బైబిల్
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
|
భాగం వ్యాసముల క్రమం |
|---|
| యేసు |
| శుద్ధ జననం · క్రూసిఫిక్షన్ · రిసర్రెక్షన్ |
| మూలాలు |
| చర్చి · కొత్త కాన్వెంట్ అపోస్తలులు · సామ్రాజ్యం · గోస్పెల్ · కాలపట్టిక |
| బైబిల్ |
| పాత నిబంధన · కొత్త నిబంధన గ్రంధాలు · బైబిల్ చట్టాలు · అపోక్రైఫా |
| క్రైస్తవ ధర్మం |
| త్రిత్వము · (తండ్రి · కొడుకు · పరిశుద్ధాత్మ) చరిత్ర · ధర్మం · అపోలాజిటిక్స్ |
| చరిత్ర మరియు సాంప్రదాయాలు |
| ప్రథమ · సంఘాలు · వర్గలు · మిషనరీలు తూర్పు పశ్చిమ సంబంధాలు · క్రుసేడులు · ఉద్ధారణలు |
| తెగలు |
| క్రైస్తవ మత విషయాలు |
| బోధన · ప్రార్థన · ఎక్యూమెనిజం ఇతర మతాలతో సంబంధాలు · ఉద్యమాలు సంగీతం · లిటర్జీ · కేలండరు చిహ్నాలు · కళలు · విమర్శ |
|
|
బైబిల్ క్రైస్తవ మతం యొక్క పవిత్ర గ్రంథం. క్రైస్తవులు ఇందులో దేవుని పలుకులు ఉన్నాయని భావిస్తారు. బైబిలుకు అనేక పేర్లు ఉన్నాయి. కొందరు పవిత్ర గ్రంథమని, పవిత్ర నిబంధనమని లేదా పరిశుద్ధ గ్రంథమని పిలుస్తారు. బైబిలు మొదట హీబ్రూ, ఆరామిక్ మరియు గ్రీకు భాషలలో రాయబడింది. ఆ తరువాత లాటిన్ ఇంకా తదితర భాషలలోకి అనువదించబడింది. ఇప్పుడు బైబిల్ 2000 కు పైగా భాషలలోకి అనువదించబడింది.
బైబిలు అనే పదం గ్రీకు భాషలోని బిబ్లియోన్ అనే పదానికి బహువచన రూపమైన "బిబ్లియ" నుండి వచ్చింది. బైబిల్లో రెండు భాగాలున్నాయి. పాత నిబంధన లో 39,కొత్త నిబంధన లో 27 కలిపి మొత్తం బైబిల్లో 66 పుస్తకాలున్నాయి. బై బిలు వ్రాయడానికి 1400 సంవత్సరాలు పట్టినది. సుమారు క్రీస్తు పూర్వం 1800 సంవత్సరం లో, అనగ వేద కాలం ఆరంభంలో బైబిలు రచించుట మొదలైనది. నలబై మంది ప్రవక్తలు, వివిధ కాలాల్లో ఈ మహా గ్రంధాన్ని రచించారు.
