ఆరికట్లవారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆరికట్లవారిపాలెం బాపట్ల జిల్లా జే.పంగులూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంజే.పంగులూరు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08593 Edit this on Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


లువా తప్పిదం: Coordinates not found on Wikidataగ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల[మార్చు]

  1. స్థానిక ఎస్.సి.కాలనీలోని ఈ 37వ నంబరు పాఠశాలకు ఇంకొంత స్థలం అవసరం కాగా, పాఠశాల ప్రక్కనే ఉన్న 3 సెంట్లస్థలం, పాఠశాల పూర్వ విద్యార్థులు వితరణతో సమకూరినది.
  2. ఈ పాఠశాల శతసంవత్సర వేడుకలకు సిద్ధంగా ఉంది.

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. 2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో స్వయంపు ఆంజనేయులు, సర్పంచిగా ఎన్నికైనారు.
  2. ఈ గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం శిథిలమవడంతో, ఎన్.ఆర్.ఇ.జి.ఎస్.నిధులతో, ఒక నూతన భవన నిర్మాణం ప్రారంభించి 4 సంవత్సరలయినది. అయిననూ నిర్మాణం పూర్తి కాలేదు.

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అమరలింగేశ్వరస్వామివారి ఆలయం (శివాలయం)[మార్చు]

గ్రామములో నూతనంగా ఈ ఆలయ నిర్మాణం చేపట్టడానికి 8 లక్షల విలువైన 40 సెంట్ల స్థలాన్ని ఇద్దరు దాతలు వితరణచేసారు. ఈ గ్రామానికి చెందిన కీ.శే.మాగులూరి సీతారామాంజనేయులు ఙాపకార్ధం, వారి సతీమణి కస్తూరి 20 సెంట్లు, కీ.శే.ఏలూరు సుబ్బారావు ఙాపకార్ధం వారి సతీమణి సీతారామమ్మ 20 సెంట్లు స్థలాన్ని అందజేసినారు. దాతల విరాళాలు 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఈ ఆలయ నిర్మాణం జరుగుచున్నది. ఆలయంతోపాటు పార్వతీదేవి అమ్మవారు, గణపతిమూర్తి, నవగ్రహ మండపాల నిర్మాణం చేపట్టినారు. ఆలయం చుట్టూ రక్షణ గోడ నిర్మాణం గూడా నిర్మించుచున్నారు. 2017, మార్చి-13వతేదీ సోమవారంనాడు, స్వామివారు, పరివార దేవతల ఆలయాలకు ప్రధాన ద్వారబంధాల ఏర్పాటు, ఋత్విక్కుల వేదమంత్రాల మధ్య, నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

నవగ్రహ మండపం[మార్చు]

ఈ గ్రామములో, దాత శ్రీ పుల్లెల సుబ్రహ్మణ్యం అందిన ఐదు లక్షల రూపాయల విరాళంతో నిర్మించనున్న ఈ మండప నిర్మాణానికి 2016, నవంబరు-9వ తేదీ బుధవారంనాడు భూమిపూజ నిర్వహించారు.

దాతల విరాళాలు 65 లక్షల రూపాయలతో ఈ ఆలయ నిర్మాణపనులు చురుకుగా జరుగుచున్నవి. పార్వతీదేవి అమ్మవారు, వినాయకస్వామి, నవగ్రహమండప నిర్మాణాలు జరుగుచున్నవి. 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, స్వామివారి ఆలయానికి ముందు, గాలిగోపురం నిర్మించుచున్నారు.

గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం[మార్చు]

గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం:- 2015, సెప్టెంబరు-8వ తేదీ శ్రావణ మంగళవారం సందర్భంగా, ఈ ఆలయంలోని అమ్మవారికి పాలపొంగళ్ళు పొంగించారు. మహిళలు పొంగలి ప్రసాదాలతో మేళతాళాలతో ఊరేగింపుగా గ్రామం నుండి ఆలయానికి చేరుకున్నారు. పసుపు, కుంకుమ, పొంగలి, నూతనవస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. శ్రావణమంగళవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలకరించారు.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు,

గ్రామ ప్రముఖులు[మార్చు]

మగులురి.రమెష్

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]