పేర్వారం జగన్నాథం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పేర్వారం జగన్నాథం

పేర్వారం జగన్నాధం (ఆగష్ట్23, 1934 - సెప్టెంబర్ 29, 2008) ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు, విద్యావేత్త.

జననం[మార్చు]

వరంగల్లు జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్లో సెప్టెంబర్ 23, 1934 న జన్మించాడు.[1] ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. పూర్తి చేసిన జగన్నాథం కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో ఆచార్యుడిగాను, వరంగల్లులోని సికెఎం కళాశాలలో ప్రిన్సిపాలు గాను, 1992-95 లలో తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ గాను పనిచేశాడు.

మరణం[మార్చు]

సెప్టెంబర్ 29, 2008వరంగల్లో మరణించాడు. మాజీ డి.జి.పి.పేర్వారం రాములు ఇతడి సోదరుడు.

రచనలు[మార్చు]

  1. అభ్యుదయకవిత్వానంతర ధోరణులు
  2. ఆరె భాషానిఘంటువు
  3. మోర్దోపు దున్న
  4. సాహితీ సౌరభం
  5. సాగర సంగీతం[2]
  6. వృషభ పురాణం
  7. గరుడపురాణం
  8. శాంతి యజ్ఞం
  9. తెలుగులో దేశీయ కవితాప్రస్థానం
  10. ఆరె జానపద గేయాలు[3]
  11. నన్నయ భారతి (ప్రథమ సంపుటము) [4] (సంపాదకత్వం - వ్యాస సంకలనం)
  12. డా.బాబాసాహెబ్ రచనలు - ప్రసంగాలు[5] (అనువాదం -11 సంపుటాలు) (ప్రధాన సంపాదకత్వం)
  13. సాహిత్యావలోకనం

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-09-18. Retrieved 2014-12-14.
  2. పేర్వారం, జగన్నాథం (ఆగస్టు 1981). సాగర సంగీతం (2 ed.). హనుమకొండ: సాహితీ బంధు బృందం. ISBN 978-12-455-9711-1.
  3. పేర్వారం, జగన్నాథం (1987). ఆరె జానపద గేయాలు. వరంగల్లు: ఆరె జానపద వాజ్మయ పరిశోధక మండలి. ISBN 978-11-753-4781-7. Retrieved 2020-07-12.
  4. పేర్వారం, జగన్నాథం (1993). నన్నయ భారతి (ప్రథమ సంపుటం) (1 ed.). హైదరాబాదు: తెలుగు విశ్వవిద్యాలయం. Retrieved 14 December 2014.
  5. పేర్వారం, జగన్నాథం (1994). డా.బాబాసాహెబ్ రచనలు - ప్రసంగాలు. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.