భూగోళ శాస్త్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భూమి భౌతిక పటం

భూగోళ శాస్త్రము అంటే భూమికి సంబంధించిన విజ్ఞానాన్ని తెలిపే శాస్త్రం. దీనిలో భాగంగా దేశాలు భూగోళంలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకొనడం. భూమి పై నదులు, పర్వతాలు, సముద్రాల స్థానాలను తెలుసుకొనడం, భూమి ఎలా ఏర్పడింది, ఏ మార్పులు పొందింది తెలుసుకోవడం.

భూ గోళ శాస్త్ర చరిత్ర[మార్చు]

పూర్వకాంబ్రియన్[మార్చు]

  • బలమైన ఆధారాలు లేక పోవటం వలన భూమిని గురించి 65 కోట్ల సంవత్సరాల ముందటి విషయాలను చిత్రాలను ఊహించలేకున్నాము. కావున 65 కోట్ల సంవత్సరాల నుంచి ఏం జరిగినదొ శాస్త్రవేత్తలు ఊహించి, నిర్ధారించారు.
  • 110 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఒకే ఒక మహా ఖంఢము ఉండినది. దానిని రొదీనియా (rodinia) అని పిలుస్తాము.
  • సుమారు 75 కోట్ల సంవత్సరాల క్రితం రొదీనియా రెండు ముక్కలై మధ్యలో పాంథలాస్సిక్ మహాసముద్రము (Panthalassic Ocean) ఆవిర్భవించింది.
  • ఉత్తర అమెరికా హిమ పూరితమైన దక్షిణ ధృవము వైపు పయనించింది. అంటార్కటికా, ఆస్ట్రేలియా, భారతదేశం, అరేబియా, భావ్య కాలమున చైనాగా మారు ఖంఢ భాగాలతోనున్న రోదినియా యొక్క ఉత్తర సగ భాఘము ప్రతి గడియారపు దిక్కులో తిరిగి ఉత్తర దృవమునకేగినది.
  • రొదినియా యొక్క రెండు భాగాల మధ్య ఉత్తర-మాద్యమ ఆఫ్రికచే నిర్మితమైన కాంగో క్రేటను (Congo Craton) మహాఖంఢము ఉండినది.55 కోట్ల సంవత్సరాల క్రితం రొదినియా రెండు సగ భాగములు కాంగో క్రేటనుతో సహా కలసి పనోషియా (Panotia) అను క్రొత్త మహాఖంఢముగా ఆవిర్భవించెను. పూర్వ కేంబ్రియన్ కాలపు జీవ లక్షణముల కల్పిత అంచనాల చార్టు. పూర్వ-కేంబ్రియన్ ఘటనలు.

కాంబ్రియన్[మార్చు]

  • పూర్వ కేంబ్రియన్ శకాంతమునకు పనోషియా మహాఖంఢము ఛీలడం మొదలై పాలియోజోయిక్ (paleozoic) శకము ఆరంభమైనది.
  • ప్రాచీన ఖంఢాలైన లోరెన్షియా (Laurentia), బాల్టికా (Baltica), సైబేరియా మధ్య ఐయాపెటస్ (Iapetus) మహాసంద్రము ఉద్భవించింది.
  • పాన్ ఆఫ్రికా (Pan-African) పర్వతాకార ఆవిరభం జరిగినప్పడు సమూహమైన గొండ్వానా (gondwana) మహాఖండము నాడీమండలము నుండి దక్షిణ ధృవము వరకు విస్తరించుకొని ఆ కాలపు అతి పెద్ద మహాఖండమైనది.
  • అర్డోవిషియన్ (ordovician) శకములో గొండ్వానా యొక్క నాడీమండల ప్రాంతాలైన ఆస్ట్రేలియా, భారతదేశము, చైనా, అన్టార్కటికా ప్రదేశాలలో వెచ్చని నీటి బంధకములు అనగా సున్నపురాయి, ఉప్పు దొరికినవి. అదలా ఉండగా గొండ్వానా (gondwana) దక్షిణ ధృవ ప్రాతాలైన ఆఫ్రిక, దక్షిణ అమెరికాలలో మంచు, ఐసుకు సంభందంచిన పదార్థాలు దొరికినవి.

