అందెశ్రీ
Jump to navigation
Jump to search
అందె శ్రీ | |
---|---|
![]() డాక్టర్ అందె శ్రీ | |
జననం | |
వృత్తి | కవి, సినీగేయరచయిత |
అందెశ్రీ (జ. జూలై 18, 1961 రచయిత.[1]
తొలినాళ్ళు[మార్చు]
ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డా. అందెశ్రీ వరంగల్ జిల్లా, జనగాం వద్ద గల రేబర్తి (మద్దూర్ మండలం) అనే గ్రామంలో జన్మించారు. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. ఈయన ఒక అనాథగా పెరిగారు. ఏ విధమయిన చదువూ చదవలేదు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు.
గీత రచన[మార్చు]
ఈయన గొడ్ల కాపరిగా పనిచేసారు. శృంగేరి మఠానికి సంబంధించిన స్వామీ శంకర్ మహారాజ్ ఇతను పాడుతుండగా విని ఇతడిని చేరదీసాడు. రాష్ట్రవ్యాప్తంగా ఈయన పాటలు ప్రసిద్ధం. నారాయణ మూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలున్నాయి. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయరచన చేసారు. ఈయన అశువు కవిత్వం చెప్పటంలో దిట్ట. 2006లో గంగ సినిమాకు గానూ నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన తెలంగాణ మాతృగీతం రచించారు.
సినీ సంభాషణలు[మార్చు]
బతుకమ్మ సినిమా కోసం ఈయన సంభాషణలు కూడా రాసారు.
సినీ పాటల జాబితా[మార్చు]
- జయజయహే తెలంగాణ జననీ జయకేతనం (తెలంగాణ మాతృగీతం)
- పల్లెనీకు వందనములమ్మో
- మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు
- గలగల గజ్జెలబండి
- కొమ్మ చెక్కితే బొమ్మరా...
- జన జాతరలో మన గీతం
- యెల్లిపోతున్నావా తల్లి
- చూడ చక్కని
- ఆవారాగాడు (సినిమా)
పురస్కారాలు, గుర్తింపులు[మార్చు]
- తెలంగాణ ప్రభుత్వము ఈయనను భారత అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ అందుకొనుటకు ప్రతిపాదించినది[2]
- ఎర్ర సముద్రం సినిమా కోసం రచించిన మాయమైపోతుండమ్మా మనిషన్నవాడు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల తెలుగు విషయం రెండో సంవత్సరం సిలబస్ లో చేర్చారు.
- కాకతీయ విశ్వవిద్యాలయం ఈయనకు గౌరవ డాక్టరేట్ అందించింది.
- అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్, వాషింగ్ టన్ డి.సి వారి గౌరవ డాక్టరేట్ తోపాటు లోకకవి అన్న బిరుదునిచ్చి 2014 ఫిబ్రవరి 1లో సన్మానించారు.
- వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారిచే దాశరథి సాహితీ పురస్కారం (2015 ఆగస్టు 14)
- డాక్టర్ రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్ట్ వారిచే జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం (2015 జూలై 5)[3]
- నంది పురస్కారం కూడా అందుకున్నారు.
- మలిదశ తెలంగాణ ఉద్యమంలో కవిగా మహోన్నతమైన పాత్రను నిర్వర్తించాడు. అంతేకాకుండా తెలంగాణ ధూంధాం కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణ 10 జిల్లాల్లోని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని కలిగించాడు.
- అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతాన్ని తెలంగాణ ప్రజలు ముక్కోటి గొంతుకలతో... ఇప్పటికి విద్యాసంస్థలలో, ఇతర ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యక్రమాలలో తెలంగాణ జాతి గీతంగా, ప్రార్థనాగీతంగా పాడుకోవడం విశేషం.
- సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారం (సుందరయ్య విజ్ఞాన కేంద్రం, 2022 అక్టోబరు 15)[4]
మూలాలు[మార్చు]
- ↑ http://www.hindu.com/2007/03/24/stories/2007032421180400.htm
- ↑ http://www.sakshi.com/news/telangana/given-state-government-for-the-list-of-great-awards-167548?pfrom=inside-related-article
- ↑ http://namasthetelangaana.com/News/award-awarded-to-andesri-1-1-442922.aspx Archived 2016-03-05 at the Wayback Machine అందెశ్రీకి రావూరి పురస్కారం ప్రదానం
- ↑ telugu, NT News (2022-10-16). "అందెశ్రీకి సుద్దాల హనుమంతు పురస్కారం ప్రదానం". Namasthe Telangana. Archived from the original on 2022-10-16. Retrieved 2022-10-16.
ఇవి కూడా చూడండి[మార్చు]
