దీపక్ మిశ్రా

వికీపీడియా నుండి
(జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా
దీపక్ మిశ్రా

న్యూఢిల్లీలో జరిగిన జాతీయ మానవ హక్కుల కమీషన్(NHRC) 24వ వ్యవస్థాపక దినం సందర్భంగా దీపక్ మిశ్రా


45వ భారత ప్రధాన న్యాయమూర్తి
పదవీ కాలం
28 ఆగస్టు 2017 – 02 అక్టోబరు 2018
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌
ముందు జగదీష్ సింగ్ ఖేహార్
తరువాత రంజన్ గొగోయ్

భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
10 అక్టోబరు 2011 – 27 ఆగస్టు 2017
నియమించిన వారు ప్రతిభా పాటిల్

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
పదవీ కాలం
24 మే 2010 – 10 అక్టోబరు 2011
ముందు అజిత్ ప్రకాష్ షా
తరువాత డి. మురుగేశన్

పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
పదవీ కాలం
1 డిసెంబరు 2009 – 23 మే 2010
ముందు ప్రఫుల్ల కుమార్ మిశ్రా
తరువాత రేఖా మన్హర్‌లాల్ దోషిత్

వ్యక్తిగత వివరాలు

జననం (1953-10-03) 1953 అక్టోబరు 3 (వయసు 70)
బంధువులు రంగనాథ్ మిశ్రా(uncle)[1]
పూర్వ విద్యార్థి మధుసూధన్ న్యాయ కళాశాల, కటక్

దీపక్‌ మిశ్రా (జ. 1953 అక్టోబరు 3) భారతదేశ సుప్రీం కోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తి. అతను 2017 ఆగస్టు 28 నుండి 2018 అక్టోబరు 2 వరకు ఆ భాద్యతలను నిర్వర్తించాడు.[2][3] అతను అంతకు పూర్వం సుప్రీం కోర్టులోన్యాయవాదిగాను, పాట్నా, ఢిల్లీ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగాను తన సేవలనందించాడు. అతను 1990 నుండి 1991 వరకు 21వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రంగనాథ్ మిశ్రాకు మేనల్లుడు. [1][4] అతను భారత 44వ ప్రధాన న్యాయమూర్తి జె. ఎస్. ఖేహార్ నుండి ప్రధాన న్యాయమూర్తి భాద్యతలను స్వీకరించాడు.

జీవిత విశేషాలు[మార్చు]

దీపక్ మిశ్రా 1953 అక్టోబరు 3న ఒడిసాలో జన్మించాడు. 1977 ఫిబ్రవరి 14న న్యాయవాదిగా బార్ అసోసియేషన్ లో చేరాడు. ఒడిశా హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. . రాజ్యంగం, సివిల్‌, క్రిమినల్‌, రెవెన్యూ, సేవా, అమ్మకం పన్ను సంబంధిత కేసుల్లో ఒడిసా హైకోర్టు, సర్వీస్‌ ట్రైబ్యునల్‌లో ప్రాక్టీస్‌ చేశారు. 1996లో ఒడిసా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యాడు. అదే ఏడాది మధ్యప్రదేశ్‌ హైకోర్టుకి బదిలీ అయ్యాడు. 1997 డిసెంబరు 19 న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందాడు. 2009 డిసెంబరులో పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి భాద్యతలను స్వీకరించి 2010 మే వరకు పని చేశాడు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. 2011 అక్టోబరు 10 నుండి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాడు. [5][6]

అతను సుప్రీం కోర్టులో 14నెలల పాటు న్యాయవాదిగా కొనసాగిన తరువాత 2017 ఆగస్టు 17 నుండి 45వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. ప్రధాన న్యాయమూర్తిగా 13 నెలల పాటు తన సేవలందించిన అతను 2018 అక్టోబరు 2 న పదవీవిరమణ చేసాడు..[6]

