ఘంటసాల బలరామయ్య: కూర్పుల మధ్య తేడాలు
JVRKPRASAD (చర్చ | రచనలు) చి వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు తొలగించబడింది; వర్గం:కృష్ణా జిల్లా వ్యక్తులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →మూలాలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను |
||
పంక్తి 15: | పంక్తి 15: | ||
[[వర్గం:1953 మరణాలు]] |
[[వర్గం:1953 మరణాలు]] |
||
[[వర్గం:కోస్తాంధ్ర ప్రముఖులు]] |
[[వర్గం:కోస్తాంధ్ర ప్రముఖులు]] |
||
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]] |
|||
[[వర్గం:కృష్ణా జిల్లా వ్యక్తులు]] |
[[వర్గం:కృష్ణా జిల్లా వ్యక్తులు]] |
||
[[వర్గం:1906 జననాలు]] |
[[వర్గం:1906 జననాలు]] |
17:39, 20 ఏప్రిల్ 2019 నాటి కూర్పు
ఘంటసాల బలరామయ్య (జూలై 5, 1906 - అక్టోబర్ 29, 1953) సుప్రసిద్ధ తెలుగు సినిమా నిర్మాత మరియు దర్శకులు.[1]
నాటకరంగంలో ప్రసిద్ధులైన వీరి సోదరులు రాధాకృష్ణయ్య గారి ప్రోత్సాహంతో వీరికి రంగస్థల అనుభవం కలిగింది. అన్నదమ్ములిద్దరూ 1933లో కలకత్తా వెళ్ళి చిత్రరంగంలో అడుగుపెట్టారు. వీరు శ్రీరామా ఫిల్మ్స్, కుబేరా పిక్చర్స్ అనే కంపెనీలు పెట్టి 1936లో సతీ తులసి, 1938లో మార్కండేయ మరియు 1940లో మైరావణ చిత్రాల్ని నిర్మించారు. 1940లో ప్రతిభా పిక్చర్స్ సంస్థను నెలకొల్పి పార్వతీ కళ్యాణం సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. తరువాతి కాలంలో చిత్ర నిర్మాణం మరియు దర్శకత్వం రెండు నిర్వహిస్తూ గరుడ గర్వభంగం (1943), సీతారామ జననం (1944), ముగ్గురు మరాఠీలు (1946), బాలరాజు (1948), శ్రీ లక్ష్మమ్మ కథ, స్వప్న సుందరి మరియు చిన్న కోడలు (1952) మొదలైనవి తయారుచేశారు.
1944లో నిర్మించిన సీతారామ జననం చిత్రం ద్వారా వీరు అక్కినేని నాగేశ్వరరావు మరియు అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు లను తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. 1948లో నిర్మించిన బాలరాజు సినిమా సాటిలేని విజయాన్ని వీరికి అందించింది. తోటివారిలో పోటీపడి శ్రీ లక్ష్మమ్మ కథ చిత్రాన్ని కేవలం 19 రోజులలో నిర్మించి విడుదల చేశారు.
వీరు అందరూ అభివృద్ధి చెందాలని, సుఖంగా జీవించాలని కోరుకొనేవారు. ఎన్నో సామాజిక అభివృద్ధి కార్యక్రమాలలో వీరు పాల్గొన్నారు. తెలుగు సినీ రంగానికి వెలలేని సేవలందించిన వీరు అక్టోబర్ 29, 1953 అర్థరాత్రిన గుండెపోటుతో పరమపదించారు. ఆ సమయంలో ఆయన రేచుక్క చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ చిత్రాన్ని పి.పుల్లయ్య పూర్తిచేశారు.