhist Scrolls from Gandhara". Retrieved April 2018.
    • Schmidt, Karl J. (1995). An Atlas and Survey of South Asian History, p.120: "In addition to being a center of religion for Buddhists, as well as Hindus, Taxila was a thriving center for art, culture, and learning."
    • Srinivasan, Doris Meth (2008). "Hindu Deities in Gandharan art," in Gandhara, The Buddhist Heritage of Pakistan: Legends, Monasteries, and Paradise, pp.130-143: "Gandhara was not cut off from the heartland of early Hinduism in the Gangetic Valley. The two regions shared cultural and political connections and trade relations and this facilitated the adoption and exchange of religious ideas. [...] It is during the Kushan Era that a flowering of religious imagery occurred. [...] Gandhara often introduced its own idiosyncratic expression upon the Buddhist and Hindu imagery it had initially come in contact with."
    • Blurton, T. Richard (1993). Hindu Art, Harvard University Press: "The earliest figures of Shiva which show him in purely human form come from the area of ancient Gandhara" (p.84) and "Coins from Gandhara of the first century BC show Lakshmi [...] four-armed, on a lotus." (p.176)
  9. Kurt A. Behrendt (2007), The Art of Gandhara in the Metropolitan Museum of Art, pp.4-5,91
  10. Mohiuddin, Yasmeen Niaz (2007). Pakistan: A Global Studies Handbook (in ఇంగ్లీష్). ABC-CLIO. ISBN 9781851098019.
  11. Kalhana Rajatarangini referred to them as simply Shahi and inscriptions refer to them as sahi.(Wink, pg 125)
  12. Al Biruni refers to the subsequent rulers as "Brahman kings"; however, most other references such as Kalahan refer to them as kshatriyas. (Wink, pg 125)
  13. Kabul Shahi
  14. Some sounds are omitted in the writing of Old Persian, and are shown with a raised letter.Old Persian p.164Old Persian p.13. In particular Old Persian nasals such as "n" were omitted in writing before consonants Old Persian p.17Old Persian p.25
  15. 16.0 16.1 Perfrancesco Callieri, INDIA ii. Historical Geography, Encyclopaedia Iranica, 15 December 2004.
  16. Herodotus Book III, 89-95[permanent dead link]
  17. Thomas Watters (1904). "On Yuan Chwang's travels in India, 629–645 A.D." Royal Asiatic Society. p. 200. Taken as Gandhavat the name is explained as meaning hsiang-hsing or "scent-action" from the word gandha which means scent, small, perfume. At the Internet Archive.
  18. Adrian Room (1997). Placenames of the World. McFarland. ISBN 9780786418145. Kandahar. City, south central Afghanistan At Google Books.
  19. Macdonell, Arthur Anthony; Keith, Arthur Berriedale (1995). Vedic Index of Names and Subjects. Vol. 1. Motilal Banarsidass Publishers. p. 219. ISBN 9788120813328. At Google Books.
  20. http://www.livius.org/articles/place/gandara/?
  21. Herodotus (1920). "3.102.1". Histories. "4.44.2". Histories (in Greek). With an English translation by A. D. Godley.{{cite book}}: CS1 maint: others (link) CS1 maint: unrecognized language (link) "3.102.1". Histories. "4.44.2". Histories. Cambridge: Harvard University Press. At the Perseus Project.
  22. "The Book Of Duarte Barbosa Vol. 1". Internet Archive. p. 136, footnote 2.{{cite web}}: CS1 maint: others (link)
  23. https://archive.org/details/catalogueofcoins01lahoiala
  24. Eggermont, Pierre Herman Leonard (1975), Alexander's Campaigns in Sind and Baluchistan and the Siege of the Brahmin Town of Harmatelia, Peeters Publishers, pp. 175–177, ISBN 978-90-6186-037-2
  25. H. C. Raychaudhuri, Political History of Ancient India (1996), p.77
  26. UNESCO World Heritage Centre: Taxila
  27. O. Bopearachchi, “Premières frappes locales de l’Inde du Nord-Ouest: nouvelles données,” in Trésors d’Orient: Mélanges offerts à Rika Gyselen, Fig. 1 CNG Coins Archived 2019-12-25 at the Wayback Machine
  28. Bopearachchi, Osmund. Coin Production and Circulation in Central Asia and North-West India (Before and after Alexander's Conquest) (in ఇంగ్లీష్). pp. 300–301.
