Coordinates: 16°30′13″N 81°55′48″E / 16.5035°N 81.9301°E / 16.5035; 81.9301

అప్పనపల్లి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తూర్పు గోదావరి జిల్లా పర్యాటక ప్రదేశాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎మూలాలు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
పంక్తి 135: పంక్తి 135:
{{మామిడికుదురు మండలంలోని గ్రామాలు}}
{{మామిడికుదురు మండలంలోని గ్రామాలు}}


[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా గ్రామాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు]]

02:18, 23 అక్టోబరు 2017 నాటి కూర్పు

అప్పనపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
అప్పనపల్లి is located in Andhra Pradesh
అప్పనపల్లి
అప్పనపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 16°30′13″N 81°55′48″E / 16.5035°N 81.9301°E / 16.5035; 81.9301
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం మామిడికుదురు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,265
 - పురుషుల సంఖ్య 2,644
 - స్త్రీల సంఖ్య 2,621
 - గృహాల సంఖ్య 1,470
పిన్ కోడ్ 533 247
ఎస్.టి.డి కోడ్

అప్పనపల్లి, తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలానికి చెందిన గ్రామము.[1].. పిన్ కోడ్: 533 247. ఈ గ్రామము. కాకినాడకు 70 కిలోమీటర్లు, రాజమండ్రికి 85 కిలోమీటర్లు మరియు అమలాపురానికి 35 కీ.మీ. దూరంలో ఉంది.

అప్పనపల్లి భాలాజీ దేవాలయము.
దేవాలయ అంతర్భాగం.
అప్పనపల్లి వద్ద గోదావరి దృశ్యం.
దస్త్రం:Appanapalli.1.jpg
అప్పనపల్లి గ్రామ కూడలిలో శివాలయము

ఈ గ్రామం పవిత్రమైన వైనతేయ నది ఒడ్డున ఉంది. ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి వారు వేంచేసి ఉన్నారు. ఇక్కడి స్వామిని అప్పనపల్లి బాలాజీ అని పిలుస్తారు. ఈ క్షేత్రం కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి పొందింది. ఈ ఉరికి మూడు ప్రక్కల గోదావరి నది నాలుగవ ప్రక్క బంగాళాఖాతం ఉన్నాయి. పచ్చటి వరిచేలు, విస్తారంగా కొబ్బరి తోటలు, పనస చెట్లు, కూరగాయల మడులతో ఉన్న ఈ ప్రాంతం కోనసీమలో భాగం.

గ్రామ చరిత్ర

ఈ గ్రామానికి అప్పనపల్లి అనే పేరు వాయువేగుల (నూకల) అప్పన అనే ఋషి ద్వారా వచ్చింది. ఆ ఋషి ఇక్కడ లోక కళ్యాణార్ధం తపస్సు చేశాడు. పూర్వకాలంలో ఈ ప్రదేశంలో బ్రాహ్మణులు వేదాలని వల్లె వేస్తూ ఉండేవారని ప్రతీతి.

వెంకటేశ్వరస్వామి దేవస్థాన చరిత్ర

ఇక్కడ రెండు వెంకటేశ్వర దేవస్థానములు ఉన్నాయి. ఇక్కడి వెంకటేశ్వర స్వామిని తూర్పు భారతదేశములోలా బాలాజీ అని పిలుస్తారు. పూర్వము ఉన్న దేవస్థానమును కళ్యాణ వెంకటేశ్వరుడు అని పిలుస్తారు. ఈ దేవస్థాన నిర్మాత మొల్లేటి రామస్వామి ఒక కొబ్బరి వర్తకుడు. ఆయన కీర్తి శేషులు శ్రీమతి వాయువేగుల శీతమ్మ గారి ఇంట్లో కొబ్బరి వర్తకము చేయ సాగెను. ఒకనాడు కొబ్బరి రాశిలో ఒక కొబ్బరి కాయలో శ్రీ వెంకటేశ్వరుని తిరు నామాలను కనుగొన్నారు. ఆ కొబ్బరి కాయను ప్రతిష్ఠించి శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించ సాగెను. అది దిన దిన ప్రవర్ధమానమయి పెద్ద పవిత్ర క్షేత్రమయినది.

ఇక్కడ దేవాలయములో ప్రతిష్ఠించబడిన ధ్వజస్తంభం గురించి ఒక విశేషమైన కథ ఉంది. ఈ ఆలయ నిర్మాణకర్త మొల్లేటి రామస్వామి మరియు కొందరు గ్రామ ప్రముఖులు ధ్వజస్తంభం కోసం నాణ్యమైన కొట్టబడిన చెట్టును కొనడానికి వెళ్ళినప్పుడు ధర విషయములో తేడా వచ్చి కొనకుండా వెనుకకు తిరిగి రావటం జరిగింది. తరువాత కొన్ని రోజులకు గోదావరి నదికి వరదలు వచ్చినవి. విచిత్రముగా ధ్వజస్తంభం కొరకు బేరమాడిన అదేచెట్టు అప్పనపల్లి తీరానికి చేరి ఉన్నదని, దానినే ధ్వజస్తంభ నిర్మాణమునకు వాడారనీ చెపుతారు.