సిలురీన్[మార్చు]

  • 40 కోట్ల సంవత్సరాల క్రితం, పాలియోజోయిక్ శకం మధ్యలో లోరెన్షియా, బాల్టికా ఖండములు కలుస్తూ ఐయాపిటస్ మహాసముద్రమును మూసివేసినవి.
  • ఈ మహాఖండముల సంఘట్టనము వలన అక్కడ అంచున ఉన్న ద్వీప వాలువంపులు ఒక దాని మీద ఒకటిగా ఏర్పడినవి, తద్వారా కాలెడొనైడ్ (Caledonide) పర్వతాలు స్కాండినేవియా (Scandinavia) లో, ఉత్తర మహా బ్రిటన్, గ్రీన్లాండ్,, ఉత్తర అమెరికా యొక్క తూర్పు సముద్రపు ప్రాంతాలలో ఉత్తర అప్లాచియన్ (Appalachian) పర్వతాలు ఏర్పడినవి.
  • బహుశా పాలియోజోయిక్ శకం మధ్యలో, ఉత్తర దక్షిణ ఛైనా గొండ్వానా యొక్క ఇండో-ఆస్ట్రేలియన్ అంచును విదిలి, పాలియో-తెథిస్ (paleo-tethys) మహాసముద్రము మీదగా ఉత్తర దిశకు ఏగినది. పాలియోజోయిక్ శకము ఆరంభము మొదలుగొని మధ్య వరకు, ఉత్తర అర్ధగోళములో ఎక్కువ శాతం పాంథలాస్సిక్ మహాసముద్రము విస్తరించి ఉండినది.
  • ఈ మహాసముద్రమును చుడుతూ, రెండు భూతల పొరలు ఒక మధ్య పొరపై ఆధారడుతూ ఇప్పటి పసిఫిక్ మహాసముద్రమును చుట్టిన "రింగ్-ఆఫ్-ఫైర్" పద్ధతిని అనుకరించు రీతిలో ఉండినది.

కార్బోనిఫెరస్[మార్చు]

  • 39 కోట్ల సంవత్సరాల క్రితం డెవోనియన్ (Devonian) శకారంభమైనది. ఈ శక ప్రారంభంలో పాలియోజోయిక్ నాటి మహాసముద్రాలు మూసుకు పోతూ పూర్వ పాంజియా తయారవటం మొదలైనది. ఈ శకం ప్రముఖముగా చేపలు జీవించిన కాలం.
  • డెవోనియన్ ప్రారంభ దశలో చేపల దవడలు క్రమేణ వృద్ధి చెంది, శకాంతము వచ్చు సమయానికి చేపలు వేటాడు జీవులలో ఉత్తమ శ్రేణి లోకి చేరెను. మొక్కలు భూమిని విస్తరించుకొని మొట్ఠమొదటి బొగ్గు బంధకములు ఎండ మెండుగా మండే పర్రలతో (swamps) కనడియన్ ఆర్కటిక్ ద్వీపాలు, ఉత్తర గ్రీన్ లాండ్,, స్కాన్డినావియాలను కప్పి వేసినవి.ఆర్కటిక్ కెనడాలోని నాడీమండల ప్రదేశాలలో మొదటిసారిగా అడవులు పెరిగినవి.
  • పాలియోజోయిక్ శకాంతములో, పన్నోషియా విభజన జరిగినప్పుడు తెరుచుకున్న అనేక మహాసముద్రములు మూసుకుపోయినవి. నాడీమండలము మధ్యగా ఉండి పాంజియా (Pangea) దక్షిణ ధృవం నుండి ఉత్తర ధృవం వరకు విస్తరించుకుని ఉండినది. దీనికి తూర్పు ప్రక్క పాలియో-తెథిస్ మహాసముద్రము పశ్చిమము వైపు పాంథలాస్సిక్ మహాసముద్రము ఆనుకొని ఉండినవి.
పేంజియా మహాఖండము
ట్రైయాస్సిక్ శకములో భూగోళము
  • కార్బోనిఫెరస్ (Carboni-ferous) శకాంతము అగు సమయము పర్మియన్ (Permian) శకారంభంలో పేంజియా యొక్క దక్షిణ భాగములు (దక్షిణ 'దక్షిణ అమెరికా', దక్షిణ ఆఫ్రికా, అంటార్కటికా, భరత ఖండము, దక్షిణ భరత ఖండము, ఆస్ట్రేలియా) హిమపూరిత ప్రదేశాలుగా మారినవి.
  • కార్బోనిఫెరస్ (Carboniferous) శకాంతములో నడీమండలము నడికట్టున మధ్య పేంజియా పర్వతములు బొగ్గు గనులకు కేంద్రమై ఉండెను.