  29. "US Department of Defense". Archived from the original on 10 జూన్ 2020. Retrieved 27 ఆగస్టు 2019.
  30. Errington, Elizabeth; Trust, Ancient India and Iran; Museum, Fitzwilliam (1992). The Crossroads of Asia: transformation in image and symbol in the art of ancient Afghanistan and Pakistan (in ఇంగ్లీష్). Ancient India and Iran Trust. pp. 57–59. ISBN 9780951839911.
  31. Bopearachchi, Osmund. Coin Production and Circulation in Central Asia and North-West India (Before and after Alexander's Conquest) (in ఇంగ్లీష్). pp. 308–.
  32. Histories, epigraphy and authority: Achaemenid and indigenous control in Pakistan in the 1st millennium BC [1][permanent dead link]
  33. Rafi U. Samad, The Grandeur of Gandhara: The Ancient Buddhist Civilization of the Swat, Peshawar, Kabul and Indus Valleys. Algora Publishing, 2011, p. 32 ISBN 0875868592
  34. Marshall, John (1975) [1951]. Taxila: Volume I. Delhi: Motilal Banarsidass. pp. 83.
  35. Mukerjee, R. K. History and Culture of Indian People, The Age of Imperial Unity, Foreign Invasion. p. 46.
  36. Curtius in McCrindle, p. 192, J. W. McCrindle; History of Punjab, Vol I, 1997, p 229, Punjabi University, Patiala (editors): Fauja Singh, L. M. Joshi; Kambojas Through the Ages, 2005, p. 134, Kirpal Singh.
  37. "Alexanders Empire – History of Ancient Pakistan". Archived from the original on 27 జూన్ 2015. Retrieved 27 ఆగస్టు 2019.
  38. Revue des etudes grecques 1973, p 131, Ch-Em Ruelle, Association pour l'encouragement des etudes grecques en France.
  39. Early Indian Economic History, 1973, pp 237, 324, Rajaram Narayan Saletore.
  40. Myths of the Dog-man, 199, p 119, David Gordon White; Journal of the Oriental Institute, 1919, p 200; Journal of Indian Museums, 1973, p 2, Museums Association of India; The Pāradas: A Study in Their Coinage and History, 1972, p 52, Dr B. N. Mukherjee – Pāradas; Journal of the Department of Sanskrit, 1989, p 50, Rabindra Bharati University, Dept. of Sanskrit- Sanskrit literature; The Journal of Academy of Indian Numismatics & Sigillography, 1988, p 58, Academy of Indian Numismatics and Sigillography – Numismatics; Cf: Rivers of Life: Or Sources and Streams of the Faiths of Man in All Lands, 2002, p 114, J. G. R. Forlong.
  41. Journal of the Oriental Institute, 1919, p 265, Oriental Institute (Vadodara, India) – Oriental studies; For Kuru-Kamboja connections, see Dr Chandra Chakraberty's views in: Literary history of ancient India in relation to its racial and linguistic affiliations, pp 14,37, Vedas; The Racial History of India, 1944, p 153, Chandra Chakraberty – Ethnology; Paradise of Gods, 1966, p 330, Qamarud Din Ahmed – Pakistan.
  42. Ancient India, History of India for 1000 years, four Volumes, Vol I, 1938, pp 38, 98 Dr T. L. Shah.
  43. Rowland, Benjamin 1945 'Ganhdara and Early Christian Art: Buddha Palliatus', American Journal of Archaeology 49.4, 445–8 [2]
  44. Bracey, R 'Pilgrims Progress' Brief Guide to Kushan History Archived 2019-04-12 at the Wayback Machine
  45. Grousset, Rene (1970). The Empire of the Steppes. Rutgers University Press. pp. 69–71. ISBN 0-8135-1304-9.
  46. Alberuni's India. (సుమారు 1030 AD). Translated and annotated by Edward C. Sachau in two volumes. Kegana Paul, Trench, Trübner, London. (1910). Vol. I, p. 22.
