ముంబై - న్యూ ఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముంబై - న్యూ ఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గందురంతో ఎక్స్‌ప్రెస్
స్థానికతమహారాష్ట్ర, గిజరాత్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ
తొలి సేవ23 మార్చి 2012; 12 సంవత్సరాల క్రితం (2012-03-23)
ప్రస్తుతం నడిపేవారుపశ్చిమ రైల్వే
మార్గం
మొదలుముంబై సెంట్రల్
గమ్యంన్యూ ఢిల్లీ
ప్రయాణ దూరం1,384 km (860 mi)
సగటు ప్రయాణ సమయం22209 – 17 hours 15 minutes; 22210 – 16 hrs 45 mins
రైలు నడిచే విధంవారానికి 2 సార్లు: 22209 – Mondays and Fridays; 22210 – Tuesdays and Saturdays
రైలు సంఖ్య(లు)22209 / 22210
సదుపాయాలు
శ్రేణులుAC First Class, AC 2 tier, AC 3 tier
కూర్చునేందుకు సదుపాయాలుNo
పడుకునేందుకు సదుపాయాలుYes
ఆహార సదుపాయాలుపాంట్రీ కార్ ఉంటుంది
సాంకేతికత
రోలింగ్ స్టాక్LHB coaches
వేగంగరిష్ఠ వేగం 130 km/h (81 mph) సగటు వేగం 83 km/h (52 mph)

ముంబై-న్యూ ఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్, ఇది ముంబై, న్యూ ఢిల్లీ ల మధ్య నడుస్తున్న దురంతో రకం రైలు. దీన్ని ముంబై AC దురంతో ఎక్స్‌ప్రెస్ అని కూడా అంటారు. ఇది 16 ఎయిర్ కండిషన్డ్ బోగీలు కల రైలు. ఇది మహారాష్ట్ర నుండి ఢిల్లీకి నడిచే అత్యంత వేగవంతమైన రైళ్ళలో ఒకటి. దీనిని పశ్చిమ రైల్వే (WR), ముంబై డివిజన్ నిర్వహిస్తుంది. ఈ రైలు గతంలో వాణిజ్య హాల్ట్‌లు చేసేది కాదు, కానీ ఇప్పుడు వడోదర, రత్లాం, కోటాలలో వాణిజ్య హాల్ట్‌లున్నాయి. ఎగువ దిశలో, న్యూఢిల్లీ నుండి ముంబైకి, రైలు నంబర్ 22210తో, దిగువ దిశలో, ముంబై నుండి న్యూఢిల్లీకి రైలు నంబర్ 22209గా ఈ సేవ నడుస్తుంది. సీల్దా-న్యూ ఢిల్లీ దురంతో రైలును బికనీర్ వరకు పొడిగించిన తర్వాత, ఈ రైలు ప్రస్తుతం భారతీయ రైల్వేలలో అత్యంత వేగవంతమైన దురంతో ఎక్స్‌ప్రెస్.

ఇతర దురంతో రైళ్లలో చాలా వరకు రాజధాని రైళ్ళ కంటే తక్కువ ప్రయాణ సమయాన్ని తీసుకుంటాయి. అందువల్ల, ముంబై దురంతో ప్రవేశపెట్టడానికి ముందు, ఇది భారతీయ రైళ్ళలో అత్యంత వేగవంతమైన సేవగా ఉంటుందని భావించారు. ఈ మార్గంలో అత్యధిక ప్రాధాన్యతను పొందే రాజధాని ఎక్స్‌ప్రెస్ ముంబై-ఢిల్లీ మార్గంలో అత్యంత వేగవంతమైన రైలుగా నిలిచింది. కానీ, ఒకప్పుడు నాన్‌స్టాప్ సర్వీసుగా నడిచినప్పటికీ, దురంతో రాజధాని రైళ్ళ కంటే 40–70 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకుంటుంది.


రైలు యొక్క తొలి పరుగు 2012 మార్చి 18 న జరిగింది. ఇది మొదటిసారిగా 02209 ముంబై సెంట్రల్-న్యూ ఢిల్లీ దురంతో ప్రారంభ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌గా నడిచింది [1] టైమ్‌టేబుల్ ప్రకారం మొదటి పరుగు 2012 మార్చి 20 న ఢిల్లీ నుండి ముంబైకి జరిగింది.

బోగీలు[మార్చు]

భారతదేశంలో తయారైన ఎరుపు-బూడిద రాజధాని లివరీలో LHB కోచ్‌లను ఈ రైలు కోసం ఉపయోగిస్తారు. మా-మాటీ-మానుష్ అని పిలువబడే దురంతో రైలుకు దురంతో వినైల్ లేదా వాల్‌పేపర్ అతికిస్తారు.

ఈ రైలులో 9 థర్డ్ AC (3A), 3 సెకండ్ AC (2A), 1 ప్యాంట్రీ, 1 ఫస్ట్ AC (1A), 2 జనరేటర్ కార్ లు ఉంటాయి. సెలవుల సమయంలో అదనపు రద్దీని తట్టుకోడానికి గరిష్టంగా 1–2 అదనపు కోచ్‌లను జోడించవచ్చు

హాల్టులు[మార్చు]

ఈ రైలుకు రెండు దిశలలోను మూడు వాణిజ్య హాల్టులున్నాయి:-

  1. వడోదర జంక్షను
  2. రత్లాం జంక్షను
  3. కోట జంక్షను

వేగం[మార్చు]

ఈ మార్గం లోని కొన్ని భాగాల్లో మినహాయించి ఈ రైలు గరిష్టంగా అనుమతించదగిన వేగం గంటకు 130 కి.మీ.

మూలాలు[మార్చు]

  1. "02209 down Mumbai central-New Delhi Duronto Inaugural Special at platform no.4 of Bovrivali". 18 March 2012.