కిరాతరాజ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంస్కృత సాహిత్యంలోని హిందూ పురాణాలలో కిరాతరాజ్యం (కిరాత) అంటే హిమాలయాలలో (ఎక్కువగా తూర్పు హిమాలయ) నివసించే కిరాతప్రజల రాజ్యం. పర్వతాలు (పర్వతారోహకులు), ఇతర హిమాలయ తెగలతో వారు కురుక్షేత్రయుద్ధంలో పాల్గొన్నారు. నేపాలు, భూటాన్ లోని హిమాలయాల లోయలలో, భారతదేశంలోని హిమాచల ప్రదేశు, ఉత్తరాఖండు, ఉత్తర ప్రదేశు, బీహారు, పశ్చిమ బెంగాలు, డార్జిలింగు (పశ్చిమ బెంగాలు), సిక్కిం అస్సాం, త్రిపురలలో పాకిస్తాన్ పశ్చిమ పర్వత ప్రాంతాలలో వీరు విస్తృతంగా వ్యాపించారు. యాలంబరు రాజుచేత కిరాత రాజవంశం స్థాపించబడింది.

మాహాభారతంలో మూలాలు[మార్చు]

(12,206)లో కాంభోజులు, గాంధారులు, బార్బరాలు మొదలైన తెగలుతో ఉత్తరప్రాంతీయ తెగలుగా కిరాతులు పేర్కొనబడ్డారు.

యవనులు, గాంధర్వులు, చినాలు, సవరలు, బార్బరాలు, సాకాలు, తుషారాలు, కంకలు, పఠవులు, ఆంధ్రులు, మద్రాకులు, పౌండ్రులు, పులిందులు, రామాతలు, కాంభోజులు మొదలైన తెగలతో కలిసి కిరాతులు ప్రస్తావించబడ్డారు. వీరు ఆర్యవర్త రాజ్యాలకు మించిన తెగలుగా ఉన్నారు. వీరిని ఆర్యవర్త-రాజులుగా వ్యవహరించడంలో సందేహాలు ఉన్నాయి. (12,64)

మ్లేచ్ఛతెగలుగా కిరాతులు[మార్చు]

పులిందులు, చినాలు, హ్యూణులు, పహ్లవాలు, సాకాలు, యవనులు, సవరలు, పౌడ్రులు, కాంచీలు, ద్రావిడులు, సింహళీయులు, కేరళీయులతో కిరాతులు కూడా ప్రస్తావించబడ్డారు. ఈ తెగలన్నింటినీ మ్లేచ్ఛ తెగలుగా అభివర్ణించారు. విశ్వమిత్రరాజు దాడికి వ్యతిరేకంగా వశిష్ఠఋషి ఆవు రక్షకులుగా కిరాతులు ఉద్భవించారని ఇక్కడ వర్ణించారు. (1,177)

కిరాతుల భూభాగాలు[మార్చు]

కిరాతుల భూభాగాలు హిమాలయ పర్వతప్రాంతాలంతటా వ్యాపించారు.

పురాతన భారతదేశంలో కిరాతుల వైవిధ్యమైన భూభాగాలు[మార్చు]