పర్మియన్[మార్చు]

  • పర్మియన్ శకమధ్య దశలో మధ్యమ పేంజియా పర్వతములు ఉత్తర దిశగా కదిలి పొడి ప్రదేశముల వైపు జరుగుతూ తేమభరితమైన నాడీమండల గాలికి అడ్డు నిలిచి ఉత్తర అమెరికా ఉత్తర యూరోప్ ఆంతర్య ప్రదేశములు ఎడారి మాదిరిగా తయారగుటకు హేతువైనది.
  • పేంజియా అనగా "సర్వమైన ప్రదేశము", పేంజియాను మనము మహామహాఖండముగా గుర్తించినను, అది ఆ కాలపు అన్ని ఖండములతో నిండినది కాదు.పూర్వార్ధ గోళములో పాలియో-తెథిస్ మహాసముద్రపు ఇరువైపుల కొన్ని ఖండములు దీని నుండి వేరుగా ఉండినవి.
  • ఈ ఖండములలో ఉత్తర దక్షిణ చైనా, కారు యొక్క 'windshield wiper' అనగా అద్దము శుభ్రపరుచు చువ్వ ఆకారములో సిమ్మీరియా (cimmeria) మహాఖండము ఉండినవి.
  • టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, టిబెట్, ఇండో-చైనా, మలయ భాగాలతో నిండిన సిమ్మీరియా కార్బోనిఫెరస్ శకాంతములో గోండ్వానా యొక్క ఇండో-ఆస్త్రేలియన్ అంచునుండి కదిలి పోయింది .
  • ట్రైయాస్సిక్ (Triassic) శకాంతములో సిమ్మీరియా చైనా ఖండంతో కలసి ఉత్తర దిశగా యూరేశియా వైపు జరిగి సైబీరియా దక్షిణ అంచుతో సంఘటించెను. ఈ సంఘటణ తరువాతనే ప్రపంచములోని అన్ని ఖండములు కలసి పేంజియా అను మహామహాఖంఢముగా పిలువబడినవి. కార్బోనిఫెరస్ శకారంభం 35 కోట్ల సం.క్రితం.

ట్రైయాస్సిక్ , జురాస్సిక్[మార్చు]

  • పేంజియా మహాఖండము ఆవిర్భవించటానికి హేతువైన ఖండముల సంఘట్టనములు డెవోనియన్ శకమునుండి ట్రైయాస్సిక్ శకాంతము వరకు కొనసాగినవి.

పేంజియా ఒక్కసారిగా ముక్కలుగా చీలలేదు, దాని చీలిక మూడు ముఖ్య ఉపాఖ్యానములుగా నడిచింది.

  • మొదటి చీలిక ఉపాఖ్యానము 18 కోట్ల సం.క్రి. మధ్య జురాస్సిక్ (Jurassic) లో మొదలైనది. ఉత్తర అమెరికా తూర్పు కోస్తా ప్రాంతాలలో, ఆఫ్రికా ఉత్తర-పశ్చిమ ప్రాంతాలలో జరిగిన అగ్నిమయమైన చురుకు చర్యల తరువాత ఉత్తర అమేరిక ఉత్తర-పశ్చిమ దిశలో కదులుతూ మధ్యమ అట్లాంటిక్ మహాసముద్రమును తెరిచింది. అదే సమయములో ఆఫ్రికా అవతల ప్రక్కన తూర్పు ఆఫ్రికా అంచులలో, అంటార్కటికాలో, మడగాస్కర్లో భీకరముగా జ్వాలాముఖులు పేలి భారత మహాసముద్ర ఆవిర్భవించుటకు సూచకమైనవి.
    1. మెసోజోయిక్ (Mesozoic) కాలమునందు ఉత్తర అమెరికా, యూరేసియా కలసి లౌరేసియా అను భాగముగా పిలువబడినవి. క్రమేణా మధ్య అట్లాంటిక్ తెరుచుకోవటంవలన లౌరేసియా గడియార దిశలో తిరిగి ఉత్తర అమెరికాను ఉత్తరమునకు, యూరేసియా దక్షిణమునకు పంపివేసింది.
    2. జురాస్సిక్ శకాంతములో ఆసియా తేమ భరిత ప్రదేశములనుండి పొడి ప్రదేశాలకు కదలడంతో, బొగ్గు గనులతో సంపన్నమైన పూర్వ ఆసియా ఎడారులతో, ఉప్పు బంధకములతో నిండిపోయింది. లౌరేసియా కదలికలవల్ల గోండ్వానాకు లౌరేసియాకు మధ్యనున్న తెథిస్ మహాసముద్రము మూసుకుపోయింది.