జస్టిస్‌ మిశ్రా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్రా మేనల్లుడు. కావేరి, కృష్ణా జలాల వివాదాలు, బీసీసీఐ సంస్కరణలు, సహారా కేసు తదితర అంశాలను విచారిస్తున్న బెంచ్‌కు నేతృత్వం వహించాడు. నిర్భయ గ్యాంగ్‌ రేప్‌ కేసులో నలుగురు దోషులకు మరణ శిక్షను ఖరారు చేసిన బెంచ్‌కు నేతృత్వం వహించాడు. దేశమంతటా సినిమా థియేటర్లలో ప్రదర్శనకు ముందుకు జాతీయ గీతం వినిపించాలన్న బెంచ్‌లో కూడా ఆయన సభ్యుడు. ముంబై పేలుళ్ల దోషి యాకూబ్‌ మెమెన్‌ పిటీషన్‌పై అర్ధరాత్రి విచారణ చేపట్టి, అతనికి విధించిన ఉరి శిక్షను రద్దు చేయడానికి తిరస్కరించాడు. హైకోర్టు జడ్జి సి.ఎస్.కర్ణన్‌ కు జైలు శిక్ష విధించిన బెంచ్‌లోనూ ఉన్నాడు. పరువు నష్టం కేసును క్రిమినల్‌ కేసుగా పరిగణించకూడదన్న ప్రతిపాదనను తోసిపుచ్చి, వాక్‌ స్వాతంత్య్రం హక్కు అంటే ఇతరుల పరువు తీయడం కాదని స్పష్టం చేసాడు.[7]

ముఖ్యమైన తీర్పులు[మార్చు]