  47. 48.0 48.1 Henry Walter Bellow. The races of Afghanistan Being a brief account of the principal nations inhabiting that country. Asian Educational services. p. 73.
  48. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 19 అక్టోబరు 2017. Retrieved 29 ఆగస్టు 2019.
  49. Malala Yousafzai (8 అక్టోబరు 2013). I Am Malala: The Girl Who Stood Up for Education and Was Shot by the Taliban. Little, Brown. pp. 123–124. ISBN 978-0-316-32241-6.
  50. Wijewardena, W.A. (17 ఫిబ్రవరి 2014). "'I am Malala': But then, we all are Malalas, aren't we?". Daily FT.
  51. Wijewardena, W.A (17 ఫిబ్రవరి 2014). "'I am Malala': But Then, We All Are Malalas, Aren't We?". Colombo Telegraph.
  52. "Attack on giant Pakistan Buddha". BBC NEWS. 12 సెప్టెంబరు 2007.
  53. "Another attack on the giant Buddha of Swat". AsiaNews.it. 10 నవంబరు 2007.
  54. "Taliban and traffickers destroying Pakistan's Buddhist heritage". AsiaNews.it. 22 అక్టోబరు 2012.
  55. "Taliban trying to destroy Buddhist art from the Gandhara period". AsiaNews.it. 27 నవంబరు 2009.
  56. Felix, Qaiser (21 ఏప్రిల్ 2009). "Archbishop of Lahore: Sharia in the Swat Valley is contrary to Pakistan's founding principles". AsiaNews.it.
  57. Rizvi, Jaffer (6 జూలై 2012). "Pakistan police foil huge artefact smuggling attempt". BBC News.
  58. Khaliq, Fazal (7 నవంబరు 2016). "Iconic Buddha in Swat valley restored after nine years when Taliban defaced it". DAWN.
  59. "Khaljies are Afghan". Abdul Hai Habibi. alamahabibi.com. Retrieved 19 ఆగస్టు 2012.
  60. "The Korean Buddhist Canon: A Descriptive Catalog (T. 361)".
  61. Mukherjee, Bratindra Nath. India in Early Central Asia. 1996. p. 15
  62. Williams, Paul. Mahāyāna Buddhism: The Doctrinal Foundations. 2008. p. 30
  63. 64.0 64.1 Nakamura, Hajime. Indian Buddhism: A Survey With Biographical Notes. 1999. p. 205
  64. Williams, Paul. Mahāyāna Buddhism: The Doctrinal Foundations. 2008. p. 239
  65. "Gandharan Sculptural Style: The Buddha Image". Archived from the original on 18 డిసెంబరు 2014. Retrieved 7 ఫిబ్రవరి 2016.
  66. 67.0 67.1 Ray, Reginald. Buddhist Saints in India: A Study in Buddhist Values and Orientations. 1999. p. 410
  67. Ray, Reginald. Buddhist Saints in India: A Study in Buddhist Values and Orientations. 1999. p. 426
  68. 69.0 69.1 "Schøyen Collection: Buddhism". Archived from the original on 10 జూన్ 2012. Retrieved 23 జూన్ 2012.
  69. 70.0 70.1 Bakshi, S.R. Kashmir: History and People. 1998. p. 194
  70. Behrendt, Kurt (2011). Gandharan Buddhism: Archaeology, Art, and Texts. UBC Press. p. 241. ISBN 978-0774841283. Retrieved 16 ఆగస్టు 2019.
  71. 72.0 72.1 72.2 "Buddhism and Buddhist Art".


ఉల్లేఖన లోపం: "note" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="note"/> ట్యాగు కనబడలేదు

"https://te.wikipedia.org/w/index.php?title=గాంధార&oldid=3839383" నుండి వెలికితీశారు