క్రెటేషియస్[మార్చు]

  • రెండవ చీలిక 14 కొట్ల సంవత్సరాల క్రితం క్రెటాషియసు శకారంభములో మొదలయినది. గొంద్వానా ముక్కలవుతూ ఉండగా దక్షిణ అమెరికా ఆఫ్రికా నుండి వేరగుచు దక్షిణ అట్లాంటికును తెరిచింది.భారతదేశం మడగాస్కరుతో సహా అంటార్కటికా, పశ్చిమ ఆస్ట్రేలియా అంచు నుండి విడిపోయి పూర్వ హిందూ మహాసముద్రమును తెరిచింది.దక్షిణ అట్లాంటికా ఒక్కసారిగా తెరుచుకోలేదు, అంచలంచలుగా దక్షిణం నుండి ఉత్తరంవైపుకి తెరుచుకుంటూ పోయింది అందుకే అది దక్షిణం వైపుకి వెదల్పుగా ఉంటుంది.
    1. ఇతర రేకు నిర్మాణ (plate tectonic) ఘఠణలు కూడా క్రెటాషియస్ శఖారంభంలో జరిగినవి.వీటిలో భాగంగానే ఉత్తర అమెరికా, యూరోపు మధ్యన చీలిక ప్రారంభము, ఐబీరియా అడ్డ గడియారపు దిశలో ఫ్రాన్స్ నుండి తిరగడము జరిగినవి.అంతే గాక మడగాస్కరు, భరత ఖండము విడిపోవడము, క్యూబా, హిస్పానియోలాలు పెసిఫికు మహాసముద్రము నుండి ఉత్పత్తి చెందుట, రాకీ పర్వతాలు ఉద్భవించుట, ఉత్తర అమెరికా పశ్చిమ అంచున అపరిచిత భూభాగాల (Wrangellia, Stikinia) రాకడ వంటి ఘఠణలు కూడా సంభవించినవి.
    2. ప్రపంచ వ్యాప్తంగా క్రెటాషియసు శకంలో వాతావరణం జురాస్సిక్, ట్రయాస్సిక్ లాగా ఈ కాలంలో కన్నా వెచ్చగా ఉండినది.ఉత్తర ఆర్కిటిక్ వ్రుత్తం, అంటర్కిటికా, దక్షిణ ఆస్ట్రేలియా ప్రాంతాలలో రాక్షస బల్లులు, పామ్ చెట్లు ఉండినవి. క్రెటాషియసు శకారంభంలో ధ్రువాల దగ్గిర హిమ భరిత మై ఉన్నా మెసొజోయిక్ శకంలో మాత్రం ఏమీ కనిపించలేదు.
    3. ఈ సామ్యమైన వాతావరణ పరిస్థితుల కారణం, భూభాగాలని లోతులేని సముద్రత్రోవలు (cretaceuos seaways) మూసివేసినవి. నాడీమండల ప్రాంతాల నుండి వెచ్చని నీరు ఉత్తరం వైపుకి తరళి ఉత్తర ధ్రువ ప్రాంతాలను వెచ్చపరిచింది.ఈ సముద్రత్రోవలు స్థానికమైన వాతావరణములని మెడితెర్రెనియన్ సముద్రములాగా సామ్యముగా చేస్తాయి, ఇందువల్ల యూరోపు వాతావరణం గుణమైన మార్పు చెందుతుంది.
    4. భూభాగాలన్నీ లోతులేని సముద్రత్రోవలతో కప్పబడటానికి కారణం అప్పటి కాలంలో సముద్ర నీటిమట్టం ఇప్పటి కన్నా 100 - 200 మీటర్లు ఎక్కువగా ఉండినది.అధిక సముద్ర నీటి మట్టనికి కారణం సముద్ర తటాకాలలో ఏర్పడిన క్రొత్త చీలికలతో భూభాగాలు నీరుతో స్థలము తప్పించబడినవి. ఈ శఖంలో సముద్రపుటరుగు వేగంగా వ్యాపించింది.విశాల గుణములతో దీర్ఘమైన ఒత్తిడితో వ్యాపించు సముద్రపుటరుగులు ఎక్కువ నీరుతో స్థలము తప్పించును . ఈ కారణంగానే సముద్రపు నీటి మట్టం పెరగడం జరుగుతుంది.