  • ఆన్‌లైన్‌లో ఎఫ్.ఐ.ఆర్: పోలీసు పనితీరును పారదర్శకంగా మలచడానికి 24 గంటల్లో ఎఫ్.ఐ.ఆర్ నమోదును వారి వెబ్‌సైటులో ఉంచాలని ఆదేశించాడు.[8]
  • ప్రమోషన్లో రిజర్వేషన్లపై జస్టిస్ మిశ్రా, జస్టిస్ డాల్వీర్ భండారిలు అలహాబాద్ హైకోర్టు తీర్పును సమర్థించారు. అవసరాన్ని సమర్థించేందుకు సరైన సమాచారం, సాక్ష్యాలు ఉన్నట్లయితే మాత్రమే ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించవచ్చని పేర్కొన్నారు. తగినంత చెల్లుబాటు అయ్యే డేటాను అందించడంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం విఫలమైనందుకు ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని బెంచ్ తిరస్కరించింది.[9][10][11]
  • ముంబై పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష అమలు నిలుపుదల కోసం 2015 జూలై 30న కొందరు హక్కుల న్యాయవాదులు అర్థరాత్రి సుప్రీంకోర్టును సంప్రదించారు. [12] ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీం కోర్టుధర్మాసనం ఈ అభ్యర్థనను త్రోసిపుచ్చింది. [13] కొద్ది గంటల తరువాత మెమన్ ఉరితీయబడ్డాడు. [14]
  • నిర్భయ కేసులో దోషులకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఉరిశిక్షనే ఖాయం చేస్తూ కీలక తీర్పు ఇచ్చింది.[15] తమ ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలంటూ నేరస్తులు వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఇలాంటి వారికి ఉరిశిక్షనే సరి అని తేల్చింది. ఢిల్లీ హైకోర్టు సహా కింది కోర్టులు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ముగ్గురు దోషుల రివ్యూ పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది. కింది కోర్టుల తీర్పును సమర్థిస్తూ 5 మే 2017న సుప్రీం తీర్పు చెప్పింది.[16]
  • 120 సంవత్సరాలుగా కొనసాగుతున్న కావేరీ వివాదానికి అతని సారధ్యంలో సుప్రీంకోర్టు కర్ణాటకకు మరింత ప్రయోజనం కలిగించే విధంగా తీర్పును వెలువరించింది. పుదుచ్చేరి, కేరళ రాష్ర్టాలకు విడుదల చేస్తున్న ఏడు టీఎంసీలు, 30 టీఎంసీల జలాల కేటాయింపులలో ఎలాంటి మార్పు చేయకుండా యధాతథంగా కొనసాగించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా, న్యాయ మూర్తులు ఏఎం కాన్‌విల్కర్‌, అమిత్వ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అంగీకరించింది.[17][18]
  • స్వలింగ సంపర్కంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. పరస్పర సహకారంతో చేసే సంపర్కం ఏమాత్రం తప్పు కాదని.. అసలు స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీం కోర్టు  ధర్మాసనం అభిప్రాయపడింది.. దీనిపై ఐదుగురు సభ్యుల దర్మాసనం తీర్పిచ్చింది. సుదీర్ఘ విచారణ తరువాత ఐ.పి.సి సెక్షన్‌ 377ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ప్రతి ఒక్కరికి హక్కులున్నట్టు స్వలింగ సంపర్కులకు కూడా సమాన హక్కులు ఉంటాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. [19]
  • పద్మావత్‌ చిత్ర విడుదలకు సుప్రీం కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. నిషేధించిన రాష్ట్రాల్లో కూడా విడుదల చేయాల్సిందేనని గురువారం తేల్చి చెప్పింది. ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమాపై విధించిన నిషేదాన్ని సస్పెండ్ చేస్తూ తీర్పు వెలువరించారు. ఈ సుప్రీం తీర‍్పుతో ఈ 2018 జనవరి 25న దేశవ్యాప్తంగా పద్మావత్‌ రిలీజ్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యింది.[20]
  • లవ్ జీహాద్ కేసులో కేరళ యువతి హదియాకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ.. పెళ్లి విషయంలో ఒక స్త్రీగా ఆమె హక్కు ఆమెకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎలా జీవించాలన్నదానిపై ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని తెలిపింది. హదియాకు తన భర్తతో కలిసి జీవించే హక్కు ఉందని చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో జోక‍్యం చేసుకునే అధికారం దిగువ న్యాయస్థానానికి లేదని, కేరళ హైకోర్టు తీర్పు న్యాయ సమ్మతం కాదని.. వారి వివాహం వారి ఇష్టప్రకారం జరిగిందేనని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అంతేకాదు భర్త షఫీన్‌ తో జీవించేందుకు అఖిల అశోకన్ అలియస్ హదియాకు స్వేచ్ఛ ఉందంటూ స్పష్టం చేసింది.[21]
