సాహిత్య అకాడమీ
సాహిత్య అకాడమీ (ఆంగ్లం : Sahitya Akademi) (హిందీ : साहित्य अकादमी ) (తెలుగు : సాహిత్య అకాదెమీ) భారతదేశానికి చెందిన ఒక సంస్థ. సాహిత్య పోషణకు, సహకారానికి, ప్రోత్సాహం కొరకు స్థాపించబడినది. భారతీయ భాషలలో ప్రముఖంగా సేవచేసిన వారికి ఇది సన్మానిస్తుంది. దీనిని మార్చి 12 1954, న స్థాపించారు. దీని నిర్వహణ భారత ప్రభుత్వం చేపడుతున్నది.
సాహిత్య అకాడెమీ, సెమినార్లు, వర్క్షాపులు, సమావేశాలు, సదస్సులు చేపడుతుంది. పరిశోధకులకు, రచయితలకు, కవులకు ప్రోత్సాహకాలు అందిస్తుంది. రచనలకు, ముద్రణలకునూ ప్రోత్సాహకాలనిస్తుంది. పురస్కార గ్రహీతలకు రూ. 50,000 లు బహుమానం ప్రకటిస్తుంది. దీని గ్రంధాలయం, భారత్ లోనే అతిపెద్ద బహుభాషా గ్రంధాలయం. రెండు, ద్విమాస పత్రికలు ప్రచురిస్తూవున్నది, అవి -- భారతీయ సాహిత్యం (ఆంగ్లంలో) మరియు సమకాలీన్ భారతీయ సాహిత్య్ (హిందీలో).
విషయ సూచిక |
కార్యాలయాలు [మార్చు]
ప్రధాన కార్యాలయం కొత్త ఢిల్లీ లో, ప్రాంతీయ కార్యాలయాలు బెంగుళూరు, కోల్కతా,ముంబాయి, చెన్నై లో వున్నాయి. పుస్తకాల విక్రయ కేంద్రం కొత్త ఢిల్లీ లో వుంది. బెంగుళూరు ప్రాంతీయ కార్యాలయం బెంగుళూరు విశ్వవిద్యాలయపు సెంట్రల్ కాలేజి భవన సముదాయములో (డా బి ఆర్ అంబేద్కర్ వీధి) (ఫోను : 91-80-22245152) వుంది.
సహాయక భాషలు [మార్చు]
- అస్సామీ
- బెంగాలి
- డోగ్రి
- ఆంగ్లము
- గుజరాతి
- హింది
- కన్నడ
- కాశ్మీరీ
- కొంకణి
- మైథిలి
- మళయాలం
- మీటీ
- మరాఠీ
- నేపాలీ
- ఒరియా
- పంజాబీ
- రాజస్థానీ
- సంస్కృతం
- సింధీ
- తమిళం
- తెలుగు
- ఉర్దూ [1]