ఇకోసీన్[మార్చు]

  • మూడవది ఆఖరిదైన చీలిక ఘట్టము సెనోజోయిక్ శకారంభంలో జరిగింది. ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్ యూరోపు నుండి విడిపోయినవి.అంటార్క్టికా ఆస్టేలియాను విడుదల చేస్తే అది 5 కోట్ల సం.క్రి. భరత ఖండం వలె ఉత్తరం వైపు ఆసియా దక్షిణ-పూర్వ భాగాన్ని గుద్దుకునే వేగంలో జరిగింది.గత రెండు కోట్ల సంవత్సరాలుగా జరిగిన చీలికలు : అరేబియా ఆఫ్రికా నుండి చీలి ఎర్ర సముద్రమును తెరవటం, జపాను పశిఫికులో పూర్వ దిశగా జరిగి జపాన్ సముద్రాన్ని తెరవటం, కాలిఫోర్నియా, ఉత్తర మెక్సికో ఉత్తరం వైపు జరిగి కాలిఫోర్నియా గల్ఫును తెరవటం.
    1. సెనోజోయికులో చాలా మహాసముద్రాలు తెరుచుకున్నప్పటికీ, గత 6 కోట్ల సంవత్సరాలను మహాఖంఢముల తీవ్ర సంఘట్టనములకు చిహ్నము.వీటిలో ప్రాముఖ్యతగలది 5 కోట్ల సం.క్రి. మొదలైన భారత ఖంఢమునకు యూరేసియాకు మధ్య జరిగిన సంఘట్టనము.క్రెటషియస్ శకాంతములో భారత ఖండము యూరేసియాను సంవత్సరానికి 15-20 సె.మీ.ల వేగంతో చేరుకున్నది, ఇది రేకు నిర్మాణ వేగాలలో ఇది పెద్ద రికార్డు.క్రెటేషియస్ శకాంతములో ద్వీపాల అంచులకు గుద్దుకొన్న తరువాత ఉత్తర భారత ఖండము యూరేసియా కింది నరముగా మారి టిబెటాన్ ప్లాటూను ఎత్తినది.ఆసక్తికరంగా, సంఘట్టణ వలన ఏర్పడిన విధ్వంసాన్ని భారత ఖండానికి బదులుగా ఆసియా ఖండమే భరించింది.దీనికి కారణం భారత ఖండము బలమైన సముద్రపు లిథోస్ఫియర్ పైన దృఢమైన రాతి వంటి లిథోస్ఫియర్ కాని ఆసియా ఇంకా సంఘట్టణల దెబ్బలతో వేడిగా ఉన్న వివిధ ఖండాల కుప్ప.భారత ఖండము వీటిని గుద్దుకోగానే ఇవన్నీ ఉత్తరంవైపునకు తూర్పువైపునకు నొక్కుకు పోయినవి.ఈ ప్రాంతాలలో భోకంపాలు ఇప్పటిదాకా కొనసాగుతోనే ఉన్నాయి.

మైయోసీన్[మార్చు]

  • ఆసియా-భారత ఖండాల సంఘట్టణ అనేక ఇతర సంఘట్టణాలతో కలసి టెథిస్ మహాసముద్రమును మూసివేసినవి.తూర్పు నుంచి పడమరకు ఈ సంఘట్టణలు : పైరినీస్ పర్వతములు స్పెయిన్-ఫ్రాన్స్ ద్వారా, ఆల్ప్స్ పర్వతములు ఇటలి, ఫ్రాన్స్, స్విట్జర్లాన్డ్ ద్వారా, హెల్లెనైడ్-డినరైడే పర్వతములు గ్రీస్, టర్కీ, బల్కన్ రాష్ట్రాల ద్వారా, జగ్రోస్ పర్వతాలు భారత, ఆసియాల ద్వారా ఉద్భవించినవి.
  • మహాఖండాల సంఘట్టణాలతో లిథోస్ఫియర్ అడ్డంగా నలిగి ఎత్తైన పర్వతాలు ఆవిర్భవించాయి.ఖండాలు అదే విస్తారమును ఆక్రమించినా వాటి ప్రదేశము కొద్దిగా తగ్గినది.తద్వారా సెనోజోయిక్ శకంలో ప్రపంచ వ్యాప్తంగా సముద్ర ప్రదేశము కొద్దిగా పెరిగింది.సముద్రపు తట్టలు పెద్దవిగనుక అవి ఎక్కువ నీటిని నిలుపగలవు.తత్ఫలితంగా గత 6 కోట్ల సంవత్సరాలుగా సముద్రమట్టం తగ్గింది.ప్రధానంగా ఖండాల సంఘట్టణల (డెవోనియన్ శకారంభం, కార్బోనిఫెరస్ శకాంతం, పెర్మియన్, ట్రైయాస్సిక్) పర్యంతము సముద్ర మట్టము తక్కువగా ఉండినది.

