శంకరంబాడి సుందరాచారి: కూర్పుల మధ్య తేడాలు
Arjunaraoc (చర్చ | రచనలు) |
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{విస్తరణ}} |
|||
[[తెలుగు సాహితీకారులు|తెలుగు రచయిత]] లలో [[శంకరంబాడి సుందరాచారి]] ([[ఆగష్టు 10]],[[1914]] - [[ఏప్రిల్ 8]],[[1977]]) కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. [[తెలుగు]] ప్రజలకు, [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన [[మా తెలుగు తల్లికి మల్లె పూదండ]] అందించాడు. |
[[తెలుగు సాహితీకారులు|తెలుగు రచయిత]] లలో [[శంకరంబాడి సుందరాచారి]] ([[ఆగష్టు 10]],[[1914]] - [[ఏప్రిల్ 8]],[[1977]]) కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. [[తెలుగు]] ప్రజలకు, [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన [[మా తెలుగు తల్లికి మల్లె పూదండ]] అందించాడు. |
||
పంక్తి 7: | పంక్తి 5: | ||
సుందరాచారి, [[1914]] [[ఆగష్టు 10]] న [[తిరుపతి]] లో జన్మించాడు.అతని మాతృభాష [[తమిళం]]<ref>{{Cite web|title=State anthem composed in Chittoor|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article1566396.ece|publisher=The Hindu|date=2011-03-24 |accessdate=2014-02-02}}</ref>. [[మదనపల్లె]] లో ఇంటర్మీడియేటు వరకు చదివాడు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. బ్రాహ్మణోచితములైన [[సంధ్యావందనము]] వంటి పనులు చేసేవాడు కాదాయన. తండ్రి మందలించగా [[యజ్ఞోపవీతం(జంధ్యం)|జంధ్యాన్ని]] తెంపివేసాడు. తండ్రి మందలింపుకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు. |
సుందరాచారి, [[1914]] [[ఆగష్టు 10]] న [[తిరుపతి]] లో జన్మించాడు.అతని మాతృభాష [[తమిళం]]<ref>{{Cite web|title=State anthem composed in Chittoor|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article1566396.ece|publisher=The Hindu|date=2011-03-24 |accessdate=2014-02-02}}</ref>. [[మదనపల్లె]] లో ఇంటర్మీడియేటు వరకు చదివాడు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. బ్రాహ్మణోచితములైన [[సంధ్యావందనము]] వంటి పనులు చేసేవాడు కాదాయన. తండ్రి మందలించగా [[యజ్ఞోపవీతం(జంధ్యం)|జంధ్యాన్ని]] తెంపివేసాడు. తండ్రి మందలింపుకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు. |
||
భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పని చేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పని చేసాడు. [[ఆంధ్ర పత్రిక]] లో |
భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పని చేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పని చేసాడు. [[ఆంధ్ర పత్రిక]] లో అచ్చుదోషాలు దిద్దేవాడిగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేసాడాయన. |
||
అమితమైన ఆత్మవిశ్వాసం ఆయనకు. ఒకసారి ఏదైనా పని వెతుక్కుందామని [[మద్రాసు]] వెళ్ళాడు. ఆంధ్ర పత్రిక ఆఫీసుకు వెళ్ళి పని కావాలని అడిగాడు. [[కాశీనాధుని నాగేశ్వర రావు|దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వర రావు]] పంతులు "నీకు తెలుగు వచ్చా" అని అడిగాడు. దానికి సమాధానంగా "మీకు తెలుగు రాదా" అని అడిగాడు. నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగు లోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్రశ్నకు