దేవస్థాన విశేషాలు

అక్కడ జరిగే పూజాదులు, సేవలు, సాంసృతిక సేవా కార్యక్రమముల వలన విపరీతమైన ప్రచారం కలిగి భక్తుల రాకపోకలు విపరీతంగా సాగుతుండేవి. ఆ రోజులలో రామస్వామి యొక్క నిస్వార్థము వలన ఆదాయము బాగుగా సమకూరి తిరుమల దేవస్థానము తీరుగా వచ్చిన వారందరకూ ఉచిత భోజనము, లోపములేని వసతులు కల్పించుటతో భక్తుల రాకపోకలు విపరీతముగా పెరిగి అత్యంత పెద్ద దేవస్థానముగా రూపుదిద్దుకొన్నది. తరువాత కొంతకాలమునకు దేవస్థాన ఆదాయము అధికముగా ఉండుటవలన ప్రభుత్వ దేవాదాయశాఖ వారు దేవస్థానమును వారి ఆధీనములోకి తీసుకొన్నారు. అప్పటి నుండి వారు పాత కార్యవర్గమును రద్దుచేసి కొన్ని పూర్వ కార్యక్రమములను నిలిపివేయుటతో భక్తుల రాకపోకలు గణనీయముగా తగ్గిపోయాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకొన్న చందముగా భక్తుల ఒరవడి తగ్గుట ఆదాయము మందగించుటతో ఈ మధ్యనే తిరిగి యధాపూర్వకంగా పాత పద్ధతులను పునరుద్ధరించుట మొదలెట్టినారు.

పాత దేవాలయము

ప్రధాన దేవస్థానమునకు కొంచెం దూరములో పురాతన దేవాలయము ఉంది. అప్పన ముని తపస్సు చేసినదిక్కడేనని అంటారు. ఇక్కడ కళ్యాణ కట్ట ఉంది. గోదావరిలో స్నానం చేసి పాత దేవస్థానములో దేవుని దర్శించిన పిదప కళ్యాణకట్టలో తలనీలాలు అర్పించి మళ్ళీ గోదావరిలో స్నానం చేసి అప్పుడు ప్రధాన దేవాలయానికి వెళ్ళి బాలాజీ దర్శనము చేసుకొనుట పరిపాటి.

ఇతర విశేషాలు

  • ప్రధాన దేవాలయము నుండి పూర్వదేవాలయము వరకూ తిరునాళ్ళు లేదా తీర్ధము ఉంటుంది.
  • అప్పనపల్లెలో బహుసుందరముగా కొత్తగా కట్టిన శివాలయము ఉంది. దేవాలయము మొత్తం తెల్లగా ఉండుట దీని ప్రత్యేకత.
  • అప్పనపల్లె గోదావరి పాయ అయిన వైనతేయనదిలో అప్పనపల్లె లంక చిన్నద్వీపం ఉంది. పచ్చగా నిండుగా పెరిగిన వృక్షాలతో అందముగా కనిపిస్తుంటుంది. ఇక్కడ పశువుల గ్రాసం సమృద్దిగా దొరకుటచే గ్రామస్థులు పశువులను ఇక్కడే ఉంచి ప్రతిరోజూ వెళ్ళి వస్తుంటారు. యాత్రికులకు కూడా స్నానఘట్టము నుండి తక్కువ రుసుముతో లంకకు వెళ్ళి చుట్టూ తిరిగి వచ్చేందుకు దేవస్థానమువారు పడవలను ఉంచుతారు.

గ్రామ ప్రముఖులు

  • శ్రీ మొల్లేటి రామస్వామి గారు
  • శ్రీ వాయువేగుల వెంకట రామయ్య గారు.
  • శ్రీ అల్లూరి సీతారామరాజు గారు.
  • శ్రీ గంటి సుబ్బా రావు గారు
  • శ్రీ మైలవరపు పురుషోత్తమ శర్మ గారు
  • శ్రీ అల్లూరి మైనర్ రాజు గారు

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 5, 265 - పురుషుల సంఖ్య 2, 644 - స్త్రీల సంఖ్య 2, 621 - గృహాల సంఖ్య 1, 470

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5, 103.[2] ఇందులో పురుషుల సంఖ్య 2, 539, మహిళల సంఖ్య 2, 564, గ్రామంలో నివాసగృహాలు 1, 338 ఉన్నాయి.

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14