బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్
| బొమ్మగాని ధర్మబిక్షం గౌడ్ | |||
మాజీ ఎంపీ, నల్గొండ | |||
| నియోజకవర్గం | నల్గొండ | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1922 ఫిబ్రవరి 15 మునుగోడు మండలం ఊకొండి గ్రామం నల్లగొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్[1] | ||
| మరణం | మార్చి 26, 2011 | ||
| రాజకీయ పార్టీ | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా | ||
| జీవిత భాగస్వామి | అవివాహితుడు | ||
| సంతానం | బొమ్మగాని ప్రభాకర్(దత్తత) | ||
| మతం | హిందూ మతం | ||
బొమ్మగాని ధర్మబిక్షం ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు, స్వతంత్ర సమరయోధులు. అతను కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) నల్గొండ లోక్సభ నియోజకవర్గం ఏం. పి.గా 10, 11వ లోక్సభ సభ్యులుగా పనిచేశారు. అంతకు ముందు సూర్యాపేట (1952), నకిరేకల్ (1957), నల్లగొండ (1962) శాసనసభ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే గా ధర్మభిక్షం హ్యాట్రిక్ విజయాలు సాధించారు. నల్లగొండ జిల్లాలోని మునుగోడు మండలం, ఊకొండి గ్రామంలో బొమ్మగాని ముత్తి లింగం, గోపమ్మ దంపతులకు1922 ఫిబ్రవరి 15లో జన్మించారు. బొమ్మగాని ధర్మబిక్షం తండ్రి చిన్నవయస్సులో మునుగోడు మండలం ఊకొండి నుండి సూర్యాపేటకు వచ్చి స్థిరపడ్డారు.
విద్యార్థి జీవితం
[మార్చు]ధర్మభిక్షం విద్యార్థి దశలోనే జాతీయ భావాలు అలవరుచుకున్నారు. నిజాం పట్టాభిషేక రజతోత్సవాల సందర్భంగా పాఠశాలలో ఉత్సవాలు జరపాలన్న ప్రధానోపాధ్యాయుడి ఆదేశాలను వ్యతిరేకించి తోటి విద్యార్థులతో కలిసి బహిష్కరించారు. సామాజిక రుగ్మతలపై పోరాడటం కోసం తన సహ విద్యార్థులకు శిక్షణనివ్వటానికి విరాళాలు సేకరించి ఒక వసతిగృహం ఏర్పాటు చేశారు. కమ్యూనిస్టుపార్టీ పట్ల ఆకర్షితులైన ధర్మభిక్షం 1942లో సీపీఐలో చేరారు. పార్టీలో పనిచేస్తూనే పాత్రికేయునిగా తెలంగాణలోని నాటి ప్రముఖ పత్రికలైన మీజాన్, రయ్యత్, గోల్కొండల్లో పనిచేశారు. నిజాంపై సాయుధపోరాటం మొదలైన తర్వాత తుపాకి చేతబట్టి యుద్ధరంగంలోకి దిగారు. సాయుధపోరాటాన్ని విస్తరింపజేశారు. ఈ క్రమంలో అరెస్త్టే ఐదేళ్లకుపైగా జైలుశిక్షను అనుభవించారు.[2]
చదువు
[మార్చు]- మెట్రిక్యులేషన్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సూర్యాపేట.
- అలిగ్రా యూనివర్సటీ కోర్స్, సూర్యాపేట.
వివాహం
[మార్చు]- అవివాహితుడు
- సోదరుడు బొమ్మగాని వెంకయ్య కుమారుడు బొమ్మగాని ప్రభాకర్ ను ధర్మభిక్షం దత్తత తీసుకున్నారు.
వృత్తి
[మార్చు]సామాజిక కార్యకర్త, కార్మికులు, వ్యాపార సంఘం సభ్యులు, పాత్రికేయులు.
రాజకీయ జీవితం
[మార్చు]స్వాతంత్య్రం అనంతరం 1952లో తొలిసారిగా హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు సూర్యాపేట నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 1957లో నకిరేకల్ నుండి, 1962లో నల్గొండ నుండి ప్రాతినిధ్యం వహించారు. 1991లో, 1996లోనూ అతను ఎంపీగా నల్గొండ లోక్సభ నియోజకవర్గం నుండి విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. 1996 లో 11వ లోక్సభ ఎన్నికలలో నల్లగొండనుండి 480 మంది ఫ్లోరైడ్ బాధితులు పోటీ చేసినప్పటికి అతను 76 వేల ఓట్ల మెజారిటీతో గెలిచాడు. గీత పనివారల సంఘం ఏర్పాటు చేసి గౌడ కులస్తుల హక్కుల కోసం అతను చివరివరకు పోరాడారు. పలు కార్మిక సంఘాల స్థాపనలో ధర్మబిక్షం ప్రధాన పాత్ర వహించి ‘కార్మిక పక్షపాతి’గా గుర్తింపు తెచ్చుకున్నారు.[3]
పదవులు
[మార్చు]- 1951-73లో కార్యదర్శి, భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) జిల్లా మండలి, నల్గొండ.