ఆఖరి మంచు శకం[మార్చు]

  • సముద్ర మట్టం తక్కువున్నప్పుడు భూఖండాలు అత్యావశ్యకమై, భూచరాలు క్రమముగా పెరిగి, ఖండాల మథ్య వలస దారులు తెరుచుకొని, వాతావరణం చాలా ఋతుపక్షంగా ఉంటుంది, ముఖ్యంగా ప్రపంచ వాతావరణం చల్లబడుతుంది.దీనికి కారణం భూమి సూర్యుని శక్తిని ఆకాశములోకి తిప్పి వెనుకకి పంపివేసేది, కాని సముద్రాలు ఆ శక్తిని పీల్చుకొనేవి.
  • అంతేగాక భూభాగాల మీద తెల్లటి శాశ్వతమైన మంచు రేకులు పెరిగి మరింత శక్తిని ఆకాశంలోకి తిప్పి పంపివేస్తాయి.ఖండాల మీద మంచు తయారవటం వలన సముద్ర మట్టం ఇంకా తగ్గి భూభాగాలు పెరిగి, భూమిని చల్లగా చేసి, మరింత మంచు తయారవుతోంది, ఇలా కొనసాగుతూనే ఉంటుంది.
  • ఇక్కడి సారాశం ఏమిటంటే: ఒక్కసారి భూమి చల్లబడటం (లేదా వేడెక్కట్టం) మొదలైతే నిశ్చయమైన బిస భూమి వాతావరణ సిద్ధాంతమును మరింత చల్లగా (లేదా వేడిగా) మార్చేస్తాయి.సెనోజోయిక్ శకాంతంలో భూమి చల్లబడటం మొదలైనది.మంచు రేకులు మొదట అంటార్క్టికాలో తయారై ఉత్తర అర్ధగోళమునకు వ్యాపించ సాగింది.గత 50 లక్షల సంవత్సరాలగా భూమి ఒక పెద్ద మంచు శకంలో ఉంది.ఇంత చల్లగా ఉండటం భూమి చరిత్రలో చాలా కొద్ది సార్లు మాత్రమే జరిగింది.

ప్రస్తుత భూమి[మార్చు]

గత 150 సంవత్సరాలుగా మానవజాతి భూమి చుట్టూ గ్రీన్హౌస్ వాయువులు తీవ్రత పెంచారు, ముఖ్యంగా బొగ్గుపులుసు వాయువు (carbondiaoxide).తత్ఫలితంగా, ప్రపంచ వాతావరణం వేడిగా మారుతున్నది.భూమి వాతావరణం వెచ్చబడితే, క్రమేనా ధృవాల మంచు కరిగి సముద్ర మట్టం పెరుగుతుంది.ఇది భూభాగాన్ని తగ్గిస్తుంది, ఇంకా తక్కువ శక్తి ఆకాశంలోకి తిరిగి వెళ్తుంది.ఈ అధిక వెచ్చదనంతో మంచు కరిగి సముద్రాలు భూభాగాలను వరదలతో ముంచెత్తుతాయి, ఫలితంగా వెచ్చదనం పెరుగుతుంది.ఈ పరిణామాల వల్ల నిశ్చయమైన బిస భూ వాతావరణాన్ని మంచు ఇంటి నుంచి పచ్చ ఇంటి తత్వానికి మార్చేస్తుంది, సరిగ్గా రాక్షస బల్లుల కాలం మాదిరిగా.

వనరులు, మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]