ఉదయగిరి కోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉదయగిరి కోట

ఉదయగిరి కోట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఉదయగిరి మండలం,ఉదయగిరిలో ఉంది. ఇది నెల్లూరుకు సుమారు వంద మైళ్ల దూరంలో ఉంది.


చరిత్ర[మార్చు]

నెల్లూరు జిల్లాలో వున్న ఈ ఉదయగిరి కోటకు దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. పల్లవులు, చోళులు, విజయనగర రాజులు, రావెళ్ల కమ్మ నాయకులు, ఢిల్లీ సుల్తానులు దీనిని పాలించిరి. విజయనగర రాజుల కాలంలో రావెళ్ల కమ్మ నాయకులు పాలించిరి. చివరకు ఆంగ్లేయులు కూడా ఈ దుర్గాన్ని పాలించినట్లు చారిత్రకాధారాలున్నాయి. చోళుల తర్వాత పల్లవ రాజులు పాలించారని జయదేవుని శాసనాన్ని బట్టి తెలుస్తున్నది. 1235 వ సంవత్సరంలో ఈ ప్రాంతం కాకతీయుల వశమైంది. కరీంనగర్ జిల్లా ఉప్పరపల్లి శాసనం ప్రకారం ఈ దుర్గాన్ని కాకతీయ రాజైన గణపతి దేవుడు పాలించాడని తెలుస్తున్నది. 1343 నాటికి ఈ ప్రాంతాన్ని జయంచాడు. పోరు మామిళ్ల శాసనాన్ని బట్టి కడప మండలమంతా ఉదయగిరి పాలనకింద వున్నట్లు తెలుస్తుంది. 1471 నుండి 1488 వరకు ఈ దుర్గం విజయ నగర రాజుల ఆధీనంలో ఉండేదని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తున్నది. శ్రీకృష్ణదేవరాయలు 1514 వ సంవత్సరంలో జూన్ 9 న ఈ దుర్గాన్ని వశపరచు కున్నాడని చారిత్రకాధారం. 1540 వ సంవత్సరంలో రాయల అల్లుడు అశీయ రామ రాయలు ఉదయగిరి పాలకుడయ్యాడు. 1579 లో గోల్కొండ సేనాని ముల్కు ఉదయగిరిని ముట్టడించారని తెలుస్తున్నది. ఆ విధంగా ఉదయగిరి గోల్కొండ నవాబుల వశమైంది. ఆ తర్వాత ఢిల్లీ చక్రవర్తుల సేనాని మీర్ జుమ్లా దీన్ని 1626 లో వశపరచుకొని అక్కడ అనేక మసీదులను నిర్మించి స్థానికంగా వుండే ఒకరికి ఆదిపత్యాన్నిచ్చి ఢిల్లీ వెళ్లి పోయాడని చరిత్ర చెపుతున్నది. ముస్లిం పాలకులలో చివరగా సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ ఈ దుర్గాన్ని పాలించాడు. అతను వాడిన ఖడ్గం ఈ నాటికీ ఉదయగిరిలో ఉంది. ఆ తర్వాత ఈ దుర్గం ఆంగ్లేయుల వశమైంది. ఆంగ్లేయుల పాలనలో డైకన్ దొర కలెక్టరుగా వున్నప్పుడు రాజ మహల్ సమీపంలో అద్దాల మేడను ఇంకా అనేక భవనాలను నిర్మించాడు. ఇలా అనేక రాజులు పాలించిన ఈ ఉదయగిరి దుర్గంలో ఆయా రాజుల కాలంలో నిర్మించిన అనేక కట్టడాలు ఆలయాలు, మసీదులు ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]