Jump to content

సత్యవతి (మహాభారతం)

వికీపీడియా నుండి
శంతనుడు సత్యవతి చూసి మోహించే సన్నివేశాన్ని రాజా రవి వర్మ చిత్రించాడు

సత్యవతి, ఆమె వంటినుంచి చేపల వాసన వస్తూండడంతో ఆమెకు మత్స్యగంధి అన్న పేరుండేది. ఈమె ఉపరిచర వసువు వీర్యమున శాపముచే మత్స్యమై యమునానదియందు ఉన్న అద్రిక అను అప్సరసకు జనించెను. మఱియు ఈమెకు యోజనగంధి, మత్స్యగంధి అను నామములు ఉన్నాయి. ఈమె కు పరాశరమహర్షి వలన పెళ్లికాక ముందే కృష్ణద్వైపాయనుని (వ్యాసుని) కనెను.

తరువాత పరాశర మహర్షి అనుగ్రహం వల్ల ఆమె వంటి నుండి చేపల వాసన పోయి సుగంధభరిత వాసన వచ్చునట్టు ఆనుగ్రహించెను.

తరువాత ఆమె సత్యవతి అను నామము న ఉన్న ఈమె కి వ్యాసుడు జన్మించినప్పటికి ని ఆయన పుట్టగానే నమస్కరించి తపస్సు కి హిమాలయాలకు వెళ్ళాడు. కాగా తనకి కన్యత్వం అలానే ఉండునట్టు వరం ఇచ్చి పరాశర మహర్షి వెళ్ళిపోయాడు.. ఆ తరవాత కొంత కాలానికి శంతన మహారాజు అటుగా వచ్చి ఈమె ని చూచి ప్రేమలో పడతాడు కానీ అప్పటికే గంగ దేవి తో వివాహం అయి భీష్ముడు పుట్టి ఉండటం తో వివాహానికి ఒప్పుకోవాలి అంటే భీష్ముడు ని కాక తనకి పుట్టే సంతానం కె పట్టాభిషేకం చెయ్యాలి అని అడుగుత్తుంది సత్యవతి. దానికి శంతనుడు ఏమి మాట్లాడకుండా మౌనం గా వెళ్ళిపోతాడు.. తండ్రి కోరిక తెలుసుకున్న భీష్ముడు తను వెళ్లి సత్యవతి ని కలిసి తాను రాజ్యం కోసం కానీ సింహాసనం కోసం కానీ ఆశించను అని అందుకని తాను ఆజన్మ బ్రహ్మ చారి గా ఉంటాను అని మాట ఇచ్చి వారిద్దరికీ వివాహం జరిపిస్తాడు అలా ఆమె మహాభారతంలో శంతనుడి కి భార్య అయ్యెను. కౌరవ, పాండవులకు మహాపితామహురాలు. శంతనుని భార్య. శంతనుని వలన ఈమె కనిన కొడుకులు చిత్రాంగదుఁడు, విచిత్రవీర్యుఁడు.

వ్యాసుడి జననం

[మార్చు]

ఒకమారు సత్యవతి పడవ నడుపుతుండగా జ్యోతిష్య శాస్త్ర పితామహుడు అయిన పరాశరుడు అనే మహా ఋషి ఆమెను మోహించగా తపసులకు ఇది వలదు అని ఆమె అభ్యంతరపెట్టినా అతను నిగ్రహించుకొనలేకపోయాడు. ఆ ముహూర్తానికి అలా జరిగిపోవాలన్నాడు. ఆమె శరీమంతా అతిలోక పరిమళభరితమయ్యేలాగానూ, ఆమె కన్యాత్వం చెడకుండేలాగానూ వరమిచ్చాడు. అలా వారి సంగమం కారణంగా యమునా నదిలో ఒక ద్వీపంలో ఆమె సద్యోగర్భాన (కన్యాత్వం చెడకుండా) జన్మించిన కొడుకే కృష్ణద్వైపాయనుడు లేదా వ్యాసుడు. ఆ పిల్లవాడు పుట్టగానే పన్నెండేళ్ళ ప్రాయునిగా ఎదిగి, తల్లికి ప్రమాణం చేసి, స్మరించినపుడు వచ్చి దర్శనం చేసుకొంటానని మాట యిచ్చి వెళ్ళిపోయాడు. ముని వరం వలన ఆమె ఎక్కడికి వెళ్ళిందీ ఏమయిందీ ఎవరూ అడుగలేదు. ఆమె శరీరం యోజనం మేర సుంధాలు విరజిమ్ముతున్నందున అమె "యోజనగంధి" అయింది.