  • వయసొచ్చిన ఇద్దరు వ్యక్తులు.. పెళ్లికి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. పెళ్లీడు వయసొచ్చిన ప్రతి అమ్మాయి, అబ్బాయి వారి వారికి నచ్చిన ఏ వ్యక్తినైనా పెళ్లిచేసుకునే అవకాశం ఉందని, ఈ విషయంలో ఎవరూ కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా తీర్పునిచ్చాడు. ప్రేమించుకున్న నేరానికి ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని, 23 ఏళ్ల హిందు అబ్బాయిని వెస్ట్ ఢిల్లీలో ముస్లిం ప్రేయసి బంధువులు దాడిచేసి చంపేసిన ఘటన పై హర్యానాలోని శక్తివాహిని అనే సంస్థ, కాపు పంచాయత్ గ్రూపు కులాంతర వివాహాలపై సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు వేసారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆ పిటీషన్ పై విచారణ చేసి కులాలు, మతాలు అనేవి పరిగణలోకి తీసుకోవడం లేదని.. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల నిర్ణయమని వ్యాఖ్యానించింది. అందులో మంచి, చెడు గురించి మాత్రం సూచనలు ఇవ్వాలిగానీ.. ఎలాంటి జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. [22][23]
  • దేశంలో పెచ్చరిల్లుతున్న అల్లరిమూకల హింసకు, గోరక్షణ పేరిట దాడులు, కొట్టి చంపడం వంటి దారుణ ఘటనలకు స్వస్తి పలుకాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ దేశపు చట్టాలను కాలరాసే అల్లరి మూకల భయానక చర్యలను, మూకస్వామ్యాన్ని ఇక ఎంతమాత్రం అనుమతించరాదని తేల్చి చెప్పింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనే అల్లరిమూకల ఆగడాలను అరికట్టేందుకు, వారిలో భయాన్ని పాదుకొల్పేందుకు ఒక ప్రత్యేక చట్టం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. దేశంలో కొనసాగుతున్న అల్లరిమూకల సామూహిక హింస, కొట్టి చంపే ఘటనలను అరికట్టేందుకు మార్గదర్శకాలను సూచించాలని కోరుతూ మహాత్మాగాంధీ మనుమడు తుషార్ గాంధీ, కాంగ్రెస్ నేత తెహసీన్ పూనావాలా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. నడి వీధిలో ఎటువంటి దర్యాప్తులు, విచారణలు/ శిక్ష లు అమలు చేయరాదని తేల్చి చెప్పింది. [24][25]
  • ఆధార్ రాజ్యాంగ బద్ధమే కానీ దానికి కొన్ని పరిమితులున్నాయంటూ 2018 సెప్టెంబరు 26 నాడు సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఆధార్ కేసుగా ప్రచారం పొందిన ఈ కేసులో మొట్టమొదట పిటిషిన్ వేసింది జస్టిస్ కేఎస్ పుట్టస్వామి. ఇప్పుడు ఆ యాక్ట్‌లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 19కి వ్యతిరేకంగా ఉన్న రెండు సెక్షన్లను కోర్టు రద్దు చేసింది. [26]
  • 2017 మే 9 న సుప్రీం కోర్టు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి. సి.ఎస్.కర్ణన్[27] ఆరు నెలల జైలుశిక్ష విధించింది. ఈ కేసులో శిక్ష విధించిన ఏడుగురు సీనియర్ న్యాయవాదుల బెంచ్ లో దీపక్ మిశ్రా కూడా ఒకరు.[28]
  • సినిమా థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతాలాపన తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు పేర్కొంది. థియేటర్ల యజమానులు తమ ఇష్టం మేరకు ఈ గీతాన్ని ప్రసారం చేయొచ్చని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన సమయంలో నిలబడటం నుంచి వికలాంగులకు ఇచ్చిన మినహాయింపు అమలులో ఉంటుందని న్యాయస్థానం తెలిపింది. [29][30]
  • అడల్టరీ శిక్షార్హమైన నేరం కాదని సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. వివాహితుడైన వ్యక్తి, వివాహం చేసుకున్న మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం కాదని తీర్పునిచ్చింది. ఇందుకు సంబంధించిన సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.[31] చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, ఏఎం ఖాన్‌విల్కర్, డీవై చంద్రచుద్, ఇందు మల్హోత్రాలతో కూడిన బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. అడల్టరీ అనేది శిక్షార్హమైన నేరం కాదు, కానీ ఆ కారణంతో విడాకులు తీసుకోవచ్చని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా తెలిపారు. [32]