కిరాతులలో అసంఖ్యాక ముఖ్యులు, వేట ఆయుధాలతో అత్యధికంగా వేట కార్యకలాపాలలో నిమగ్నమయ్యారు. పండ్లు, మూలాలను తినడం, చర్మాలు (జంతువుల చర్మాలు) ధరించి, హిమావతు (టిబెట్టు) ఉత్తర వాలులలో నివసించారని పేర్కొన్నారు. వెనుక నుండి సూర్యుడు ఉదయించే పర్వతం మీద (అరుణాచల ప్రదేశు), సముద్ర తీరంలో కరుషా ప్రాంతంలో (బంగ్లాదేశులోని గంగా ంఖద్వారం, పాకిస్తానులోని సింధు ముఖద్వారం కావచ్చు), లోహిత్య పర్వతాల రెండు వైపులా (తూర్పు అస్సాం, పశ్చిమ అరుణాచల ప్రదేశులో). యుధిష్ఠరుడు తన రాజసూయయాగం సందర్భంగా కప్పం అర్పించినట్లు వారు పేర్కొన్నారు. వారు వారితో చెప్పులు, కలబందను (నల్ల కలబంద), విలువైన చర్మాలు, బంగారం, పరిమళ ద్రవ్యాలు, వారి స్వంత జాతికి చెందిన పదివేల మంది బాలికలు, మారుమూల దేశాల పక్షులు, పర్వతాల నుండి సేకరించిన గొప్పశోభకలిగిన బంగారం (2,51). కైరతలు (కిరాతులు), దారదాలు, దర్వులు, సూరలు, వైమాకులు, ఔదంబరులు, దుర్విభాగాలు, కుమారాలు, పరదాలతో బాహ్లికులు, కాశ్మీరాలు, ఘోరకాలు కూడా ఇక్కడ కానుకలు అర్పించారు.

కిరాతులు వివిధ తెగలను పహ్లావాలు, దారదాలు, యవనులు, సాకాలు, హరహునాలు, చినాలు, తుఖారాలు, సైంధవులు, జగుదలు, రమతలు, ముండాలు, మహిళల రాజ్యం, తంగనాలు మొదలైన తెగలతో ప్రస్తావించారు. కేకాయలు, మాళవులు, కాశ్మిరు నివాసులు కూడా వీరితో ప్రస్తావించబడ్డారు. యుధిష్ఠిరుని స్వాధీనంలో ఉన్నట్లు భావించబడుతుంది. వీరంతా ఆయన రాజభవనంలో వివిధ కార్యాలయాలను నిర్వహిస్తున్నట్లు వారు వర్ణించారు. (3.51)

యుద్ధంలో ఉగ్రమైన హిమావతు పర్వతంలో వేగవంటమైన జీవితం గడిపే కిరాతులను దుర్యోధనుడి (7,4) కోసం కర్ణుడు ఓడించాడు.

హిమాలయ రాజ్యం పులిందరాజ్యం ఆధీనతలో కిరాతులు[మార్చు]

పులిందరాజు కిరాతులను కూడా (2,4) పేర్కొన్నాడు. ఇంద్రప్రస్థలో పాండవ రాజు యుధిష్ఠిర నూతన ఆస్థాన ప్రారంభోత్సవానికి ఆయనతో పాటు ప్రాచీన భారతదేశంలోని అనేకమంది రాజులు (భరత వర్ష) హాజరవుతారు. అతని రాజ్యం టిబెట్టులోని కైలాసపర్వతశ్రేణికి దగ్గరగా ఉంది.

పులిందుల ప్రభువు అయిన సుబాహు రాజు భూభాగం హిమాలయాలలో గుర్రాలు, ఏనుగులతో నిండి ఉంది, కిరాతులు, టాంగాణాలు, వందలాది పులిందాలతో రద్దీగా ఉన్నారు. అన్యదేశ తెగలవారితో అద్భుతాలతో నిండి ఉంటారు. పాండవులు తమ అరణ్యవాసంలో కొంతకాలం హిమాలయ ప్రాంతాలలో (3,140) ఉన్నారు.

అప్పుడు ఆ యోధులందరూ (పాండవులు సమకాలీనులుగా బదరీ (బద్రీనాథు, ఉత్తరాఖండు) వద్ద సంతోషంగా నివసించారు) ఒక మాసకాలం ప్రయాణించి కిరాతుల రాజు సుబాహు రాజ్యం వైపు వెళ్ళారు. యోధులు పాండవులు నడిచిన మార్గం అనుసరించి కష్టతరమైన హిమాలయ ప్రాంతాలను దాటి, చైనా, తుఖారా, దారదా, కులిందా అన్ని వాతావరణాలను దాటి (ఆభరణాలు అధికంగా ధరించారు) ఆ యోధులు సుబాహు రాజధానికి చేరుకున్నారు (3,176).