శంతనుడితో వివాహం

[మార్చు]

దేవవ్రతుడు (భీష్ముడు, గాంగేయుడు) అనే కుమారుని హస్తినాపురం రాజైన శంతనునికి అప్పగించి గంగ అతనిని విడచిపోయింది. తరువాత యమునాతీరంలో వేటకు వెళ్ళిన శంతనుడు సత్యవతిని చూసి మోహించాడు. తనకిచ్చి పెండ్లి చేయమని ఆమె తండ్రి దాశరాజును కోరాడు. అయితే తన కుమార్తె సంతతికే రాజ్యం కట్టబెట్టేలాగయితేనే రాజుకు తన కుమార్తెనిస్తానని దాశరాజు చెప్పాడు. తండ్రి ద్వారా ఈ సంగతి తెలిసికొన్న దేవవ్రతుడు దాశరాజు వద్దకు వెళ్ళి తాను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని, తను గాని, తన సంతతిగాని రాజ్యం కోసం సత్యవతి సంతానంతో పోటీ పడే సమస్యే రాదని భీషణంగా ప్రతిజ్ఞ చేశాడు. సత్యవతిని తనకు మాతృదేవతగా అనుగ్రహించమని అర్ధించాడు. ఆమెను సగౌరవంగా తోడ్కొని వెళ్ళి తండ్రితో వివాహం జరిపించాడు.

సత్యవతీ, శంతనులకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే బిడ్డలు కలిగారు. శంతనుని మరణానంతరం చిత్రాంగదుడు రాజయ్యాడు కాని ఒక గంధర్వునితో యుద్ధంలో మరణించాడు. తరువాత భీష్ముడు విచిత్రవీర్యుని రాజు చేశాడు. అతనికి కాశీరాజు కుమార్తెలు అంబిక, అంబాలికలనిచ్చి పెండ్లి చేశాడు. కామలాలసుడైన విచిత్రవీర్యుడు కొద్దికాలానికే అనారోగ్యంతో, నిస్సంతుగా మరణించాడు.

దేవరన్యాయం

[మార్చు]

ఇక వంశపరిరక్షణకు వేరే మార్గం లేదని, భీష్ముని పట్టాభిషేకం చేసుకోమని సత్యవతి కోరింది కాని భీష్ముడు ప్రతిజ్ఞా భంగానికి నిరాకరించాడు. దేవర న్యాయం ప్రకారం పెద్దల అనుమతితో ఉత్తములైన బ్రాహ్మణులతో కోడళ్ళకు ఆధానం జరిపి వంశాన్ని కాపాడుకోవచ్చునని సూచించాడు.

అప్పుడు సత్యవతి తన వివాహపూర్వ వృత్తాంతం భీష్మునితో చెప్పింది. తనకే సద్యోగర్భంలో జన్మించిన వ్యాసునితో కోడళ్ళకు ఆధానం జరుపవచ్చునా అని అడిగింది. వ్యాసుని పేరు వినగానే భీష్ముడు ఆమెకు ప్రణామం చేశాడు. తనను కన్న తల్లియైన గంగవలెనే ఆమె కూడా పరమ పవిత్రమూర్తి అన్నాడు. ఆమె కారణంగా తమ వంశం పావనమైందని అన్నాడు. అనంతరం సత్యవతి వ్యాసుని స్మరించి తమ అవసరం తెలియజెప్పింది.

మూలాలు

[మార్చు]

వనరులు

[మార్చు]
  • శ్రీ మదాంధ్ర సంపూర్ణ మహాభారతము - వ్యవహారికాంధ్ర వచనము - రచన: బొమ్మకంటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, కొంపెల్ల వేంకటరామశాస్త్రి - ప్రచురణ: గొల్లపూడి వీరాస్వామి సన్, రాజమండ్రి (2001)