Jump to content

ఎస్.పి.పరశురాం

వికీపీడియా నుండి
ఎస్.పి.పరశురాం
దర్శకత్వంరవిరాజా పినిశెట్టి
నిర్మాతఅల్లు అరవింద్
తారాగణంచిరంజీవి,
శ్రీదేవి
ఛాయాగ్రహణంకె. ఎస్. ప్రకాష్
కూర్పువేమూరి రవి
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
మార్చి 4, 1994 (1994-03-04)[1]
భాషతెలుగు

ఎస్. పి. పరశురాం రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో 1994 లో విడుదలైన చిత్రం. ఇందులో చిరంజీవి, శ్రీదేవి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాను అల్లు అరవింద్, జి. కె రెడ్డి, ముకేష్ ఉదేషి నిర్మించారు. ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. తెలుగులో కథానాయికగా శ్రీదేవికిది చివరి సినిమా.[2]

పరశురాం విధినిర్వహణ పట్ల కఠినంగా వ్యవహరించే ఒక పోలీసు అధికారి. అతని తమ్ముడు నీలి చిత్రాల కేసులో పట్టు పడితే అతన్ని అరెస్టు చేయడానికి వెనుకాడడు. ఈ నేరంలో రాణి అనే చిన్న దొంగ కూడా బాధితురాలు అవుతుంది. ఆమె తప్పించుకుంటుంది కానీ సాక్షిగా ఉండటానికి ఒప్పుకుంటుంది. ఆమె సాక్షిగా ఉండటం వలన గూండాలు ఆమె మీద దాడి చేస్తారు. ఆ దాడిలో ఆమె చూపు కోల్పోతుంది. పరశురాం ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. కానీ ఆమెను, కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తుంటారు. వాళ్ళ నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడన్నది మిగతా కథ.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: రవిరాజా పినిశెట్టి
  • సంగీతం: యం.యం.కీరవాణి
  • నేపథ్య గాయకులు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • ఛాయ గ్రహణం: కె.ఎస్.ప్రకాష్
  • కూర్పు: వేమూరి రవి
  • నిర్మాతలు: అల్లు అరవింద్, జి.కె.రెడ్డి, ముకేష్ ఉదేపి
  • నిర్మాణ సంస్థ: సాయి చరణ్ కంబైన్స్
  • విడుదల:04:03:1994.

సంగీతం

[మార్చు]

ఈ చిత్రానికి రాజ్ - కోటి సంగీతం అందించారు.

  • ఆరింటదాక అత్తకొడకా - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
  • ఏమి స్ట్రోకురో - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
  • చంపేయి గురు - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
  • ఓ బాబా కిస్ మి - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
  • ఏడవ కేడవ కేడవకమ్మా - కె. ఎస్. చిత్ర
  • ముద్దబంతి - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర

మూలాలు

[మార్చు]
  1. "S. P. Parashuram Movie". TOI.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. Nadadhur, Srivathsan (2018-02-26). "Sridevi: Star for all seasons". The Hindu. ISSN 0971-751X. Retrieved 2020-07-30.