గద్దె రామ్మోహన్ రావు
| గద్దె రామ్మోహన్ రావు | |||
![]()
| |||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు
| |||
| పదవీ కాలం 1994-1999 | |||
| ముందు | ముసునూరి రత్నబోసు | ||
|---|---|---|---|
| తరువాత | దాసరి వెంకట బాలవర్థన్ రావు | ||
| నియోజకవర్గం | గన్నవరం | ||
| పదవీ కాలం 1999-2004 | |||
| ముందు | పర్వతనేని ఉపేంద్ర | ||
| తరువాత | లగడపాటి రాజగోపాల్ | ||
| నియోజకవర్గం | విజయవాడ | ||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు
| |||
| పదవీ కాలం 2014-2019 | |||
| ముందు | యలమంచిలి రవి | ||
| నియోజకవర్గం | విజయవాడ(తూర్పు) | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1959 జనవరి 9 గన్నవరం, కృష్ణా జిల్లా | ||
| రాజకీయ పార్టీ | తెలుగుదేశం | ||
| జీవిత భాగస్వామి | గద్దె అనూరాధ | ||
| నివాసం | విజయవాడ | ||
గద్దె రామ్మోహన్ రావు కృష్ణా జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు.విజయవాడ లోక్ సభ స్థానం నుంచి 13 వ లోక్ సభకు ఎన్నిక అయినారు. 1999 లో గన్నవరం శాసనసభ నియోజకవర్గం నుంచి, 2014 లో విజయవాడ (తూర్పు) నియోజకవర్గం నుంచి గెలుపొందారు,చాలా మంచి వ్యక్తిగా ఈయనకు పేరుంది.
విశేషాలు
[మార్చు]గద్దె రామమోహన్ 1959, జనవరి 9వ తేదీన కృష్ణాజిల్లా గన్నవరంలో గద్దె సుబ్బయ్య, శ్రీనివాసులమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడు గన్నవరంలోని వి.కె.ఆర్.కాలేజీలో డిగ్రీ చదివాడు. ధార్వాడలోని కర్ణాటక విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి. (మైక్రోబయాలజీ) చదివాడు. 1982లో ఇతని వివాహం అనూరాధతో జరిగింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. ఇతడు వ్యాపారస్థుడు, పారిశ్రామిక వేత్త, సంఘసేవకుడు.[1]
రాజకీయరంగం
[మార్చు]ఇతడు 1994 శాసనసభ ఎన్నికలలో గన్నవరం (కృష్ణా జిల్లా) నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన దాసరి బాలవర్ధనరావుపై పదివేల ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. తరువాత ఇతడు తెలుగుదేశం పార్టీలో చేరాడు. 1999లో విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుండి గెలిచి పార్లమెంటు సభ్యుడైనాడు. తిరిగి వరుసగా 2014, 2019, 2024 లలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికైనాడు.
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Thirteenth Lok Sabha Members Bioprofile". Parliament of India LOK SABHA HOUSE OF THE PEOPLE. Lok Sabha Secretariat. Archived from the original on 3 జూన్ 2020. Retrieved 3 June 2020.
