బిట్రా శ్రీనివాసరావు
Jump to navigation
Jump to search
బిట్రా శ్రీనివాసరావు ప్రముఖ చిత్రకారుడు. ఇతడు 1924లో భట్టిప్రోలు గ్రామంలో బాపయ్య, వెంకమ్మ దంపతులకు జన్మించాడు[1]. ఇతడు ప్రముఖ సినిమా ఆర్ట్ డైరెక్టర్ గొట్టిముక్కల కోటేశ్వరరావు వద్ద చిత్రకళను అభ్యసించాడు. 1951లో భట్టిప్రోలులోని టి.ఎం.రావు ఉన్నత పాఠశాలలో చిత్రకళోపాధ్యాయుడిగా చేరాడు. తరువాత గుంటూరు హిందూ కళాశాల హైస్కూలులో చిత్రకళోపాధ్యాయుడిగా పనిచేశాడు. ఇతడు గాంధేయవాది. ఎప్పుడూ ఖద్దరు వస్త్రాలనే ధరించేవాడు. ఇతడు ఎందరో విద్యార్థులను చిత్రకారులుగా తీర్చిదిద్దాడు. గుంటూరులో అడివి బాపిరాజు పేరు మీద ఉన్న కళాపీఠం పునరుద్ధరణకు తోడ్పడ్డాడు.
ఇతడు వేసిన తైలవర్ణ చిత్రాలు హిందూ కాలేజీలో, విజయవాడ గాంధీ కొండమీది మ్యూజియమ్లో ఉన్నాయి. ఇతడు చిత్రించిన కొన్ని తైలవర్ణ చిత్రాలు:
- సరస్వతి
- కోదండరాముడు
- గీతోపదేశం
- పొట్టి శ్రీరాములు
- గాంధి
- నెహ్రూ
- ఆంధ్రకేసరి
- జిల్లెలమూడి అమ్మ మొదలైనవి.
సన్మానాలు[మార్చు]
- 1956లో కొల్లిపర గ్రామంలో నీలం సంజీవరెడ్డిచే సన్మానం.
- 1961లో గుంటూరులో కాశీ కృష్ణమాచార్యుల పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు చేతుల మీదుగా సన్మానం.
- 1970లో విజయవాడ గాంధీ కొండపై రాష్ట్రపతి వి.వి.గిరి చేత సన్మానం.
మూలాలు[మార్చు]
- ↑ బోనేపల్లి, మురళి (15 June 1980). "రూప చిత్రకారుడు శ్రీ బిట్రా శ్రీనివాసరావు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 67, సంచిక 75. Retrieved 26 January 2018.[permanent dead link]