తుమ్మిడిహట్టి ప్రాజెక్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు
అధికార నామండా. బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు
ప్రాణహిత నది

బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టును ప్రాణహిత నదిపై నిర్మిస్తున్నారు. గతంలో తలపెట్టిన అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు రూపురేఖలను మార్చినపుడు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో పాటు ఈ ప్రాజెక్టు ఉనికి లోకి వచ్చింది. కొమరంభీం జిల్లా, కౌటాల మండలం, తుంబడిహట్టి (తుమ్మిడిహట్టి) వద్ద ప్రాణహిత నదిపై 148 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మాణం ఈ ప్రాజెక్టులోని ప్రధానమైన భాగం. వార్ధా, పెన్‌గంగ నదులు సంగమించి ప్రాణహిత నదిగా రూపొందే స్థలం వద్ద ఈ బ్యారేజీని నిర్మిస్తారు. నిల్వ సామర్థ్యం 1.8 టీఎంలు. సిర్పూర్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.[1]

ఈ ప్రాజెక్టు స్థలాన్ని 200 మీటర్లు ఎగువకు జరిపి వార్ధా నదిపై నిర్మించాలని ఒక ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం పరిశీలించింది.[2]

రూపకల్పన[మార్చు]

ఇవీ చదవండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు. "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". నమస్తే తెలంగాణ. Retrieved 13 September 2017.
  2. Babu, Patan Afzal (2018-07-24). "Tummidhihatti tweak brings down Kaleshwaram cost". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-14.