టి.సుండుపల్లె మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
Map
నిర్దేశాంకాలు: 13°59′10″N 78°54′32″E / 13.986°N 78.909°E / 13.986; 78.909Coordinates: 13°59′10″N 78°54′32″E / 13.986°N 78.909°E / 13.986; 78.909
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅన్నమయ్య జిల్లా
మండల కేంద్రంటి.సుండుపల్లె
విస్తీర్ణం
 • మొత్తం346 km2 (134 sq mi)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం57,140
 • సాంద్రత170/km2 (430/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి979


టి.సుండుపల్లె మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్నమయ్య జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము

మండల విశేషాలు[మార్చు]

ఈ మండలంలో మూడు చోట్ల మెగాలిథిలిక్ సమాధులు ఉన్నాయి. అవి దేవావాండ్ల పల్లె, సుండుపల్లె నుండి సీతంపేటకు పోయే దారిలో ఒకచోట, పింఛా గ్రామం వద్ద ఒకచోట ఉన్నాయి.

ఝరికోన జలాశయం[మార్చు]

ఈ జలాశయాన్ని, రు. 33కోట్ల అంచనా వ్యయంతో, 2006 లో మొదలుపెట్టి, 2010లో నిర్మాణం పూర్తి చేసారు. దీని ముఖోద్దేశ్యం ఏమిటంటే, రాయచోటి పట్టణానికి త్రాగునీటి సరఫరా మరియూ సంబేపల్లి, కె.వి.పల్లె, సుండుపల్లె మండలాలకు సాగునీరు అందించడం. కానీ దీనికి అనుసంధానంగా కాలువలు ఇంతవరకూ నిర్మించకపోవడంతో ఈ జలాశయం ఇంకా ఉపయోగంలోనికి రాక, నిరుపయోగంగా ఉంది.

గుండుగుహ[మార్చు]

బాహుదానది తూర్పుభాగంలో శేషాచల కొండల నడుమ ఒక గుహ ఉంది. చూడపచ్చని వాతావరణంలో ఉన్న దీనిని, "గుండుగుహ", "మేకపోతు గని"గా పిలుస్తారు. రాయవరం పంచాయతీ, కావలిపల్లి గ్రామానికి దిగువన ఉన్న ఈ గుహ, సుండుపల్లెకు 15 కి.మీ. దూరంలోనూ, రాయచోటికి 37 కి.మీ. దూరంలోనూ ఉంది. ఇందులో 5 కి.మీ. కాలినడకన వెళ్ళవలసియుంటుంది. ఇక్కడి కొండ, బయటి భాగంలో శేషుని ఆకారంలో ఉంటుంది. గుహలోపలికి వెళ్ళడానికి చిన్న కన్నం ఉంటుంది. ఇది ఒక మేకపోతు గుండును ఢీ కొనడం వలన అది పగిలి, మనిషి వెళ్ళేటంత దారి ఏర్పడినదని ప్రతీతి. అందుకే దీనిని "గుండు గుహ" అని పిలుస్తారు. లోపల శివుని చిత్రం ఉంది. పౌర్ణమి, అమావాస్య, శ్రావణ, కార్తీక మాసాలలో పూజలు చేసెదరు.

జిల్లాలోని నదులు ఎండిపోయినా, ఇక్కడ నిత్యం జలం పారుతూ ఉంటుంది. వేసవిలోనూ ఇక్కడ చల్లని వాతావరణం ఉంటుంది. దీనిని పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దితే, ఎక్కువ మంది దర్శించటానికి అనువుగా ఉంటుంది.

మండల గణాంకాలు[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలంలోని మొత్తం జనాభా 53,013.అందులో పురుషులు 27,060 మంది ఉండగా స్త్రీలు 25,953మంది ఉన్నారు. అక్షరాస్యత మొత్తం 54.96%, పురుషులు అక్షరాస్యత 69.11% స్త్రీలు అక్షరాస్యత 40.18%

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

  1. అక్కంపల్లె
  2. భాగంపల్లె
  3. గుండ్లపల్లె
  4. మడితాడు
  5. ముదంపాడు
  6. పెద్దినేనికాల్వ
  7. పొలిమేరపల్లె
  8. రాయవరం
  9. రెడ్డివారిపల్లె
  10. టి.సుండుపల్లె
  11. తిమ్మసముద్రం
  12. ఏర్రమనేనిపాలెం

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. https://core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Y.S.R%20-%202018.pdf.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972966, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు[మార్చు]