  • 2018 సెప్టెంబరు 28న సుప్రీం కోర్టు కేరళ శబరిమలలో మహిళలకు ప్రవేశాన్ని అనుమతించవచ్చునని పేర్కొంటూ సంచలన తీర్పు నిచ్చింది. మహిళల భక్తికి అయ్యప్పను దూరం చేయరాదని సుప్రీం కోర్టు పేర్కొంది. అంతేగాకుండా.. నెలసరి సాకుగా ఆలయ ప్రవేశం నిషిద్ధమనడం.. రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం తెలిపింది. మిగిలిన అయ్యప్ప ఆలయాలకు లేని ఆంక్షలు శబరిమలలో ఎందుకని న్యాయస్థానం ప్రశ్నించింది. భారత రాజ్యాంగంలో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు ఉన్నాయన్న విషయాన్ని మరువరాదని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. ఆచారం ప్రకారం తరాలుగా ఈ దేవాలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై నిషేధం ఉంది. మహిళలందరూ దేవుడి సృష్టిలో భాగమే. ఉద్యోగం, పూజల్లో వారి పట్ల వివక్ష ఎందుకని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ప్రశ్నించింది.[33]
  • క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న చట్ట సభ సభ్యులపై అనర్హత వేటు వేయాలని వాజ్యంపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నేరం రుజువైతే తప్ప వారిపై అనర్హత వేటు వేయలేమని స్పష్టం చేసింది. అభియోగ దశ నుండే ఎన్నికలో పోటీ చేయకుండా ఎంపీ, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థతో పాటు బాజాపా నేత అశ్వని కుమార్ ఉపాధ్యాయ్ లు సుప్రీం లో పిటిషన్ దాఖలు వేశారు. దీనిపై పూర్తి విచారణ చేపట్టిన అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ నేరం రుజువయ్యేంత వరకు చట్టసభ సభ్యులపై అనర్హత వేటు వేసే స్థాయిలో తాము లేమని స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో నిర్ణయాన్ని పార్లమెంట్ కె వదిలేస్తున్నట్లు తెలిపారు. దీనిపై పార్లమెంట్ ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.[34]
  • మసీదులో నమాజ్ చేయడం అనేది ఇస్లాం మతంలో అంతర్భాగం కాదంటూ 1994లో ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ తీర్పును సమీక్ష కోసం ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదలాయించాలంటూ దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం తోసిపుచ్చింది. 1994 ఇస్మాయిల్ ఫారూఖీ కేసులో ఇచ్చిన తీర్పులో "ప్రార్థనలు ఎక్కడైనా చేసుకోవచ్చు, నమాజ్ మసీదులోనే చేయాలనేమీ లేదు" అని సుప్రీం కోర్టు చెప్పింది. ఆ తీర్పును పునఃసమీక్షించేందుకు విస్తృత ధర్మాసనానికి నివేదించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజారిటీతో తీర్పు ఇచ్చింది.[35]
  • కోర్టుల్లో జరిగే విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సుప్రీంకోర్టుఅనుమతించింది. కోర్టుల్లో జరిగే విచారణలు ప్రజలకు తెలిసేలా చేయాలని సీనియర్‌ అడ్వకేట్ ఇందిరా జైసింగ్‌తో పాటు మరికొందరు పిటిషన్లు వేశారు. వీటిని బుధవారం విచారించిన భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎమ్ ఖాన్విల్కర్‌లతో కూడినధర్మాసనం.. కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టులో జరిగే వ్యవహారాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా న్యాయవ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందని అభిప్రాయపడింది. కోర్టులో జరిగే విచారణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తెలుసుకోవాలనుకోవడం ప్రజల హక్కని.. దీని వల్ల పారదర్శకత కూడా పెరుగుతుందని వ్యాఖ్యానించింది. ప్రత్యక్షప్రసారాల విషయంలో నియమాలు ఉల్లంఘించకూడదంది. రాజ్యాంగ పరంగా ప్రాముఖ్యత కలిగిన కేసుల్లో.. సీజేఐ విచారణ చేపట్టే సమయంలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు పైలెట్ ప్రాజెక్ట్‌గా తీసుకొంటామన్నారు.[36]