- 1952-57లో శాసనసభ్యులు, హైదరబాద్ శాసనసభ
- 1957-62, 1962-67 శాసన సభ్యులు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ.[4]
- 1972 నుంచి కార్యవర్గ సభ్యులు, సిపిఐ, ఆంధ్రప్రదేశ్.
- 1991లో 10వ లోక్సభ స్థానానికి ఎన్నిక.
- 1991-96 సభ్యులు, సంప్రదింపుల కమిటీ, గ్రామీణాభివృద్ధి శాఖ.
- 1992-95 కార్యదర్శివర్గ సభ్యులు, రాష్ట్ర సమితి, సిపిఐ, ఆంధ్రప్రదేశ్
- 1996 లో 11వ లోక్సభ స్థానానికి రెండవసారి ఎన్నిక[5]
- సభ్యులు, భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ), జాతీయ మండలి.
సాంఘీక, సాంస్కృతిక కార్యక్రమాలు
[మార్చు]- భారత ప్రభుత్వం నుంచి తామ్రపత్ర పురస్కారం అందుకున్నారు.
- గ్రామీణ పేదలు హక్కుల కోసం పోరాటం,, ఈత, యువత, విద్యార్థులు అసంఘటిత కార్మికుల సంఘటితం, పేదలకోసం భూమి, ఇళ్ళు కొనుగోలు.
విదేశి పర్యటనలు
[మార్చు]- అమెరికా
ఇతర వివరాలు
[మార్చు]స్వాతంత్ర్య సమరయోధులు, నల్గొండలో కార్మిక సంఘాలు వ్యవస్థాపకులు, అధ్యక్షుడు, అఖిల భారతదేశ గీత కార్మిక, పనివారల ఫెడరేషన్; ఆర్య సమాజ్ ఆర్గనైజర్, ఆంధ్ర మహాసభ కార్యకర్త.
- కాలక్షేపం: పఠనం, పర్యటన, సాంఘికీకరణ
- క్రీడలు :హాకీ, యోగ
- *ధర్మ బిక్షం గారి ప్రతిభా పురస్కారాలు*: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ రాష్ట్ర యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా మెరిట్ సాధించిన విద్యార్ధులకు ప్రతిభా పురస్కారాలు.
మరణం
[మార్చు]89 ఏళ్ళ వయసులో ఇంట్లో జారి పడటంతో అతను తుంటి ఎముకకు దెబ్బతగిలింది. హైదరాబాద్లోని కామినేని ఆసుపత్రిలో ఫిబ్రవరి 11న శస్త్రచికిత్స జరిపారు. తర్వాత తేరుకున్నప్పటికీ వూపిరితిత్తుల సమస్య జఠిలం కావటంతో చికిత్స పొందుతూ 2011, మార్చి 26న మరణించాడు.
విగ్రహావిష్కరణ
[మార్చు]ఉమ్మడి నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం జనగాం గ్రామంలో 2013 న బొమ్మగాని ధర్మ బిక్షం గారి విగ్రహం దేశిని చినమల్లయ్య గారు, బొమ్మగాని ప్రభాకర్ గౌడ్ లు ఆవిష్కరించారు..
భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ గ్రామంలో 2019 నవంబరు 8 రోజున బొమ్మగాని ధర్మభిక్షం విగ్రహాన్ని ఎక్సైజ్శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించాడు.[6][7]
వనరులు
[మార్చు]- ↑ Eenadu (4 November 2023). "ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే గెలిచారు". the original నుండి 4 November 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 November 2023.
- ↑ సాక్షి, పాలిటిక్స్ (15 March 2019). "అసామాన్య...సామాన్యుడు!". Sakshi. ఒరిజినల్ నుండి 5 నవంబరు 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 November 2019.
- ↑ Namasthe Telangana (15 February 2022). "పోరాటయోధుడు ధర్మభిక్షం". the original నుండి 15 February 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 February 2022.
- ↑ Sakshi (14 October 2023). "ఎమ్మెల్యేలయ్యారు.. ఎంపీలూ అయ్యారు!". the original నుండి 24 October 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 October 2023.
- ↑ Eenadu (16 December 2023). "ఫ్లోరైడ్పై పోరు.. నామినేషన్ల జోరు". the original నుండి 16 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 December 2023.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణా తాజావార్తలు (8 November 2019). "సంస్థాన్ నారాయణపూర్లో బొమ్మగాని ధర్మభిక్షం విగ్రహం ఏర్పాటు". www.andhrajyothy.com. ఒరిజినల్ నుండి 11 November 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 November 2019.
- ↑ ఈనాడు, సూర్యాపేట (9 November 2019). "ధర్మభిక్షం చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలి - EENADU". www.eenadu.net (in ఇంగ్లీష్). the original నుండి 11 November 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 November 2019.