సమాధానం ఎలా ఇవ్వాలో తెలియ లేదు అని అన్నాడు. ఆంధ్ర పత్రికలో ఉద్యోగం చేస్తుండగా, ఒక ప్రముఖునిపై పద్యం వ్రాయవలసి వచ్చింది. నేను వ్యక్తులపై పద్యాలు వ్రాయను అని భీష్మించుకుని, దాని కోసం ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు సుందరాచారి. తరువాత విద్యాశాఖలో పాఠశాల పర్యవేక్షకుడిగా పని చేసాడు. [[నందనూరు]] లో ఉండగా ఒకసారి పాఠశాల సంచాలకుడు వచ్చాడు. ఆ సంచాలకుడు సుందరాచారిని ప్యూనుగాను, ప్యూనును పర్యవేక్షకుడిగాను పొరబడ్డాడు. దానికి కోపగించి, సుందరాచారి ఆ ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేసాడు. |
అమితమైన ఆత్మవిశ్వాసం ఆయనకు. ఒకసారి ఏదైనా పని వెతుక్కుందామని [[మద్రాసు]] వెళ్ళాడు. [[ఆంధ్ర పత్రిక]] ఆఫీసుకు వెళ్ళి పని కావాలని అడిగాడు. [[కాశీనాధుని నాగేశ్వర రావు|దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వర రావు]] పంతులు "నీకు తెలుగు వచ్చా" అని అడిగాడు. దానికి సమాధానంగా "మీకు తెలుగు రాదా" అని అడిగాడు. నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగు లోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్రశ్నకు సమాధానం ఎలా ఇవ్వాలో తెలియ లేదు అని అన్నాడు. ఆంధ్ర పత్రికలో ఉద్యోగం చేస్తుండగా, ఒక ప్రముఖునిపై పద్యం వ్రాయవలసి వచ్చింది. నేను వ్యక్తులపై పద్యాలు వ్రాయను అని భీష్మించుకుని, దాని కోసం ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు సుందరాచారి. తరువాత విద్యాశాఖలో పాఠశాల పర్యవేక్షకుడిగా పని చేసాడు. [[నందనూరు]] లో ఉండగా ఒకసారి పాఠశాల సంచాలకుడు వచ్చాడు. ఆ సంచాలకుడు సుందరాచారిని ప్యూనుగాను, ప్యూనును పర్యవేక్షకుడిగాను పొరబడ్డాడు. దానికి కోపగించి, సుందరాచారి ఆ ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేసాడు. |
||
భార్య అనారోగ్యం కారణంగా ఆయన వేదన చెంది, జీవిత చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితం గడిపాడు. సుందరాచారి [[1977]] [[ఏప్రిల్ 8]] న తిరుపతి, గంగుండ్ర మండపం వీధిలో నివాసముంటున్న ఇంట్లో మరణించాడు. |
భార్య అనారోగ్యం కారణంగా ఆయన వేదన చెంది, జీవిత చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితం గడిపాడు. సుందరాచారి [[1977]] [[ఏప్రిల్ 8]] న తిరుపతి, గంగుండ్ర మండపం వీధిలో నివాసముంటున్న ఇంట్లో మరణించాడు. |
||
పంక్తి 27: | పంక్తి 25: | ||
==ఇతర విశేషాలు== |
==ఇతర విశేషాలు== |
||
సుందరాచారి మా తెలుగు తల్లికి |
సుందరాచారి "మా తెలుగు తల్లికి" గీతాన్ని [[1942]] లో [[దీనబంధు]] సినిమా కోసం రచించాడు. కానీ ఆ చిత్ర నిర్మాతకు యుగళగీతంగా వాడడానికి నచ్చక పోవటం వల్ల ఆ సినిమాలో చేర్చలేదు. [[టంగుటూరి సూర్యకుమారి]] గ్రామఫోన్ రికార్డు కోసం ఆ పాటను మధురంగా పాడిన తరువాతనే ఆ గీతానికి గుర్తింపు లభించింది. |
||
ఒకసారి [[ఢిల్లీ]] వెళ్ళి అక్కడ [[నెహ్రూ]] ను కలిసాడు. తాను రచించిన బుధ్ధ చరిత్ర లోని ఒక పద్యాన్ని ఇంగ్లీషులోకి అనువదించి ఆయనకు వినిపించాడు. నెహ్రూ ముగ్ధుడై ఆయనను మెచ్చుకుని 500 రూపాయలు బహూకరించాడు. |
ఒకసారి [[ఢిల్లీ]] వెళ్ళి అక్కడ [[నెహ్రూ]] ను కలిసాడు. తాను రచించిన బుధ్ధ చరిత్ర లోని ఒక పద్యాన్ని ఇంగ్లీషులోకి అనువదించి ఆయనకు వినిపించాడు. నెహ్రూ ముగ్ధుడై ఆయనను మెచ్చుకుని 500 రూపాయలు బహూకరించాడు. |
||