విషయ సూచిక |
పాత నిబంధన [మార్చు]
బైబిల్లోని మొదటి భాగాన్ని పాత నిబంధన గ్రంథం అని అంటారు.ఇందులో ఇశ్రాయేలీయుల యూదుల కథలు ఆజ్ఞలు సామెతలు కీర్తనలు మరియు దేవుడు వాళ్లను ఎలా ఎంచుకున్నాడో తెలిపే చరిత్ర ఉంటాయి.ఇవన్నీ హెబ్రూ లో రాశారు. 39 పుస్తకాలు ఇవి:
- ఆది కాండము
- నిర్గమ కాండము
- లేవియ కాండము
- సంఖ్యా కాండము
- ద్వితీయోపదేశ కాండము
- యెహూషువ
- న్యాయాధిపతులు
- రూతు
- దానియేలు
- యోనా
- ఆమోసు
- ఎజ్రా
- ఎస్తేరు
- ఓబద్యా
- జెకర్తా
- జెఫన్యా
- నహూము
- మలాకీ
- హొషేయ
- హగ్గయి
- మీకా
- యోవేలు
- యోబు
- యెషయా
- యెహేజ్కేలు
- సమూయేలు
- రాజులు - 1
- రాజులు -2
కొత్త నిబంధన [మార్చు]
రెండవ భాగాన్ని కొత్త నిబంధన గ్రంథం అంటారు. గ్రీకులో యేసుక్రీస్తు జీవితచరిత్రనే నాలుగు సువార్తలుగా నలుగురు రాశారు. అపోస్తలుడైన పౌలు వివిధ సంఘాలకు రాసిన ఉత్తరాలు కూడా ఉన్నాయి.27 పుస్తకాలు ఇవి:
- మత్తయి సువార్త
- మార్కు సువార్త
- లూకా సువార్త
- యోహాను సువార్త
- అపోస్తలుల కార్యములు
- రోమీయులకు పత్రిక
- I కొరంథీయులకు పత్రిక
- II కొరంథీయులకు పత్రిక
- గలతీయులకు పత్రిక
- ఎఫసీయులకు పత్రిక
- ఫిలిప్పీయులకు పత్రిక
- కొలొస్సైయులకు పత్రిక
- I థెస్సలొనీకైయులకు పత్రిక
- II థెస్సలొనీకైయులకు పత్రిక
- I తెమొతికి పత్రిక
- II తెమొతికి పత్రిక
- తీతుకు పత్రిక
- ఫిలేమోనుకు పత్రిక
- హెబ్రీయులకు పత్రిక
- యాకోబు పత్రిక
- I పేతురు పత్రిక
- II పేతురు పత్రిక
- I యోహాను పత్రిక
- II యోహాను పత్రిక
- III యోహాను పత్రిక
- యూదా పత్రిక
- ప్రకటన గ్రంధము
కేథలిక్కు బైబిల్ [మార్చు]
ఇందు లో అదనంగా ఉన్నగ్రంధాలు: 14. వీటిని దైవావేశితంకావనే కారణం చెబుతూ ప్రొటెస్టంటులు అంగీకరించరు.
- మొదటి ఎస్డ్రాసు
- రెండవ ఎస్డ్రాసు
- తోబితు
- యూదితు
- ఎస్తేరు
- సొలోమోను జ్ఞానగ్రంథము
- సిరాకు పుత్రుడైన యేసు జ్ఞానం
- బారూకు
- ముగ్గురు పరిశుద్ధ పిల్లల పాటలు
- సూసన్న చరిత్ర
- బేలు, డ్రాగనుల చరిత్ర
- మనస్సేప్రార్ధన
- మొదటి మక్కబీయులు
- రెండవ మక్కబీయులు
తెలుగులో బైబిలు [మార్చు]
1812లో బైబిలులో కొంత భాగము తెలుగులో ప్రచురితమైంది. 1818లో క్రొత్త నిబంధన గ్రంధము ప్రచురించారు. 1854లో పూర్తి బైబిలును తెలుగులో ప్రచురించారు. 1842లో S.P.G. తెలుగు మిషను కడప జిల్లాలో ఆరంభమైంది. రెవ.విలియమ్ హొవెల్ 1842లోనే ప్రార్ధనల పుస్తకాన్ని, కొంత బైబిలును అనువదించాడు. 1858లో S.P.C.K. వారు మద్రాసులో దీనిని ప్రచురించారు. అంతకు ముందే 1849లో పి.ఆర్.హంట్ 'A Teloogoo translation of the Book of Common Prayer'ను మద్రాసు అమెరికన్ ప్రెస్సులో ప్రచురించాడు. 1880లో మద్రాసు డయోసియన్ కమిటీవారు S.P.C.K. ప్రెస్సులో సామాన్య ప్రార్ధనల పుస్తకాన్ని ప్రచురించారు. కడప, ముత్యాలపాడులలో మిషనరీ కార్యములు నిర్వహించిన రెవ.జాన్ క్లే మంచి తెలుగు పండితుడు. ఆయన ఈ తెలుగు బైబిలును విస్తృతంగా సవరించాడు.
అంతర్జాలంలో తెలుగు బైబిల్ [మార్చు]
సజీవవాహిని సంస్థ తెలుగు బైబిల్ [1] అంతర్జాలంలో అందుబాటులో వుంది.