వివాదాలు[మార్చు]

దేశ చరిత్రలో తొలిసారిగా నలుగురు జడ్జీలు- జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌ గోగోయ్‌, జస్టిస్‌ కురియన్ జోసెఫ్, జస్టిస్‌ మదన్‌ లోకూర్‌- ఆయన పనితీరును ప్రశ్నిస్తూ మీడియాకెక్కారు. అమిత్‌ షా నిందితుడిగా ఉన్న కేసును విచారించిన సీబీఐ జడ్జి బీహెచ్‌ లోయా అనుమానాస్పద మరణ కేసును డీల్‌ చేసిన విషయంలో మిశ్రా వ్యవహరించిన తీరుపై విమర్శలు రేగాయి. కొలీజియంలో చీలికలు, ప్రభుత్వానికి అనుకూలంగా కొందరు జడ్జీలు వ్యవహరిస్తున్నారంటూ సీనియర్‌ న్యాయమూర్తుల విమర్శలు, ఇవన్నీ దీపక్‌ మిశ్రా పనితీరుపై అనుమానాలు రేగేట్లు చేశాయి. ఆఖరికి ఆయన అభిశంసనకు 65 మంది ఎంపీలు తీర్మానం ప్రవేశపెట్టడం పరిస్థితిని తీవ్రస్థాయికి తీసుకెళ్లింది.[37]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Rautray, Samanwaya (9 August 2017). "Dipak Misra, the Man behind Nation Anthem ruling to be next CJI". The Economic Times. Retrieved 9 August 2017.
  2. "Hon'ble Mr. Justice Dipak Misra". Supreme Court of India. Archived from the original on 2017-06-11. Retrieved 2 October 2018.
  3. Maneesh Chhibber (1 October 2012). "The courtrooom cast after presidential reference". The Indian Express. Retrieved 23 April 2018.
  4. Deshpande, Swati (15 May 2016). "'He taught me that law needs to have a human face'". The Times of India.
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; sc2 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. 6.0 6.1 Mittal, Priyanka (8 ఆగస్టు 2017). "Justice Dipak Misra to be next Chief Justice of India". Livemint. Retrieved 13 జనవరి 2018.
  7. https://www.andhrajyothy.com/Artical.aspx?SID=457446[permanent dead link]
  8. "Delhi HC bids farewell to CJ Dipak Misra". Zee News. PTI. 5 October 2011.
  9. "Supreme Court upholds High court's decision to quash quota in promotion". The Times of India. 28 April 2012. Archived from the original on 10 మే 2013. Retrieved 10 August 2012.
  10. "SC quashes quota benefits in promotions". The Hindu. 28 April 2012. Archived from the original on 4 November 2012. Retrieved 10 August 2012.
  11. "U.P.Power Corp.Ltd. vs Rajesh Kumar & Ors. on 27 April 2012". IndianKanoon.org. Archived from the original on 10 ఆగస్టు 2012. Retrieved 2 అక్టోబరు 2018.
  12. "SC judge who rejected Yakub Memon's plea gets threat letter". Hindustan Times. 8 August 2015. Retrieved 23 April 2018.
  13. "When SC opened its doors at 3 am for Yakub - Rediff.com India News". www.rediff.com. Retrieved 16 May 2018.
  14. "How Yakub Memon was hanged- The Times of India". The Times of India. Retrieved 16 May 2018.
  15. "Nirbhaya gangrape case: Supreme Court verdict on convicts plea challenging their death sentence shortly". India Today. ANI. 5 May 2017. Retrieved 3 September 2017.
  16. Rajagopal, Krishnadas (5 మే 2017). "Delhi gang rape case: SC confirms death for four". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 13 జనవరి 2018.
  17. "కావేరి జలాల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు.. స్పందించిన పళణిస్వామి". Archived from the original on 2018-02-18. Retrieved 2018-10-02.
  18. "Cauvery verdict: SC directs Karnataka to release 177.25 tmc water to Tamil Nadu". The Economic Times. 16 February 2018.
  19. "స్వలింగ సంప‍ర్కంపై సుప్రీం ధర్మాసనం సంచలన తీర్పు".
  20. "పద్మావత్‌ : సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌".
  21. "లవ్ జీహాద్ కేసులో ట్విస్ట్! హదియాకు ఊరట, హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సుప్రీం!".
  22. "మేజర్ల పెళ్లిపై సుప్రీం సంచలన తీర్పు".
  23. Ashok K. M. (27 March 2018). "Right To Choose Life Partner Is A Fundamental Right, Consent Of Family, Community, Clan Not Necessary For Marriage Between Two Adults: SC [Read Judgment]". Live Law.
  24. "మూకస్వామ్యం చెల్లదు".
  25. "Horrendous acts of mobocracy can't be allowed, create law against it, SC asks government". The Economic Times. Press Trust of India. 17 July 2018.
  26. "ఆధార్ తీర్పు: తొలి పిటిషనర్ పుట్టస్వామి.. ఈయన ఎవరు?".
  27. PTI. "Won't attend SC contempt hearing on March 31: Justice Karnan". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2017-05-09.
  28. "Supreme Court sends Justice Karnan to jail for contempt, gags press on him". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 10 మే 2017. Retrieved 13 జనవరి 2018.
  29. "సుప్రీం కోర్టు : థియేటర్లలో జాతీయ గీతం తప్పనిసరి కాదు".
  30. "The man behind National Anthem ruling will be next CJI: 7 things about Dipak Misra". The Economic Times. Economic Times. Economic Times. 9 August 2017.
  31. "Historic verdicts delivered during CJI Dipak Misra's tenure".
  32. "Adultery no longer a criminal offence in India". BBC News. Retrieved 27 September 2018.
  33. "మహిళలకూ అయ్యప్ప ఆలయ ప్రవేశం.. సుప్రీం సంచలన తీర్పు".
  34. "అనర్హత వేటు విషయంలో చేతులెత్తేసిన సుప్రీం".[permanent dead link]
  35. "అయోధ్య వివాదం: 1994 తీర్పును సమీక్షించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు".
  36. "కోర్టు విచారణ లైవ్ స్ట్రీమింగ్‌కు ఓకే: సుప్రీం".
  37. "సంఘటనాత్మక శకం".[permanent dead link]
Legal offices
అంతకు ముందువారు
జగదీష్ సింగ్ ఖేహార్
భారత ప్రధాన న్యాయమూర్తి
28 ఆగస్టు 2017 - ప్రస్తుతం
తరువాత వారు
Incumbent