ముహమ్మద్ కులీ కుతుబ్ షా

వికీపీడియా నుండి
మహమ్మద్ కులీ కుతుబ్ షా
హైదరాబాదులో కుతుబ్ షా సమాధి.

ముహమ్మద్ కులీ కుతుబ్ షా (ఆంగ్లం :Muhammad Quli Qutab Shah), కుతుబ్ షాహీ వంశపు ఐదవ సుల్తాన్. ఇతను హైదరాబాదు నగరాన్ని స్థాపించాడు. చార్మినార్ ను కట్టించాడు. హైదరాబాదు నగరాన్ని, ఇరాన్ కు చెందిన ఇస్‌ఫహాన్ నగరంలా తీర్చిదిద్దాడు. ఇతను కులీ కుతుబ్ షా గా ఎక్కువగా పేర్కొనబడతాడు.. జననం క్రీ.శ. 1580 - మరణం 1612.

విషయ సూచిక

సాహిత్య పోషణ[మార్చు]

ముహమ్మద్ కులీ కుతుబ్ షా, అరబ్బీ భాష, పర్షియన్ భాష, ఉర్దూ భాష మరియు తెలుగు భాష లలో పాండిత్యం గలవాడు. ఇతను ఉర్దూ మరియు తెలుగు భాషలలో కవితలు వ్రాశాడు. ఉర్దూ సాహిత్య జగతిలో దీవాన్ (కవితా సంపుటి) గల మొదటి సుల్తాన్. ఇతని దీవాన్ పేరు "కుల్లియాత్ ఎ కుతుబ్ షాహి". ఇతను తెలుగు రచనలూ కవితలూ చేశాడు. దురదృష్ట వశాత్తు, ఇతడి తెలుగు పద్యాలేవీ ఇపుడు అందుబాటులో లేవు.

ముందు
ఇబ్రహీం కులీ కుతుబ్ షా
కుతుబ్ షాహీ వంశము
1518–1687
తరువాత
సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షాహ్

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  • Luther, Narendra. Prince, Poet, Lover, Builder: Muhammad Quli Qutb Shah, The Founder of Hyderabad

బయటి లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కి సంభందించిన మీడియా ఉంది

ఇతర పఠనాలు[మార్చు]