Coordinates: 16°00′10″N 81°01′29″E / 16.002859°N 81.024807°E / 16.002859; 81.024807

ఇస్మాయిల్ బేగ్ పేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇస్మాయిల్ బేగ్ పేట
—  రెవెన్యూయేతర గ్రామం  —
ఇస్మాయిల్ బేగ్ పేట is located in Andhra Pradesh
ఇస్మాయిల్ బేగ్ పేట
ఇస్మాయిల్ బేగ్ పేట
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°00′10″N 81°01′29″E / 16.002859°N 81.024807°E / 16.002859; 81.024807
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521328
ఎస్.టి.డి కోడ్ 08671

ఇస్మాయిల్ బేగ్ పేట కృష్ణా జిల్లా కోడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామస్థులకు తమ గ్రామంలో పోలింగు కేంద్రం లేదు. వీరు వోటు వేయాలంటే, మరో శివారు గ్రామమైన నరసింహాపురం గ్రామానికి 3 కి.మీ. పైగా నడచి వెళ్ళి తమ ఓటు హక్కు వినియోగించుకోవలసి ఉంది. [1]

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కొత్తమాజేరు, అవనిగడ్డ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం 79 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లాపరిషత్ హైస్కూల్, పిట్టల్లంక

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామం, కోడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీరామాలయం[మార్చు]

ఐదు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. ధనుర్మాసంలోనూ, వినాయకచవితి, మొదలగు పర్వదినాలలో గూడా ఈ ఆలయంలో పూజాది కార్యక్రమాలను హిందూసంప్రదాయాల ప్రకారం నిర్వహించుచున్నారు. కార్తీకమాసంలోనూ హరేరామనామ సప్తాహాలు నిర్వహించుచూ గ్రామాన్ని ఆధ్యాత్మకతకు నెలవుగా తీర్చిదిద్దినారు. [2] ఈ పురాతన ఆలయం శిథిలావస్థకు చేరడంతో, ఆలయాన్ని పునర్నిర్మించారు. పునర్నిర్మించిన ఈ ఆలయంలో పునఃప్రతిష్ఠా కార్యక్రమాలను 2016,ఫిబ్రవరి-24వ తేదీ బుధవారం సాయంత్రం, శ్రీ విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, వాస్తుహోమం పూజలతో ప్రారంభించారు. 25వ తేదీ గురువారం ఉదయం 7-52 గంటలకు విగ్రహ పునఃప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి శాంతి కళ్యాణమహోత్సవం నిర్వహించారు. [4] ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవాలలో భాగంగా, 2017,ఫిబ్రవరి-25వతేదీ శనివారంనాడు హరేరామనామ ఏకాహం ప్రారంభించారు. 26వతేదీ ఆదివారంనాడు ముగింపు, హారతి కార్యక్రమాలను నిర్వహించెదరు. [5]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

వరికూటి హనుమంతరావు, సీనియర్ కమ్యూనిస్టు నాయకులు:- ఇతను 89 సంవత్సరాల వయసులో, 2015,ఆగస్టు-21వ తేదీనాడు స్వగృహంలో అనారోగ్యంతో అశువులుబాసినారు. [3]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఏప్రిల్-4; 2వపేజీ. [2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మార్చి-28; 3వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,ఆగస్టు-22; 3వపేజీ. [4] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016,ఫిబ్రవరి-26; 3వపేజీ. [5] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,ఫిబ్రవరి-26; 1వపేజీ.