కావూరు (చెరుకుపల్లి మండలం)

వికీపీడియా నుండి

కావూరు గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని గ్రామం. కల్యాణ కావూరు దీని మరో పేరు. పొన్నూరు నుండి 17 కి.మీ. దూరంలోను, రేపల్లె నుండి 25 కి.మీ. దూరంలోను, తెనాలి నుండి 28 కి.మీ. దూరంలోను, మండల కేంద్రం చెరుకుపల్లి నుండి 3 కి.మీ. దూరంలోను కావూరు ఉంది.

విషయ సూచిక

[మార్చు] గ్రామ విశేషాలు

బాలికల గురుకుల పాఠశాల

మండలంలోని గ్రామాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటైన మొట్టమొదటి గ్రామం, కావూరు. గ్రామంలోని వినయాశ్రమము ప్రముఖ సామాజిక సేవాకేంద్రం. గ్రామంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కృషి విజ్ఞాన పరిషత్తు, బాలికల గురుకుల విద్యాశాల ఏర్పాటయ్యాయి. గ్రామంలోని వ్యవసాయ పరపతి సంఘం చుట్టుపక్కల గ్రామాలకు కేంద్రంగా ఉంది.

  • ఆర్థిక వ్యవస్థ: ముఖ్యంగా వ్యవసాయాధారితం. ప్రధానంగా ప్రకాశం బారేజి నుండి నీటి సరఫరా జరుగుతుంది. మెట్ట ప్రాంత భూములకు వర్షాలు, మరియు వ్యక్తిగత లిఫ్టులు నీటి సౌకర్యం కలిగిస్తున్నాయి. వరి ప్రధానమైన పంట. రెండవ పంటగా మినుమును ప్రధానంగా పండిస్తారు.
2007 లో డాక్టస్ పేరుతో మెడికల్ ట్రాన్‌స్క్రిప్షన్ కంపెనీని గ్రామంలో ఏర్పాటు చేసారు. హైదరాబాదులోని ప్రముఖ మెడికల్ ట్రాన్‌స్క్రిప్షను సంస్థయైన వరల్డ్‌టెక్ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. గ్రామంలోనే కాక, చుట్టుపక్కల గ్రామాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది.
  • ఆరోగ్యం: గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. మండల కేంద్రమైన చెరుకుపల్లిలో వివిధ ప్రైవేటు ఆసుపత్రులు వైద్య సౌకర్యాలు అందిస్తున్నాయి.
  • విద్య: గ్రామంలో కింది విద్యా సౌకర్యాలున్నాయి.
    1. ప్రభుత్వ జూనియర్ కళాశాల, హైస్కూలుతో సహా
    2. తిలక్ జాతీయ ప్రాథమిక పాఠశాల
  • గ్రామ ప్రముఖులు:
    1. తెలుగులెంక, అభినవ తిక్కన బిరుదులు పొందిన తుమ్మల సీతారామమూర్తి కావూరు గ్రామంలో జన్మించాడు.
    2. ప్రముఖ మందుల తయారీ కంపెనీ నాట్కో ఫార్మస్యూటికల్స్ ను స్థాపించిన నన్నపనేని వెంకన్న చౌదరి కావూరు గ్రామంలోనే చదువుకున్నాడు.
    3. హైదరాబాదులోని ప్రముఖ మెడికల్ ట్రాన్‌స్క్రిప్షను సంస్థయైన వరల్డ్‌టెక్‌ను స్థాపించిన తుమ్మల రామకృష్ణ కావూరు గ్రామస్తుడే!
  • పరిశ్రమలు:
    1. డాక్టస్ అనే పేరుతో వరల్డ్‌టెక్ వారి మెడికల్ ట్రాన్‌స్క్రిప్షన్ కేంద్రం కలదు.

[మార్చు] వినయాశ్రమం

వినయాశ్రమ ప్రవేశద్వారం

1930 లో గాంధీ సహాయ నిరాకరణోద్యమం మొదలుపెట్టినపుడు, ఆంధ్రలో ఉద్యమ సమయంలో ప్రజల్లో జాతీయోద్యమ స్ఫూర్తిని రగుల్కొలిపేందుకు శిబిరాలను నెలకొల్పదలచారు. ఆ విధంగా మూడు చోట్ల ఆశ్రమాలను ఏర్పాటు చేసారు. తూర్పు గోదావరి జిల్లాలో సీతానగరం వద్ద, నెల్లూరు జిల్లాలో పల్లిపాడు వద్ద, గుంటూరు జిల్లాలో కావూరు లోను వీటిని ఏర్పాటు చేసారు. కావూరులో నెలకొల్పినదే వినయాశ్రమము. ఈ ఆశ్రమాలు నిరాడంబరత్వానికి ప్రతీకగా ఉంటూ ప్రజల సాంఘిక, ఆర్థిక అభివృద్ధికి పాటుపడ్డాయి. స్వాతంత్ర్యోద్యమ సమయంలో మహాత్మా గాంధీ ఈ ఆశ్రమాన్ని సందర్శించాడు.

ఆశ్రమాన్ని తుమ్మల బసవయ్య, తుమ్మల దుర్గాంబ నిర్మించారు. 65 ఎకరాల స్థలంలో ఆశ్రమం నెలకొని ఉంది. 1984లో ఆశ్రమ స్థలం నుండి కొంత భాగాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలకు కేటాయించారు.

[మార్చు] గణాంకాలు

  • జనాభా: 6341
  • పురుషులు: 3110
  • స్త్రీలు: 3231
  • అక్షరాస్యత: 53.65 శాతం
  • పురుషుల అక్షరాస్యత: 66.96 శాతం
  • స్త్రీల అక్షరాస్యత: 60.17 శాతం

[మార్చు] బయటి లింకులు


వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె