Coordinates: 15°57′44″N 80°44′58″E / 15.962257°N 80.749404°E / 15.962257; 80.749404

కూచినపూడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కూచినపూడి
—  రెవిన్యూ గ్రామం  —
కూచినపూడి is located in Andhra Pradesh
కూచినపూడి
కూచినపూడి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°57′44″N 80°44′58″E / 15.962257°N 80.749404°E / 15.962257; 80.749404
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం నిజాంపట్నం
ప్రభుత్వం
 - సర్పంచ్ బేతపూడి రాజేశ్వరి బేతపూడి రాజేశ్వరి
జనాభా (2021)
 - మొత్తం 8,784
 - పురుషుల సంఖ్య 3,550
 - స్త్రీల సంఖ్య 3,650
 - గృహాల సంఖ్య 2,181
పిన్ కోడ్ 522 262
ఎస్.టి.డి కోడ్ 08648

కూచినపూడి, బాపట్ల జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన నిజాంపట్నం నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రేపల్లె నుండి 14 కి. మీ. దూరంలోనూ ఉంది.

గణాంకాలు[మార్చు]

2021భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2181 ఇళ్లతో, 8,784 జనాభాతో 2006 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3550, ఆడవారి సంఖ్య 3650. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1391 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 262. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590479.[1] పిన్ కోడ్: 522262. ఎస్.టి.డి.కోడ్ = 08648.

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7968. ఇందులో పురుషుల సంఖ్య 3980, స్త్రీల సంఖ్య 3988, గ్రామంలో నివాసగృహాలు 2254 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2006 హెక్టారులు.

గ్రామ చరిత్ర[మార్చు]

మండలకేంద్రం నిజాంపట్నం అయినప్పటికీ, శాసనసభ నియోజక వర్గం పేరు కూచినపూడి. 2009 ఎన్నికల సమయంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమంలో కూచినపూడి నియోజకవర్గం రేపల్లె నియోజక వర్గంలో కలిపారు. కాని కూచినపూడి సదుపాయాలు, అభివృద్ధి కొరత ఉంది. అయితేే కూచిపూడి గ్రామంలో కంటే పుల్లమెరక, గరువుపాలెం ప్రాంతంలో లో అధికంగా చదువుకున్న యువతీ యువకులు ఉద్యోగులు అధిక సంఖ్య నివసిస్తున్నారు

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో అల్లపర్రు, ముత్తుపల్లి అగ్రహారం, పల్లపట్ల, ఈదుపల్లి, ఏలేటిపాలెం గ్రామాలు ఉన్నాయి.

గ్రామపంచాయతీ[మార్చు]

  • 2021 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా ఎస్సీ రిజర్వుడ్ లో కేటగిరి కింద బేతపూడి రాజేశ్వరి ఎన్నికైంది.
  • ఈ పంచాయతీ కార్యాలయానికి నూతన భవనం నిర్మించారు.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 11, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి నిజాంపట్నంలో ఉంది.సమీప జూనియర్ కళాశాల నిజాంపట్నంలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల రేపల్లెలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు బాపట్లలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం రేపల్లెలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

కూచినపూడిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, 8 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో6 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

కూచినపూడిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. అంగన్ వాడీ కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

కూచినపూడిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 30 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 9 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 10 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 21 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 85 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1848 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 298 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1550 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

కూచినపూడిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 1550 హెక్టార్లు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  • శ్రీ విమర్శప్రకాశ వీరేశ్వర స్వామివారి ఆలయం:- ఈ దేవాలయంలో కార్తీక మాసం ఆఖరి ఆదివారం, 2013 డిసెంబరు 1 నాడు, 11 లక్షల వొత్తులతో, దీపారాధన కార్యక్రమం జరిగింది.
  • పుల్లమెరక శివారు గ్రామములో రెండు చర్చి లు కలవు క్రీస్తు దేవాలయం IREF చర్చిలో ఏటా డిసెంబరు 25న క్రిస్మస్, ఏప్రిల్ నెలలో గుడ్ ఫ్రైడే ఈస్టర్ పర్వదినాన భక్తులు ఎంతో శ్రద్ధతో చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తారు.
  • శ్రీ రామాలయం.
  • శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం.
  • శ్రీ పోతురాజు స్వామి ఆలయం:- కూచినపూడి గ్రామంలో, పునర్నిర్మాణం చేసిన ఈ ఆలయంలో, 2014, మార్చి-8న, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా, హోమాలు, అభిషేకాలు నిర్వహించారు.
  • శ్రీ దేశమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో 2014, ఆగస్టు-10వ తేదీ, శ్రావణ పౌర్ణమి, ఆదివారం నాడు, అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తొలుత అమ్మవారి ప్రతిమకు గ్రామవీధులలో తప్పెట్లతో భారీగా ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలోని పోతురాజు గుడి వద్ద, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
  • శ్రీరామమందిరం:- ఈ గ్రామంలో రజకసంఘం ఆధ్వర్యంలో నూతనం నిర్మించిన శ్రీరామమందిరం ప్రారంభోత్సవం, 2014, డిసెంబరు-6, శనివారం నాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోమాలు. ప్రత్యేకపూజా కార్యక్రమాల్యు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేసారు.
  • శ్రీ నాగేంద్రస్వామివారి ఆలయం:- కూచినపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని యేమినేనివారిపాలెం గ్రామంలో ఉన్న నాగేంద్రస్వామి పుట్టకు మూడు నెలల క్రితం, ఆలయం నిర్మించారు. ఇక్కడికి సుదూరప్రాంతాలనుండి భక్తులు వచ్చి, తమ తమ మొక్కులు తీర్చుకుంటారు. ఈ ఆలయం రేపల్లె-నిజాంపట్నం రహదారి ప్రక్కనే ఉండటంతో, భక్తుల సౌకర్యార్ధం, ఆర్.టి.సి. ఇక్కడ ఒక రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటుచేసారు.

ఆధ్యాత్మిక విశేషాలు[మార్చు]

కూచినపూడి గ్రామంలోని పులిగడ్డ రామచంద్రరావు పాఠశాల ఆవరణలో, 2014, జూలై-2న తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణను సర్వాంగసుందరంగా అలంకరించారు. ఉత్సవవిగ్రహాలను తిరుపతి నుండి ప్రత్యేకవాహనంలో తీసుకొనివచ్చారు. శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిలను ప్రత్యేకపూలతో అలంకరించారు. సాయంత్రం 4 గంటల నుండి, కోలాటం, భజన కార్యక్రమాలను ఏర్పాటు చేసారు. తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు, స్వామివారికి అలంకారాలు చేసి, హోమం, కళ్యాణధార, పూలమాల మార్పిడి, మంగళసూత్ర ధారణ చేసారు. అనంతరం తలంబ్రాలు పోయించారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో, పాఠశాల ప్రాంగణం గోవిందనామ స్మరణతో మార్మ్రోగినది. వెనుకబడిన ప్రాంతాలలోని ప్రజలకు శ్రీనివాసుని దగ్గర చేసేందుకు, ఈ కల్యాణం నిర్వహించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పినారు.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు[మార్చు]

పులిగడ్డ రామచంద్రరావు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న కె.ప్రియాంక తయారుచేసిన, భూమి ఉష్ణ వినిమయ పరికరం, 2015, డిసెంబరు-23న బాపట్లలో నిర్వహించిన డివిజను స్థాయి విద్యా వైఙానిక ప్రదర్శనలో రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. అనంతరం 2015, డిసెంబరు-28 నుండి 30 వరకు, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో ఎంపికై, 2016, జనవరి-19 నుండి 23 వరకు, బెంగుళూరులో నిర్వహించు దక్షిణభారతదేశస్థాయి విద్యా వైఙానిక ప్రదర్శనకు ఎంపికైంది.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".