దేవరకొండ విఠల్ రావు
దేవరకొండ విఠల్ రావు | |||
దేవరకొండ విఠల్ రావు | |||
తరువాత | Incumbent | ||
---|---|---|---|
నియోజకవర్గము | Mahabubnagar | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నవంబరు 14 1947 Mahabubnagar, ఆంధ్ర ప్రదేశ్ | 14 నవంబరు 1947 /||
మరణం | మే 28 2016 | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
జీవిత భాగస్వామి | డి.నిర్మల | ||
సంతానము | 2 కుమారులు, 2 కుమార్తెలు | ||
నివాసము | హైదరాబాదు | ||
September 26, 2006నాటికి | మూలం | http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=4025 |
దేవరకొండ విఠల్ రావు ( నవంబర్ 14, 1947 - మే 5, 2016) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 14వ లోక్సభకు మహబూబ్నగర్ లోకసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు. వీరి కుటుంబం డి.వి.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల స్థాపించారు.
జీవిత విశేషాలు[మార్చు]
ఆయన 1947 నవంబరు 14 న జన్మించారు. ఆయన కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్మరాసుపేట మండలం లగ్చర్ల గ్రామానికి చెందినవారు. ఆయన 20 యేళ్ల పాటు గాంధీభవన్ లో ఉంటూ పీ.సీ సీ కోశాధికారిగా పనిచేసారు. 2004 లోక్ సభ ఎన్నికలలో మహబూబ్ నగర్ నుండి పోటీ చేసి జితేందర్ రెడ్డి పై గెలుపొందారు. నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరారెడ్డికి సన్నిహితంగా మెలిగారు. ఎం.పి.ల ఫోరం కన్వీనరుగా పనిచేసారు.
ఎంపీగా పనిచేసిన కాలంలోనే అప్పన్నపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. మహబూబ్నగర్ లో కొన్నేళ్లుగా మూతపడ్డ బోయపల్లి రైల్వే గేటును సొంతనిధులతో ప్రారంభించేందుకు కృషి చేశారు. పద్మశాలి సంఘం రాష్ట్రనేతగా పనిచేసి సంఘం బలోపేతానికి కృషిచేశారు. 2008 లోక్సభ ఎన్నికల్లో మహా బూబ్నగర్ నుంచి పోటీ చేసి ప్రస్తుత సీఎం కేసీఆర్ చేతిలో 18 వేల ఓట్లతో ఓడిపోయారు 2014లో కోడంగల్ నుం చి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాక జిల్లాకు రాకపోకలు తగ్గించారు. హైదరాబాద్ శివారులో డీవీఆర్ పేరుతో విద్యా సంస్థలు నడుపుతున్నారు.[1]
వ్యక్తిగత జీవితం[మార్చు]
ఆయనకు భార్య నిర్మల, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మరణం[మార్చు]
గత కొద్ది కాలంగా అఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన తన 60వ యేట మే 28 2016 న కన్నుమూసారు.[2]
మూలాలు[మార్చు]
- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణ, తే.29.5.2016, విఠల్ రావు మృతి.
- ↑ విఠల్ రావు మృతి[permanent dead link]