వారి చివరి గమ్యం యమునా మూలం. అందువల్ల వారు బదరి (బద్రీనాథు) నుండి టిబెట్టు, కాశ్మీరు, చివరికి హిమాచల ప్రదేశు వరకు వృత్తాకార మార్గాన్ని తయారు చేయగలిగారు.

పౌడ్రక వాసుదేవుడి పాలనలో కిరాతులు[మార్చు]

వాసుదేవ కృష్ణునికి శత్రువు అయిన పౌండ్రక వాసుదేవుడు అనే రాజు ఉన్నాడు. ఈ రాజు వాసుదేవ క్రిష్ణుడిలాగా దుస్తులు ధరించి తానే వాసుదేవుడినని చెప్పుకునేవాడు. వంగ (పశ్చిమ బెంగాలు), పౌడ్ర (ఉత్తర-బంగ్లాదేశు), కిరాతులు (2,14) రాజ్యాలను పరిపాలించాలని ఆయన కోరుకున్నాడు. ఇక్కడ పేర్కొన్న కిరాతులు డార్జిలింగు ప్రాంతం వంటి పశ్చిమ బెంగాలు ఉత్తర పర్వతప్రాంతాలలో నివసించేవారు.

భగదత్తుడి పాలనలో కిరాతులు[మార్చు]

కిరాతుల (భూటాను), చినాల ప్రాగ్జ్యోతిషా (అస్సాం) రాజు భగదత్తా (5,19) సైన్యాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సైన్యం కౌరవుల కొరకు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొంది. దాని పరిమాణం ఒక అక్షౌహిని (భారీ ఆర్మీ యూనిటు).

కిరాతులను జయించిన భీముడు[మార్చు]

పాండవరాజు యుధిష్ఠిరుడి రాజసూయ యాగానికి నివాళి సేకరించడానికి తూర్పు దేశాలలో సైనికపోరాటంలో కిరాతరాజులను జయించింది, విదేహ రాజ్యానికి దగ్గరకు చేరుకున్నాడు.

విదేహ రాజ్యం నుండి దండయాత్రకు పంపిన పాండు కుమారుడు భీముడు ఇంద్ర పర్వతం (2,29) గురించి నివసిస్తున్న ఏడుగురు కిరాతరాజులను జయించాడు. వీరిని నేపాలులోని కిరాతులుగా పరిగణించారు.

కిరాతులను జయించిన నకులుడు[మార్చు]

పాండవ రాజు యుధిష్ఠిరుడు రాజసూయ యాగానికి నివాళి అర్పించడానికి పాశ్చాత్య దేశాలలో తన సైనిక పోరాటం సందర్భంగా పశ్చిమపర్వత ప్రాంతంలోని కిరాతులను జయించాడు.

పాండు కుమారుడు నకులా, సముద్ర తీరంలో (కరాచీ ప్రాంతంలో) నివసిస్తున్న భయంకరమైన మ్లేచ్ఛులు, అలాగే పహ్లవులు (ఇరానియను తెగ), కిరాతులు, యవనులు, సాకాలు (2, 31). ఈ కిరాతులు పాకిస్తాను లోని పశ్చిమ పర్వతాలలో నివసించారు.

కురుక్షేత్రయుద్ధంలో కిరాతులు[మార్చు]

కౌరవుల (5,19) పక్షంలో చేరిన ప్రాగ్జ్యోతిష (అస్సాం) రాజు భగదత్తుడి ఒక అక్షౌహినిలో కిరతులు (భూటాను), చినాలు భాగంగా ఉన్నారు.

కౌరవుల భారీ సైన్యంలో (5,198) భాగంగా సాకాలు, పశ్చిమ కిరాతులు, యవనులు, సిబీలు, వాసతీలు కదనరంఘానికి కలిదినట్లు ప్రస్తావించారు. కౌరవుల (6,20) యుద్ధ శ్రేణిలో సాకాలు, కిరాతులు, యవనులు, పహ్లవులు ప్రస్తావించబడ్డారు. అదేవిధంగా మరొక రోజు (6,50) ఏర్పడిన మరొక యుద్ధ శ్రేణిలో అవి ప్రస్తావించబడ్డాయి.