పంక్తి 35: | పంక్తి 33: | ||
==మూలాలు, వనరులు== |
==మూలాలు, వనరులు== |
||
⚫ | |||
*[[దూరదర్శన్]] లో పులికంటి కృష్ణారెడ్డి పాల్గొన్న ఒక చర్చా కార్యక్రమం |
*[[దూరదర్శన్]] లో పులికంటి కృష్ణారెడ్డి పాల్గొన్న ఒక చర్చా కార్యక్రమం |
||
*ఇతర పుస్తకాలు |
|||
⚫ | |||
==బయటి లింకులు== |
==బయటి లింకులు== |
||
* |
*[http://www.archive.org/details/SamgrahaValmikiSundaraRamayanamu సుందర రామాయణం -సుందరాచారి (ఆర్కైవ్స్.ఆర్గ్)] |
||
*[http://www.hindu.com/2004/11/25/stories/2004112502810500.htm సుందరాచారి జ్ఞాపకాలపై హిందూ పత్రిక వ్యాసం] |
*[http://www.hindu.com/2004/11/25/stories/2004112502810500.htm సుందరాచారి జ్ఞాపకాలపై హిందూ పత్రిక వ్యాసం] |
||
*[http://www.hindu.com/2007/07/26/stories/2007072650260200.htm తిరుపతిలో ఆవిష్కరింపబడిన సుందరాచారి విగ్రహం ఫోటో] |
*[http://www.hindu.com/2007/07/26/stories/2007072650260200.htm తిరుపతిలో ఆవిష్కరింపబడిన సుందరాచారి విగ్రహం ఫోటో] |
06:20, 2 ఫిబ్రవరి 2014 నాటి కూర్పు
తెలుగు రచయిత లలో శంకరంబాడి సుందరాచారి (ఆగష్టు 10,1914 - ఏప్రిల్ 8,1977) కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు.
జీవిత విశేషాలు
సుందరాచారి, 1914 ఆగష్టు 10 న తిరుపతి లో జన్మించాడు.అతని మాతృభాష తమిళం[1]. మదనపల్లె లో ఇంటర్మీడియేటు వరకు చదివాడు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. బ్రాహ్మణోచితములైన సంధ్యావందనము వంటి పనులు చేసేవాడు కాదాయన. తండ్రి మందలించగా జంధ్యాన్ని తెంపివేసాడు. తండ్రి మందలింపుకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు.
భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పని చేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పని చేసాడు. ఆంధ్ర పత్రిక లో అచ్చుదోషాలు దిద్దేవాడిగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేసాడాయన.
అమితమైన ఆత్మవిశ్వాసం ఆయనకు. ఒకసారి ఏదైనా పని వెతుక్కుందామని మద్రాసు వెళ్ళాడు. ఆంధ్ర పత్రిక ఆఫీసుకు వెళ్ళి పని కావాలని అడిగాడు. దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు "నీకు తెలుగు వచ్చా" అని అడిగాడు. దానికి సమాధానంగా "మీకు తెలుగు రాదా" అని అడిగాడు. నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగు లోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్రశ్నకు సమాధానం ఎలా ఇవ్వాలో తెలియ లేదు అని అన్నాడు. ఆంధ్ర పత్రికలో ఉద్యోగం చేస్తుండగా, ఒక ప్రముఖునిపై పద్యం వ్రాయవలసి వచ్చింది. నేను వ్యక్తులపై పద్యాలు వ్రాయను అని భీష్మించుకుని, దాని కోసం ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు సుందరాచారి. తరువాత విద్యాశాఖలో పాఠశాల పర్యవేక్షకుడిగా పని చేసాడు. నందనూరు లో ఉండగా ఒకసారి పాఠశాల సంచాలకుడు వచ్చాడు. ఆ సంచాలకుడు సుందరాచారిని ప్యూనుగాను, ప్యూనును పర్యవేక్షకుడిగాను పొరబడ్డాడు. దానికి కోపగించి, సుందరాచారి ఆ ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేసాడు.
భార్య అనారోగ్యం కారణంగా ఆయన వేదన చెంది, జీవిత చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితం గడిపాడు. సుందరాచారి 1977 ఏప్రిల్ 8 న తిరుపతి, గంగుండ్ర మండపం వీధిలో నివాసముంటున్న ఇంట్లో మరణించాడు.
