ఎమ్.పీతాంబరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎమ్.పీతాంబరం

ముత్తుధుత పీఠంబరం (ఎం.పి.గా సుపరిచితుడు) తెలుగు సినిమాకు చెందిన ఆహార్య నిపుణుడు.[1] అతను తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి తారక రామారావు, తమిళం సినిమాలలో ఎం.జి.రామచంద్రన్ , నంబియార్‌లకు వ్యక్తిగత మేకప్‌మేన్‌గా వ్యవహరించాడు. పురాణ పురుషుల పాత్రలకు మేకప్‌ వేయడంలో ఆయనకంటూ ప్రత్యేక శైలి ఉంది.[2]

జీవిత విశేషాలు[మార్చు]

ఎం.జి.ఆర్, పీతాంబరం లు చెన్నెలోని ఎలిఫెంట్ గేట్ వద్ద ఇరుగుపొరుగువారు. వారిద్దరి తల్లులు మంచి స్నేహితులు. యువకునిగా ఉన్న పీతాంబరం సంగీతంలోని సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకోవటానికి కె.వి. మహాదేవన్ స్టూడియోలకు వెళ్ళేవాడు. కానీ విధి ఇంకోలా ఉన్నందున అతను కాస్ట్యూమర్ అసిస్టెంట్‌గా మారాడు. జెమినీ స్టూడియోస్ కోసం మేకప్ ఆర్టిస్ట్‌గా హరి బాబును కలకత్తా నుండి దర్శకుడు కె. సుబ్రహ్మణ్యం తీసుకువచ్చినప్పుడు పీతాంబరం జీవితం మలుపు తిరిగింది. పీతాంబరం అతని వద్ద సహాయకుడిగా చేరాడు.

అతను 1945 లో వాహిని స్టుడియోలో చేరాడు. అతను పాతాళ భైరవి సినిమా కోసం 105 ఏళ్ల వ్యక్తిగా ఎస్.వి. రంగారావుకు మేకప్ వేసాడు.

పీతాంబరం ఎలిఫెంట్ గేట్ నుండి పుడుపేటకు, తరువాత ట్రిప్లికేన్‌కు నివాసం మార్చాడు. చివరకు 1960 లో నెం .1, గణేష్ స్ట్రీట్, గోపాలపురం, చెన్నై వద్ద స్థిరపడ్డాడు. అతని కుమారుడు చిత్ర దర్శకుడు పి. వాసు. జెమిని గణేషన్, సావిత్రి, కె.ఆర్. విజయ, రంగారావు, షీలా, షావుకారు జానకి వంటి వారికి మేకప్ ఆర్టిస్టుగా పనిచేసాడు. హిందీ నటులు అశోక్ కుమార్, దిలీప్ కుమార్, ప్రాణ్ లకు మద్రాసులో షూటింగ్ జరిగినప్పుడల్లా అతను వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ గా వారికి పనిచేసేవాడు.

1962లో అతనుఎం.జి.రామచంద్రన్ మొదటి సినిమా "పాసమ్‌" కు మేకప్ ఆర్టిస్టుగా చేరి 1978 లో ఎంజిఆర్ చివరి సినిమా "మదురైయాయ్ మీట సుందర పాడ్యన్" వరకు మేకప్ మ్యాన్ గా కొనసాగాడు. [3] అతను 1947 లో లవకుశ చిత్రం నుండి 1982 లో ఈనాడు వరకు ఎన్టీఆర్ కోసం వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేసాడు.

అతను ఎన్టీఆర్‌ను పురాణ పురుషులుగా మార్చడంలో ఎంతో కృషి చేసిన ఆహార్య నిపుణుడు. అతను శ్రీకృష్ణార్జున విజయం, అగ్గిబరాటా, గుండమ్మ కథ, మిస్సమ్మ, పాతాళ భైరవి, లవకుశ తదితర చిత్రాలకు పనిచేశాడు. చిత్ర నిర్మాణంలోనూ అతనికి అనుభవం ఉంది. ఎన్టీఆర్‌తో అన్నదమ్ముల అనుబంధం, యుగంధర్ చిత్రాల్ని నిర్మించాడు. అలాగే పంభూతాలు చిత్రం ఆయన సంస్థ నుంచి వచ్చినదే. నందమూరి బాలకృష్ణ దర్శకత్వంలో "నర్తనశాల" చిత్రీకరణ ప్రారంభించినప్పుడు పీతాంబరంకి మేకప్‌ బాధ్యతలు అప్పగించాడు. అయితే ఆ సినిమా ఓ షెడ్యూల్‌ తరవాత ఆగిపోయింది. 1980 చిత్రం మురట్టు కలై కోసం నటుడు రజనీకాంత్‌కు కృష్ణుని రూపాన్ని ఇచ్చాడు.[4]


వీరు 90 సంవత్సరాలకు చెన్నైలో 2011 ఫిబ్రవరి 21 తేదీన పరమపదించాడు.[2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

అతని భార్య కమల. అతని కుమారులు విధ్యా సాగర్, వాసు , విమల్. కుమార్తెలు వనజ , విజయలక్ష్మి . అతని కుమారుడు పి.వాసు దక్షిణాదిన సంచలనం సృష్టించిన చంద్రముఖి, నాగవల్లి చిత్రాలకు దర్శకుడు.[4]

మూలాలు[మార్చు]

  1. Sripatisarma, Vedantam (2019-06-06). Southern Glory: About South Indian films among top 100 Indian films listed by CNN-IBN during Indian Film Centenary Year 2013 (in ఇంగ్లీష్). Notion Press. ISBN 978-1-64587-251-1.
  2. 2.0 2.1 HaribabuBolineni 2013-11-13T07:37:13+05:30 (2011-02-22). "NTR's make up man Peethambaram dead!". Chitramala (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-06-23. Retrieved 2020-06-21.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Shivprasadh, S. (2011-03-03). "Man who had the magic touch". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-06-21.
  4. 4.0 4.1 "Peethambaram passes away". Nandamuri Fans Discussion Board (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-06-21. Retrieved 2020-06-21.

బాహ్య లంకెలు[మార్చు]