కురుక్షేత్రయుద్ధంలో పాండవుల వైపున ఉన్న యాదవ అధిపతి సాత్యకి మాటలు: - ఇతర కిరాతుల చేత నడుపబడుతున్న కవచాలతో, ఆభరణాలతో అలంకరించబడిన, 700 ఏనుగులను కిరాతుల రాజు గతంలో అర్జునుడికి సమర్పించాడు. వీరు గతంలో యుధిష్ఠిరునికి మేలు చేసేవారు. సమయం తెచ్చే వైవిధ్యాలను చూడండి. ఎందుకంటే ఇవి ఇప్పుడు యుధిష్ఠిరుడికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఆ ఏనుగులను కిరాతులను యుద్ధంలో ఓడించడం కష్టం. వారు ఏనుగుల పోరాడటంలో నైపుణ్యం సాధించారు. అన్నీ అగ్ని నుండి పుట్టుకొచ్చాయి. పూర్వం, అర్జునుడు యుద్ధంలో వారందరినీ ఓడించాడు. వారు ఇప్పుడు దుర్యోధనుడి ఆదేశాల మేరకు జాగ్రత్తగా నాకోసం ఎదురు చూస్తున్నారు. యుద్ధంలో ఓడించడం కష్టమైన ఈ కిరాతులను నా బాణవర్షంతో చంపడంలో నేను అర్జునుడి మార్గంలో అనుసరిస్తాను (7,109).

తుషారాలు, యవనులు, ఖాసాలు, దర్వభీసరలు, దారదాలు, సాకులు, కామతలు, రామథులు, తంగనాలు, ఆంధ్రాకులు (స్పష్టంగా దక్షిణ ఆంధ్రలు కాదు), పులిందులు, భయంకరమైన పరాక్రమం చూపగల కిరాతులు, మ్లేచ్ఛులు, పర్వతారోహకులు , సముద్ర వైపు నుండి వచ్చిన జాతులు కౌరవ రాజు దుర్యోధనుడి ప్రయోజనం కోసం యుద్ధంలో ఐక్యమయ్యాయి. (8,73) కిరాతుల పాలకుడు యుద్ధంలో మరణించాడు (8,5).

కురుక్షేత్రయుద్ధం తరువాత అర్జునుడి విజయాలు[మార్చు]

కురుక్షేత్ర యుద్ధమైదానంలో తమ బంధువులను కోల్పోయినందుకు. యుధిష్ఠరుడి అశ్వమేధ యాగానికి కానుకలు అర్పించడానికి తన సైనికపోరాటం సందర్భంగా అర్జునుడితో పోరాడిన అనేకమంది క్షత్రియరాజుల పిండాలు లెక్కలేనంతగా సమర్పించబడ్డాయి. అసంఖ్యాక కిరాతులు, యవనులు, అద్భుతమైన విలుకాండ్రు, మ్లేచ్ఛులలో విభిన్న తెగలు అంతకుముందు (కురుక్షేత్ర మైదానంలో పాండవులచే) నిరాశకు గురయ్యారు. అనేక మంది ఆర్య రాజులు, సైనికులు, జంతువులను కలిగి ఉన్నవారందరూ యుద్ధంలో అర్జునుడిని ఎదుర్కొన్నారు (14 73). ఆయన అంగాలు, కోసల, కిరాత, తంగనాలతో (14,83) పోరాడాడు.

బ్రాహ్మణరహిత కిరాతులు[మార్చు]

మేకలాలు, ద్రావిడులు, లాతాలు, పౌడ్రులు, కొన్వాసిరాలు, సౌండికాలు, దారదాలు, దర్వాలు, చౌరాలు, సవారలు, వర్వరాలు, కిరాతులు, యవనులు, కంభోజులు, హుణులు, సాకాలు, క్షత్రియుల అనేక ఇతర తెగలు బ్రాహ్మణరహితం కారణంగా శూద్రుల స్థితికి దిగజారిపోయాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]