2004 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుపతి పట్టణము తిరుచానూరు రోడ్డులోని అన్నపూర్ణేశ్వరి సర్కిల్లో సుందరాచారి జ్ఞాపకార్ధం, ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది.[2]
సాహితీ వ్యాసంగం
శంకరంబాడి సుందరాచారి గొప్ప కవి. పద్య కవిత్వం ఆయనకు ప్రీతిపాత్రమైన కవితా ప్రక్రియ. పద్యాలలోనూ తేటగీతి ఆయన ఎంతో ఇష్టపడ్డ ఛందస్సు. తేటగీతిలో ఎన్నో పద్యాలు వ్రాసాడు. "నా పేరు కూడా (శంకరంబాడి సుందరాచారి) తేటగీతిలో ఇమిడింది, అందుకనే నాకది బాగా ఇష్టం" అనేవాడు ఆయన. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి.. కూడా తేటగీతిలో రాసిందే. ఈ పద్యం ఆయన రచనలలో మణిపూస వంటిది. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని రమ్యంగా వర్ణించిన నాలుగు పద్యాలు అవి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి గౌరవించింది.
మహాత్మా గాంధీ హత్య జరిగినపుడు ఆవేదన చెంది, బలిదానం అనే కావ్యం వ్రాసాడు. ఆ పద్యాలను పాఠశాలలో పిల్లలకు ఆయనే చదివి వినిపించాడట. ఆ పద్యాలలోని కరుణ రసానికి పిల్లలు రోదించారని ప్రముఖ రచయిత పులికంటి కృష్ణారెడ్డి చెప్పాడు.
సుందర రామాయణం అనే పేరుతో రామాయణం రచించాడు. అలాగే సుందర భారతం కూడా వ్రాసాడు. తిరుపతి వేంకటేశ్వర స్వామి పేరు మకుటంగా శ్రీనివాస శతకం రచించాడు. ఇవే కాక జపమాల, బుద్ధగీతి అనే పేరుతో బుధ్ధ చరిత్ర కూడా రాసాడు.
రవీంద్రుని గీతాంజలిని అనువదించాడు. మూలంలోని భావాన్ని మాత్రమే తీసుకుని, భావం చెడకుండా, తెలుగు నుడికారం పోకుండా చేసిన ఆ స్వతంత్ర అనువాదం బహు ప్రశంసలు పొందింది. ఏకలవ్యుడు అనే ఖండకావ్యం, కెరటాలు అనే గ్రంథం కూడా రచించాడు. సుందర సుధా బిందువులు అనే పేరుతో భావ గీతాలు వ్రాసాడు. జానపద గీతాలు వ్రాసాడు, స్థల పురాణ రచనలు చేసాడు.
సినిమాలకు కూడా పాటలు రాసాడు. మహాత్మాగాంధీ, బిల్హణీయం, దీనబంధు అనే సినిమాలకు పాటలు వ్రాసాడు. దీనబంధు సినిమాలో నటించాడు కూడా.
ఇతర విశేషాలు
సుందరాచారి "మా తెలుగు తల్లికి" గీతాన్ని 1942 లో దీనబంధు సినిమా కోసం రచించాడు. కానీ ఆ చిత్ర నిర్మాతకు యుగళగీతంగా వాడడానికి నచ్చక పోవటం వల్ల ఆ సినిమాలో చేర్చలేదు. టంగుటూరి సూర్యకుమారి గ్రామఫోన్ రికార్డు కోసం ఆ పాటను మధురంగా పాడిన తరువాతనే ఆ గీతానికి గుర్తింపు లభించింది.
ఒకసారి ఢిల్లీ వెళ్ళి అక్కడ నెహ్రూ ను కలిసాడు. తాను రచించిన బుధ్ధ చరిత్ర లోని ఒక పద్యాన్ని ఇంగ్లీషులోకి అనువదించి ఆయనకు వినిపించాడు. నెహ్రూ ముగ్ధుడై ఆయనను మెచ్చుకుని 500 రూపాయలు బహూకరించాడు.
బిరుదులు
శంకరంబాడి సుందరాచారిని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము ప్రసన్న కవి అని గౌరవించింది. ఆయనను భావకవి అనీ, అహంభావకవి అనీ కూడా అనేవారు. సుందరకవి అన్నది ఆయన మరోపేరు.
మూలాలు, వనరులు
- ↑ "State anthem composed in Chittoor". The Hindu. 2011-03-24. Retrieved 2014-02-02.
- ↑ "YSR unveils Sankarambadi statue". 2004-11-17. Retrieved 2014-02-02.
{{cite web}}
: Unknown parameter|pubisher=
ignored (|publisher=
suggested) (help)
- దూరదర్శన్ లో పులికంటి కృష్ణారెడ్డి పాల్గొన్న ఒక చర్చా కార్యక్రమం